breaking news
Multi-specialty hospitals
-
కేకేఆర్ చేతికి మెడికవర్ ఇండియా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత హెల్త్కేర్ విభాగంలో అవకాశాలను మరింతగా అందిపుచ్చుకునే దిశగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం కేకేఆర్ తాజాగా భారీ డీల్కి తెరతీసింది. అంతర్జాతీయ వైద్యసేవల దిగ్గజం మెడికవర్ ఏబీకి చెందిన భారత విభాగం మెడికవర్ ఇండియాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ ఎంతనేది కేకేఆర్ నిర్దిష్టంగా వెల్లడించకపోయినప్పటికీ.. సంస్థ విలువను 1.2 బిలియన్ యూరోలుగా (దాదాపు రూ. 13,200 కోట్లు) లెక్కగట్టినట్లు న్యాయ సలహాలందిస్తున్న ట్రైలీగల్ వివరించింది. కేకేఆర్కి చెందిన ఫండ్స్కి 100 శాతం వాటాలను విక్రయించేందుకు తమతో పాటు మైనారిటీ వాటాదారులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మెడికవర్ తెలిపింది. దీనితో స్థూలంగా 740 మిలియన్ యూరోలు లభిస్తాయని, ఆ మొత్తంతో పోలాండ్ తదితర దేశాల్లో కార్యకలాపాలు విస్తరించనున్నట్లు పేర్కొంది. ఈ డీల్కి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు కంపెనీ సీఈవో జాన్ స్టబింగ్టన్ చెప్పారు. మరోవైపు ప్రస్తుత మేనేజ్మెంటే మరో మూడేళ్ల పాటు కొనసాగుతుందని మెడికవర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ వెల్లడించారు. సంస్థలో 14 వేల మంది ఉద్యోగులు, 1,900 మంది పైగా డాక్టర్లు ఉన్నారని, వారు కూడా యథాప్రకారంగానే కొనసాగుతారని పేర్కొన్నారు. సంస్థను మరింతగా విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ ఏడాది ఆఖరు నాటికి ఇది పూర్తి కావొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తు తం ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో మొత్తం నాలుగు రాష్ట్రాల్లో సుమారు 11–12 లక్షల మంది పేషంట్లకు చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు. అటు, ‘మరింత నాణ్యమైన వైద్య సేవలందించడంలో మెడికవర్ ఇండియా డాక్టర్లు, ఉద్యోగులకు మద్దతుగా నిలుస్తూ, దేశవ్యాప్తంగా అధునాతన హెల్త్కేర్ సరీ్వసులను విస్తరించేందుకు ఈ పెట్టుబడులు దోహదపడతాయి‘ అని కేకేఆర్ పార్ట్నర్ అక్షయ్ తనా తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో 24 ఆస్పత్రుల నెట్వర్క్.. మ్యాక్స్క్యూర్ హాస్పిటల్ చెయిన్ ఆపరేటర్, హైదరాబాద్కి చెందిన సహృదయ హెల్త్కేర్లో నియంత్రణాధికారాలుండే వాటాలను కొనుగోలు చేయడం ద్వారా స్వీడన్కి చెందిన మెడికవర్ 2017లో భారత హెల్త్కేర్ మార్కెట్లోకి ప్రవేశించింది. మెడికవర్ ఇండియాలో మెడికవర్ హోల్డింగ్స్ బీవీకి 67 శాతం ఉండగా, మైనారిటీ షేర్హోల్డర్లయిన ప్రస్తుత సీఎండీ జి. అనిల్ కృష్ణ తదితరుల వద్ద సుమారు 33 శాతం వాటాలు ఉన్నాయి. సంస్థలో పి. హరికృష్ణ, ఎ. శరత్ రెడ్డి ఈడీలుగా, ఏఆర్ కృష్ణప్రసాద్ డైరెక్టరుగా ఉన్నారు. సుమారు 4,800 పడకలతో 24 ఆస్పత్రుల నెట్వర్క్ ఉంది. 80 పైచిలుకు స్పెషాలిటీల్లో సేవలు అందిస్తోంది. భారీ విస్తరణ బాటలో కేకేఆర్ కేకేఆర్ 2004 నుంచి అంతర్జాతీయంగా హెల్త్కేర్ విభాగంలో సుమారు 20 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. గత కొన్నాళ్లుగా భారత్లోనూ విస్తరించింది. మ్యాక్స్ హెల్త్కేర్లో భారీ లాభాలకు నిష్క్రమించిన దాదాపు నాలుగేళ్ల తర్వాత 2025లో కేరళకు చెందిన బేబీ మెమోరియల్ హాస్పిటల్ (బీఎంహెచ్)లో దాదాపు రూ. 