-
కృష్ణమ్మకు భారీగా వరద
సాక్షి, అమరావతి: తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని మున్నేరు ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 1.97 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా.. అదే స్థాయిలో దిగువకు వదిలేశారు. ఈ ప్రవాహానికి కట్టలేరు, బుడమేరు, పాలేరు తదితర వాగులు, వంకల ప్రవాహం తోడవుతుండటంతో పులిచింతల ప్రాజెక్ట్కు దిగువన కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీలోకి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 2,60,875 క్యూసెక్కులు చేరుతుండటంతో.. అంతే స్థాయిలో వరదను 55 గేట్లను 6 అడుగులు, 15 గేట్లను ఏడు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. జూలై చివరి వారంలో ప్రకాశం బ్యారేజీకి ఈ స్థాయిలో వరద రావడం.. గేట్లు ఎత్తి సముద్రంలోకి ఈ స్థాయిలో వరదను వదిలేయడం ఇదే తొలిసారి. ఖమ్మం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో శుక్రవారం వర్షాలు తెరిపి ఇవ్వడంతో శనివారం ప్రకాశం బ్యారేజీలోకి చేరే ప్రవాహం తగ్గనుంది. ఎగువ కృష్ణాలో స్థిరంగా ప్రవాహం పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా కృష్ణా ప్రధాన పాయలో ఎగువన వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ల నుంచి 1.66 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద కాస్త తగ్గింది. తుంగభద్ర డ్యామ్లోకి 1.07 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 59 టీఎంసీలకు చేరుకుంది. జూరాలకు ఎగువ నుంచి 1.22 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో స్పిల్ వే గేట్లు, విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తున్నారు. జూరాల నుంచి 1,20,390 క్యూసెక్కులు, స్థానికంగా కురిసిన వర్షాల వల్ల సుంకేశుల బ్యారేజ్ నుంచి 4,311, హంద్రీ నుంచి 117 వెరసి 1,24,818 క్యూసెక్కులు శ్రీశైలంలోకి చేరుతుండటంతో నీటి నిల్వ 45.53 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో శనివారం శ్రీశైలం ప్రాజెక్ట్లోకి చేరే వరద పెరగనుంది. ఇక తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు మూసీ నుంచి పులిచింతలలోకి 55,144 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 28.03 టీఎంసీలకు చేరుకుంది. మరో 17 టీఎంసీలు చేరితే పులిచింతల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేయనున్నారు. -
విషాదం: బతుకు దెరువు కోసం వచ్చి.. మున్నేరువాగులో గల్లంతు..
సాక్షి, మహబూబాబాద్(వరంగల్) : మానుకోట జిల్లా కేంద్రం శివారులోని మున్నేరువాగులో పడి యువకుడు గల్లంతైన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని పోచమ్మమైదాన్ ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ (30) బతుకుదెరువు కోసం మానుకోటకు వచ్చాడు. జిల్లా కేంద్రంలోని లక్ష్మి థియేటర్ వెనుక ప్రాంతంలో నివాసం ఉండే అమ్జద్ వద్ద మార్బుల్ బండలు పరిచే పని చేస్తున్నాడు. కాగా, గురువారం మధ్యాహ్నం సమీప బంధువులు అజీమ్, యాసిన్, ఇర్ఫాన్ మున్నేరువాగు చెక్ డ్యాం సమీపంలోకి చేరుకుని మద్యం సేవించారు. అనంతరం ఇర్ఫాన్ ఈతకొడతానని చెప్పి మున్నేరువాగు నీటి ప్రవాహంలోకి వెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో యాసిన్ వాగులో దిగి వెతికాడు. ఆచూకి లభ్యంకాకపోవడంతో మరో మిత్రుడు మౌసిన్కు ఫోన్చేసి విషయం చెప్పడతోపాటు, డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో టౌన్ ఎస్హెచ్ఓ జూపల్లి వెంకటరత్నం, టౌన్ ఎస్సై గాలిబ్, రూరల్ ఎస్సై నగేష్, బ్లూ కోల్ట్స్ పీసీలు వీరన్న, విజయ్కుమార్, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులతోపాటు స్థానికులు మున్నేరువాగు నీటిలో ఇర్ఫాన్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు ఇర్ఫాన్ ఆచూకీ లభ్యంకాలేదు. కాగా, ఇర్ఫాన్కు భార్య, కుమార్తె ఉండగా ప్రస్తుతం ఆమె గర్భిణిగా ఉంది. చదవండి: లాక్ డౌన్ ఆసరా చేసుకుని .. బావమరిది.. దారి దోపిడీలు.. -
పులిచింతలపై నిలదీద్దాం
♦ పరిహారంపై ఏపీ తీరును ఎండగట్టేందుకు సిద్ధమైన తెలంగాణ ♦ ఇప్పటికే అక్రమ ప్రాజెక్టులపై గరంగరం ♦ పురుషోత్తపట్నం, శివభాష్యం సాగర్పై బోర్డుకు, కేంద్రానికి ఫిర్యాదులు ♦ మున్నేరు బ్యారేజీపైనా అభ్యంతరం ♦ తాజాగా పులిచింతలను తెరపైకి తెస్తున్న తెలంగాణ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం, బోర్డుల వద్ద అడ్డుపుల్లలు వేస్తున్న ఆంధ్రప్రదేశ్పై తెలంగాణ ముప్పేట దాడి చేస్తోంది. ఇప్పటికే ఏపీ గోదావరిపై చేపట్టిన పురుషోత్తపట్నం, కృష్ణా నదిపై చేపట్టిన శివభాష్యం సాగర్, మున్నేరు బ్యారేజీ నిర్మాణంపై అభ్యంతరాలు తెలిపిన తెలంగాణ... తాజాగా పులిచింతల పరిహారం అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమైంది. ఏటా పులిచింతల పరిహారంపై ప్రశ్నిస్తున్నా స్పందన లేకపోవడంతో దీనిపై ఏపీని గట్టిగా నిలదీయాలన్న పట్టుదలతో ఉంది. వరుసగా అస్త్రాలు.. తెలంగాణ చేపడుతున్న అనేక ప్రాజెక్టుల విషయంలో ఏపీ జోక్యం పెరిగింది. కృష్ణా, గోదావరి జలాల్లో వాటాల మేరకు నీటి వినియోగం చేస్తున్నామని చెబుతున్నా... ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్ర జల సంఘం, బోర్డుల వద్ద ఫిర్యాదులు చేస్తోంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ.. పోలవరం ఎడమకాల్వపై ఏపీ చేపట్టిన పురుషోత్తపట్నంపై గోదావరి బోర్డుకు ఫిర్యా దు చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కర్నూలు జిల్లాలో చేపడుతున్న శివభాష్యం సాగర్పైనా ఇటీవలే కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసిం ది. కృష్ణా జిల్లాలో చేపట్టిన మున్నేరు బ్యారేజీ నిర్మాణంపై కూడా అభ్యంతరాలు లేవనెత్తింది. ఈ బ్యారేజీ నిర్మాణంతో తెలంగాణ ప్రాంతం లో ముంపు ఉంటుందని సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. ఇప్పుడు పులిచింతలపై దృష్టి సారించింది. అసంపూర్ణ పునరావాసంతో ఏటా పులిచింతల కింద తెలంగాణ గ్రామాలు ముంపు బారిన పడుతున్నా ఏపీ స్పందన సరిగా లేదని తెలంగాణ గుర్రుగా ఉంది. పులిచింతలలో 45.7 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఈ నీటితో నల్లగొండ జిల్లాలో 13 గ్రామాలు ముంపునకు గురవుతు న్నాయి. ఈ గ్రామాల పునరావాసానికి పరిహా రం కింద రూ.381 కోట్లు ఖర్చవుతుందని లెక్కలు వేశారు. ఈ నిధుల విడుదలలో జాప్యం కారణంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం రేగింది. ఓ దశలో గవర్నర్ జోక్యం చేసుకోవడంతో పరిహార చెల్లింపులకు ఓకే చెప్పిన ఏపీ.. రూ.53 కోట్లు ఒకమారు, రూ.75 కోట్లు ఇంకోమారు విడుదల చేసింది. ఇవిపోను ఇంకా భూసేకరణకు రూ.20 కోట్లు, దేవాలయాల పునర్నిర్మాణానికి రూ.15 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.25 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు రూ.50 కోట్లు, ఇతర వసతులకు మొత్తంగా రూ.115 కోట్లు రావాల్సి ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని గతేడాది అక్టోబర్లో ఏపీకి విన్నవించింది. రూ.49 కోట్లు మాత్రమే ఇచ్చిన ఏపీ రాష్ట్రం విన్నవించిన ఆరు నెలలకు స్పందించిన ఏపీ.. పులిచింతల జలాశయంలో ముంపునకు గురైన నాలుగు ఎత్తిపోతల పథకాలను మరోచోటుకు తరలించడానికి రూ.49 కోట్ల పరిహారాన్ని గత నెల చివరి వారంలో విడుదల చేసింది. మిగతా రూ.66 కోట్లపై పేచీ పెడుతోంది. భూనిర్వాసితులు, సహాయ పునరావాస ప్యాకేజీ కింద పరిహారం ఇప్పటికే చెల్లించామని, తెలంగాణకు బకాయిలేమీ లేమని చెబుతోంది. దీనిపై రెండు, మూడు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం.. ఏపీకి లేఖ రాసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై స్పందించకుంటే బోర్డులోనే తేల్చుకోవాలని భావిస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement