-
కొత్తగా పదో తరగతిలో చేరిన విద్యార్థులకు గుడ్న్యూస్..
సాక్షి, ఎడ్యుకేషన్: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పదో తరగతి జాయిన్ అయిన విద్యార్థులకు ఎడ్యుకేషన్.సాక్షి.కామ్ అందిస్తున్న సువర్ణావకాశం. కొత్తగా చేరిన విద్యార్థులకు ఈవిధంగా సందేహాలు ఉండోచ్చు. పదో తరగతి సిలబస్ ఎలా ఉంటుంది..? స్టడీమెటీరియల్ ఎక్కడ దొరుకుంది.? టెక్ట్స్ బుక్స్ కావాలంటే ఎలా..? పబ్లిక్ పరీక్షల మోడల్ పేపర్స్, ప్రివియస్ పేపర్స్ ఎక్కడ అందుబాటులో ఉంటాయి..? పదో తరగతి తర్వాత బెస్ట్ కెరీర్ ఎంచుకోవడం ఎలా..? ఎలా చదవాలి? ప్రిపరేషన్ ఎలా ప్రారంభించాలి? ...ఇంకా ఇలాంటి ఎన్నో సందేహాలు సరైన సమాధానం ఇచ్చే సరైన వేదిక education.sakshi.com. పైన సంబంధించిన తాజా పూర్తి క్వాలిటీ సమాచారం ఉచితంగా ఎడ్యుకేషన్.సాక్షి.కామ్లో అందుబాటులో ఉంది. ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు మోడల్ పేపర్స్, స్టడీమెటీరియల్, గైడెన్స్ మొదలైనవి ప్రిపేర్ చేశారు. అలాగే గైడెన్స్ వీడియోలు, తాజా టెన్త్ క్లాసు సమాచారం కూడా ఈ కొత్త వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే education.sakshi.comలో మీకు కావాల్సిన సమాచారం తెలుకోండి. ఏపీ పదో తరగతి స్టడీమెటీరియల్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రివియస్ పేపర్స్,కెరీర్ గైడెన్స్, ప్రిపరేషన్ టిప్స్ మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి తెలంగాణ పదో తరగతి స్టడీమెటీరియల్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రివియస్ పేపర్స్,కెరీర్ గైడెన్స్, ప్రిపరేషన్ టిప్స్ మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి -
టెన్త్ పరీక్షల మార్కుల నమూనా పత్రాలు ఇవే
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విభాగాల వారీగా ప్రశ్నల సంఖ్య, మార్కుల విధానాలను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ ఏ.సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి నమూనా పత్రాలను విడుదల చేశారు. నాలుగు పేపర్ల నమూనా పత్రాలను బోర్డు వెబ్సైట్లో పొందుపరిచినట్లు వివరించారు. గతంలో 11 పేపర్లకు ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించగా ఈసారి 6కి కుదించిన సంగతి తెలిసిందే. ఇందులో నాలుగు పేపర్ల మార్కుల నమూనా పత్రాలను విభాగాల వారీగా ప్రకటిస్తున్నామని డైరెక్టర్ పేర్కొన్నారు. మిగతావి కూడా త్వరలోనే వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. -
బట్టీ చదువులకు చెక్!
తెరపైకి కొత్త పద్ధతి - సీసీఈ విధానానికి శ్రీకారం - ఉపాధ్యాయులకు శిక్షణ కెరమెరి : టెస్ట్ పేపర్ కొని వరుసగా నాలుగు మోడల్ పేపర్లు బట్టీ పట్టేస్తే వార్షిక పరీక్షలో ఈజీగా పాసయ్యేవారు. కానీ ఆ పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇక నుంచి విద్యార్థి మేథో సంపత్తి, తార్కిక శక్తిని నిశితంగా పరిశీలించేందుకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆ విధానమే ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవ్య విధానంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ నేపథ్యంతో కథనం. ఇదీ నిరంతర సమగ్ర మూల్యాంకనం పాఠశాలలో జరిగే అభ్యాసన ప్రక్రియలకు, లక్ష్యాలకు, బోధనలకు, ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థి మేథో మథనానికి తోడ్పడే విధానమే నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ). ఈ విధానం నాలుగేళ్లుగా కొనసాగుతోంది. ఈ ఏడాది 9, 10 తరగతులకూ వర్తింపజేశారు. పదో త రగతి పాఠ్యపుస్తకాలు మారడంతో పరీక్ష విధానం కూడా సీసీఈ పద్ధతిలోనే ఉండనుంది. ఇందుకోసం ఉపాధ్యాయులకు కొత్త పాఠ్యపుస్తకాల బోధన విధానం, మూ ల్యాంకనంపై అవగాహన కోసం ఈ నెల 16 నుంచి శిక్ష ణ ఇస్తున్నారు. ప్రతీ సబ్జెక్టులో నిర్మాణాత్మక మూల్యాం కనం (ఫార్మెటీవ్ అసిస్మెంట్) ద్వారా ఏడాదిలో నాలు గు సార్లు లఘు పరీక్ష పెడుతారు. ఇక సంగ్రాహనాత్మక మూల్యాంకనమంటే విషయావగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, సమాచార సేక రణ, ప్రాజెక్టు పనులు, విలువలు, మొదలగు విద్యాప్రమాణాలను అనుసరించి ఏడాదికి మూడు సార్లు పరీక్ష నిర్వహించే విధానం. ఇందులో విద్యార్థి ప్ర శ్నలు ఆలోచించి రాయాల్సి ఉంటుంది. ఈ విధానంలో పుస్తకంలో ఉన్న ప్రశ్నలను నేరుగా ఇవ్వరు. అలాగే ఒకసారి ఇచ్చిన ప్రశ్న రెండోసారి పునారావృతం కాదు. మార్కుల విధానం.. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగానే ఈ ఏడాది 9, 10 తరగతులకు 100 మార్కులకు బదులు 80 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. మిగిలిన 20 మార్కులు విద్యార్థుల జ్ఞాపకశక్తి, ప్రతిస్పందనలు, రాత అంశాలు, ప్రాజెకు పనులకు సంబంధించి మార్కులు ఉంటాయి. జీవితానికి అన్వయించుకునేలా.. విద్యార్థి పాఠ్యాంశాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని తను నేర్చుకున్న అంశాలను తన జీవితానికి అన్వయించుకునేందుకు ఈ విధానం దోహదపడుతుంది. విద్యార్థులను టీచర్లు కొన్ని కోణాల్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, విషయ పరిశీలన, పరిశోధనా శక్తి మెరుగుపడుతుంది. అయితే 20 మార్కులకు సంబంధించి ఉపాధ్యాయుడు విద్యార్థుల విషయంలో ఎంతో నిశితంగా పరిశీలనతో వ్యవహరించాల్సి ఉంటుంది. - చంద్రశేఖర్, ఉపాధ్యాయుడు, అనార్పల్లి ఆలోచన విధానానికే మార్కులు గత బోధన విధానం ప్రకారం పాఠాల వెనుక ఉన్న నిరంతరం వచ్చే ప్రశ్నలకు సమాధానాలు రాయడమనేది మూస పద్ధతి. కానీ ప్రస్తుత విధానంలో విషయ సంసిద్ధతతో ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్లాలి. గణితంలో ప్రస్తుతం సమస్యకు సంబంధించిన సూత్రాలు కూడా ఉపాధ్యాయులే విద్యార్థుల ద్వారా రాబట్టాల్సి ఉంటుంది. అందువల్ల విద్యార్థుల ఆలోచన శక్తి పెరిగేలా ఉపాధ్యాయుడు ఎంతో చొరవ చూపాలి. - తిరుపతి, ఉపాధ్యాయుడు, గోయగాం నిశిత పరిశీలన అవసరం ఈ విధానం మేథోసంపత్తి ఉన్న నేటి తరం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో కీలకం. పాఠశాల వెలుపల, లోపల విద్యార్థులను నిశితంగా పరిశీలించాలి. ఇంతకు ముందులా నోట్స్, గైడ్స్ ఉండవు. తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకున్న దానిని తన మేథో ఆధారంగా రాయాల్సి ఉంటుంది. దీని వల్ల విద్యార్థిలో ఉన్న జ్ఞానం వెలికి వచ్చి ఒక ప్రశ్నకు ఒక్కో విద్యార్థి ఒక్కో రీతిలో సమాధానమిస్తాడు. ఇది విద్యార్థి తార్కిక ఆలోచనకు, పరిశోధన శక్తికి దోహదపడుతుంది. - ఆర్.రమేశ్, ఉపాధ్యాయుడు, కెరమెరి
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement