-
దేశంలో ఫస్ట్ ఏసీ రైల్వే టర్మినల్
బెంగళూరు రైల్వే టెర్మినల్ ను దేశంలోనే తొలిసారిగా సెంట్రలైజ్డ్ ఎయిర్ కండీషనింగ్, తదితర అధునాతన సదుపాయాలతో నిర్మించారు. దీనికి ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరును పెట్టారు. దేశంలోనే మొట్టమొదటి ఏసీ టర్మినల్ నిర్మాణానికి రూ.314 కోట్ల ఖర్చు అయ్యింది. ఈ నెలాఖరులో ప్రారంభించడానికి ఏసీ రైల్వే టర్మినల్ సర్వం సిద్ధమైంది. "భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరుతో బెంగళూరులో నిర్మించిన తొలి ఏసీ రైల్వే టర్మినల్ త్వరలో ప్రజలకు వినియోగంలోకి రానున్నదని" రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. Named after one of the foremost Civil Engineers Bharat Ratna Sir M Visvesvaraya, India's first centralised AC Railway terminal in Bengaluru is all set to become operational soon. pic.twitter.com/L2agyUevd1 — Piyush Goyal (@PiyushGoyal) March 13, 2021 బెంగళూరుతో అనుసంధానానికి మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో బయప్పనహల్లిలో న్యూ కోచ్ టర్మినల్ నిర్మాణానికి 2015-16లో ప్రణాళిక సిద్ధం చేశామని సౌత్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ చెప్పారు. భారతదేశంలో మొట్ట మొదటి ఈ సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్డ్ రైల్వే టెర్మినల్ ను బెంగళూరు విమానాశ్రయం తరహాలో నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజు 50 రైళ్లను నడపనున్నారు. 4,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టర్మినల్ రోజు 50 వేల మంది వరకు స్టేషన్ను సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. టెర్మినల్లోఏడు ప్లాట్ఫారమ్లు, 3 పిట్ లైన్లు ఉన్నాయి.ప్రయాణికుల సౌకర్యార్థం రెండు సబ్వేలు, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్లు, వీఐపీ లాంజ్, ఫుడ్ కోర్టు, అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాలు, రియల్ టైం ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టం తదితర వసతులు కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. చదవండి: కొత్త ఏసీ కొనాలనుకునే వారికి షాక్! ఆన్లైన్ లో నకిలీ వస్తువులు అమ్మితే ఇక అంతే! -
వరద: నిజాంల ‘ప్లాన్’ బెస్ట్!
సాక్షి, హైదరాబాద్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం అంతా అతలాకుతలమైంది. కానీ కుతుబ్షాహీ, ఆసఫ్జాహిల కాలంలో ఏర్పడ్డ బస్తీ లు కొన్ని ఇప్పటికీ చెక్కుచెదరకుండా.. వరద ముప్పు లేకుండా ఉన్నాయి. పాత బస్తీలోని పలు పాత మొహల్లాల నివాసితులు తమ ప్రాంతాలకు ఇప్పటికీ వరద ముప్పు లేదని, దానికి నాటి నిజాం పాలకులు, ఇంజినీర్ల కృషే కారణమని అంటున్నారు. చార్మినార్, మొఘల్పురా, ఖిల్వాట్, షా అలీ బండా, ఫతే దర్వాజా, పురాని హవేలి, నూర్ఖాన్ బజార్, హుస్సేనీ ఆలం, దూద్బౌలి, ఇంజిన్ బౌలి, కోట్ల అలీజా, పత్తర్గట్టి, పంజేషా పంచ మొహల్లా, చంచల్గూడ, ఖాజీపురా, కార్వాన్, జియాగుడ, అఫ్జల్గంజ్, ఫీల్ఖానా, జుమేరాత్ బజార్ తదితర ప్రాంతాలు నిన్నమొన్నటి భారీ వరదల్లోనూ ముంపునకు గురికాలేదు. నిజాం కాలం నాటి డ్రైనేజ్ జనాభా అనేక రెట్లు పెరిగినప్పటికీ వందేళ్ల క్రితం నిజాం కాలంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తోంది. వర్షం పడిన గంట, అరగంటలోపే పాతబస్తీలోని అత్యధిక బస్తీల్లో నీరు డ్రైనేజీ ద్వారా వెళ్లిపోతోంది. 1908లో మూసీ వరద విపత్తు తర్వాత నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సంప్రదించి హైదరాబాద్ నగరాన్ని వరద నుంచి రక్షించేందుకు..నీరు సాఫీగా వెళ్లేందుకు డ్రైనేజీ వ్యవస్థను సిద్ధం చేయాలని కోరారు. హైదరాబాద్ నగర పునర్నిర్మాణంలో సలహాలు ఇవ్వాలని, వరదల నుంచి నగర భవిష్యత్ రక్షణ కోసం ప్రతిపాదనలు రూపొందించాలని, నీటిపారుదలకు సంబంధించి సర్వం సిద్ధం చేయాలని కోరారు. 1911లో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ మరణించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నగరంలో మెరుగైన పౌర సౌకర్యాలను అందించడానికి ‘సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు’ను స్థాపించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనలు అమలు చేశారు. ఆ కాలంలోనే పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో పాటు, వర్షపు నీరు వెళ్లడానికి రోడ్లపై ప్రత్యేక భూగర్భ నీటిపారుదల కోసం లైన్స్ ఏర్పాటు చేశారు. విశ్వేశ్వరయ్య ప్లాన్లోని ముఖ్యాంశాలివీ.. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీ నిర్మాణం మూసీ వరదల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు పురానాపూల్ నుంచి చాదర్ఘాట్ æవరకు మూసీనది పరీవాహక ప్రాంతంలో రక్షణ గోడలు ఏర్పాటు డ్రైనేజీ మాస్టర్ప్లాన్ పనుల పర్యవేక్షణకు నిపుణుల కమిటీ ఏర్పాటు. సకాలంలో పనులు పూర్తి ఓపెన్ డ్రైనేజీని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థగా మార్చడం ట్రంక్ సీవర్ మొయిన్స్, లేటరల్స్, సబ్మొయిన్స్, మురుగు కాల్వల డిజైన్లు సిద్ధం చేశారు లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉండాలో దిశానిర్దేశం చేశారు జాయింట్స్, మలుపుల వద్ద పైప్లైన్ వ్యవస్థ ఎలా ఉండాలో డ్రాయింగ్స్ ద్వారా ముందస్తుగా కసరత్తు చేసి నిర్మాణాలు చేపట్టారు నిజాం కాలంలో పకడ్బందీగా నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. దీంతో పాటు భూగర్భ అంతర్గత పైప్లైన్ల డిజైన్ వ్యవస్థ నేటికీ ఆయా ప్రాంతాలను వరద ముప్పు నుంచి కాపాడుతోంది. -
అప్పటి మూసీ వరదల నుంచి కాపాడింది ఆయనే
-
నవభారత నిర్మాతలు
నేడు ఇంజినీర్స్ డే దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర కీలకం ఇంజినీరింగ్ రంగంలో ఉపాధితోపాటు, ప్రత్యేక గుర్తింపు నైపుణ్యం ఉంటే ఉజ్వల భవిత ఏఎన్యూ (గుంటూరు): అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఇంజినీరింగ్ రంగ ప్రాధాన్యం కూడా గణనీయంగా పెరుగుతోంది. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, ఆరోగ్యం, విద్య తదితర అన్ని రంగాల్లోనూ ఇంజినీర్ల సేవలు తప్పనిసరి అయ్యాయి. ఇందుకు అనుగుణంగా మనదేశ శాస్త్ర సాంకేతిక రంగ నిపుణులు తమ సత్తాను చాటుకుంటున్నారు. ఈ రంగానికి ఉన్న ఆదరణ దృష్ట్యా ఇంజినీరింగ్ కోర్సు చదివే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతోంది. నైపుణ్యాలు పెంపొందించుకుని ఉజ్వల భవితను సొంతం చేసుకోవటంతోపాటు సమాజాభివృద్దిలో కీలకపాత్ర పోషించాలని భావి భారత ఇంజినీర్లకు నిపుణులు సూచిస్తున్నారు. మనదేశ తొలితరం శాస్త్రవేత్త, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశ శక్తిని 19వ దశాబ్దంలోనే ప్రపంచానికి చాటిన డాక్టర్ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఏటా మన దేశంలో సెప్టెంబర్ 15న ఇంజినీర్స్డే నిర్వహిస్తున్నారు. ఇంజినీర్గా జీవితాన్ని ప్రారంభించిన డాక్టర్ విశ్వేశ్వరయ్య దేశాభివృద్ధికి దోహదం చేసే అనేక నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. హైదరాబాద్, ముంబై నగరానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం రూపకల్పన, విశాఖపట్నం పోర్ట్ ఏర్పాటులో ఆయన సేవలు ఎనలేనివి. దేశాభివృద్ధికి అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం ఆయనను భారతరత్నతో సత్కరించింది. సమాజానికి ఉపయోగపడాలి.. సమాజానికి ఉపయోగపడితేనే ఇంజనీరింగ్ వృత్తికి నిజమైన సార్ధకత చేకూరుతుంది. దేశంలో లక్షల సంఖ్యలో ఇంజినీర్లు ఉండగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఇప్పటికీ దేశం గౌరవించటానికి ఆయన సేవలే కారణం. వృత్తిని సామాజిక బాధ్యతగా భావించిన ఘనత ఆయనకే దక్కుతుంది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన ఫలాలను సక్రమమైన మార్గంలో భారతీయ సమాజానికి అందించాల్సిన బాధ్యత యువ ఇంజినీర్లపై ఉంది. ఇంజినీరింగ్ అంటే మంచి ఉద్యోగమనే భావనతోపాటు మంచి బాధ్యత అని కూడా గుర్తుంచుకుని ముందుకు సాగాలి. - ఆచార్య ఈ.శ్రీనివాసరెడ్డి , ప్రిన్సిపాల్, ఏఎన్యూ ఇంజినీరింగ్ కాలేజి జీవితాశయం.. ఇంజినీర్ను అవుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నా. బీటెక్ చదవాలనేది నా జీవితాశయం. నేడు ఉన్న పోటీ, మారుతున్న పరిజ్ఞానం దృష్ట్యా మంచి ఇంజినీర్ కావటం అంత సులభం కాదు. ఇంజినీరింగ్ విద్యను ఎంజాయ్ చేసి కేవలం కోర్సు పాసయ్యామనిపించుకుంటే తరువాత విధుల్లో రాణించటం వీలుకాదు. కాన్సెప్ట్ను డెవలప్ చేసుకుని పరిస్థితులకు అనుగుణంగా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. - కె.అజయ్, బీటెక్, ఏఎన్యూ కాలేజీ జాతి గర్వించాలి.. ఇంజినీరింగ్ విద్యార్థులు అభివృద్ధి చెందుతున్న పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని జాతి గర్వించేలా ఎదగాలి. కేవలం చదువుతోనే సంపూర్ణ ఇంజినీర్లుగా రూపొందలేరు. సామాజిక అవసరాలు, దేశాభివృద్ధికి దోహదం చేసే నూతన ఆవిష్కరణలు, పరిజ్ఞానం రూపకల్పన అంశాలను ఇంజినీర్లు అవగాహన చేసుకుని వాటిని అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవాలి. రానున్న రోజుల్లో ఇంజినీర్ల సేవలు దేశానికి చాలా కీలకం. దానిని దృష్టిలో ఉంచుకుని విద్యార్దులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. ఈ రంగంలోని మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. - ఆచార్య పి.సిద్ధయ్య, ఏఎన్యూ ఇంజినీరింగ్ డీన్ ప్రజలకు ఏం కావాలో గుర్తించాలి.. ఇంజినీర్ల నుంచి ప్రజలు, సమాజం ఏం కోరుకుంటుందనేది గుర్తించి దానికి అనుగుణంగా మసలుకోవాలి. సమాజంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానంతో కృషి చేయాలి. మంచి లక్ష్యం, ఉన్నతాశయంతో ముందుకు సాగితే నిరతంరం ప్రజాభిమానం చూరగొనవచ్చు. అన్ని రంగాల్లో సేవలు అందించే ప్రత్యేకత ఇంజనీర్లకే దక్కుతుంది. దానిని సద్వినియోగం చేసుకుని మంచి పేరుతెచ్చుకోవాలి. - వి.