breaking news
N Convention Centre
-
నాగార్జున రియల్ హీరో అంటూ సీఎం రేవంత్రెడ్డి కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి సినీ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ గురించి మాట్లాడారు. తాజాగా ఆయన హైదరాబాద్లోని కొండాపూర్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మించిన పి.జనార్థన్రెడ్డి(పీజేఆర్) ఫ్లైఓవర్ను ప్రారంభించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు గురించి రేవంత్రెడ్డి మాట్లాడుతూ నాగార్జున గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ గురించి సీఎం రేవంత్రెడ్డి ఇలా చెప్పుకొచ్చారు. 'ఆ మధ్య కాలంలో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ను ప్రభుత్వం తొలగించింది. ఆ తర్వాత నాగార్జునే స్వయంగా వచ్చి రెండు ఎకరాల స్థలం ప్రభుత్వానికి అప్పజెప్పారు. నగర అభివృద్ధిలో హీరోగా ముందు ఉంటానని ఆయన అన్నారు. మంచి సంకల్పంతోనే ఆ చెరువును అభివృద్ధి చేస్తున్నారంటూ.. రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నట్లు వాలంటీర్గా ఆయన ముందుకు వచ్చారు' అని సీఎం అన్నారు.గతేడాది ఆగష్టు నెలలో మాదాపూర్లో ఉన్న నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్హాలును హైడ్రా కూల్చి వేసిన విషయం తెలిసిందే. నగరంలోని తమ్మిడికుంట చెరువును ఆక్రమించి అనుమతి లేని నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారంటూ హైడ్రా ఈ కూల్చివేతలకు చర్యలు చేపట్టింది. తమ్మిడికుంటను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ను నిర్మించారని ప్రభుత్వం ప్రకటించింది. ఆపై ఆ చెరువు చుట్టూ ఉన్న పలు కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేసింది. అప్పుడు ఈ సంఘటన తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనంగా మారింది. -
తెలంగాణలో ‘హైడ్రా’మా.. రేవంత్ ప్లాన్ ఫలిస్తుందా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేనెతుట్టెను కదిపారా? లేక హైదరాబాద్ ప్రక్షాళనకు నడుం కట్టారా? అన్నది ఆసక్తికరంగా ఉంది. ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ హైడ్రా కూల్చివేసిన తీరు అత్యంత సంచలనమే అని చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ కన్వెన్షన్ వివాదం నడుస్తున్నప్పటికీ, ఇంత ఆకస్మికంగా రేవంత్ సర్కార్ ఇలా కూల్చివేతకు దిగుతుందని ఎవరూ ఉహించలేదు. అలాగే గండిపేట, తదితర కొన్ని చెరువులలోని ఆక్రమణలు, ఫుల్ టాంక్ లెవెల్ లోపు ఉన్న ఇళ్లను కూడా కూల్చివేశారు. వీటిలో పలు ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి.నాగార్జున హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నప్పటికీ పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ ఉత్తర్వులు వచ్చేలోగానే అధికారులు కూల్చే పని దాదాపు పూర్తి చేశారు. తొలుత ఈ కూల్చివేతల పర్వం ఆరంభం అయినప్పుడు బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ను దృష్టిలో ఉంచుకుని చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. తదుపరి మరికొన్ని కూల్చివేతలలో ఇతర పార్టీలకు చెందినవారి ఆస్తులు కూడా ఉండడంతో ఏమి జరుగుతుందా అని అందరిలో ఉత్కంఠ ఏర్పడింది. కొందరిలో భయం కూడా చోటు చేసుకుంది. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు హైడ్రా నోటీసు ఇవ్వడం, హైడ్రా ఉన్నతాధికారి రంగనాథ్పై నాగేందర్ సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగాయి.కొన్నిచోట్ల ఎంఐఎంకి చెందిన కొంతమంది చోటా నేతల అక్రమ భవనాలను కూడా తొలగించారు. ఈ మొత్తం ప్రక్రియను కేవలం హైదరాబాద్ను వరదలు, కాలనీల మునక నుంచి రక్షించడానికే ఆరంభించారన్న భావన కలిగే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదనిపిస్తుంది. కానీ, తమ పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి కాంగ్రెస్లో చేర్చుకోవడానికి, హామీలను అమలు చేయలేకపోవడం, ఇతర సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి రేవంత్ సర్కార్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. ఈ సమస్య ఒక్క హైదరాబాద్లోనే కాదు. మన దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో ఉందని చెప్పాలి.స్వార్థపరులు కొందరు చెరువులు, నదులు, నాలాలు, తదితర వాటర్ బాడీస్ను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. కొంతమంది బిల్డర్లు చెరువులలో ఆక్రమిత స్థలాలలో అపార్టుమెంట్ నిర్మించి మధ్య తరగతివారికి అమ్మేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అక్కడ విశేషం ఏమిటంటే ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కృష్ణానది ఒడ్డున ఒక అక్రమ నిర్మాణంలో నివసించడం. ఆయన ఆ ఇల్లు ప్రభుత్వానిదని ఒకసారి, ప్రైవేటు ఆస్తి అని మరో సారి చెప్పారు. ఎలాగైతేనేం గత తొమ్మిదేళ్లుగా ఆయన అక్కడే ఉంటున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. అంతేకాక తన ఇంటి చెంతనే ప్రభుత్వ ధనంతో అక్రమంగా ప్రజావేదిక పేరుతో ఒక హాల్ నిర్మించారు. దానిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేస్తే విధ్వంసం అంటూ తెలుగుదేశంతోపాటు జనసేన, బీజేపీ తదితర అప్పటి ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి.టీడీపీ మీడియా ఈనాడు, జ్యోతి వంటివి కూడా దానిని విధ్వంసంగానే చిత్రీకరించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కృషి చేశాయి తప్ప, నదీ గర్భంలో అక్రమంగా ప్రభుత్వమే నిర్మాణం చేస్తే ఎలా అని ప్రశ్నించలేదు. తెలంగాణలో మాత్రం రేవంత్కు వ్యతిరేకంగా ఒక ముక్క రాయడం లేదు. ఇది విధ్వంసం అని ఆ మీడియా వ్యాఖ్యానించడం లేదు. అక్రమ నిర్మాణాలే అని చెబుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటితో పాటు పలు ఇతర భవనాలు కూడా కృష్ణా తీరాన ఉన్నాయి. వాటి నుంచి మురుగు నదిలోకి వెళుతోందని పర్యావరణవేత్తలు గగ్గోలు పెట్టినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఏమైనా చర్య తీసుకుందామని ఆలోచించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపరీతంగా దుష్ప్రచారం చేశారు.అదే తెలంగాణలో గత కొన్ని రోజులుగా కాని, అంతకు ముందుకాని చెరువుల శిఖం భూములలోని నిర్మాణాలను కూల్చి వేస్తుంటే ప్రతిపక్షాలు ఏవీ నేరుగా విమర్శించడం లేదు. బీజేపీ ఎంపీ రఘునందనరావు అయితే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని తప్పు పట్టారు. కాని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కొంచెం భిన్నంగా వ్యాఖ్యానించి ప్రభుత్వ తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఇందులో రాజకీయ కక్ష, పక్షపాతం ఉన్నాయని ఆరోపిస్తోందే తప్ప, ఈ కూల్చివేతలు చేయవద్దని చెప్పలేదు. కాకపోతే కొందరు మంత్రులు, కాంగ్రెస్ ప్రముఖుల ఇళ్లు కూడా హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువుల భూములలో ఉన్నా వాటి జోలికి వెళ్లడం లేదని విమర్శించింది.రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వి6 చానల్ అధినేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్, కాంగ్రెస్ నేత కెవిపి రామచంద్రరావు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తదితరుల ఫామ్ హౌస్ల ఫోటోలను కూడా తీసి వాటిని ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నిస్తూ నమస్తే తెలంగాణ పత్రిక రెండు పేజీల కథనాలు ఇచ్చింది. అలాగే ఓవైసీ కాలేజీ ఫోటోలను కూడా ప్రచురించారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన విద్యా సంస్థలకు కూడా అధికారులు నోటీసు ఇచ్చారు. ఇది కక్షపూరితమేనని బీఆర్ఎస్ అంటోంది. ఇంతవరకు హైడ్రా దాడులకు గురైనవారిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ వారే ఉన్నారని చెబుతున్నారు. కాని హైడ్రా మాత్రం తాము ఎవరి పట్ల పక్షపాతం చూపడం లేదని స్పష్టం చేస్తోంది.నాగార్జున సెలెబ్రెటి కావడంతో ఆయన ఫంక్షన్ హాల్ కూల్చడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన తన కన్వెన్షన్ సెంటర్ను కూల్చడం చట్ట విరుద్దం అని, ఒక్క సెంటు కూడా ఆక్రమించలేదని, తన ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని ప్రభుత్వంపై వ్యాఖ్యానించారు. నాగార్జున గత ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లతో సత్సంబంధాలు కలిగి ఉండడం వల్ల కూడా ఇప్పుడు టార్గెట్ అయ్యారా అన్న చర్చ రాజకీయ వర్గాలలో ఉంది. చెరువులు, కాల్వలలోకి నీరు రాకుండా ఎవరు ఏ నిర్మాణం చేపట్టినా తొలగించవలసిందే. ఎన్ కన్వెన్షన్ వల్ల కూడా అలాంటి నష్టం జరుగుతుందా? లేదా? అన్నది ఎవరూ చెప్పడం లేదు. కాకపోతే టెక్నికల్గా అది చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని అంటున్నారు. నాగార్జున వంటి ప్రముఖుల భవనాన్ని కూల్చితే అది సమాజానికి ఒక సంకేతం ఇచ్చినట్లవుతుందని, ఇతరులు ఇలా చెరువులు ఆక్రమించకుండా ఉంటారన్నది ప్రభుత్వ అధికారుల వాదనగా ఉంది. పైగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరుగా ఎన్ కన్వెన్షన్ పై ఫిర్యాదు చేశారు.నిజంగానే ఇదే స్పీడ్తో రేవంత్ ప్రభుత్వం చెరువులను ఆక్రమించి నిర్మించిన వాటన్నిటిని కూల్చివేయగలుగుతుందా? అనే మీమాంస ఏర్పడుతోంది. హైదరాబాద్లో కాని, చుట్టుపక్కల కాని వందల చెరువులు కబ్జాలకు గురై పోయాయి. ఖైరతాబాద్, సరూర్ నగర్, సైనిక్ పురి, యూసఫ్ గూడ, ఎల్లారెడ్డి గూడ, ఫిర్జాదీగూడ తదితర పలు చోట్ల చెరువుల చుట్టూరా ఇళ్లు వచ్చేశాయి. మూసినది వెంట అనేక కాలనీలు ఏర్పడ్డాయి. వాటిలో అత్యధికంగా పేదలు, దిగువ మధ్య తరగతివారు నివసిస్తున్నారు. మూసినది ఆధునీకరణలో భాగంగా వాటిని తొలగించగలుగుతారా? అన్నది చూడాలి. దానివల్ల రాజకీయంగానే కాక, సామాజికంగా కూడా చాలా చిక్కులు వస్తాయి. పైగా ఇళ్లు కోల్పోయినవారు లక్షలలో నష్టపోతారు. ఇప్పటికే కూల్చివేసిన అపార్టుమెంట్లను కొనుగోలు చేసినవారి పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది. ఇలాంటివారిని సమర్థించజాలం కాని ఎవరో చేసిన తప్పుకు వీరు బలి అవుతారు. ఈ నిర్మాణాలకు అనుమతులు ఎలా వచ్చాయన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.అవినీతికి పాల్పడ్డ అధికారులు, రాజకీయ నేతలపై కూడా చర్యలు తీసుకుంటారా? లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కూల్చివేతకు గురైన వాటిలో ఎన్నిటికి బ్యాంకులు రుణాలు ఇచ్చాయో, వాటి పరిస్థితి ఏమవుతుందో చెప్పలేం. హుస్సేన్ సాగర్ చుట్టూ గతంలో ప్రభుత్వమే కొన్ని నిర్మాణాలు చేసింది. ఆ సమీపంలో కూడా ఎప్పటి నుంచో కాలనీలు వచ్చేశాయి. వాటిని కదలించే పరిస్థితి లేదు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్లు నెక్లెస్ రోడ్డు అయితే హుస్సేన్ సాగర్ను కొంతమేర పూడ్చి నిర్మించారు. కొన్ని ప్రభుత్వ భవనాలు కూడా చెరువుల చెంత ఉన్నాయని వాటిని ఏమి చేస్తారని ఆయన ప్రశ్నించారు. గండిపేటలోని టీడీపీ ఆఫీస్ కూడా చెరువులోనే ఉందన్నది బీఆర్ఎస్ తాజా విమర్శ. దాని జోలికి వెళ్లే ధైర్యం రేవంత్ సర్కార్ చేస్తుందా? ఇవి కాకుండా ప్రభుత్వ స్థలాలు, ట్రస్టుల భూముల స్థలాలలో నిర్మించిన వివాదాలు చాలానే ఉన్నాయి.అయ్యప్ప సొసైటి భూముల వ్యవహారం తెలిసిందే. ఇలాంటి వాటి జోలికి వెళితే తేనెతుట్టె కదల్చినట్లే కావచ్చు. అందుకే రేవంత్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొన్ని కీలకమైన చోట్ల ప్రత్యేకించి చెరువులలోని నిర్మాణాలను తీసివేయడానికి పూనుకున్నట్లుగా ఉంది. ఈ సందర్భంగా రేవంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. హైదరాబాద్ను రక్షించడానికే తమ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోందని, ఇలా చేయలేకపోతే తాను వైఫల్యం చెందినట్లే అని అన్నారు. చెరువుల ఆక్రమణదారులలో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారు ఉన్నారని అన్నారు. ప్రభుత్వంలో ప్రత్యక్షంగా భాగస్వాములైనవారు కూడా ఉండవచ్చని రేవంత్ వ్యాఖ్యానించడం గమనించవలసిన అంశం.ఇప్పటికే పొంగులేటితో సహా పలువురు కాంగ్రెస్ నేతలు కూడా గండిపేట తదితర చోట్ల ఫార్మ్ హౌస్లు నిర్మించుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే పొంగులేటి తను ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణం చేయలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిని చివరికంటా కొనసాగించడం అంత తేలికైన పనికాదు. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అక్రమ నిర్మాణాలు, చెరువు కబ్జాలపై కొంత హడావుడి చేసినా, ఆ తర్వాత వదలివేసింది. అప్పుడు కూడా బీఆర్ఎస్పై విమర్శలు వచ్చాయి. అలాగే ఇప్పుడు కూడా మధ్యలో కూల్చివేతలు ఆపితే రకరకాల ఆరోపణలు రావచ్చు. పార్టీ నిధులు పోగు చేయడానికి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలను కాంగ్రెస్లోకి తీసుకు రావడానికి ఈ కూల్చివేతలు జరుగుతున్నాయని కనుక ప్రచారం ఆరంభమై, ప్రజలు దానిని నమ్మడం మొదలైతే మాత్రం రేవంత్ ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది. అలాకాకుండా చిత్తశుద్ధితో కొనసాగిస్తే మంచిపేరే రావచ్చు.అందులో కూడా సమస్యలు ఉంటాయి. ఉదాహరణకు పీవీ నరసింహారావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్పప్పుడు భూ సంస్కరణలను అమలు చేయడానికి సంకల్పించారు. అది ఇష్టం లేని కాంగ్రెస్ నేతలు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో చేరి దానిని తీవ్రం చేశారని, దాంతో పీవీ పదవి నుంచి తప్పుకోవలసి వచ్చిందని అంటారు. ఎన్.టి రామారావు మద్య నిషేధాన్ని గట్టిగా అమలు చేయడం ఇష్టం లేని కొన్ని వర్గాలు ఆయనను పదవి నుంచి దించివేయడానికి చంద్రబాబు నాయుడుకు సహకరించాయన్న ప్రచారం కూడా లేకపోలేదు. కొన్ని సార్లు మంచి పనులు చేయడానికి ప్రయత్నించినా పదవీ గండం రావచ్చు. లేదా వేరే ఉద్దేశ్యాలతో ఈ చర్యలకు దిగినా పదవులకు చేటు రావచ్చు. అందులోనూ కాంగ్రెస్ పార్టీలో ఉండే వర్గపోరు ఎటు తీసుకువెళ్లేది చెప్పలేం. ఇప్పటికైతే రేవంత్కు కాంగ్రెస్లో మద్దతు బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అవరోధాలు అన్నిటిని తట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుక విజయవంతంగా చెరువుల ఆక్రమణలను నిర్మూలించి ప్రజల మన్నన చూరగొంటే ఆయన తనకంటూ ఒక చరిత్రను సృష్టించుకున్నవారు అవుతారు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
హైదరాబాద్లో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా... కూల్చివేతపై న్యాయ పోరాటం చేస్తానన్న నాగార్జున.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదు: నాగార్జున ఎమోషనల్
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున స్పందించారు. కోర్టు కేసులు, స్టే ఆర్డర్లకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. చట్టానికి వ్యతిరేకంగా తాము ఏ పనులూ చేయలేదని చెప్పడానికే ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు వివరించారు. పట్టా భూమిలోనే కన్వెన్షన్ హాల్ ఉందని, ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదని స్పష్టం చేశారు. ఇది ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అని, కూల్చివేత కోసం గతంలో ఇచ్చిక అక్రమ నోటీసుపై కోర్టు స్టే కూడా ఇచ్చిందని గుర్తు చేశారు.ఇది కరెక్ట్ కాదునేడు చట్టవిరుద్ధంగా తమ భవనాన్ని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు కూడా తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని తెలిపారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కచ్చితంగా తానే దగ్గరుండి నేలమట్టం చేసేవాడినని తెలిపారు.తప్పుడు సంకేతాలుఇప్పుడు జరిగిన పరిణామాల వల్ల, మేమేదో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముందన్నారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కాగా తమ్మిడికుంట చెరువులో మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారని ఆరోపణలు రావడంతో హైడ్రా దాన్ని నేలమట్టం చేసింది. స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంతో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. చదవండి: నాగార్జున N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత -
నాగార్జున N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అధికారులు శనివారం కూల్చివేస్తున్నారు. మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువులో దాదాపు మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాకు ఫిర్యాదు కూడా అందింది. ఈ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు మధ్యలో ఎన్ కన్వెన్షన్ను అధికారులు నేలమట్టం చేస్తున్నారు.గతంలో ఏం జరిగిందంటే?తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న హయాంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేసేందుకు ప్రయత్నాలు జరగాయి. కానీ అక్కడిదాకా వెళ్లిన బుల్డోజర్లు దాన్ని టచ్ చేయకుండానే వెనుదిరిగాయి. అప్పటినుంచి ఈ భవనం జోలికి ఎవరూ వెళ్లలేదు. అయితే ఆ కట్టడాన్ని నేలమట్టం చేసి చెరువును పునరుద్ధరించాలని స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ను కూల్చివేస్తోంది.చదవండి: బిగ్బాస్ 8లోకి అమృత ప్రణయ్? -
బ్యూటీ షో
-
డిజైనర్ షో.. అదరహో
-
అందాలు.. నడిచొచ్చాయిలా..!
-
మాది 1949 నుంచీ పట్టా భూమే
* ప్రభుత్వ రికార్డులే ఈ విషయాన్ని చెబుతున్నాయి * హైకోర్టుకు ఎన్ కన్వెన్షన్ యజమానుల నివేదన * నోటీసివ్వకుండా చర్యలు తీసుకోవటం సరికాదు * ఎన్ కన్వెన్షన్ తరఫు న్యాయవాది వాదనలు * ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలకు అనుమతి లేదు * టీ-సర్కారు తరఫున ఏజీ వాదనలు * నేడు కోర్టు ఉత్తర్వులు.. అప్పటివరకూ యథాతథస్థితే సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించిన స్థలం 1949 నుంచీ పట్టా భూమిగానే ప్రభుత్వ రికార్డుల్లో ఉందని సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం కోర్టుకు నివేదించారు. తమ భూమిపై ఇప్పటివరకు ఎటువంటి వివాదాలు లేవని, చెరువును అనుకుని నిర్మాణం ఉందన్న ఏకైక కారణంతో చెరువును ఆక్రమించుకున్నామని చెప్పడం సరికాదని ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. తమ భూమిని సర్వే చేయాలని అధికారులు భావిస్తే వారికి సహకరిస్తామని వివరించారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లిమిట్స్)ను నిర్ణయించడం, మార్కింగ్ చేయడం చట్ట విరుద్ధమన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లోని తమ్మిడికుంట చెరువు భూమిని ఆక్రమించి తాము ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించామని ఆరోపిస్తూ రెవెన్యూ అధికారులు కన్వెన్షన్ సెంటర్లోని నిర్మాణాలను మార్కింగ్ చేయడాన్ని సవాలు చేస్తూ ఎన్కన్వెన్షన్ యజమాని, సినీ నటుడు అక్కినేని నాగార్జున, దాని లీజుదారు ఎన్3 ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి నల్లా ప్రీతమ్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై సోమవారం విచారణ జరిపి, ఈ మొత్తం వ్యవహారంలో యథాతథస్థితి కొనసాగించాలని అధికారులను ఆదేశించిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, ఈ వ్యాజ్యాలపై మంగళవారం కూడా వాదనలు విన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం, న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డిలు వాదనలు వినిపించగా.. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్లోని నిర్మాణాల విషయంలో ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఇదే హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ ఉత్తర్వులు ఇంకా అమలులోనే ఉన్నాయని శ్రీరఘురాం కోర్టుకు నివేదించారు. తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ ఏరియా కేవలం 18.28 ఎకరాలు మాత్రమేనని హెచ్ఎండీఏ వెబ్సైట్లో ప్రభుత్వమే పేర్కొందని ఆయన తెలి పారు. అధికారులు మాత్రం 29.24 ఎకరాలను ఎఫ్టీఎల్ కింద పరిగణిస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. నిర్దిష్ట విధి విధానాలను పాటించకుండా ఏకపక్షంగా ఎఫ్టీఎల్ నిర్ణయించడం, మార్కింగ్ చేయడం సరికాదని మరో న్యాయవాది నిరంజన్రెడ్డి తెలిపారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్లోని భవనాలకు మార్కింగ్ చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్ధించుకుంది. చెరువుల పరిరక్షణ నిమిత్తం చర్యలు తీసుకోవాలంటూ లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల అమలులో భాగంగానే జీహెచ్ఎంసీ అధికారులు ఎన్ కన్వెన్షన్ లోనికి వెళ్లి తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ను పరిశీలించారని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కొండం రామకృష్ణారెడ్డి కోర్టుకు నివేదించారు. అధికారులది కేవలం పరిశీలనేనని, అందులో భాగంగానే మార్కింగ్ చేసి ఎఫ్టీఎల్ను అంచనా వేసే ప్రయత్నం చేశారన్నారు. ఒకవేళ జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని భావిస్తే, విధివిధానాలకు లోబడి, ఎన్ కన్వెన్షన్ సెంటర్ యజమాన్యానికి ముందస్తు నోటీసులు జారీ చేసి, వారి వాదనలు విన్న తరువాతనే ముందుకెళతారని, ఆ మేర తాను హామీ ఇస్తున్నానని, దానిని రికార్డ్ చేయాలని ఆయన కోర్టును కోరారు. అసలు ఎన్ కన్వెన్షన్ సెంటర్లోని నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతి లేదని, వాటిని కూల్చివేసే సమయంలో కూడా నోటీసులు జారీ చేస్తామని, చట్ట విరుద్ధంగా ఎటువంటి చర్యలు తీసుకోరని ఆయన పేర్కొన్నారు. ఈ దశలో పిటిషనర్లు హైకోర్టుకు రావడం సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరెడ్డి ఈ వ్యాజ్యాలపై బుధవారం ఉత్తర్వులు జారీ చేస్తానని, అప్పటి వరకు యథాతథస్థితిని కొనసాగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. -
ఎన్ కన్వెన్షన్పై హైకోర్టు స్టే
* కఠినచర్యలు తీసుకోకుండా నియంత్రించాలని నాగార్జున పిటిషన్ * మరో పిటిషన్ దాఖలు చేసిన లీజుదారు * రెండింటిపై విచారణ నేడు సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్పై యథాతథస్థితిని కొనసాగించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, ఖానామెట్ గ్రామంలోని తుమ్మిడికుంట చెరువు భూమిని ఆక్రమించి తాము ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్టు రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేయడాన్ని సవాల్చేస్తూ సినీనటుడు అక్కినేని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ కన్వెన్షన్పై కఠినచర్యలు తీసుకోకుండా అధికారులకు ఆదేశాలివ్వాలని నాగార్జున సోమవారం మధ్యాహ్నం అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి స్టే మంజూరు చేశారు. ఇదే అభ్యర్థనతో నాగార్జున నుంచి ఎన్ కన్వెన్షన్ను లీజ్కు తీసుకున్న ఎన్3 ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి నల్లా ప్రీతమ్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణను న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు. న్యాయబద్ధంగానే కొన్నాను... గురుకుల్ ఘట్కేసర్ ట్రస్ట్ అధ్యక్షుడు బి.కిషన్లాల్ నుంచి 1982లో కొందరు వ్యక్తులు భూమిని కొనుగోలు చేయగా, 1992లో వారి నుంచి తాను 27 వేల చదరపు మీటర్ల స్థలాన్ని కొన్నట్టు నాగార్జున తన పిటిషన్లో వివరించారు. చట్టపరంగా, న్యాయబద్ధంగానే కొన్న ఈ స్థలంలో హుడా అనుమతితో ప్రహరీగోడ నిర్మించినట్టు చెప్పారు. నిబంధనల ప్రకారం అక్కడ ఫంక్షన్ హాల్ నిర్మించి జీహెచ్ఎంసీ నుంచి లెసైన్స్ తీసుకున్నట్టు, ఆస్తి పన్ను కూడా చెల్లిస్తున్నట్టు నాగార్జున తెలిపారు. భవనాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నట్టు కూడా ఆయన వివరించారు. తన బీఆర్ఎస్ దరఖాస్తుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ, ఫంక్షన్హాల్పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా గతంలోనే హైకోర్టును కూడా ఆశ్రయించినట్టు ఆయన తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ఆ వ్యాజ్యాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, ఆ ఫంక్షన్హాల్ను వివిధకార్యక్రమాలకు పలువురు ఇప్పటికే బుక్ చేసుకున్నారని ఆయన తెలిపారు. బఫర్జోన్లో లేదు... తన ఫంక్షన్హాల్ బఫర్జోన్కి వస్తుందని అధికారులు మార్క్ చేసినట్టు తెలిసిందని, 1992లో తాను కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బఫర్జోన్ను ఎందుకు నిర్ణయించలేదని ఆయన తన పిటిషన్లో ప్రశ్నించారు. అంతేకాక ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ ప్రక్రియంతా చేస్తున్నారు. ఇది అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఆరోపించారు. 10 హెక్టార్లు అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం ఉంటే, 30 మీటర్లను బఫర్జోన్గా గుర్తిస్తారని, రికార్డుల ప్రకారం, హెచ్ఎండీఏ వెబ్సైట్ ప్రకారం తుమ్మిడికుంట చెరువు విస్తీర్ణం 10 హెక్టార్లలోపే ఉందని, దీంతో తన నిర్మాణాలు బఫర్జోన్ వెలుపలే ఉన్నాయన్నారు. అధికారుల తాజా మార్కింగ్ల వల్ల వారికి, తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.