2,500 కోట్లకు సుమారు 70 శాతం వాటాలను కొనుగోలు చేయడం ద్వారా మళ్లీ హెల్త్కేర్ విభాగంలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి దక్షిణాది మరింతగా కార్యకలాపాలు విస్తరించింది. మైత్రా హాస్పిటల్, చళికట్టు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను కొనుగోలు చేసింది. అలాగే హెల్త్కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్లో నియంత్రణాధికారాలున్న వాటాలను దక్కించుకుంది. ఈ విభాగంలో ఫైనాన్సింగ్ కార్యకలాపాలు కూడా నిర్వహిస్తోంది. -
హింసించి.. చంపేశారా..?!
అనంతపురం సెంట్రల్: ఆస్పత్రి భవనంపై నుంచి యువకుడు నగ్నంగా దూకడం.. చికిత్స పొందుతూ కొంతసేపటి తర్వాత మృతి చెందడం నగరంలో కలకలం రేపింది. ఆత్మహత్య అని ఆస్పత్రి వారు చెబుతున్నా... చిత్రహింసలు పెట్టి చంపేశారని పలువురు ఆరోపిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.... శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం రామాపురం గ్రామానికి చెందిన దబ్బర అశోక్ (30) అనంతపురంలోని హిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు కమీషన్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. గత శుక్రవారం రాత్రి ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి నగ్నంగా కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసి.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడని ఆస్పత్రి వారు తెలిపారు. ఆ రాత్రి ఏం జరిగింది..? అశోక్ను ఆస్పత్రికి చెందిన ప్రముఖ వ్యక్తి, ఓ వివాహిత భర్త, మరో రౌడీషిటర్ కలిసి ఆస్పత్రిలోనే ఓ గదిలో బంధించి.. బట్టలూడదీసి చిత్రహింసలకు గురిచేశారని తెలుస్తోంది. నేరుగా చంపకుండా.. భవనంపై నుంచి దూకి చనిపోవాలని ప్రేరేపించినట్లు సమాచారం. అయితే అశోక్ భవనంపై నుంచి దూకినా స్వల్ప గాయాలే కావడంతో ప్రాణభయంతో పైకిలేచి నడుస్తూ రాగా.. క్షణాల్లో కొందరు వచ్చి ఈడ్చుకుంటూ ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. దీంతో సదరు వ్యక్తులు ఆస్పత్రిలో ఆ యువకుడి ఊపిరి తీసేశారని తెలిసింది. మృతి చెందిన తర్వాత ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. మృతుడి బంధువులు వచ్చి ఆందోళన చేసి, డయల్ 100కు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. యువకుడి వీపుపై వాతలు, బలమైన దెబ్బలు ఉండటం కనిపించింది. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు బయటకు రాకుండా ఆస్పత్రి యాజమాన్యం జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. ప్రేమాయణమా.. అప్పుల వారి పనా..? యువకుడి మృతికి ప్రేమాయణం.. లేదా అప్పులే కారణమై ఉండవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. అశోక్ ఓ వివాహితతో వాట్సాప్ చాటింగ్ చేసేవాడని, ఈ క్రమంలోనే ప్రేమకు దారి తీసి ఉండవచ్చని, విషయం తెలిసిన తర్వాత అతడి అడ్డు తొలగించి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు అప్పులు కూడా చేశాడని, వసూలు చేసే క్రమంలో ఇలా చావబాది.. ఊపిరి తీసేశారా అన్న అభిప్రాయమూ వినపడుతోంది. నిందితులను