కరుణాకర్, బీటెక్ సివిల్ ఇంజినీరింగ్, ఏఎన్యూ ఈ రంగానికి ప్రాధాన్యం.. ఇంజనీరింగ్ విద్యార్థులు నామమాత్రపు పరిజ్ఞానంతో ఫీల్డ్లోకి వెళితే దీర్ఘకాలంగా ఆ రంగంలో నిలదొక్కుకోలేరు. నాది వ్యవసాయ కుటుంబం అయినా చిన్నప్పటి నుంచి నాకు ఇంజినీర్ కావాలనే బలమైన కోరిక ఉంది. ఇంజనీరింగ్ కోర్సు పూర్తయిన అనంతరం నిబద్ధతతో సేవలు అందించేందుకు కృషి చేస్తా. భవిష్యత్లో ఈ రంగానికి మరింత ప్రాధాన్యత పెరగనుంది. - బి.సత్యన్నారాయణ స్వామి, బీటెక్ మెకానికల్, ఏఎన్యూ రాణించవచ్చు.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ఇంజినీర్లు మనదేశంలో పుట్టటం మన అదృష్టం. పాతకాలపు ఇంజినీర్లు కమిట్మెంట్తో పనిచేసేవారు. వారి కష్టానికి ప్రతి ఫలమే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇంజినీరింగ్ రంగంలో గతానికి ఇప్పటికీ టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చాయి. నిర్మాణం, విద్యుత్ తదితర రంగాల్లో నూతన పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. పాతకాలపు ఇంజినీర్ల అనుభవాలు, వారి కమిట్మెంట్, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే యువ ఇంజినీర్లు మంచిగా రాణించవచ్చు. - ఆచార్య రమణారావు, ఎలక్ట్రికల్ విభాగాధిపతి, ఏఎన్యూ ఇంజినీరింగ్ కాలేజీ ఇంజినీర్ల పనితనానికి మచ్చుతునక విజయపురిసౌత్: ఇంజినీర్ల పనితనానికి మచ్చుతునక నాగార్జునసాగర్ ప్రాజెక్టు. మానవనిర్మిత దేవాలయంగా రూపుదిద్దుకున్న సాగర్ పూర్తిగా స్వదేశీయ పరిజ్ఞానంతో నిర్మించినది. భారత ఇంజినీర్లు తమ ప్రతిభాపాటవాలతో నాగార్జునసాగర్ ఆనకట్టను నిర్మించి మట్టిలోనూ మాణిక్యాలు ఉన్నాయని ప్రపంచానికి చాటగలిగారు. ప్రపంచ సాంకేతిక లోకమే అబ్బురపడేలా అత్యధిక ఎత్తు, నిడివి గల ఈ డ్యాంను పూర్తిగా రాతితో నిర్మించారు. పుష్కరకాలం పాటు కార్మికులు, ఇంజినీర్లు నిర్విరామంగా చేసిన కృషి ఫలితంగా 1969 నాటికి డ్యాం నిర్మాణం పూర్తయింది. ప్రధాన డ్యాం ఇరుపక్కలా రెండు ఎర్త్డ్యాంలు నిర్మించారు. దేశంలోని మేషనరీ డ్యాంలలో ఇది రెండవది. 590 అడుగుల ఎత్తులో ప్రాజెక్టుండగా 110 చదరపుమైళ్ల విస్తీర్ణంలో నీరు నిలబడి ఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణసమయంలో 408.24టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం కల్గి ఉండేలా నిర్మాణం జరిగింది. కాలక్రమేణా పూడిక నిండటంతో ప్రస్తుతం 312.0450 టీఎంసీల నీరు నిల్వ ఉంటోంది. 1955 సంవత్సరం డిసెంబర్10న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా 12 సంవత్సరాల కాలంలో ఒక కొలిక్కి వచ్చింది. 45 వేలమంది శ్రామికులు 24 గంటలు తమ శ్రమను ధారపోసి శ్రమైక సౌందర్యానికి ప్రతీకగా సాగర్ ప్రాజెక్టును నిలిపారు. ఆనాడు పెద్దరాళ్లను సైతం క్యావింజర్లు ఎత్తుకొని డ్యాం పైవరకు వెళ్లేవారు. 1967లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. అనంతరం 1974లో క్రస్ట్గేట్ల నిర్మాణం పూర్తయింది. ఆనాటి ఇంజినీర్లు ఏలాంటి లాభాపేక్షలేకుండా కేవలం వేతనం కోసమేకాకుండా భారతదేశం అభివృద్ధికోసం పనిచేసేవారని రిటైర్డ్ ఇంజనీర్లు తెలిపారు. నేడు ఉన్నంత సాంకేతిక పరిజ్ఞానం కాని మిషనరీలు కాని ఆనాడు లేవు. కనీసం సమాచారాన్ని అందిపుచ్చు కోవడానికి కూడా నేడున్నన్ని అవకాశాలు లేవు. అయినా ఆనాటి ఇంజినీర్లు బలమైన కోర్కె, పనిచేయాలనే తలంపు దీక్ష ఉండటంతో ప్రాజెక్టును సకాలంలో అంచనా వ్యయంకంటే తక్కువ వ్యయంతో పూర్తిచేశారు. **
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement