breaking news
Mumbai stampede
-
చావుబతుకుల మధ్య కూడా ఇదేం బుద్ధి
ముంబయి : దసరా పండుగ వేళ విషాదం నింపిన ముంబయి ఎల్ఫిన్స్టోన్ రోడ్డులోని రైల్వే స్టేషన్ పాదచారుల వంతెనపై ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు ఒక వైరల్ వీడియో ఓ కొత్త నేర విచారణ ప్రారంభించడానికి కారణం అయింది. సహాయం చేసే పేరిట వచ్చి వంతెనపై చిక్కుకుపోయిన ఓ మహిళను లైంగికంగా ఓ యువకుడు వేధించినట్లుగా ఆ వీడియోలో ఉంది. నిజంగా అతడు సహాయం చేస్తున్నాడా లేక ఆ పేరుతో అడ్వాన్టేజ్ తీసుకొని అలాంటి భయానక పరిస్థితుల్లో కూడా అనుచితంగా ప్రవర్తించాడా అనే విషయం స్పష్టంగా తేలాల్సి ఉంది. ప్రస్తుతం లభించిన ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. అలాగే, ఆ సమయంలో తమ ఫోన్లలో తీసిన వీడియోలను, సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించనున్నారు. పాదచారుల వంతెనపై తొక్కిసలాట జరిగినప్పుడు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఆ సమయంలో ఓ మహిళ కొంతమంది మధ్య ఇరుక్కుపోయింది. అయితే, సహాయం చేసేందుకంటూ వెళ్లిన ఓ యువకుడు ఆమెను అసభ్యంగా తాకుతూ కనిపించాడు. పోలీసులు కూడా అదే విషయం నిర్ధారణకు వచ్చినప్పటికీ ఆ వ్యక్తి ఎవరో పట్టుకొని విచారిస్తేగానీ అంతిమ నిర్ణయానికి రాలేమని అంటున్నారు. -
అధికారులకు రైల్వేమంత్రి డెడ్లైన్
సాక్షి, న్యూఢిల్లీ : ‘మహా’ విషాదం నేపథ్యంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్... ఆశాఖ ఉన్నతాధికారులకు వారం రోజులు డెడ్లైన్ విధించారు. ముంబై ఎల్పిన్స్టోన్ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటనలో 23మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అలాగే 35మంది గాయపడ్డారు. ఈ ఘటనపై పీయూష్ గోయల్ శనివారం రైల్వే భద్రత అంశంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గడువులోపు ముంబై సబర్బన్ రైల్వేస్టేషన్లో భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న కీలక ప్రదేశాలను గుర్తించాలన్నారు. అంతేకాకుండా అన్ని స్టేషన్లలో లోపల, బయటకు వెళ్లే ప్రాంతాలలో పూర్తిస్థాయి ప్రణాళిక చేపట్టాలని, రైల్వే ఫ్లాట్ఫామ్లను సాధ్యమైనంత క్రమబద్ధీకరించేలా చూడాలన్నారు. వారం రోజుల్లోగా వీటన్నింటిని పూర్తి చేయాలని గోయల్ ఆదేశాలు ఇచ్చారు. ఇక 15 నెలల్లోగా ముంబయితో పాటు దేశంలోని అన్ని సబర్బన్ రైళ్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా 23 మందిని బలిగొన్న ఎల్ఫిన్స్టన్ స్టేషన్ వద్ద అదనపు పాదచారుల వంతెన (ఎఫ్ఓబీ) నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్లను ఆహ్వానిస్తోంది. ప్రమాదం జరిగిన శుక్రవారమే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 40 అడుగుల పొడవు నిర్మించనున్న ఈ వంతెనను 2016 రైల్వే బడ్జెట్లో ప్రకటించారు. ముంబై సబర్బన్ ప్రాంతంలో రూ.45 కోట్ల బడ్జెట్తో చేపట్టబోయే ఎస్కలేటర్లు, ఎఫ్ఓబీలు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల ప్రాజెక్టుల్లో ఇది అంతర్భాగం. రూ.9.5 కోట్ల వ్యయమయ్యే ఈ వంతెనను వచ్చే ఏడాది అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
ముంబై రైల్వేస్టేషన్లో మహా విషాదం
-
ముంబైలో తొక్కిసలాట.. 18 మంది మృతి
66 మందికి గాయాలు.. సాక్షి, ముంబై: దావూదీ బోహ్రా ముస్లిం తెగ ఆధ్యాత్మిక గురువు డాక్టర్ సయ్యద్నా మహ్మద్ బర్హనుద్దీన్ భౌతికకాయానికి నివాళులు అర్పించే సమయంలో విషాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. 66 మంది గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని పోలీసులు వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు, 102 ఏళ్ల సయ్యద్నా శుక్రవారం గుండెపోటుతో ఇక్కడి మలబార్ హిల్ ప్రాంతంలో ఆయన ఇంటి (సైఫీ మహల్)లో కన్నుమూశారు. మరణవార్త తెలుసుకున్న ఆయన అభిమానులు కడసారి చూపుకోసం రాత్రి నుంచే ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో తరలిరావడం మొదలుపెట్టారు. శనివారం తెల్లవారు జామున అంతిమ దర్శనం కొద్దిసేపు నిలిపేస్తున్నామనే ప్రకటన రావడంతో ఒక్క సారిగా ప్రజలు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఇక్కడి వీధులన్నీ ఇరుకుగా ఉండడం, భారీగా జనం హాజరుకావడంతో ఊపిరాడక ఎక్కువమంది మరణించారని ముంబై పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పారు. ఇదే విషయాన్ని డాక్టర్లు కూడా ధ్రువీకరించారని ఆయన తెలిపారు. ఊపిరి అందకపోవడంతో కొంతమంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారన్నారు. సమీపంలోని గేట్లు కూడా మూసివేయడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని ఆయన వెల్లడించారు. సయ్యద్నా నివాసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి చేరువలోనే ఉంది. కాగా, గాయపడిన వారికి సైఫీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటన అనంతరం ఉదయం 10 గంటల తర్వాత సయ్యద్నా అంతిమయాత్ర ప్రారంభమైంది. రెండు లక్షల మందికి పైగా ఆ యాత్రలో పాల్గొన్నారు. బెండీ బజార్లోని రౌదాత్ తహేరాలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. సయ్యద్నా మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంతాపం తెలిపారు. మతగురువే కాదు గొప్ప మానవతావాది! సాక్షి, ముంబై: మలబార్ హిల్లోని సైఫీ మహల్లో శుక్రవారం మృతిచెందిన బుర్హానుద్దీన్ కేవలం భోరా సామాజిక వర్గానికి చెందిన 52వ మతగురువు మాత్రమేకాదు అంతకు మించిన మానవతావాది కూడా. మూఢ నమ్మకాలను పారద్రోలి, విద్య ప్రాముఖ్యతను తెలియజేసి వెనుకబడిన భోరాల ఉనికిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు. 1912, మార్చి 6న సూరత్లో జన్మించిన ఆయన 15వ యేటనే హజ్ యాత్రకు వెళ్లారు. 1965లో భోరా సమాజానికి 52వ మతగురువుగా నియమితులయ్యారు. ఆయన వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని 2011 మార్చి 25న దేశవ్యాప్తంగా భారీ ఉత్సవాలు నిర్వహించారు. ఆయన నివాసముంటున్న ముంబైలో భారీగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, ఆ సమాజం ప్రజలు, మతగురువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రపంచంలో వివిధ దేశాల్లో భోరా సమాజం ప్రజలు పార్థనలు చేసుకునేందుకు అవసరమైన ప్రార్థనాస్థలాల ఏర్పాటుకు, సాంస్కృతిక కేంద్రాలు నెలకోల్పడానికి ఎంతో చొరవ తీసుకున్నారు. ఆయన స్థాపించిన ప్రార్థనాస్థలాలు ఉత్తర అమెరికా, యూరప్, ఆఫ్రికా, అస్ట్రేలియా తదితర దేశాలలో ఇప్పటికీ ఉన్నాయి. మనదేశంలో కూడా ఎన్నో సదస్సులు నిర్వహించారు. అంతేకాక ముంబై, సూరత్, దుబాయ్, కరాచీ, కొలంబో తదితర దేశాల్లో సమావేశాలు, చర్చాగోష్టులు, అవగాహన శిబిరాలు నిర్వహించారు. విద్యా సంస్థలు నెలకొల్పి విద్యార్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. ఆయనను ఆర్డర్ ఆఫ్ దస్టార్ ఆఫ్ జర్డన్, అలీగఢ్ ముస్లీం యూనివర్సిటీ డాక్టరేట్ తో, డాక్టర్ ఆఫ్ ఇస్లామిక్ సైన్స్, టెక్సాస్ యూనివర్సిటీ, కరాచీ యూనివర్సిటీ చాన్స్లర్ పదవులతో సన్మానించాయి. లండన్లోని రాయల్ అల్బర్ట్ హాల్లో ప్రసంగించిన ఘనత కూడా ఆయనకు దక్కింది.