breaking news
Namibian President Haze
-
నమీబియా అధ్యక్షుడు గీన్గోబ్ కన్నుమూత
హరారే: నమీబియా అధ్యక్షుడు హగె గాట్ప్రీడ్ గీన్గోబ్(82) మృతి చెందారు. కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతున్న గీన్గోబ్ హరారేలోని లేడీ పొహంబా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారని అధ్యక్షభవనం తెలిపింది. ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడినట్లు 2014లో గీన్గోబ్ స్వయంగా ప్రకటించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. 2015 నుంచి దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్న గీన్గోబ్ పదవీ కాలం ఈ ఏడాదితో పూర్తి కావాల్సి ఉంది. వలస పాలన నుంచి బయటపడ్డాక నమీబియా మొదటి ప్రధానిగా 1990–2002 మధ్య తిరిగి 2008–12 సంవత్సరాల మధ్య గీన్గోబ్ బాధ్యతలు నిర్వహించారు. ఇదీ చదవండి: చిలీలో కార్చిచ్చు ఎఫెక్ట్.. 46 మంది మృతి, వేలాది మందికి.. -
భారత్కు యురేనియం సరఫరాను పరిశీలిస్తాం
- నమీబియా అధ్యక్షుడు హేజ్ వెల్లడి - రాష్ట్రపతి ప్రణబ్కు విందు విండ్హాక్ (నమీబియా): అణు శక్తిని ప్రపంచ శాంతి కోసం వినియోగిస్తే భారత్కు యురేనియంను సరఫరా చేసే విషయంలో ఉండే చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని నమీబియా తెలిపింది. నమీబియాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆ దేశాధ్యక్షుడు హేజ్ గీంగోబ్ విందులో ఈమేరకు చెప్పారు. ‘నమీబియాలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ మా వద్ద ఎలాంటి అణ్వాయుధాలు లే వు. అందుకే వాటిని వినియోగించుకోవడం లేదు. శాంతి నిమిత్తం ఉపయోగించే భారత్లాంటి దేశానికి మా యురేనియం వనరులను సరఫరా చేసేందుకు కావాల్సిన చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తాం’ అని ఆయన అన్నారు. తమ దేశంలో భారత కంపెనీలు పెట్టుబడులు పెట్టాల్సిందిగా హేజ్ ఆహ్వానించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు భారత్ అధిక ప్రాధాన్యతనిస్తోందని ప్రణబ్ తెలిపారు. ప్రస్తుత గ్లోబలైజేషన్ ప్రపంచంలో ఆఫ్రికా, భారత్లు కీలకంగా మారాయని తద్వారా ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ధికి ఇరు దేశాలు కృషి చేయాలని చెప్పారు. నమీబియా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలోనూ ప్రణబ్ మాట్లాడారు.