breaking news
national handicrafts Day
-
మోదీ జీ.. భారత్ కన్నా శ్రీలంక బెటర్ ప్లేస్లో ఉంది: కేటీఆర్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న వస్త్ర పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూ స్తోందని మంత్రి కె.తారక రామా రావు విమర్శించారు. నేతన్నలకు కేంద్రం నోటిమాటలు కాకుండా నిధుల మూటలు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. తెలంగాణ టెక్స్టైల్ రంగానికి సాయం చేశామంటూ ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు అసత్యాలు వల్లె వేయడం మానుకోవాలన్నారు. తెలంగాణలో టెక్స్టైల్ రంగానికి చేయూత ఇవ్వాలంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు కేటీఆర్ శనివారం లేఖ రాశారు. కేంద్రం జీఎస్టీ విధింపు వంటి నిర్ణయాలతో నేత కార్మికుల పొట్టకొడుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.1,552 కోట్ల అంచనా వ్యయంతో చేప ట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మౌలిక సదుపా యా లు కల్పించేందుకు ముందుకు రాకపోగా, పార్క్ను తానే ఏర్పా టుచేసినట్లు అసత్యాలు చెబుతోందని దుయ్యబట్టారు. కాంప్రహెన్సివ్ పవర్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ పథకం కింద సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపా దనపై కేంద్రం స్పందించలేదని కేటీఆర్ ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీకి వెళ్లగా, తెలంగాణలో మరో ఐఐహెచ్ టీ ఏర్పాటు చేయాలన్న వినతిపైనా కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు. హైదరాబాద్లో నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇని స్టిట్యూట్తో పాటు హ్యాండ్లూమ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటుపైనా కేంద్రం నుంచి స్పందన లేదని వెల్లడించారు. బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేయండి జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం(ఎన్హెచ్డీపీ)లో భాగంగా తెలంగాణలో 15 బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలనే తెలంగాణ విజ్ఞప్తిని మోదీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని కేటీఆర్ విమర్శించారు. వస్త్ర పరిశ్రమపై విధించిన జీఎస్టీని తగ్గించడంతోపాటు జీఎస్టీ నుంచి చేనేత పరిశ్రమను పూర్తిగా మినహాయించాలన్నారు. రాష్ట్రంలోని మరమగ్గాల ఆధునికీకరణకు అవసరమయ్యే నిధుల్లో 50 శాతం భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర ప్రభు త్వం వాటా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టెక్స్టైల్ రంగంలో బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల కంటే భారత్ వెనుకంజలో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు ఊతమివ్వాలని కోరారు. ఇది కూడా చదవండి: నడి వీధుల్లో కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు.. కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు -
రాష్ట్ర చేనేతకు ‘బ్రాండ్’ గుర్తింపు
♦ తెలుగు రాష్ట్ర్రాల నుంచి 21 ఉత్పత్తులకు గుర్తింపు ♦ పోచంపల్లి ఇక్కత్ సహా పలు ఉత్పత్తులకు ఐహెచ్బీ ♦ ఇకపై విదేశీ ఎగుమతులు, ఉపాధికి మరింత ఊతం సాక్షి, హైదరాబాద్: ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ (ఐహెచ్బీ) పేరిట రాష్ట్రంలోని చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కనుంది. ఇప్పటికే రాష్ట్రం నుంచి 21 రకాలైన చేనేత ఉత్పత్తులకు ఈ బ్రాండ్ గుర్తింపు లభిం చింది. మరిన్ని పేరెన్నికగన్న ఉత్పత్తులు కూడా ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఐహెచ్బీ పొందిన చేనేత ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గిరాకీ పెరుగుతుంది. కార్మికులకు మెరుగైన ఉపాధి లభించనుంది. చేనేత రంగాన్ని ప్రోత్సహించేం దుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ను ప్రవేశ పెట్టిం ది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా గత ఏడాది ఆగస్టు ఏడో తేదీన ఐహెచ్బీని ఆవిష్కరించారు. ధరించేవారి చర్మానికి హాని కలిగించని రీతిలో.. వస్త్ర ఉత్పత్తిలో ఉపయోగించే దా రం, రంగుల నాణ్యత, డిజైన్లలో నవ్యత తదితర అంశాలను పరిశీలించిన తర్వాతే.. ఆయా ఉత్పత్తులకు ఐహెచ్బీ గుర్తిం పు దక్కుతుంది. ఈ బ్రాండ్ కలిగి ఉన్న చేనేత ఉత్పత్తులను మాత్రమే ఇకపై విదేశాలకు ఎగుమతి చేయాలి. అయితే టెక్స్టైల్ కమిటీ ఆమోదించిన ఉత్పత్తులకు మాత్రమే ఐహెచ్బీ దక్కుతుంది. వస్త్ర నాణ్యత, నవ్యతను నిర్ధారించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న 17 అధునాతన ప్రయోగశాలల్లో పరీక్ష లు నిర్వహించి.. ఐహెచ్బీ గుర్తింపు ఇస్తారు. దేశవ్యాప్తంగా సుమారు 500కుపైగా పేరెన్నికగన్న చేనేత ఉత్పత్తులు ఉం డగా.. ఇప్పటి వరకు 41 కేటగిరీలకు సంబంధించి 170 ఉత్పత్తులకు ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ గుర్తింపు దక్కింది. మరో 200 ఉత్పత్తులకు సంబంధించిన దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయి. 21 ఉత్పత్తులకు ఐహెచ్బీ చీరలు, డ్రెస్ మెటీరియల్, బెడ్షీట్లు, షాలువాల తయారీలో దేశంలో పేరెన్నికగన్న చేనేత ఉత్పత్తులకు మాత్రమే ఈ బ్రాండ్ను ఇవ్వాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి దేశంలోనే తొలిసారిగా.. గత ఏడాది డిసెంబర్లో పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులకు ఐహెచ్బీ దక్కింది. తాజాగా కాటన్, సిల్క్ చీరలు, కాటన్, సిల్క్ డ్రెస్ మెటీరియల్, కాటన్ సిల్క్ విభాగంలో 21 చేనేత ఉత్పత్తులకు ఐహెచ్బీ గుర్తింపు ఇచ్చారు. కాటన్ చీరల కేటగిరీలో పోచంపల్లి, వెంకటగిరి, ఉప్పాడ, సిద్దిపేట, నారాయణపేట, మంగళగిరి.. సిల్క్ చీరల కేటగిరీలో పోచంపల్లి, ధర్మవరం, కాటన్ సిల్క్ చీరల కేటగిరీలో గద్వాల చేనేత ఉత్పత్తులకు గుర్తింపు ఇచ్చారు. కాటన్ డ్రెస్ మెటీరియల్లో పోచంపల్లి ఇక్కత్, మంగళగిరి, సిల్క్ డ్రెస్ మెటీరి యల్లో పోచంపల్లి ఇక్కత్, కాటన్ బెడ్షీట్లలో తెలంగాణ ఇక్కత్ ఉత్పత్తులకు ఐహెచ్బీ గుర్తింపు లభించింది.