breaking news
nadikuda
-
చెరువులో పడి తాత, మనవడు మృతి
నడికూడ: ఎడ్లబండి అదుపుతప్పి చెరువులో పడిపోవడంతో తాత, మనవడు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం వరికోలు గ్రామం లో ఆదివారం చోటుచేసుకుంది. పరకాల రూరల్ సీఐ రమేశ్ కుమార్, ఎస్ఐ వెంకటకృష్ణ కథనం ప్రకారం.. వరికోల్కు చెందిన కానాల సాంబయ్య (46) తన పెద్ద కూతురు కుమారుడు ఆసోల ఆర్తిక్ (6) వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి బయల్దేరారు. మనవ డు ఎడ్లబండి తోలుతుండగా.. తాత వెనకాల నడుచుకుంటూ వస్తున్నాడు. వరికోల్, వేములపల్లి గ్రామాల మధ్య ఉన్న నల్లకుంట చెరువు కట్టపై ఎద్దులు బెదరడంతో బండి అదుపుతప్పి చెరువులో పడిపోయింది. ఆర్తిక్ నీటిలో పడగా.. వెనకాల వస్తున్న సాంబయ్య మనవడని కాపాడటానికి చెరువులోకి దిగాడు. ఆయనకు ఈత రాకపోవడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాలను బయటకు తీశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. -
నడికూడలో బైక్ చోరీ
పరకాల : మండలంలోని నడికూడలో దొంగలు మంగళవారం రాత్రి హల్చల్ చేశారు. గ్రామంలోని ఓ బైక్ను అపహరించారు. మరో బైక్ను అపహరించేందుకు విఫల యత్నం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. నడికూడకు చెందిన టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఊర రవీందర్రావు, చింతలపల్లి భీమ్రావులు తమ ఇళ్ల ఎదుట బైక్లను నిలిపారు. కాగా, రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వాటిని అపహరించారు. అయితే గ్రామ శివారులోని ఓ పత్తి చేనులో భీమ్రావు బైక్ కనిపించింది. రవీందర్రావు బైక్ మాత్రం ఎంత వెతికినా దొరకలేదు. దీంతో ఆయన బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.