-
Napalm girl: మానని గాయంతో ఇప్పటికీ నరకం అనుభవిస్తోంది
తెలిసీ తెలియని వయసు.. తోటి చిన్నారులతో ఆడిపాడే సమయంలోనే కొండంత కష్టం వచ్చి పడింది. ఒక యుద్ధం.. ఆమె జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేయడమే కాదు.. ఐదు దశాబ్దాల తర్వాత మానని గాయాలతో ఆమెకు నిత్య నరకం చూపిస్తోంది కూడా. వియత్నాం వార్ ద్వారా చరిత్రలో నిలిచిన పోయిన నాపామ్ గర్ల్ కథ(వ్యథ) ఇది.. తొమ్మిదేళ్ల ఆ చిన్నారి.. ఇంటి పక్కన స్నేహితులతో సరదాగా ఆడుకుంటోంది. పారిపోండి.. పరిగెత్తండి అంటూ మిలిటరీ దుస్తుల్లో ఉన్న కొందరి హెచ్చరికలు వాళ్ల చెవినపడ్డాయి. అంతా కలిసి పరుగులు తీశారు. ఇంతలో వాళ్లు ఉన్న ప్రాంతంలో ఓ బాంబు పైనుంచి వచ్చి పడింది. మిగతా పిల్లలంతా ఏడుస్తూ తలోదిక్కు పారిపోతుంటే.. ఆ చిన్నారి మాత్రం దుస్తులు మంటల్లో కాలిపోయి.. బట్టల్లేకుండా రోదిస్తూ గాయాలతో రోడ్డు వెంట పరుగులు తీసింది. జూన్ 8, 1972.. టే నిహ్ ప్రావిన్స్ ట్రాంగ్ బ్యాంగ్ వద్ద జరిగిన ఈ ఘటన.. ఒక ఐకానిక్ ఫొటో ద్వారా చరిత్రలో నిలిచిపోయింది. నాపామ్ గర్ల్.. సుప్రసిద్ధ ఫొటో. వియత్నాం యుద్ధంలో అమెరికా ఫైటర్ జెట్లు నాపామ్ బాంబులు సంధించడంతో.. కాలిన గాయాలతో బట్టలు లేకుండా వీధుల వెంట పరిగెత్తింది ఆ చిన్నారి. వీపు, భుజానికి తీవ్ర గాయాలు అయ్యాయి ఆమెకి. అయితే ఆ గాయాలకు యాభై ఏళ్ల తర్వాత చికిత్స అందుకుంటోంది. నాపామ్ గర్ల్ అసలు పేరు కిమ్ ఫుసీ ఫాన్ టి. గత ఏడాదిగా ఆమె ఆస్పత్రిలోనే.. పదిహేడు సర్జరీల ద్వారా ట్రీట్మెంట్ అందుకుంది. కానీ, ఆమె గాయాలు మానాలంటే.. మరో పదేళ్లపాటు కూడా ఆమెకి మరిన్ని సర్జరీలు అవసరం. అంటే.. ఆమె ఈ నరకం మరిన్ని సంవత్సరాలు తప్పదన్నమాట. ఫాన్ తి.. పుట్టింది ఏప్రిల్ 6, 1963లో. ఆ ఘటన తర్వాత ఆమె జీవితం.. వివాదాలు, ఆంక్షల నడుమే నడుస్తోంది. చేసేది లేకచివరికి.. ఆమె తన భర్తతో పాటు 1992లో కెనడాకు ఆశ్రయం మీద వెళ్లారు. 2015లో ఆమె ఫ్లోరిడాకు చెందిన డాక్టర్ జిల్ వాయిబెల్ను కలసుకుంది. ఆమె కథ తెలిసిన వాయ్బెల్ ఉచితంగా చికిత్స అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం మియామిలో కిమ్ ఫుసీ ఫాన్ తి.. చివరి దశ చికిత్స అందుకుంటోంది. ఇప్పుడు తాను వియత్నాం యుద్ధ బాధితురాలిని కాదని, తనకు ఇద్దరు బిడ్డలు.. మనవరాళ్లు ఉన్నారని, తనను ఇప్పుడు నాపామ్ గర్ల్ అని పిలవొద్దని.. శాంతి స్థాపన కోసం పాడుపడుతున్న ఒక ఉద్యమకారణిని అని చెప్తోందామె. వియత్నాం-అమెరికన్ ఫొటోగ్రాఫర్ నిక్ ఉట్ అనే ఫొటో జర్నలిస్ట్.. నాపామ్ గర్ల్ ఫొటోకు గానూ ఫులిట్జర్ అందుకున్నారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆ ఫొటోపై పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. అయితే.. ఉట్ మాత్రం ఆ ఫొటో వియత్నాం యుద్ధానికి సిసలైన నిదర్శనమని ప్రకటించారు. -
