breaking news
naannaku prematho
-
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఫుల్ హ్యాపీ!
‘‘ఇందులో కొత్త ఎన్టీఆర్ని చూశామనీ, కుటుంబమంతా కలిసి చూసే సినిమా ఇచ్చారనీ అందరూ అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపితమైంది’’ అని నిర్మాత బీవీయస్యన్ ప్రసాద్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఆయన నిర్మించిన ‘నాన్నకు ప్రేమతో’ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండు వారాల్లో 50 కోట్ల షేర్ని క్రాస్ చేయడం ఆనందంగా ఉందని బీవీయస్యన్ ప్రసాద్ అన్నారు. మరికొన్ని విశేషాలను శనివారం పాత్రికేయులతో ఈ విధంగా పంచుకున్నారు. మొదటి రోజు ఈ చిత్రానికి డివెడైడ్ టాక్ వచ్చింది. కానీ, ఎన్నో సినిమాలు తీసిన నిర్మాతగా సినిమా ఎప్పుడు నిలబడుతుందనే విషయం మీద నాకు అవగాహన ఉంది. అందుకని కంగారుపడలేదు. నా నమ్మకం నిజమైంది. డివెడైడ్ టాక్ వచ్చినప్పటికీ చూసినవాళ్లందరూ బాగుందనడంతో సినిమా నిలదొక్కుకుంది. ఎన్టీఆర్ నటన బాగుందని అందరూ అంటున్నారు. మంచి సినిమా తీశాడని సుకుమార్ని ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ప్రేమించారు కాబట్టే, మంచి వసూళ్లు దక్కాయి. ♦ సినిమా చూసినవాళ్లలో కొంతమంది హైదరాబాద్లో కూడా తీయొచ్చ న్నారు. కానీ, కథానుగుణంగానే లండన్లో తీశాం. కథకు తగ్గ లొకేషన్ అనీ, అక్కడ తీయడం వల్లే కథ ఎలివేట్ అయ్యిందనీ చాలామంది అన్నారు. సినిమా మొత్తం చాలా గ్రాండ్గా ఉందని కూడా ప్రశంసించారు. ♦ చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఉండదు. బాగా ఆడే ప్రతి సినిమా పెద్ద సినిమానే. ఈ మధ్య నేను ‘దోచెయ్’ అనే మీడియమ్ బడ్జెట్ సినిమా తీశాను. అది పెద్దగా ఆడలేదు. ఏ సినిమాకైనా దర్శకుడు, హీరో కాంబినేషనే ముఖ్యం. ఆ కాంబినేషన్కి బలమైన కథ కుదిరితే సినిమా నిర్మాణం మొదలవుతుంది. సో... కథ కన్నా కూడా ముందు కాంబినేషన్ సెట్ అవ్వాలి. ♦ అందరు హీరోలూ నాతో చాలా బాగుంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్. మా సంస్థలో ఏ సినిమా తీసినా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాం. అందుకే అనుకున్న సమయానికి విడుదల చేస్తాం. ప్లానింగ్ విషయంలో మా అబ్బాయి బాపినీడుని అభినందించాల్సిందే. నిర్మాతగా నాది 30 ఏళ్ల ప్రయాణం. 1986 సంక్రాంతికి ‘డ్రైవర్ బాబు’ రిలీజైతే, ఈ సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’ వచ్చింది. ఈ థర్టీ ఇయర్స్ అయామ్ వెరీ హ్యాపీ. ♦ ‘అత్తారింటికి దారేది’ పారితోషికం విషయంలో నాకూ, పవన్ కల్యాణ్కూ మధ్య వచ్చింది చిన్న సమస్య. త్వరలోనే అది పరిష్కారం అవుతుంది. కుదిరితే నెక్ట్స్ సినిమా కూడా పవన్కల్యాణ్తో చేయొ చ్చేమో. ప్రస్తుతం ముగ్గురు హీరో లతో సంప్రతింపులు జరుపుతున్నా. ఎవరితో చేస్తానో త్వరలో చెబుతా. -
రాక్స్టార్లా దుమ్మురేపిన ఎన్టీఆర్
హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపైనే కాదు నిజ జీవితంలో కూడా చాలా ఎనర్జిటిక్గా ఉంటారని అందరూ చెప్తుంటే ఏమోగానీ ఈ వీడియో చూస్తే మాత్రం నిజమేనని ఫిక్స్ అవ్వాల్సిందే. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న నాన్నకు ప్రేమతో చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. టైటిల్ తోనే అందరినీ ఆకర్షించిన ఈ చిత్రం ప్రతి రోజూ ఏదో ఒకరూపంలో పబ్లిసిటీలో దూసుకెళ్లుతోంది. ఆ చిత్ర యూనిట్ నాన్నకు ప్రేమతో చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను, మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ చిత్ర హైప్ను మరింత పెంచేస్తుంది. తాజాగా ఇప్పటికే అందరి నోళ్లలో నానుతున్న 'ఫాలో ఫాలో యూ' అనే పాట మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ పాటను ఎన్టీఆరే ఆలపించారు. ఈ సమయంలో యంగ్ టైగర్ ఉత్సాహం చూస్తుంటే.. ఈయన యాక్టరా లేక పాప్ సింగరా అని అనిపించేట్లుగా కనిపించారు. ఏ మాత్రం బెరుకు లేకుండా రికార్డింగ్ థియేటర్లో పక్కనే దేవీ శ్రీ ప్రసాద్ సూచనలు చేస్తుండగా అదిరిపోయే స్టైల్ తో 'ఫాలో ఫాలో యూ' అనే గీతాన్ని ఎన్టీఆర్ ఆలపించారు. పాడే సమయంలో ఎన్టీఆర్ ఉత్సాహాన్ని చూసి కుర్చీలో కూర్చోబుద్ధిగానీ దేవీ శ్రీ కూడా లేచి నిల్చోని ఎన్టీఆర్ తో జతకట్టారు. ఆ వెంటనే ఈ చిత్ర నిర్మాత బీవీఎస్ఎల్ ప్రసాద్తో కలిసి ఇద్దరూ ఫాలో ఫాలో యూ అంటూ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతూ రికార్డింగ్ థియేటర్లో సందడి చేశారు.