-
‘ఇలాంటి వేదన మరెవరికీ రాకూడదు’
సహచర విద్యార్థి దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన చిన్నారి మహ్మద్ ఇబ్రహీం కుటుంబం విషాదం నుంచి ఇంకా తేరుకోలేదు. కొడుకు మృతితో తండ్రి అబ్దుల్ ముజీబ్, తల్లి జరీనాబేగం కన్నీటి పర్యంతం అవుతున్నారు. అన్న ఇక రాడా.. అంటూ ఇబ్రహీం తోబుట్టువులు ఉమర్, అలీజాఫాతిమా అమాయకంగా అడుగుతున్న ప్రశ్నలకు ఆ దంపతులు బదులివ్వలేకపోతున్నారు. టోలిచౌకిలోని ఐఏఎస్ కాలనీలో ఉన్న ప్రామిసింగ్ కాన్సెప్ట్ హైస్కూల్లో ఇదే ప్రాంతంలో నివసిస్తున్న ఆరున్నరేళ్ల మహ్మద్ ఇబ్రహీం ఒకటో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే ఈ నెల 12వ తేదీన స్కూల్కు వెళ్లాడు. అదే పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల విద్యార్థి కోపం పట్టలేక ఇబ్రహీం మర్మాంగంపై మోకాలితో తన్నడంతో ఇబ్రహీం భయంతో అక్కడి నుంచి పరుగులు తీసి బాల్కానీలో దాక్కున్నాడు. అయినాసరే ఆ విద్యార్థి ఆగలేదు. దాక్కున్న ఇబ్రహీంను బయటకు లాగి మూడుసార్లు మోకాలితోనే పొత్తికడుపులో, మర్మాంగాలపైన తన్నాడు. దీంతో ఇబ్రహీం తీవ్ర నొప్పితో అవస్థలు పడుతూనే సాయంత్రం దాకా ఏడుస్తూ మెట్ల కింద కూర్చొని బడి వదిలిపెట్టగానే ఇంటికి వెళ్లి మంచమెక్కాడు. ఏం జరిగిందని తల్లిదండ్రులు ప్రశ్నించగా సీనియర్ విద్యార్థి కొట్టాడంటూ చెప్పడంతో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల13వ తేదీన నీలోఫర్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూనే ఈ నెల 16న ఇబ్రహీం కన్నుమూశాడు. ఈ ఘటనపై తండ్రి ముజీబ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై జాతీయ బాలల హక్కుల కమిషనర్, పాఠశాల విద్యాశాఖ విచారణకు ఆదేశించాయి. అయితే ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా ఇంత వరకు పాఠశాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ ముజీబ్ ప్రశ్నిస్తున్నారు. పాఠశాలను మూసివేయాలని తన కొడుకు మృతికి కారకుడైన విద్యార్థిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం టోలిచౌకిలోని తన నివాసంలో ఆయన జరిగిన ఘటనపై, అధికారుల తీరుపై మండిపడ్డారు. తన కొడుకు మరణానికి పాఠశాల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. పాఠశాల ఆవరణలో ఒక విద్యార్థిని ఇంకో విద్యార్థి తరిమితరిమి కొడుతుంటే ఉపాధ్యాయులు చూడరా అని నిలదీశారు. ఇంత జరిగినా స్కూల్ను ఎందుకు సీజ్ చేయలేదని నిలదీశారు. తక్షణం న్యాయవిచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్ అయింది తప్పితే న్యాయం మాత్రం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్లో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయని ఆరోపించారు. తన కొడుకు జరిగిన దుస్థితి మరొకరికి జరగకుండా ఉండాలంటే స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఘటన జరిగినప్పుడే అధికారులు హడావుడి చేస్తున్నారు తప్ప, స్కూళ్లలో విద్యార్థులకు రక్షణ ఏపాటి ఉందో తెలుసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగకపోతే కమిషనర్ వద్దకు వెళ్తామని అన్నారు. -
'చిన్నారుల కేసు విచారణ వేగం పెంచాం'
హైదరాబాద్: ఇద్దరు మైనర్ విద్యార్థుల ఘర్షణ కేసులో విచారణ ముమ్మరం చేశామని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి యాజమాన్యానికి నోటీసులు ఇస్తామని అన్నారు. విచారణ వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 12న టోలిచౌకి ఐఏఎస్ కాలనీలోని ప్రామిసింగ్ స్కాలర్స్ హైస్కూల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న మహ్మద్ ఇబ్రహీం(6)... మూడో తరగతి విద్యార్థిని చీమిడి ముక్కోడా అని గేలి చేయడంతో ఆ కుర్రాడు తనను టీచ్ చేస్తావా అని మర్మాంగాలపై తన్నాడు. కుప్పకూలిన ఇబ్రహీంను ఇంటికి వెళ్లిన తర్వాత నిలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పురుషాంగం, కడుపు ప్రాంతాల్లో శస్త్రచికిత్సలు చేశారు. కానీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజాము 3 గంటలకు చిన్నారి మరణించినట్టు వైద్యులు తెలిపారు. కారు డ్రైవర్గా పనిచేసే ఇబ్రహీం తండ్రి ముజీబ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
స్కూల్లో చిన్నారుల ఫైట్.. ఒకరి మృతి
- టోలిచౌకీలో ఘటన హైదరాబాద్: హేళనలతో బడిలో చిన్నారుల మధ్య రగిలిన వివాదం దాడులకు కారణమైంది. చివరకు ఒకరి ప్రాణాలను బలిగొంది. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలివి... ఈ నెల 12న టోలిచౌకి ఐఏఎస్ కాలనీలోని ప్రామిసింగ్ స్కాలర్స్ హైస్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న మహ్మద్ ఇబ్రహీం(6)... మూడో తరగతి విద్యార్థిని చీమిడి ముక్కోడా అంటూ గేలి చేశాడు. దీంతో కోపం పట్టలేని ఆ విద్యార్థి... నన్ను టీజింగ్ చేస్తావా అంటూ తరగతి గదిలోనే ఇబ్రహీం మర్మాంగాలపై తన్నాడు. కుప్పకూలిన ఇబ్రహీం... కాసేపటి తరువాత లేచి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే తనకు మర్మాంగాల వద్ద నొప్పిగా ఉందని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాడు. వారు తొలుత పెద్దగా పట్టించుకోలేదు. మరుసటి రోజు ఉదయం చూడగా చిన్నారికి దెబ్బ తగిలినచోట బాగా వాపు వచ్చింది. కంగారెత్తిన తల్లిదండ్రులు ఇబ్రహీంను వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పురుషాంగం, కడుపు ప్రాంతాల్లో శస్త్రచికిత్సలు చేశారు. కానీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజాము 3 గంటలకు చిన్నారి మరణించినట్టు వైద్యులు తెలిపారు. కారు డ్రైవర్గా పనిచేసే ఇబ్రహీం తండ్రి ముజీబ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు స్కూలు యాజమాన్యాన్ని ప్రశ్నించి, వివరాలు తెలుసుకున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
Advertisement