breaking news
moon tour
-
స్పేస్ ఎక్స్ ‘చంద్రయాన్’లో భారత నటుడు దీప్ జోషి
వాషింగ్టన్: ‘డియర్ మూన్’ పేరుతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అంతరిక్ష యాత్రకు వెళ్లే బృందంలో బాల్వీర్ టీవీ షోతో దేశవ్యాప్త క్రేజ్ సాధించిన భారత నటుడు దీప్ జోషి చోటు దక్కించుకున్నారు! చంద్రుని సమీపానికి స్పేస్ ఎక్స్ చేపడుతున్న తొలి వాణిజ్య అంతరిక్ష యాత్ర డియర్ మూన్. దాంట్లో అందుబాటులో ఉన్న టికెట్లన్నింటినీ జపాన్ కుబేరుడు యసాకు మజావా కొనుగోలు చేశారు. తన వెంట పలు రంగాల నుంచి 8 మంది ప్రఖ్యాత కళాకారులను తీసుకెళ్లాలని తొలుత భావించినా చివరికి వారిని ఇంటర్వ్యూల ద్వారా ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 10 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఏడాదిన్నర పాటు అనేకానేక వడపోతల అనంతరం జోషితో పాటు ప్రఖ్యాత బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ కరీం ఇలియా, అమెరికా నుంచి ప్రముఖ డీజే, నిర్మాత స్టీవ్ అవోకీ, సినీ దర్శకుడు బ్రెండన్ హాల్, యూట్యూబర్ టిమ్ డాడ్, దక్షిణ కొరియాకు చెందిన కె–పాప్ మ్యుజీషియన్ షొయ్ సెయంగ్ హుయాన్ (టాప్) విజేతలుగా నిలిచారు. వీరంతా వచ్చే ఏడాది స్పేస్ ఎక్స్ స్టార్షిప్ వెహికిల్లో మజావాతో పాటు 8 రోజుల పాటు అంతరిక్షంలో విహరిస్తారు. 3 రోజులు చంద్రుని చుట్టూ తిరుగుతారు. 22 ఏళ్ల జోషి ఈ బృందంలో అత్యంత పిన్న వయస్కుడు. 2000 నవంబర్లో గుజరాత్లోని అహ్మదాబాద్లో పుట్టారు. పలు గుజరాతీ సినిమాల్లో నటించారు. ‘‘దేవ్ యువోత్సాహం తమకెంతో స్ఫూర్తినిస్తుంది. అందుకే ఆయన్ను ఎంపిక చేసుకున్నాం’’ అని మజావా పేర్కొన్నారు. -
బంపరాఫర్: 14 వేల కోట్ల భారీ డిస్కౌంట్!
అంతరిక్షయానం ఇప్పుడు పక్కా కమర్షియల్గా మారిపోయింది. భూమి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘కర్మన్ లైన్’ దాటి వెళ్లొస్తూ.. రోదసియానం పూర్తైందని జబ్బలు చరుచుకుంటున్నాయి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీలు. తద్వారా పాపులారిటీతో పాటు ప్రభుత్వ అంతరిక్ష సంస్థలతో భారీ ఒప్పందాలను సొంతం చేసుకుంటున్నాయి . ఈ క్రమంలో అమెజాన్ ఫౌండర్, బ్లూ ఆరిజిన్ స్పేస్ ఏజెన్సీ ఓనర్ జెఫ్ బెజోస్.. నాసాకు బంపరాఫర్ ప్రకటించాడు. బ్లూ ఆరిజిన్ ఓనర్ జెఫ్ బెజోస్.. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసాకు ఓ బహిరంగ లేఖ రాశాడు. నాసా చేపట్టబోయే ‘మూన్ మిషన్-2024’లో మూన్ ల్యాండర్ బాధ్యతలను తమ కంపెనీకి అప్పగించాలని, తద్వారా 2 బిలియన్ల డాలర్లు(మన కరెన్సీలో దాదాపు 14 వేల కోట్ల రూపాయలు) డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించాడు. తద్వారా చరిత్రలోనే అతిపెద్ద డిస్కౌంట్ ఆఫర్తో వార్తల్లోకెక్కింది ఈ డీల్. అయితే ఈ లేఖపై నాసా ఇంకా స్పందించాల్సి ఉంది. ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా 2024లో చంద్రుడి మీదకు ప్రణాళికలు వేస్తున్న నాసా.. అక్కడి అనుభవాలు 2030-మార్స్ క్రూ మిషన్ కోసం ఉపయోగపడుతుందని భావిస్తున్నాయి. ఈ క్రమంలో మూన్ల్యాండర్ కోసం ఆక్షన్ నిర్వహించింది. సుమారు 2.9 బిలియన్ డాలర్ల విలువైన ‘ది హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్’ కాంట్రాక్ట్ను ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ఎగరేసుకుపోయింది. అయితే ఈ వ్యవహారంపై ప్రత్యర్థి బ్లూ ఆరిజిన్తో పాటు డైనెటిక్స్ కంపెనీలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో నాసా పునరాలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో బెజోస్ నుంచి నాసాకు బంపరాఫర్ వెళ్లడం విశేషం. ‘ఫండింగ్ లేని కారణంగా నాసా ఒకే కాంట్రాక్టర్ను తీసుకుందనే విషయం తెలుసు, కానీ, పోటీతత్వం ఉంటేనే పని సమర్థవంతంగా సాగుతుందనే విషయం గుర్తించాల’ని ఆ బహిరంగ లేఖలో నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్కు సూచించాడు బెజోస్. అంతేకాదు ‘బ్లూ మూన్ ల్యాండర్’ ప్రత్యేకతలను వివరించడంతో పాటు.. కక్క్ష్యలో ల్యాండర్ను పరీక్షించేందుకు అవసరమయ్యే ఖర్చును కూడా తామే భరించుకుంటామని బెజోస్ స్పష్టం చేశాడు. ఒకవేళ ఈ ఆఫర్ను ఒప్పుకుంటే చరిత్రలోనే భారీ డిస్కౌంట్ దక్కించుకున్న క్రెడిట్ నాసా సొంతమవుతుంది. -
అదొక అద్భుత ఘట్టం.. లైవ్లో చూపించినా నమ్మరెందుకు?
చరిత్రలో అదొక అత్యంత ముఖ్యమైన ఘట్టం. సాంకేతికతను పుణికిపుచ్చుకున్న మనిషి, అప్పటిదాకా రోదసీ యాత్రలతోనే సరిపెట్టుకున్న మనిషి.. ఏకంగా చందమామ కలను సాకారం చేసుకున్న క్షణాలవి. 1969 జులై 20 నాసా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై మొదటగా అడుగుపెట్టాడు. ఆ వెంటనే మరో పైలెట్ బజ్ ఆల్డ్రిన్ ‘ఈగిల్ లునార్ మాడ్యుల్’ నుంచి కిందకి దిగగా.. ఆ ఇద్దరూ కలిసి చంద్రుడిపై అమెరికా జెండాను సగర్వంగా ఎగరేశారు. అమెరికా నాసా ‘అపోలో’ ప్రయోగం ద్వారా సుసాధ్యమైన ఈ ఘటనకు ఇవాళ్టికి 52 ఏళ్లు పూర్తైంది. అంతేకాదు ఆ ఘట్టానికి గుర్తుగా ఇవాళ ‘మూన్ డే’ కూడా నిర్వహిస్తుంటారు. అయితే ఆ ఫీట్ నిజమేనా అనే అనుమానాలు ఎందుకు వినిపిస్తాయో తెలుసా? సాక్షి, వెబ్డెస్క్: మొత్తం 24 బిలియన్ల డాలర్ల(ఇప్పటి లెక్కల ప్రకారం.. అది వంద బిలియన్ల డాలర్లపైనే ఉండొచ్చు) ఖర్చుతో నాసా ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జులై 16న ఉదయం 9గం.30ని. శాటర్న్ వీ రాకెట్ ద్వారా ‘అపోలో 11 స్పేస్ ఫ్లైట్’ ఫ్లోరిడా మారిట్ ఐల్యాండ్లోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరింది. కమాండర్గా నీల్ ఆర్మ్స్ట్రాంగ్, లునార్ మాడ్యూల్ పైలెట్ బజ్ అల్డ్రిన్, కమాండ్ మాడ్యూల్ పైలెట్ మైకేల్ కోలిన్స్ అపోలో స్పేస్ ఫ్లయిట్లో పయనం అయ్యారు. రెండు లక్షల నలభై వేల మైళ్ల దూరపు ప్రయాణం తర్వాత జులై 19న చంద్రుడి కక్క్ష్యలోకి అడుగుపెట్టింది అపోలో. ఉద్వేగభరిత క్షణాలవి.. అర్ధరాత్రి దాటాక అపోలో నుంచి లునార్ మాడ్యూల్, ఈగిల్ మాడ్యూల్ రెండూ విడిపోయాయి. ఈగిల్ మాడ్యూల్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ అల్డ్రిన్ ఉండగా.. మాడ్యూల్ పైలెట్ మైకేల్ కోలిన్స్ చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టాడు. ఇక రెండు గంటలు ఉపరితలంలో సంచరించాక.. చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ అయ్యింది ఈగిల్. ఆ విషయాన్ని ఆర్మ్స్ట్రాంగ్ నాసా స్పేస్ కమ్యూనికేషన్ సెంటర్కు తెలిపాడు. అప్పటిదాకా సాఫీగా సాగిన ప్రయాణంతో పోలిస్తే.. అక్కడి నుంచి అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. సుమారు ఐదు గంటల తర్వాత లునార్ మాడ్యూల్ నుంచి చంద్రుడి మీద అడుగు మోపాడు ఆర్మ్స్ట్రాంగ్. వెంట తెచ్చిన బీమ్ సిగ్నల్ ఆధారిత టీవీ కెమెరాతో అదంతా లైవ్ రికార్డు చేస్తూ వచ్చాడు. అలా అదొక అద్భుతమైన ఘట్టంగా మిగిలిపోయింది. “That one small step for man, one giant leap for mankind.”.. ఇది చంద్రుడి మీద అడుగుమోపిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చెప్పిన మాటలు. అప్పటికి టైం.. రాత్రి 10గం.56ని(ET). బజ్ అల్డ్రిన్ పది నిమిషాలకు బయటకు వచ్చేంత వరకు ఆర్మ్స్ట్రాంగ్ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అమెరికా జెండా పాతారు. కొన్ని పరికరాలను అక్కడ ఉంచారు. సంతోషంగా కలియతిరిగారు. ఈ మొత్తాన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 65 కోట్ల మంది టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. #50thAnniversary 🌚👨🏼🚀👨🏼🚀👨🏼🚀 "That's one small step for man, one giant leap for mankind." ... and #Jump Happy #MoonDay 🌚 &#WorldJumpDay#50thanniversaryofthemoonlanding#LunarLanding#ManOnTheMoon 👨🏼🚀👨🏼🚀👨🏼🚀 pic.twitter.com/t7Ut0ogSN5 — Miguel Velasco (@_miguelvelasco) July 20, 2019 మూన్డేగా గుర్తింపు ఆ ఇద్దరూ చంద్రుడి మీద 21 గంటలు గడిపినట్లు చెప్తుంటారు. అక్కడి మట్టిని సేకరించారు. అలాగే వాళ్లు దిగిన ప్రాంతానికి ‘ట్రాన్క్విలిటీ బేస్’ అనే పేరు పెట్టారు. చివరికి ఈ ఇద్దరూ కమాండ్ మాడ్యూల్ కొలంబియాలో కొలిన్స్తో కలిసి చివరికి భూమ్మీదకు ప్రయాణం అయ్యారు. జులై 24న వాళ్లు భూమ్మీద సేఫ్గా ల్యాండ్ కావడంతో ఆ అంకం విజయవంతంగా పూర్తైంది. నాసా దృష్టిలో అది ‘సింగిల్ గ్రేటెస్ట్ టెక్నాలజికల్ అఛీవ్మెంట్ ఆఫ్ ఆఫ్ ఆల్టైం’. ఆ తర్వాత ఎన్నో దేశాల రోదసీ ప్రయోగాలకు బలం ఇచ్చిందది. 1971లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆ మధురక్షణాలకు గుర్తింపు ఉండాలని ప్రత్యేకంగా ఆ రోజును ‘మూన్ డే’గా ప్రకటించారు. ఈ విజయానికి గుర్తుగా ఎన్నో డాక్యుమెంటరీలు, ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి. కానీ, చాలామంది దీనిని నమ్మరు. అదంతా కట్టుకథగా భావిస్తుంటారు. ఎందుకు.. కట్టుకథ.. కౌంటర్లు బిల్ కేసింగ్ అనే అమెరికన్ రైటర్.. జులై 1969 నుంచి డిసెంబర్ 1972 దాకా జరిగిన అపోలో మూన్ ల్యాండింగ్స్ అన్నీ ఉత్త ప్రచారాలే అని ప్రచారం చేసిన మొదటి వ్యక్తి. చంద్రుడి మీద నాసా పరిశోధనలంతా నాటకమే అని అన్నాడాయన. ఆ తర్వాత ఆయన రూట్లో చాలామంది పయనించారు. అయితే ఈ వాదనను కొట్టేయడానికి సైంటిస్టులు ఆధారాలను ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తుంటారు. చాలామందికి కలిగిన కామన్ డౌన్ ఏంటంటే.. మూన్ ల్యాండింగ్ టైంలో నక్షత్రాలు కనిపించకపోవడం. చంద్రుడి మీద గాలి లేకపోవడంతో ఆకాశం నల్లగా ఉంటుంది. అలాంటప్పుడు నక్షత్రాలు కూడా కనిపించాలి కదా? అని అడిగారు. అయితే అవి కంటికి కనిపించనంత సూక్క్ష్మంగా ఉన్నాయని నాసా వివరణ ఇచ్చింది. ఇక జెండా రెపరెపలాడడం. గాలి లేనప్పుడు జెండా ఎగిరిందని కొందరు ప్రశ్నించారు. అయితే ఆ జెండా కదలికలు వ్యోమగాములు పాతినప్పుడు కలిగినవేనవి వివరణ ఇచ్చారు. ఇక ముఖ్యమైన అనుమానం ఏంటంటే.. వాన్ లెన్ బెల్టులు. అంతరిక్షంలోని ఈ బెల్టుల గుండా ప్రయాణం వీలు కాదని, ఒకవేళ చేస్తే హై రేడియేషన్ ఎఫెక్ట్తో ప్రాణాలు పోతాయనేది కొందరి అభిప్రాయం కమ్ అనుమానం. అయితే వాళ్లు ప్రయాణించిన వేగం, తక్కువ టైంలో చేరుకవోడం వల్లే తక్కువ రేడియోధార్మికత నుంచి సురక్షితంగా బయటపడ్డారేది సైంటిస్టుల వాదన. ఇవన్నీ పక్కనపెడితే.. యాభై రెండేళ్లు పూర్తయ్యాక కూడా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మాటలు.. ఈనాటికీ అంతరిక్ష ప్రయోగాలప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఇక నాటి అద్భుతానికి ఆధారంగా.. చంద్రుడి మీద నుంచి తెచ్చిన మట్టి.. వివిధ దేశాల అంతరిక్ష ల్యాబ్ల్లో ఉన్న వాటి శాంపిల్స్, చంద్రుడిపై పాద ముద్రలు, 2009లో నాసా లునార్ రీ కన్నియసాన్స్ ఆర్బిటర్ తీసిన ఫొటోలు. చైనా, ఇండియా జపాన్ దేశాలు పంపిన స్పేస్ వెహికిల్స్ సేకరించిన సాక్క్క్ష్యాలు.. అన్నింటికి మించి రష్యాకు ధీటైన ప్రయోగంలో విజయం సాధించామనే నాసా సంబురాలు.. ఇంతకంటే సాక్క్ష్యం ఇంకేం కావాలనేది స్పేస్ సైంటిస్టుల మాట. -
చంద్రయాత్ర.. పారాచ్యూట్ ల్యాడింగ్
సాధారణ మనిషిని త్వరలో చంద్రమండలానికి తీసుకెళ్లనున్నట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. 2018లో ఈ ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్పేస్ షిప్ను నాసాకు చెందిన ఆస్ట్రోనాట్లు అభివృద్ధి చేస్తున్నారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ నుంచి 2018 ద్వితీయార్ధంలో చంద్రమండల యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం రోజులపాటు జరిగే చంద్రయాత్రకు ఒక్కొక్కరి నుంచి ఎంత చార్జ్ చేస్తున్నారనే విషయంపై స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ చీఫ్ ఎలాన్ మస్క్ మాట్లాడలేదు. అయితే, హాలీవుడ్ నుంచి మాత్రం ఎవరూ ఈ యాత్రలో పాల్గొనడంలేదని ఆయన వెల్లడించారు. చంద్రునిపై కాలుమోపేందుకు ఇద్దరు యాత్రికులు ఇప్పటికే తమను కలిశారని.. వారివురికి అంతరిక్ష యానం గురించి విస్తృత శిక్షణ ఇస్తామని తెలిపారు. ఒకసారి యాత్రకు వెళ్లి రావడానికి ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. భూమి నుంచి చంద్రమండల యాత్రకు బయల్దేరే వ్యక్తులు 4,80,000 కిలోమీటర్ల నుంచి 6,40,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చంద్రునిపై పారాచ్యూట్ ద్వారా ల్యాండ్ అవుతారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల రక్షణ చర్యలను నాసా తీసుకుంటున్నట్లు మస్క్ తెలిపారు. చంద్రుని యాత్ర చేయాలంటే మాత్రం ఒక్కో టిక్కెట్టు ధర రూ.16,69,06,252లతో కొనాల్సిందేనని తెలిసింది.