breaking news
National Film Awards
-
అందుకే అవార్డులు ఇవ్వలేదా?
జాతీయ చలనచిత్ర అవార్డులపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. విజేతలు ఆనందోత్సాహాల్లో తేలియాడుతుంటే, పరాజితుల మద్దతుదారులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అవార్డుల ఎంపిక విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తమ నటుడు అవార్డు ఎంపికపై పెదవి విరుస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, విక్రమ్లకు అవార్డు దక్కకపోవడం పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు మలయాళ నటుడు చందు సలీంకుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంచి సినిమాలను వదిలేసి మామూలు చిత్రాలకు అవార్డులు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. పాలక పక్షం వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను అవార్డులకు ఎంపిక చేశారని వ్యాఖ్యానించారు.మమ్ముట్టితో పాటు కార్తీక్ ఆర్యన్ను ఉత్తమ నటుడిగా ఎంపిక చేయడంపై చందు సలీంకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. "జాతీయ అవార్డును అధికార పార్టీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు అందజేస్తున్నప్పుడు, దానికున్న హుందాతనాన్ని ఊహించండి. అయినా కూడా వారు మిమ్మల్ని (మమ్ముట్టి) విస్మరించలేకపోతున్నారు, ఎందుకంటే దేశంలోనే మీ నటన అత్యుత్తమమైనద"ని ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. కాగా, 'బ్రహ్మయుగం' చిత్రంలో తన నటనకు మమ్ముట్టి, చందు ఛాంపియన్' చిత్రానికి కార్తీక్ ఆర్యన్.. ఉత్తమ నటులుగా ఎంపికైన సంగతి తెలిసిందే.సాధారణ సినిమాలకు అవార్డులా?మంచి చిత్రాలను విస్మరించి, సాధారణ సినిమాలకు అవార్డులు ఇచ్చారని చందు సలీంకుమార్ విమర్శించారు. అధికార పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగిన వారికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. "ప్రతిభకు కాకుండా అధికార పార్టీకి దగ్గరగా ఉండటం వల్లే అవార్డులు వచ్చాయనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంటే, చరిత్ర కూడా వాటిని అలాగే గుర్తుంచుకుంటుంది. ప్రభుత్వాలు మారినా అవార్డుల విలువ నిలిచి ఉండాలి. అవి కళాత్మక శ్రేష్ఠతకు నిదర్శనంగా నిలవాలి. ఒకవేళ ప్రజలకు వాటిపై నమ్మకం పోతే, ఆయా కాలాల్లోని అత్యుత్తమ చిత్రాలుగా చరిత్ర వీటిని గుర్తించద"ని ఘాటుగా వ్యాఖ్యానించారు.'ఆడుజీవితం'కు మొండిచేయిపృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ది గోట్ లైఫ్’ (ఆడుజీవితం), చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘తంగలాన్’ చిత్రాలకు ప్రధాన విభాగాల్లో అవార్డులు రాకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అవార్డుల జాబితా వెలువడిన వెంటనే #TheGoatLife, #Thangalaan హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. ‘ది గోట్ లైఫ్’కు ఒక్క అవార్డు కూడా రాకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటనకు కచ్చితంగా బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఒక్క పురస్కారం కూడా దక్కకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా గళం విన్పిస్తున్నారు. 'పుష్ప 2: ది రూల్', 'రాయన్' వంటి చిత్రాలకు అవార్డులు ప్రకటించిన జ్యూరీ.. ఈ రెండు సినిమాలను ఎందుకు విస్మరించిందని ప్రశ్నిస్తున్నారు. మెయ్యళగన్', 'మంజుమ్మెల్ బాయ్స్', 'కిష్కింధ కాండం' వంటి చిత్రాలకు అవార్డులు దక్కకపోవడాన్ని కూడా ప్రస్తావించారు.అవార్డుల విశ్వసనీయతపై అనుమానాలు72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ చిత్రానికి సరైన గుర్తింపు లభించకపోవడం పట్ల సోషల్ మీడియాలో అభిమానులు స్పందిస్తూ.. “జాతీయ అవార్డుల విశ్వసనీయత గతంలో ఉన్నంతగా ఇప్పుడు కనిపించడం లేదు” అంటూ వ్యాఖ్యానించారు. “#TheGoatLife ఒక్క అవార్డు కూడా గెలవకపోవడం ఎలా సాధ్యమైంది? పృథ్వీరాజ్ సుకుమారన్ తన పాత్ర కోసం చేసిన కృషి అసాధారణం. ఆయనకు అవార్డు రాకపోయినా, ఆయన చేసిన నటనే ఒక అవార్డు లాంటిది” అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని “మాస్టర్పీస్”గా అభివర్ణిస్తూ, పృథ్వీరాజ్ నటనను “ఐకానిక్ పెర్ఫార్మెన్స్”గా కొనియాడారు.విక్రమ్ అభిమానుల నిరాశ‘తంగలాన్’ సినిమాలో విక్రమ్ నటనకు కూడా అవార్డు వస్తుందని అనుకున్నారు. కానీ ఆయనకూ నిరాశ తప్పలేదు. దీంతో చియాన్ విక్రమ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. “చియాన్ విక్రమ్ను మరోసారి విస్మరించారు. ఇది ఆయన నష్టం కాదు, జాతీయ అవార్డులకే పెద్ద లోటు” అని వారు వ్యాఖ్యానించారు. “తంగలాన్ కోసం విక్రమ్ తన శరీరాన్నీ, మనసునీ పూర్తిగా అంకితం చేశారు. సినిమానే జీవితంగా భావించి పనిచేశారు. అయినప్పటికీ ఆయనకు జాతీయ అవార్డు రాకపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం” అని భావోద్వేగంగా స్పందించారు. “కృషికి గుర్తింపు ఉండాలి. చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ కోసం చేసిన శ్రమ జాతీయ అవార్డుకు అర్హమైనది” అని పేర్కొన్నారు.చదవండి: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నటుడు నరేశ్ ఆందోళనఅందుకే అవార్డులు ఇవ్వలేదా?పృథ్వీరాజ్ సుకుమారన్, విక్రమ్ సినిమాలకు అవార్డులు ఇవ్వకపోవడానికి కారణాలు వేరే ఉన్నాయని అభిమానులు అంటున్నారు. లూసిఫర్కు సీక్వెల్గా పృథ్వీరాజ్ తెరకెక్కించిన ఎల్2- ఎంపురాన్ సినిమా కేంద్ర ప్రభుత్వానికి గురైంది. దీంతో ఆయన సంస్థపై ఈడీ దాడులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమాకు అవార్డు ఇవ్వకుండా పక్కనపెట్టారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక తంగలాన్ దర్శకుడు ఫా. రంజిత్ కూడా మొదటి నుంచి అంబేద్కర్ వాదాన్ని గట్టిగా వినిపిస్తూ, వివక్షకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నారు. బహూశా ఈ కారణంతోనే ఆయన సినిమాకు అవార్డు రాలేదన్న అనుమానాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రాపగాండా సినిమాగా ఆరోపణలు ఎదుర్కొన్న హిందీ మూవీ 'ఆర్టికల్ 370'కి ఉత్తమ చలనచిత్ర పురస్కారం దక్కడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం అర్థయిందని కామెంట్లు పెడుతున్నారు. Master Piece #TheGoatLife #AadujeevithamIconic Performance🔥 @PrithviOfficial Pillar of the movie ❤️ @arrahman"கற்பனைக்கு அப்பாற்பட்ட ஒர் உன்மை சம்பவம்." pic.twitter.com/sOrzH8ctWL— Sasikumar Periasamy (@SKP_Offl) July 19, 2026How did #TheGoatLife did not even win a Single award.On what basis are the #72ndNationalFilmAwards are given National Award deserved #PrithvirajSukumaranHe may not get an award but he himself is an award for the efforts that he have put for the Film. pic.twitter.com/DCSCPL7JDC— Surya (@Suryan0110) July 18, 2026#ChiyaanVikram ignored yet again!Not his loss - it’s a big miss for the National Award.#Thangalaan #72ndNationalAwardspic.twitter.com/6X08MX5jms— Balaji (@RDBalaji) July 18, 2026#ChiyaanVikram's dedication and hard work for #Thangalaan were unmatched..🙏 He put his heart and soul into the role.. It is very disappointing to see it go unrecognized by the National Awards..🚶 The man deserves more..🤝 pic.twitter.com/f4khOtoekh— Laxmi Kanth (@iammoviebuff007) July 19, 2026 -
35 మార్కుల కథకు నూరు మార్కులు
లెక్కల్లో సున్నా మార్కులు తెచ్చుకునే తెలుగు పిల్లాడి కథ. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ‘ఉత్తమ బాలల చిత్రం’ గా ఎంపికై నూరు మార్కులు తెచ్చుకుంది. 2024 సెప్టెంబర్లో విడుదలై నోటిమాటతో హిట్టయిన ‘35 చిన్న కథ కాదు’. ఇప్పుడు ఢిల్లీలోనూ హిట్ కొట్టింది. పిల్లల తెలివిని మార్కులతో కొలవ వద్దనే సందేశం నేటి అవసరంగా భావించి కమిటీ ఈ సినిమాను అవార్డుతో గౌరవించింది.‘సున్నాకే విలువ లేనప్పుడు మైనస్ వన్, మైనస్ టూలకు విలువ ఎలా వస్తుంది సార్’ అని పెదబ్బ ప్రశ్న. వాడి అసలు పేరు అరుణ్. ఇంట్లో ‘పెదబ్బ’ అని పిలుస్తారు. క్లాస్లో అందరూ ‘జీరో బాబు’ అని పిలుస్తుంటారు. దానికి కారణం వాడికి లెక్కల్లో ‘సున్నా’ రావడమే కాదు ‘సున్నా’కు విలువ లేకపోవడం అంటే ఏంటో అర్థం కాకపోవడం వల్ల కూడా. పరీక్షల్లో వాడు సున్నాను దాటి 35 మార్కులు తెచ్చుకుని నెక్స్›్ట క్లాస్కు వెళ్లడమే ‘35 చిన్న కథ కాదు’ స్టోరీ. ఈ కథలో పిల్లాడు 35 దాటినట్టుగానే సినిమా సరిహద్దులు దాటింది.30 ఏళ్ల తర్వాత తెలుగుకు... 1996లో గుణశేఖర్ తీసిన ‘బాల రామాయణం’కు జాతీయ ఉత్తమ బాలల చిత్రం అవార్డు వచ్చింది. 30 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ ‘35 చిన్న కథ కాదు’తో తెలుగు సినిమా రంగం ఆ అవార్డును సాధించింది. పిల్లల మనస్తత్వాన్ని, చదువులో పసి మనసులు ఎదుర్కొనే సవాళ్ళను ఈ సినిమా చర్చించింది. పిల్లల్ని అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎలా అవగాహనా లేమితో వ్యవహరిస్తారో ఈ సినిమా చూపుతుంది. నందకిషోర్ ఈమని దర్శకత్వంలో రానా దగ్గుబాటి సమర్పణలో విడుదలైన ఈ సినిమా ‘ప్రతి ఇంటా చర్చించాల్సిన నిజాయితీ గల కథ’ అని ఈ జాతీయ పురస్కార ప్రకటనతో మరోసారి రుజువైంది.తల్లి తోడుగా నిలిచి...‘స్కూల్లో కావాల్సింది మేము పిల్లలతో బాగుండటం కాదు. పిల్లలు బాగు పడటం’ అంటాడు ఈ సినిమాలో లెక్కల మాష్టారు. అతని దృష్టిలో అరుణ్ ఒక మొద్దు. అలాంటి పిల్లల్ని అవమానించి, బాధించి దారికి తేవాలనేది అతని ఉద్దేశం. కాని ఉపాధ్యాయుడు బాధించే కొద్దీ పిల్లలు ఇంకా భీతావహులవుతారని ఎందుకు అర్థం చేసుకోరు? అరుణ్ అటు తండ్రి ఒత్తిడికీ, ఇటు ఉపాధ్యాయుడి పీడనకీ మధ్య నలిగిపోతాడు. ఒకసారి ఇంట్లో నుంచి పారిపోతాడు. అలాంటి సమయంలో తల్లే అతనికి తోడు నిలుస్తుంది. పిల్లాడు చేతికందకుండా పోతాడేమోనన్న భయంతో పదో తరగతి కూడా పాస్ కాని ఆ అమ్మ వాడితో కలిసి తానూ లెక్కలు నేర్చుకుని, కొడుకును గెలిపించేందుకు పోరాటం చేస్తుంది. ‘తనకు తానుగా విలువ లేని సున్నా... ఒకటి పక్కన చేరితే పది అవుతుంది..... అలా ఎదుటివారికి విలువ పెంచుతుంది’ అని చెబుతుంది. ప్రకృతి కూడా ఇదే నియమం మీద పని చేస్తుందని అరుణ్ అర్థం చేసుకుంటాడు. వాడికి లెక్కల్లోని ముడి మెల్లగా విడిపోతుంది. పరీక్ష పాసై విజయ దరహాసం చేస్తాడు. బట్టీ పట్టే విధానం కాకుండా, చదువు వెనుక ఉండే అసలైన సత్యాన్ని, పిల్లల ఆలోచనా విధానాన్ని గౌరవించాలని ఈ కథ ఉద్దేశం.ఎవరెవరు? తల్లి పాత్రలో నివేదా థామస్, తండ్రి పాత్రలో విశ్వదేవ్, అలాగే కఠినమైన లెక్కల మాష్టారు పాత్రలో ప్రియదర్శి నటించారు. ఇటీవల మరణించిన దర్శకుడు కె. భాగ్యరాజా ఈ సినిమాలో ప్రిన్సిపాల్గా కనిపిస్తారు. నివేదా థామస్ నటనకు తెలంగాణ ‘గద్దర్’ అవార్డు లభించడం మరో గుర్తింపు.అర్థం చేసుకోండి... పిల్లలు పాఠశాలలో అడుగుపెట్టినప్పటి నుండి ‘ర్యాంకులు’, ‘మార్కులు’ అనే పెద్ద బరువును మోపుతున్నాం. తక్కువ మార్కులు వస్తే జీవితంలో దేనికీ పనికిరారు అనే ముద్ర వేసే విద్యా వ్యవస్థకు వంత పాడుతున్నాం. అందుకే ‘మాకు మార్కులు కాదు, మమ్మల్ని అర్థం చేసుకునే మనసులు కావాల’ని ఈ సినిమా ద్వారా పిల్లలు అడుగుతున్నారు. ప్రతి పిల్లాడిలోనూ ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. ఒకరికి లెక్కలు రాకపోవచ్చు, కానీ కళలలో అపారమైన సృజనాత్మకత ఉండవచ్చు. తల్లిదండ్రుల అండ, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉంటే ఏ పిల్లాడూ జీవితంలో సున్నా కాదు అనే నమ్మకాన్ని ఈ సినిమా కలిగించింది. ‘35’ అనేది కేవలం పాస్ మార్క్ మాత్రమే కాదు, అది ఒక పిల్లాడి ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని చాటిచెప్పిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు రావడం పెద్ద తెలుగు సంబరం. అది ఈ రోజు నిజం అయింది‘35: చిన్న కథ కాదు’ సినిమాకి ఉత్తమ బాలనటుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గద్దర్ అవార్డు అందుకున్నాను. అయితే జాతీయ అవార్డుకి ఎంపిక అవుతానని ఊహించలేదు. నేను ఈ స్థాయి వరకు రాగలిగానంటే మా అమ్మ సత్యవాణి ఇచ్చిన ధైర్యం, నాన్న సురేష్కుమార్ ఇచ్చిన ఆత్మవిశ్వాసం, చెల్లి బాల ఇచ్చిన బలం. నాకు చాన్స్ ఇచ్చిన డైరెక్టర్ నంద కిశోర్ సార్కి థ్యాంక్స్. నా నటన చూసిన తర్వాత తప్పకుండా అవార్డు వస్తుందని చాలామంది చెప్పారు.. అది ఈరోజు నిజం అయింది. ‘35: చిన్న కథ కాదు’ని ప్రేక్షకులందరూ గుండెల్లో పెట్టుకున్నారు. ఈ సినిమాలో నా నటనకు ఇటు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు అటు కేంద్ర ప్రభుత్వ అవార్డు రావడంతో నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.. ఏడుపొస్తోంది. నేను ఈ అవార్డుకి ఎంపిక అయినట్లు ముందు మా డైరెక్టర్గారు, ఆ తర్వాత విశ్వదేవ్గారు, టీమ్ మెంబర్స్ చెప్పారు. ప్రస్తుతం నేను 8వ తరగతి చదువుతున్నాను. నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లకు కూడా థ్యాంక్స్ చెబుతున్నాను. నేను ఎంచుకునే పాత్రలు సవాల్గా ఉండటంతో పాటు అవార్డులు వచ్చేలా ఉండాలని ఎంచుకుంటాను. – ఉత్తమ బాలనటుడు(అరుణ్ దేవ్ – ‘35: చిన్న కథ కాదు) -
జాతీయ సినీ అవార్డులు.. ప్రైజ్మనీ ఎంత? ఎవరికి ఏమేం ఇస్తారంటే?
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో టాలీవుడ్ హవా కనిపించింది. 71వ జాతీయ సినీ అవార్డుల్లో (National Film Awards 2025) టాలీవుడ్ ఏడు పురస్కారాలను ఎగరేసుకుపోయింది. 2023లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ అవార్డులు ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ నిలవగా.. ఉత్తమ నటుడిగా షారూఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్) అవార్డులు కొల్లగొట్టారు. అయితే వీరిద్దరూ రూ.2 లక్షల పురస్కారాన్ని చెరిసగం పంచుకోవాల్సి ఉంది. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాకుగానూ రాణీ ముఖర్జీకి ఉత్తమ నటి పురస్కారం వరించింది. అవార్డుతో పాటు రూ.2 లక్షలు అందుకోనుంది. వీళ్లందరికీ ఇదే తొలి జాతీయ అవార్డు కావడం విశేషం! తెలుగు చలనచిత్రసీమకు ఏయే విభాగంలో జాతీయ అవార్డులు వచ్చాయి? వారికి ఎంత ప్రైజ్మనీ అందుతుందనే వివరాలను చూసేద్దాం..వారికి బంగారు పతకం2024 సంక్రాంతికి విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచిన ‘హను–మాన్’ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్), బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ) విభాగంలో పురస్కారాలు వచ్చాయి. దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మకు, యానిమేటర్ జెట్టి వెంకట్ కుమార్కు బంగారు పతకంతో పాటు రూ.3 లక్షల నగదు చొప్పున అందజేయనున్నారు. జెట్టి వెంకట్ కుమార్.. వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గానూ వ్యవహరించినందున అతడికి మరో వెండి పతకంతో పాటు మరో రూ.2 లక్షలు ఇవ్వనున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ నందు పృథ్వీ వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు తీసుకోనున్నాడు.బేబీ సింగర్కు రూ.2 లక్షలు‘గాంధీతాత చెట్టు’ సినిమాకుగాను సుకృతికి ఉత్తమ బాలనటి పురస్కారం వరించింది. అయితే ఈ కేటగిరీలో మరో ఇద్దరికి అవార్డులు రావడంతో.. రూ.2 లక్షల ప్రైజ్మనీని ఈ ముగ్గురూ సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. బేబీ మూవీలో ప్రేమిస్తున్నా... పాటకు పీవీఎస్ఎన్ రోహిత్కు ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు వరించింది. ఇతడికి వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు రానున్నాయి.బేబీ డైరెక్టర్కు రూ.1 లక్ష ప్రైజ్మనీబెస్ట్ స్క్రీన్ప్లే విభాగంలో బేబీ రచయిత సాయి రాజేశ్తో పాటు మరో తమిళ దర్శకుడికి అవార్డు వరించింది. దీంతో అతడితో కలిసి రూ.2 లక్షల బహుమానాన్ని సమంగా పంచుకోవాల్సి ఉంటుంది. వీరికి వెండి పతకాలు బహుకరిస్తారు. బలగం సినిమాలో ‘ఊరు పల్లెటూరు..’ పాట రచయిత కాసర్ల శ్యామ్ బెస్ట్ లిరిక్ రైటర్గా వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు అందుకోనున్నాడు. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి నిలిచింది. షైన్ స్క్రీన్స్ నిర్మాతలతో దర్శకుడు అనిల్ రావిపూడి రూ.2 లక్షల ప్రైజ్మనీని సమానంగా పంచుకోనున్నాడు.చదవండి: బుల్లితెర నటి ఇంట విషాదం.. 'నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది -
ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్లవైపు మళ్లాయి: నటుడు మిథున్ చక్రవర్తి
‘‘నా చర్మపు రంగు నలుపుగా ఉండటం అనేది నా కెరీర్ ఆరంభంలో పెద్ద సవాల్లా అనిపించింది. నల్లగా ఉన్నవారు నటులుగా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం కష్టమన్నట్లు కొందరు మాట్లాడారు. ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్లమని కూడా సలహా ఇచ్చారు. ఒకానొక దశలో నా చర్మపు రంగును మార్చమని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. ఆ తర్వాత అసలు నేనేం చేయగలను? నా బలం ఏంటి? అని ఆలోచించాను. నేను బాగా డ్యాన్స్ చేయగలనని నా బలం తెలుసుకున్నాను.మంచి డ్యాన్సర్ కావాలనుకున్నాను. అప్పుడు ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్ల వైపు మళ్లుతాయని అనుకున్నాను. ప్రేక్షకులు నా డ్యాన్స్ను అభిమానించడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు నా కలర్ను మర్చిపోయారు. నేనో సెక్సీ డ్యాన్సర్గా, డస్కీ బెంగాలీ బాబుగా పేరు సంపాదించుకున్నాను’’ అని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం స్వీకరించిన అనంతరం ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి. దేశ రాజధాని ఢిల్లీలో 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. 2022 సంవత్సరానికిగాను ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం ‘ఆట్టమ్’ (మలయాళం), ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి (కాంతార–కన్నడ), ఉత్తమ నటీమణులుగా నిత్యా మీనన్ (తిరుచిత్రంబలం–తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ఎక్స్ప్రెస్–గుజరాతీ) అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు ‘కార్తికేయ 2’కు దక్కింది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ అవార్డు స్వీకరించగా, చిత్రదర్శకుడు చందు మొండేటి, హీరో నిఖిల్ కూడా హాజరయ్యారు. ‘΄పొన్నియిన్ సెల్వన్– 1’కు గానూ ఉత్తమ సంగీతం (నేపథ్య సంగీతం) విభాగంలో ఏఆర్ రెహమాన్ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు వివిధ భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ వేదికపై ఇంకా మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ – ‘‘ఇప్పటికి మూడు జాతీయ అవార్డులు అందుకున్నాను. తొలి అవార్డు (‘మృగయా’) అందుకున్నప్పుడే నేను చాలా సాధించాననుకున్నాను. ‘మృగయా’ సినిమా స్క్రీనింగ్కి వెళ్లినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్... అతను ఈ లోకంలో లేడు కాబట్టి పేరు చెప్పను. అతను ‘ఈ సినిమా చాలా బాగుంది. నువ్వు అద్భుతమైన నటుడివి. కానీ ఇలాంటి బట్టలతో నువ్వు ఎలా కనిపిస్తున్నావో తెలుసా?’ అంటే నేను నిర్ఘాంతపోయాను.నేను ఆయన ముందు నగ్నంగా నిలబడ్డానా? అనిపించింది. వెంటనే ఆయన ‘మృగయా’లో నేను చేసిన ఆదివాసీ పాత్ర గురించి చెప్పినట్లు పేర్కొన్నారు. నేను నా తొలి జాతీయ అవార్డు అందుకున్న తర్వాత హాలీవుడ్ యాక్టర్ అల్ పచీనో అంతటి ప్రతిభ నాలోనూ ఉందనుకున్నాను. అకస్మాత్తుగా నా తీరు మారిపోయింది. కొందరు నిర్మాతలతో దురుసుగా ప్రవర్తించాను. నన్ను నేను అల్ పచీనో అనుకుం టున్నానని నిర్మాతలు గ్రహించలేకపోయారు. ఓ సందర్భంలో ఒక నిర్మాతకు కథను నా ఇంటికి పంపాలన్నాను. అతను వెంటనే లేచి నా చెంప చెళ్లుమనిపించాడు. అప్పట్నుంచి నన్ను నేను ఓ అల్ పచీనోలా ఊహించుకోవడం మానేశాను. నాదే తప్పని గ్రహించాను. నా తీరు మార్చుకున్నాను’’ అన్నారు.మంచి మార్పు తీసుకురావాలన్నదే...: రిషబ్ శెట్టిప్రతి సినిమా ప్రభావం ప్రేక్షకుల పై ఉంటుంది. అందుకే ప్రజల్లో, సమాజంలో మంచి మార్పును తీసుకువచ్చే సినిమాలు తీయాలన్నది నా ఉద్దేశం.కష్టానికి ప్రతిఫలం దక్కింది: నిత్యా మీనన్ చిత్రపరిశ్రమలో దాదాపు 15 ఏళ్ల కష్టం నాది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ అవార్డు. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి దీన్ని బాధ్యతగా చూడకుండా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. ‘తిరుచిత్రంబలం’ బృందానికి, నా సహ నటులకు ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. ఇదే ఉత్సాహంతో మంచి దర్శకులు, రచయితలతో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను. సినిమాకి సరిహద్దులు లేవు: ఏఆర్ రెహమాన్ సినిమాకి ప్రాంతం, భాష అంటూ ఎలాంటి సరిహద్దులు లేవు. నేను అందుకున్న ఏడో జాతీయ అవార్డు ఇది. సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాకు వచ్చేందుకు కారకులైన ఫిల్మ్ మేకర్స్కి, ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నంగారికి ధన్యవాదాలు. -
జాతీయ అవార్డ్ గెలుచుకున్న సినిమాలు.. ఏయే ఓటీటీల్లో?
70 జాతీయ అవార్డులని కేంద్రం తాజాగా శుక్రవారం ప్రకటించింది. 2022 డిసెంబరు 31లోపు సెన్సార్ పూర్తయిన చిత్రాలకుగానూ పురస్కార విజేతలు ఎవరెవరనేది అనౌన్స్ చేశారు. తెలుగు నుంచి 'కార్తికేయ 2' మాత్రమే ప్రాంతీయ చిత్రం కేటగిరీలో అవార్డ్ దక్కించుకుంది. మలయాళ, తమిళ సినిమాలదే పూర్తిగా ఆథిపత్యం. ఇంతకీ ఈ మూవీస్ అన్నీ ఏయే ఓటీటీల్లో ఉన్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల పూర్తి లిస్ట్)నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్- ఓటీటీఉత్తమ చిత్రంగా నిలిచిన మలయాళ సినిమా 'ఆట్టమ్'.. అమెజాన్ ప్రైమ్లో ఉంది.ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టిని నిలబెట్టిన 'కాంతార'.. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఉత్తమ నటిగా నిత్యా మీనన్ చేసిన 'తిరు' సన్ నెక్స్ట్లో, మానసి పరేఖ్ 'కచ్ ఎక్స్ప్రెస్' షీమారో మీ అనే ఓటీటీలో ఉంది.ప్రాంతీయ చిత్రాల విభాగంలో.. కార్తికేయ 2(తెలుగు) జీ5లో ఉంది. పొన్నియిన్ సెల్వన్-1 (తెలుగు-తమిళ) అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది.సౌది వెళ్లక్క సీసీ 225య/2009 (మలయాళ) చిత్రం సోనీ లివ్లో ఉంది.వాల్వీ (మరాఠీ).. అమెజాన్ ప్రైమ్, జీ5 ఓటీటీల్లో ఉంది.కబేరి అంతర్జాన్ (బెంగాలీ).. జియో సినిమా ఓటీటీలో ఉంది.గుల్ మోహర్ (హిందీ).. హాట్ స్టార్లో ఉంది.ఉత్తమ దర్శకుడు విభాగంలో సూరజ్ బర్జాత్యాకి అవార్డు వచ్చిన 'ఊంచాయ్'.. జీ5లో ఉంది.విజువల్ ఎఫెక్ట్స్, ప్లే బ్యాక్ సింగర్ తదితర కేటగిరీల్లో విజేతగా నిలిచిన 'బ్రహ్మస్త్ర'.. హాట్స్టార్లో ఉంది.ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో అవార్డ్ గెలిచిన 'కేజీఎఫ్ 2'.. అమెజాన్ ప్రైమ్లో ఉంది.ఉత్తమ మేకప్, ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో గెలిచిన బెంగాలీ మూవీ 'అపరాజితో'.. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.ఉత్తమ బాలనటుడిగా నిలిచిన శ్రీపాథ్ నటించిన 'మలికాపురమ్'.. హాట్స్టార్లో ఉంది.(ఇదీ చదవండి: 'తంగలాన్' సినిమా రివ్యూ)


