breaking news
mp gedem nagesh
-
రైతులెవ్వరూ అధైర్యపడవద్దు
భీంపూర్(బోథ్): జిల్లాలో వర్షాల తాకిడికి ఎన్నో చోట్ల పంటనష్టం జరిగిందనీ, రైతులు ఎవరూ అధైర్యపడకుండా ఉండాలని జిల్లా ఎంపీ గోడం నగేశ్ అన్నారు. భీంపూర్ మండలంలోని అర్లి(టి), వడూర్ గ్రామ శివారులలో జరిగిన ఆయన పరి శీలించారు. అక్కడున్న స్థానిక రైతులను పంటల సరళి, నష్టపోయిన తీరును అడిగి తెలుసుకున్నా రు. కాగా ఎక్కువ మొత్తలో పత్తితో పాటు సోయా పంటలు తీవ్రంగా నష్టపోయాయనీ, పలు చోట్ల వాగులు కోతకు గురవడంతో పత్తిపంట పూర్తిగా దెబ్బతిన్నదనీ రైతులు ఆవేదన వ్యక్తపర్చారు. రెవెన్యూ, సంబంధిత వ్యవసాయ అధికారులు ఆయా గ్రామాల రైతుల చేలలో నష్టపోయిన పంటల వివరాలను పక్కాగా సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అనంతరం నూతనంగా ఏర్పడిన కమట్వాడ గ్రామపంచాయతీలో ప్రభుత్వం చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు. క్యాంపులో అందుతున్న సేవలను సంబంధిత వైద్యాధికారి సూరత్ను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది చేపడుతున్న కంటి పరీక్షల్లో ఆయన కంటి పరీక్షలను చేయించుకున్నారు. ఇందులో ఎంపీటీసీ రుద్రగంగయ్య నాయకులు పులినారాయణ, శ్రీధర్రెడ్డి, రాజు, సవాయి స్వామి, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. తాంసీలో నీట మునిగిన పంటల పరిశీలన తాంసి(బోథ్): జిల్లాలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను, వర్షాల వల్ల ఇళ్లు కూలిన కుటుం బాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని ఎంపీ గోడం నగేశ్ బాధిత కుటుంబా లకు ధైర్యమిచ్చారు. శుక్రవారం తాంసీ మండలం లోని వివిధ గ్రామాలలో భారీ వర్షాల వలన నీట మునిగిన పంటలను అధికారులతో కలిసి పరీశి లించారు. మండల కేంద్రంలో వర్షానికి కూలిన ఇండ్లను పరిశీలించి, తాంసి వాగు పొంగి ప్రవహించడంతో వాగు ఒడ్డున గల ఇండ్లలో వాగు నీరు చేరిన ఇండ్లను అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులు త్వరగా సర్వే చేసి నష్టం వివరాలను అంచన వేయాలని తెలిపారు. ఇందులో తాంసీ తహసీల్దార్ శ్రీదేవి, వ్యవసాయాధికారి రవీందర్, ఏడీ రమేశ్, డిప్యూటీ తహసీల్దార్ ప్రేంనివాస్, ఆర్ఐలు సుమలత, మహేందర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణ, నాయకులు శ్రీధర్ రెడ్డి, సదానంద్, విలాస్, కాంత్రెడ్డి, నాగారెడ్డి తదితరులు ఉన్నారు. పంటచేలను పరిశీలించిన ఎంపీ నేరడిగొండ(బోథ్): జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షానికి నీట మునిగిన పంటలను ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ పరిశీలించారు. శుక్రవారం మండలంలోని కుమారి, కుప్టి, తర్నం గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కడెం నదీ పరివాహక ప్రాంతాల్లో పత్తి, సోయా, తదితర పంటలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ఈ పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు నష్టం అంచనా వివరాలను తెలుసుకొని రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లోని పంట చేలల్లో వరదనీరు ఆగి ఉంటుందని, ఆ నీటిని రైతులు బయటకు పంపాలని సూచించారు. తడి ఆరిన అనంతరం పత్తి మొదళ్లకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పాటించి పంటలకు మందులు పిచికారీ చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి రైతులకు అన్ని రకాల సహాయాన్ని అందేలా చూస్తానని ఆయా గ్రామాల రైతులకు భరోసానిచ్చారు. పంట క్షేత్రాలకు స్వయంగా వెళ్లి నష్టపోయిన వివరాలను తెలుసుకున్నారు. ఆయన వెంట రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గడ్డం భీంరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు గాదె శంకర్, ఏరు రాజేశ్వర్, ఆడెపు రమేష్, రాథోడ్ రవీందర్, శివారెడ్డి, రాజురెడ్డి, తదితరులు ఉన్నారు. -
మార్లవాయిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
నార్నూర్(జైనూర్) : ఎంతో చరిత్ర కలిగిన మార్లవాయి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కోవ లక్ష్మి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపీ గెడం నగేష్ అన్నారు. ఆదివారం జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో హైమన్డార్ఫ్ దంపతుల వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సహాయ మంత్రి లక్ష్మి, ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపీ గెడం నగేష్ హైమన్డార్ఫ్ దంపతుల సమాధుల వద్ద సంప్రదాయబద్ధంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేసిన మానవ పరిణామక్రమ శాస్త్రవేత్త హైమన్డార్ఫ్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. హైమన్డార్ఫ్ వర్ధంతిని అధికారింగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆదివాసీ గిరిజనుల హక్కులు, సంస్కృతి, సంప్రదాయల పరిరక్షణ కోసం కృషి చేసిన ఆ దంపతులను ఎప్పటికీ మరువలేమని అన్నారు. గ్రామంలో రూ.6కోట్లతో ట్యాంకు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినట్లు సహాయ మంత్రి కోవ లక్ష్మి తెలిపారు. కొమురం భీమ్ స్వగ్రామమైన జోడేఘాట్ను రూ.25 కోట్లతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. హైదారాబాద్లోని బంజారాహిల్స్లో ఆదివాసీల కోసం ఆదివాసీ భవనం నిర్మాణానికి స్థలం కేటాయించిందని, ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. గిరిజనుల సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలు, పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏవో పెందూర్ భీము, ఆరోగ్య శాఖ అధికారి తొడసం చందు, ఆర్డీవో ఐలయ్య, ఎంపీడీవో దత్తరాం, తహశీల్దార్ వర్ణ, ఏజెన్సీ డీఈవో సనత్కుమార్, ఎంపీపీ కొడప విమలప్రకాష్, కోఆప్షన్ సభ్యులు సబుఖాన్, ఏజెన్సీ ఎస్సీ, ఎస్టీ సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మర్సుకోల తిరుపతి, సర్పంచులు భీంరావ్, బొంత ఆశరెడ్డి, లక్ష్మణ్, ఆదివాసీ సంఘాల నాయకులు లక్కేరావ్, వెడ్మా బొజ్జు, సీతారామ్, అంబాజీ, ఐటీడీఏ మాజీ చైర్మన్ అర్జు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనక యాదవ్రావ్, రాయ్సెంటర్ జిల్లా మెడి మేస్రం దుర్గు తదితరులు పాల్గొన్నారు.