1972 నాటి గాయాలకు నేడు చికిత్స
న్యూయార్క్: యుద్ధం వల్ల బాల్యం ఎంత ఛిద్రమవుతుందో ప్రపంచానికి చాటిచెప్పిన ఈ చిత్రం నాడు ప్రపంచాన్నే కుదిపేసింది. చిత్రంలో బట్టలు లేకుండా పరుగెడుతూ కనిపిస్తున్న తొమ్మిదేళ్ల వియత్నాం పాప కిమ్ ఫూనకు నేడు సరిగ్గా 52 ఏళ్లు. నాడు దక్షిణ వియత్నాంలోని ట్రాంగ్ బ్యాంగ్ గ్రామంపై యుద్ధ సేనలు ప్రయోగించిన నాపమ్ బాంబు వల్ల వంటిపై బట్టలు మంట పుట్టడంతో ఆ పాప ఆ బట్టలను ఊడదీసి వీధిలో పరుగెత్తింది. అప్పుడు కాలిన గాయాలు ఇప్పటికీ సల్పుతుంటే బాధను మౌనంగా భరిస్తూ వచ్చింది. ఇక ఆ బాధను భరించలేనంటూ కెనడాలోని టొరాంటోలో నివసిస్తున్న కిమ్ ఫూ ఇటీవల అమెరికాలోని మయామి ఆస్పత్రికి వెళ్లి నాటి గాయాలకు చికిత్స చేయించుకుంటోంది. ఆమెకు భర్త బీ యూ తొయాన్, ఇద్దరు పిల్లలు, 1972, జూన్ 7వ తేదీన బాంబు దాడి నుంచి తప్పించుకొని వీధిలో పరుగెడుతున్నప్పుడు, కిమ్ ఫూ, ఆమె సోదరుల ఫొటోను తీసిన నాటి లాస్ ఏంజలిస్ ఏపీ ఫొటోగ్రాఫర్ నిక్ ఉట్లు తోడుగా ఉన్నారు. అప్పడు, ఆ పాపను వాళ్ల సోదరులను ఏపీ మీడియా వాహనంలోనే సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి వారి ప్రాణాలను రక్షించింది కూడా ఫొటోగ్రాఫర్ నిక్ ఉట్యే. ఈ ఫొటోను తీసిన నిక్ ఉట్కు పులిట్జర్ అవార్డు లభించింది. ఇప్పడు ఆయనకు 65 ఏళ్లు ఉన్నాయి. ఆయనను కిమ్ ఫూ ‘మామ’ అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. నాటి బాంబు దాడిలో ఎడమ చేయి, ఎడమ భుజానికి తీవ్ర కాలిన గాయాలయ్యాయని, చికిత్స కోసం పెద్దయ్యాక ఎన్నో ఆస్పత్రులు తిరిగానని, ఎక్కడికెళ్లినా సరైన వ్యాయామం చేయడం ఒక్కటే మార్గమని చెబుతూ వచ్చారని, నేటికి వ్యాయామం చేస్తున్నా గాయాల బాధ తగ్గడం లేదని, ఎడమ చేయి పూర్తిగా ఇప్పటికీ లేవడం లేదని కిమ్ ఫూ తెలిపారు. అమెరికాలోని ‘మయామి డెర్మటాలజీ లేజర్ ఇనిస్టిట్యూట్’లో సరైన చికిత్స ఉందని తెలిసి, తన భర్త, అంకుల్ ఫొటోగ్రాఫర్ సహాయంతో ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నానని, ఒక్కో సెషన్కు దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని చెప్పారు. చావుతోనే తన గాయాల బాధ తీరుతుందని నిన్నటిదాకా భావిస్తూ వచ్చానని, ఏడాదిలోగా ఆ బాధ నుంచి కోలుకుంటాననే ఆశాభావం ఇప్పుడు కలుగుతోందని ఆమె అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement