breaking news
National Human Rights Committee
-
రెండ్రోజుల్లో సజ్జనార్ను విచారించనున్న ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’హత్యాచార నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. దిశ ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేసిన వీసీ సజ్జనార్ను గురువారం లేదా శుక్రవారం విచారణ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సజ్జనార్కు త్రిసభ్య కమిటీ భౌతికంగా సమన్లు జారీ చేసింది. సోమవారం ప్రారంభమైన జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ముగ్గురు సభ్యుల విచారణ మంగళవారం కూడా కొనసాగింది. మరొక సభ్యుడి విచారణతో బుధవారం ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత దిశ హత్యాచార నిందితులైన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్కు చెందిన అరీఫ్, గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్ కుమార్, జొల్లు శివలను ప్రైవేట్ అతిథి గృహంలో ఉంచి పోలీసులు విచారించిన నేపథ్యంలో ఆ అతిథిగృహం వాచ్మెన్ను కూడా సిర్పుర్కర్ కమిషన్ విచారించనుంది. ఆ తర్వాత ఫోరెన్సిక్ బాలిస్టిక్ రిపోర్ట్, పోస్ట్మార్టం రిపోర్ట్ నిపుణులను కూడా విచారణ చేయనుందని తెలిసింది. చదవండి: సజ్జనార్ కీలక నిర్ణయం.. ఇక బస్సులపై ఈ పోస్టర్లు కనిపించవు -
మా ఇళ్లను కూల్చేసి, తరిమేశారు
మానవ హక్కుల కమిటీ ముందు అంగుళూరు గ్రామస్తుల ఆవేదన దేవీపట్నం/రాజమహేంద్రవరం సిటీ: పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామమైన అంగుళూరును దౌర్జన్యంగా ఖాళీ చేయించారన్న ఆరోపణల నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యులు ఇంద్రజిత్కుమార్(అసిస్టెంట్ రిజిస్ట్రార్, లా), రజ్బీర్సింగ్ (డిప్యూటీ ఎస్పీ) మంగళవారం విచారణ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని అంగుళూరును 2015 మే నెలలో అధికారులు దౌర్జన్యంగా ఖాళీ చేయించారని ఎమ్మెల్సీ టి.రత్నాబాయి, సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు ఈ విచారణ నిర్వహించారు. ఈ సంద ర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ ఇళ్లను అధికారులు కూల్చేసి తరిమేశారని తెలిపారు. 2013 కొత్తచట్టం ప్రకారం తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇప్పించాలని కమిషన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. -
బాబు ఆదేశాల మేరకే బూటకపు ఎన్కౌంటర్
ఘటనా స్థలాన్ని పరిశీలించిన జాతీయ మానవ హక్కుల కమిటీ చంద్రగిరి: ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతోనే పోలీసులు కూలీలను తీసుకొచ్చి కాల్చి చంపారని మానవ హక్కుల సంఘం నాయకులు ఆరోపించారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రెట్స్ (పీయూడీఆర్), పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీ (పీయూసీఎల్), పీపుల్స్ రైట్స్ ఫర్ ప్రొటెక్షన్ కమిటీ(పీఆర్టీసీ), హ్యూమన్ రైట్స్ కమిషన్ (హెచ్ఆర్సీ) తదితర జాతీయ సంఘాల సభ్యులు శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడో పట్టుకున్న కూలీలను తీవ్రంగా హింసించి అనంతరం అటవీప్రాంతంలోకి తీసుకువచ్చి కాల్చిపడేసి పోలీసులు ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఎన్ కౌంటర్పై వెంటనే సుప్రీంకోర్టు సిట్టింగ్ ఈ కార్యక్రమంలో జాతీయ ప్రజా సంఘాల నేతలు శాంతన్, అజిత్, అజ్మన్, టాటా ఇన్స్టిట్యూట్ ఉద్యోగులు దామోదర్, సుకన్య, కన్నన్, రాష్ట్ర మానవహక్కుల ఉపాధ్యక్షుడు చిట్టిబాబు, ప్రొఫెసర్ లక్ష్మణ్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి నంబూరి శ్రీమన్నారాయణ, తెలంగాణ సహాయ కార్యదర్శి నారాయణరావు, పౌరహక్కుల సంఘం నేత దుడ్డు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పీయూడీఆర్ కమిటీపై కేసు నమోదు అటవీశాఖ అధికారుల అనుమతి లేకుండా అటవీప్రాంతంలోకి వెళ్లిన పీయూడీఆర్ కమిటీపై ఏపీ ఫారెస్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తిరుపతి వైల్డ్లైఫ్ డీఎఫ్వో జి. శ్రీనివాసులు తెలిపారు. తమిళనాడులో ఆరని ‘ఎర్ర’ అగ్ని చెన్నై, సాక్షి ప్రతినిధి: శేషాచలం ఎన్కౌంటర్పై రాష్ర్టవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. శనివారం సైతం రాష్ట్రంలో పలు పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించాయి. మక్కల్ ఇలక్కియ కళగం, పురట్చి మానవర్ ఇలైజంర్ మున్నని, పుదియ జననాయక తొళిలాలర్ మున్నని, పెన్గళ్ విడుదలై మున్నని తదితర పార్టీలు శనివారం సెంట్రల్ స్టేషన్ను ముట్టడించాయి. తమిళగ మున్నేట్ర కాంగ్రెస్ కట్చి నేత అరుళ్దాస్ నాయకత్వంలో సుమారు 150 మంది ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆంధ్రాక్లబ్) ను ముట్టడించారు. స్మగ్లర్లను కాపాడేందుకే కాల్పులు నిందితుల్ని రక్షించేందుకే అమాయక తమిళ కూలీలను కాల్చి చంపారని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఆరోపించారు. తిరుచ్చిరాపల్లిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయవిచారణ జరిపించాలి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లపై సీబీఐ దర్యాప్తు, న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పీయూసీఎల్, ఆల్ ఇండియా పీపుల్స్ ఫోరం, న్యాయవాదులు, ప్రజాస్వామ్య, మానవహక్కుల సంఘాల ఆధ్వర్యంలో ఏపీభవన్ ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. దర్యాప్తు అధికారిగా ఏఎస్పీ త్రిమూర్తులు తిరుపతి: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్పై దర్యాప్తు అధికారిగా తిరుపతి ఏఎస్పీ త్రిమూర్తులును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎన్కౌంటర్ ప్రభావం తిరుమల శ్రీవారి భక్తులపై కనిపిస్తోంది. ఫర్షణల నేపథ్యంలో తమిళ భక్తుల రాక భారీగాతగ్గింది.