కాపాడేందుకు ఒత్తిళ్లు.. ఈ కేసులోని నిందితుల్లో హాస్పిటల్కు చెందిన ప్రముఖుడు శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ మహిళా ప్రజాప్రతినిధి కుమారుడు, శింగనమల నియోజకవర్గంలోని ప్రముఖ వ్యక్తికి సదరు వ్యక్తి బంధువు. దీంతో అతన్ని కాపాడేందు కోసం అధికార తెలుగుదేశం పార్టీ నేతలు రంగంలోకి దిగి.. పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. ఇది ఆత్మహత్యా.. లేక హత్యా అనేది పోస్టుమార్టం నివేదికలో బయటపడనుంది.త్వరలోనే అన్నీ తెలుస్తాయి హిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మూడో అంతస్తు నుంచి అశోక్ అనే యువకుడు దూకి.. చికిత్స పొందుతూ మృతి చెందాడని సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాం. మృతిపై అనుమానాలు ఉన్నాయని అతడి అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఈ కేసులో పోస్టుమార్టం నివేదికే కీలకం. ఒత్తిళ్లకు తలొగ్గం. నిబంధనల ప్రకారమే కేసు దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే అసలు విషయాలు బయటకు వస్తాయి. – కౌలుట్లయ్య, సీఐ, త్రీటౌన్ పోలీసుస్టేషన్, అనంతపురం -
‘టిమ్స్’కు కొత్త రూపు
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పేదలకు చేరువ చేసే క్రమంలో ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మూడు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులను సాధారణ మల్టీ స్పెషాలిటీ కేంద్రాలుగా కాకుండా, ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ హబ్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఒక్కో టిమ్స్కు ఒక ప్రధాన స్పెషాలిటీని కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి అనుబంధంగా మరో కీలక విభాగాన్ని జోడించి మొత్తం ఆరు సూపర్ స్పెషాలిటీ సేవలను ఒక సమగ్ర వైద్య వ్యవస్థగా అందుబాటులోకి తేనుంది.నిమ్స్ తరహాలో స్వయం ప్రతిపత్తి (అటానమస్) కలిగిన సంస్థలుగా ఈ టిమ్స్ ఆస్పత్రులను తీర్చిదిద్దుతూ, అత్యాధునిక వైద్య సేవలకు కొత్త కేంద్రాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.మల్టీ–ఆర్గాన్ వ్యాధులపై ప్రత్యేక దృష్టిమారుతున్న జీవనశైలి, పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధులను దృష్టిలో పెట్టుకొని, ఒకే అవయవానికి పరిమితమైన వైద్య సేవల కంటే పరస్పరం సంబంధం ఉన్న అవయవాల చికిత్సలను ఒకేచోట అందించాలనే ఆలోచనతో ఈ ప్రణాళిక రూపొందుతోంది. గుండె, కిడ్నీ, మెదడు, మానసిక ఆరోగ్యం, జీర్ణకోశం, మూత్రపిండాల వ్యాధుల మధ్య ఉన్న అనుసంధానాన్ని పరిగణనలోకి తీసుకొని కొత్త స్పెషాలిటీ కాంబినేషన్లను ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది.సనత్నగర్ టిమ్స్కు కార్డియో–రీనల్ సెంటర్సనత్నగర్ టిమ్స్ను కార్డియాలజీతోపాటు నెఫ్రాలజీకి ప్రత్యేక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది. గుండె జబ్బులతో బాధపడే అనేక మందిలో కిడ్నీ సమస్యలు కూడా ఉండటంతో ఈ రెండు విభాగాల సేవలు ఒకేచోట అందితే రోగులు వేర్వేరు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అత్యాధునిక కార్డియాక్, డయాలసిస్ సేవలు ఒకే కేంద్రంలో అందుబాటులోకి రానున్నాయి. అల్వాల్ టిమ్స్లో న్యూరో–మెంటల్ కేర్అల్వాల్ టిమ్స్ను న్యూరాలజీతోపాటు సైకియాట్రీ లేదా జెరియాట్రిక్స్ సేవలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. స్ట్రోక్, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులతో బాధపడే రోగులకు మానసిక, పునరావాస సేవలు కూడా అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో సమగ్ర న్యూరో కేర్ అందించేలా ప్రణాళిక రూపొందుతోంది.కొత్తపేట టిమ్స్లో గ్యాస్ట్రో–యూరో కాంబినేషన్కొత్తపేట టిమ్స్లో గ్యాస్ట్రో ఎంటరాలజీతోపాటు యూరాలజీ సేవలను అందుబాటులోకి తేనున్నారు. జీర్ణకోశ వ్యాధులు, కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్, మూత్రనాళ సమస్యలకు సంబంధించిన అత్యాధునిక చికిత్సలు ఒకే కేంద్రంలో లభించనున్నాయి.గాంధీ, ఉస్మానియా, నిమ్స్పై తగ్గనున్న ఒత్తిడిఈ మూడు టిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా, నిమ్స్లపై ఉన్న రోగుల భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. జిల్లాల నుంచి వచ్చే రిఫరల్ కేసులను ఆయా వ్యాధుల స్పెషాలిటీని బట్టి నేరుగా టిమ్స్లకు తరలించే విధానాన్ని అమలు చేయనున్నారు. దీంతో రోగులకు వేగంగా చికిత్స అందడంతోపాటు పెద్ద ఆస్పత్రుల్లో రద్దీ కూడా తగ్గనుంది.మెడికల్ టూరిజంపై సర్కారు ఫోకస్హైదరాబాద్ను అంతర్జాతీయ వైద్య కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం మెడికల్ టూరిజంపైనా దృష్టి సారించింది. మూడు టిమ్స్లలో విదేశీ రోగుల కోసం ఒక్కో ఆస్పత్రిలో 50 పడకల ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఆధునిక మౌలిక వసతులతో విదేశీ రోగులను ఆకర్షించడం ద్వారా తెలంగాణను గ్లోబల్ హెల్త్ హబ్గా నిలబెట్టే వ్యూహానికి ప్రభుత్వం పదును పెడుతోంది. -
Andhra Pradesh: ఆస్పత్రులకు ఆహ్వానం
కోవిడ్ నేర్పిన పాఠాలు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా వైద్య రంగం ఆవశ్యకతను, ఆధునిక వైద్య సేవల అవసరాన్ని ఈ మహమ్మారి నొక్కి చెప్పింది. కోవిడ్ తీవ్రతను ముందుగానే ఊహించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ పరంపరలో ప్రభుత్వ ఆస్పత్రులను నాడు–నేడు ద్వారా మెరుగు పరచడంతో పాటు.. ముందు చూపుతో ప్రైవేట్ రంగంలోనూ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు చేయూతనిస్తోంది. ఇలా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో సగానికి సగం బెడ్లు పేదలకు అందుబాటులో ఉండేలా వడివడిగా అడుగులు వేస్తోంది. సాక్షి, అమరావతి: వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరమే లేకుండా, స్థానికంగానే అత్యుత్తమ వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 13 చోట్ల మల్టీ/సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. తొలి దశలో 13 పట్టణాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను కోరుతూ ఏపీఐఐసీ టెండర్లను ఆహ్వానించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి నగరాల నడిబొడ్డున ఆస్పత్రుల నిర్మాణానికి ఏపీఐఐసి ఉచితంగా భూమిని ఇవ్వనుంది. ఇప్పటికే అవసరమైన మేరకు స్థలాలను సేకరించింది. రాష్ట్ర విభజన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అత్యధిక శాతం హైదరాబాద్కే పరిమితం కావడంతో కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వీటి నిర్మాణం చేపట్టినట్లు ఏపీఐఐసీ టెండర్లలో పేర్కొంది. ఇందుకోసం ఆయా నగరాల్లో ఎకరం నుంచి 5 ఎకరాల వరకు భూమిని సేకరించింది. ఆస్పత్రి నిర్మాణం, దాని నిర్వహణ.. బిడ్ దక్కించుకున్న సంస్థే నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు ఒక చోట లేదా వివిధ నగరాల్లో ఆస్పత్రులు నిర్మించడానికి బిడ్లను దాఖలు చేసుకునే అవకాశం కల్పించింది. నవంబర్ 6న మొదలైన బిడ్ల స్వీకరణ నవంబర్ 25 మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. దాఖలైన బిడ్లను పరిశీలించి డిసెంబర్ 15న బిడ్డర్లను ఎంపిక చేస్తారు. బిడ్డింగ్లో ఎంపికైన సంస్థ రెండేళ్లలో ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. అధిక పెట్టుబడి పెట్టేవారికి ప్రాధాన్యత ► అత్యధికంగా ప్రత్యేక వైద్య సేవలు, అధిక పడకలు అందుబాటులోకి వచ్చే విధంగా బిడ్డింగ్లో నిబంధనలను పొందుపర్చినట్లు ఏపీఐఐసీ చీఫ్ ఇంజనీర్ సీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రతి చోట కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి, కనీసం 100 పడకల ఆస్పత్రిని నిర్మించాల్సి ఉంటుంది. ► అయితే బిడ్డింగ్ ఎంపికలో అధిక పెట్టుబడితో అధిక పడకలు నిర్మించడానికి ముందుకు వచ్చే సంస్థలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రతి ఆస్పత్రిలో కనీసం రెండు స్పెషాలిటీ ట్రీట్మెంట్లను కలిగి ఉండాలి. ఈ స్పెషాలిటీ ట్రీట్మెంట్ల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ఎంపికలో వాటికి అంత ప్రాధాన్యత ఉంటుంది. ► క్యాన్సర్, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, బోన్ మారో వంటి చికిత్సలు అందించే వాటికి ఎంపికలో ప్రాధాన్యత అధికంగా ఉండేలా నిబంధనలు రూపొందించారు. ఆరోగ్యశ్రీకి 50 శాతం పడకలు ► కొత్తగా నిర్మించే ఈ ఆస్పత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి తప్పనిసరిగా 50% పడకలను కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయా నగరాల్లో 2020లో వివిధ రోగాలకు చికిత్స తీసుకున్న వారి వివరాలను బిడ్లో పొందుపర్చారు. తద్వారా బిడ్డింగ్ దాఖలు చేసే సంస్థలు స్పెషాలిటీ చికిత్సలను ఎంపిక చేసుకోవడానికి సులభతరమవుతుంది. ► వైఎస్సార్ ఆరోగ్య శ్రీకి ఎన్ని పడకలు అధికంగా కేటాయిస్తే బిడ్ ఎంపికలో అంత ప్రాధాన్యత పెరుగుతుంది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స చేసే వైద్యులు కూడా ఆయా నగరాల్లోనే నివసించాలన్న నిబంధన కూడా విధించారు. ఈ 13 ఆస్పత్రుల నిర్మాణం ద్వారా కనీసం రూ.2,500 కోట్ల పెట్టుబడులు 2,000 అదనపు పడకలు అందుబాటులోకి వస్తాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. -
ఆరోగ్యమే మహా భాగ్యమని..
ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెంచే ఉద్దేశంతో ‘సాక్షి’ మీడియా, డీఎస్ రీసెర్చ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో హైటెక్స్లో ఏర్పాటు చేసిన ‘లివ్ వెల్ ఎక్స్పో’ ఆదివారం సాయంత్రం ముగిసింది. వివిధ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, దంత, నేత్ర, హెయిర్, ఆయుర్వేద, హోమియో, యునానీ ఆస్పత్రుల స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి.


