breaking news
Nandaluru Railway gate
-
వైరల్: నలుగురిని కాపాడిన యాచకుడు
నందలూరు (రాజంపేట): ఈతకు వెళ్లి నీటి గుంతలో కూరుకుపోయిన ఐదుగురిలో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో నలుగురిని ఒక యాచకుడు కాపాడాడు. ఈ ఘటన చెయ్యేటి రైల్వే వంతెన వద్ద సోమవారం చోటు చేసుకుంది. చెయ్యేటి గ్రామమైన కుమ్మరపల్లె (నాగిరెడ్డిపల్లె మేజర్ పంచాయతీ పరిధి)కు చెందిన ఐదుగురు విద్యార్ధులు సరదగా ఈత కొట్టడానికి రైల్వే వంతెనకు చేరుకున్నారు. ఇసుక కోసం గోతులు తీయడంతో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల్లో ఇటీవల వర్షానికి భారీగా నీరు చేరింది. ఈ గుంతల్లో ఈత కొడుతూ ఐదుగురూ లోపలకు కూరుకుపోయారు. ఒడ్డున ఉన్న స్నేహితులు కేకలు వేయడంతో గమనించిన ఒక యాచకుడు గుంతలోకి దిగి నలుగురిని బయటకు తీసుకొచ్చాడు. అయితే ఆదిత్య (16) బయటకు రాలేక మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా మృతి చెందిన విద్యార్థి తండ్రి రమేశ్ గతంలోనే చనిపోయాడు. ఒకగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లి శైలజ రోదించడం అందరినీ కలచివేసింది. -
రైలు ఢీకొని మహిళ మృతి
వైఎస్సార్జిల్లా : రైలు పట్టాలు దాటుతున్న మహిళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీకొని మృతిచెందింది. ఈ సంఘటన వైఎస్సార్ జ్లిలా నందలూరు రైల్వే గేటు సమీపంలో సోమవారం జరిగింది. వివరాల ప్రకారం.. మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుబ్బమ్మ(52) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో నందలూరుకు వచ్చిన ఆమె రైలు గేటు వేసి ఉన్న సమయంలో గేటు కింది నుంచి వెళ్లి పట్టాలు దాటడానికి ప్రయత్నించింది. అదే సమయంలో వచ్చిన సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.