-
తాజా మాజీ ముఖ్యమంత్రికి అధిష్టానం షాక్
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రెండు నెలలుగా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. 30 స్థానాలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒకే విడతలో ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ స్వామికి షాకిచ్చింది. ఆయనకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేదు. ఈ విషయాన్ని పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాజాగా 14 అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అయితే ఆ జాబితాలో నారాయణస్వామి పేరు లేదు. రెండో జాబితాలోనూ ఆయనకు అవకాశం ఉండదని తెలుస్తోంది. నారాయణస్వామి నియోజకవర్గం నెల్లిథోప్ స్థానాన్ని డీఎంకేకు కేటాయించారు. షా జహన్ కామ్రాజ్ నగర్, వి.సుబ్రమణ్యన్ కరైకల్ (నార్త్), కందసామి ఎంబలమ్, కమలకణ్నన్ థిరునల్లర్ స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఎన్నికల వ్యవహారాలు, ప్రచారం బాధ్యతలను నారాయణస్వామి చూసుకుంటారని.. అందుకే ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పార్టీ పుదుచ్చేరి వ్యవహారాల ఇన్చార్జి గుండురావు తెలిపారు. అయితే నారాయణస్వామి పేరు ప్రకటించకపోవడం కొంత పార్టీలో విబేధాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
‘మోదీకి నేనంటే చాలా ఇష్టం.. అందుకే’
సాక్షి, విశాఖపట్నం : దేశంలో నిరంకుశ పాలన అంతం కావాలంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఉద్వాసన పలకడం ఒక్కటే మార్గమని పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ‘ మేము(కాంగ్రెస్) ఆయనను బయటికి పంపాల్సిన అవసరం లేదు. ఆయన పాలన పట్ల ప్రతీ ఒక్కరిలో అసంతృప్తి రగులుతోంది. ఈ కారణంగా ఆయన సొంత మనుషులు, పార్టీ వాళ్లే ఏదో ఒకరోజు ఆయనను బయటికి నెట్టివేస్తారు. కేవలం ఇద్దరు మనుషుల చేతుల్లో బీజేపీ నలిగిపోతుందని ఆ పార్టీ నాయకులే నా దగ్గర గోడు వెళ్లబోసుకున్నారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన పదవి నుంచి దిగిపోక తప్పదు’ అని వ్యాఖ్యానించారు. ఆయనకు నేనంటే చాలా ఇష్టం... ప్రధాని మోదీకి ముఖ్యమంత్రులతో మాట్లాడే సమయమే ఉండదని నారాయణ స్వామి విమర్శించారు. గతంలో ఆయన అపాయింట్మెంట్ కోసం ఆరు సార్లు ప్రయత్నిస్తే కనీసం రెండుసార్లైనా దొరికేది.. కానీ ఇప్పుడు పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ మోదీకి నేనంటే ఎంతో ఇష్టం. అందుకే కిరణ్బేడీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా పంపించారు’ అని నారాయణ స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా పాలన పరమైన విషయాల్లో కిరణ్బేడి అతిగా జోక్యం చేసుకుంటున్నారని, లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండేకంటే ఓ చౌకీదార్లా ఉండేందుకే ఆమె ఉత్సాహం చూపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. -
సీఎం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్!
పుదుచ్చేరి: పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వం, లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మధ్య మళ్లీ ఘర్షణ తారాస్థాయికి చేరింది. లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మంగళవారం కేంద్రం నామినేట్ చేసిన ముగ్గురు వ్యక్తులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించారు. బీజేపీ పుదుచ్చేరి శాఖ అధ్యక్షుడు వీ స్వామినాథన్, పార్టీ కోశాధికారి కేజీ శంకర్, విద్యావేత్త ఎస్ సెల్వ గణపతిలతో ఆమె హడావిడిగా ప్రమాణస్వీకారం చేయించారు. దీనిపై నారాయణస్వామి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తమ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్నది. మరోవైపు ఈ నియామకాలపై స్టే విధించాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా గవర్నర్ ఎలా ఎమ్మెల్యేలను నామినేట్ చేస్తారని, ఇది సమాఖ్యస్ఫూర్తికి వ్యతిరేకమని సీఎం వీ నారాయణస్వామి అంటుండగా.. ఆయన ఆరోపణలను కిరణ్ బేడీ తోసిపుచ్చారు. తాను రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నట్టు ఆమె తెలిపారు. ‘కేబినెట్ మంత్రులు నా దగ్గరకు వచ్చి.. మీరు ఎందుకు ప్రజలను కలుస్తున్నారు? వారి సమస్యలను ఎందుకు పరిష్కరిస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. మీరు రబ్బర్స్టాంప్లా ఉండాలని మంత్రులు అంటున్నారు’ అని కిరణ్ బేడీ అన్నారు. -
పుదుచ్చేరి సీఎంగా నారాయణస్వామి
పుదుచ్చేరి: కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి వి.నారాయణస్వామి పుదుచ్చేరి పదో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఇక్కడి గాంధీ థిడాల్లో నారాయణ, మరో ఐదుగురు మంత్రుల చేత లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీ ప్రమాణం చేయించారు. వీరిలో సీఎం పీఠం కోసం పోటీపడిన నమశ్శివాయమ్, మల్లాది కృష్ణారావు, ఎంఓహెచ్ఎఫ్ షాజహాన్, ఎం.కందసామి, కమలాకన్నన్ ఉన్నారు. యానాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణారావు తెలుగులో ప్రమాణం చేశారు. వీరంతా గతంలో రాష్ట్ర మంత్రులుగా పనిచేసినవారే. 30 మంది సభ్యుల అసెంబ్లీలో 15 మంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా 69 ఏళ్ల నారాయణ గత నెలలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
పురోగతి లేని ఎత్తినహొళె
ఇలాగే కొనసాగితే 25 ఏళ్లు గడిచినా పథకం పూర్తికాదు {పభుత్వం మాటలకు చేతలకు పొంతన లేదు ఇప్పటి వరకూ కేవలం 300 మీటర్ల మేర పనులు పూర్తి ఎమ్మెల్సీ వై.ఎ.నారాయణస్వామి కోలారు : ప్రభుత్వం చెబుతున్న విధంగా ఎత్తిన హొళె పథకం పనులు పురోగతి సాధించడం లేదని ఎమ్మెల్సీ వై.ఎ.నారాయణస్వామి విమర్శించారు. ఈ పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు వేగవంతం చేయడం ద్వారా ఐదేళ్లలో కోలారుకు నీరు తీసుకు వచ్చేందుకు దోహపడుతుందని అన్నారు. కోలారు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధృుల బందం శనివారం ఎత్తినహొళె ప్రాజెక్ట్ పనులు పరిశీలించింది. అనంతరం ఆదివారం కోలారులో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ... ప్రస్తుతం ఎత్తినహొళె ప్రాజెక్టు పనులు మందకొడిగా సాగుతున్నాయని ఇలాగే కొనసాగితే మరో 25 యేళ్లు పూర్తయినా పథకం పూర్తి కాదన్నారు. ఎత్తిన హొళె పథకం పనులు వేగవంతంగా జరుగుతున్నాయంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలకు, అక్కడ జరుగుతున్న పనులకు పొంతన లేదని అన్నారు. ఇప్పటి వరకూ కేవలం 300 మీటర్ల మేర పైప్లైన్ పనులు పూర్తి అయ్యాయని వివరించారు. ఎనిమిది చెక్డ్యాంలను పూర్తి చేయాల్సి ఉండగా ఒక్క చెక్డ్యాం నిర్మాణ పనులు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. బయలు సీమ జిల్లాల నీటి సమస్య గురించి ప్రభుత్వం తెలుసుకోవాలని జిల్లాల నీటి సమస్య పరిష్కారానికి ప్రాజెక్టు పనులను వేగ వంతం చేయాలన్నారు. ప్రాజెక్టు పనులు నిరాటంకంగా సాగడానికి నీరావరి మండలిని రచించాలని డిమాండు చేశారు. ప్రతి నెలా ప్రగతి పరిశీలన జరగాలన్నారు. బయలు సీమకు చెందిన ప్రజా ప్రతినిధు లందరూ దీనిపై ఏకాభిప్రాయాన్ని వ్యక్త పరచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. ఎత్తినహొళె ప్రాజెక్టు ప్రగతి పరిశీలనకు వెళ్లిృ బందంలో తనతో పాటు డిప్యూటీ స్పీకర్ శివశంకర్రెడ్డి, మాజీ స్పీకర్ రమేష్కుమార్, డి.ఎస్.వీరయ్య, మంజునాథ్గౌడృ కష్ణారెడ్డి, రాజణ్ణ, సుధాకర్లాల్, ముని శ్యామప్ప, శివలింగేగౌడ తదతరులు ఉన్నారని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement