breaking news
mlc results
-
జైమల్లన్న, జై రాకేశ్రెడ్డి, ఐ లవ్యూ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓటు వేసే సమయంలో కొందరు అత్యుత్సాహంతో నినాదాలు రాయగా, ఇంకొందరు ఇతర అభ్యర్థుల ఫొటోలు నలిపేయడం, బ్యాలెట్ పేపరు వెనుక అంకెలు వేయడం, మరికొందరు ఐలవ్యూ అంటూ రాశారు. చెల్లని ఓట్లు 7.69 శాతం వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఉప ఎన్నికలో పోలైన ఓట్లలో 7.69% ఓట్లు చెల్లలేదని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 4, 63,839 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. వారిలో 3,36,013 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. కొందరి అవగాహన రాహిత్యం, అత్యుత్సాహం కారణంగా 25, 824 వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. 3,10,189 చెల్లిన ఓట్లుగా అధికారులు ప్రకటించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి రౌండ్లో అధిక సంఖ్యలో చెల్లుబాటుకాని ఓట్లు బయటపడ్డాయి. కొందరు తొలి ప్రాధాన్యత ఓట్లు వేయకుండా ఇతర ప్రాధాన్యత ఓట్లు వేయడం, టిక్కులు పెaట్టడం చేశారు. బ్యాలెట్ పేపరుపై ఇష్టానుసారంగా రాతలు బ్యాలెట్పేపర్లపై ప్రాధాన్యతక్రమంలో అంకెలు మాత్రమే వేయాలి. ఇతర ఎలాంటి రాతలు రాయొద్దని ఎన్నికల అధికారులు పలుమార్లు చెప్పారు. అయినా అవేమీ పట్టించుకోకుండా బ్యాలెట్ పేపర్లపై కొందరు జైమల్లన్న, జైరాకేశ్రెడ్డి అంటూ రాశారు. ఓ పట్టభద్రుడైతే బ్యాలెట్ పేపర్లో ఉన్న అభ్యర్థి ఫొటో కట్ చేసుకుపోయాడు. మరికొందరు పట్టభద్రులు బ్యాలెట్ పేపర్ వెనుక అంకెలు వేయగా, మరికొందరు మొదటి ప్రాధాన్యత ఓటు వేయకుండా రెండో ప్రాధాన్యత ఓటు వేశారు. కొందరు పట్టభద్రులు ఒక అడుగు ముందుకేసి ఐలవ్యూ అంటూ రాసినట్టు తెలిసింది. -
ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న..
-
'100 కోట్లతో ప్రజాప్రతినిధుల కొనుగోలు'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి విమర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులను రూ. 100 కోట్లు వెచ్చించి కోనుగోలు చేసి.. ఎమ్మెల్సీ స్థానాలను చంద్రబాబు కైవసం చేసుకున్నారని ఆయన విమర్శించారు. గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేశారని, ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని భూమన మండిపడ్డారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో దుష్టపాలన కొనసాగుతుందని, ఆయన దురాగతాలు ఎక్కువకాలం కొనసాగవని భూమన అన్నారు. -
ప్రలోభాలతో విజయం సాధించారు
అమరావతి: ప్రజల తీర్పుతో గెలిచినటువంటి వాళ్లను అధికార బలంతో ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. టీడీపి అక్రమంగా సాధించిన ఈ విజయంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలెవరూ అసంతృప్తికి గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందో బేరీజు వేసుకొని ముందుకెళ్తామని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ధైర్యముంటే వైఎస్ఆర్ సీపీ నుంచి టీడీపీలో చేరిన వారితో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ క్యాంపులు పెట్టి.. పోలీసుల సహాయంతో నాయకులను ఇళ్ల నుంచి తీసుకెళ్లారని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. చెక్కులు ఇచ్చి మత పెద్దల వద్ద ప్రమాణాలు చేయించుకొని గెలిచారని, అసలు ఇది గెలుపే కాదని ఆయన విమర్శించారు. -
ప్రలోభాలతో విజయం సాధించారు
-
టీఆర్ఎస్ అహంకారానికి చెంపపెట్టు
సాక్షి, హైదరాబాద్: అధికార దుర్వినియోగం, అప్రజాస్వామిక విధానాలు, ప్రజా ప్రతినిధులను బెదిరించడం, బ్లాక్మెయిల్ వంటి చర్యలకు పాల్పడుతున్న టీఆర్ఎస్కు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టువంటివని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. నల్లగొండ, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకున్న నేపథ్యంలో బుధవారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల కోటా నుంచి మూడు స్థానాలకు పోటీచేసిన కాంగ్రెస్పార్టీ రెండు స్థానాలను గెలుచుకుందన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం టీఆర్ఎస్ పార్టీ అన్ని అడ్డదారులను తొక్కి, అప్రజాస్వామికంగా వ్యవహరించిందని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విషసంస్కృతిని రాష్ట్ర రాజకీయాల్లోకి తెచ్చి, ప్రతిపక్షాలను లేకుండా చేయాలని ఆ పార్టీ కుట్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు. నల్లగొండ, మహబూబ్నగర్లో విజయంకోసం అధికారపార్టీ అన్ని కుయుక్తులకు, కుట్రలకు పాల్పడిందని ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. ఖమ్మం, రంగారెడ్డిలో టీఆర్ఎస్కు మెజారిటీ స్థానాలు లేకున్నా ఎలా గెలిచిందో ప్రజాస్వామ్యవాదులు అర్థం చేసుకోవాలని కోరారు. టీఆర్ఎస్ గెలుపుకోసం వైఎస్సార్సీపీ పరోక్షంగా పనిచేందని ఆరోపించారు. నల్లగొండలో గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్నగర్లో గెలిచిన దామోదర్రెడ్డిని అభినందించారు. హృదయంలో దాచుకున్నారు: జానా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులు, కుట్రలు, కుయుక్తులకు పాల్పడినా స్థానిక సంస్థల ప్రతినిధులు ధర్మాన్ని హృదయంలో దాచుకున్నారని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి అన్నారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీతో కలసి ఆయన అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్కు బలం లేకున్నా నల్లగొండలో చేయని ట్రిక్కులు, కుయుక్తులు లేవన్నారు. గెలుపుకోసం ప్రజాస్వామ్య విలువలను పట్టించుకోకుండా టీఆర్ఎస్ చాలా అనైతిక పద్ధతులను అవలంభించిందని విమర్శించారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను బెదిరించి, ప్రలోభాలు పెట్టి, బంధుగణాలను అడ్డుగా పెట్టి టీఆర్ఎస్ విజయం కోసం ప్రయత్నాలు చేసిందన్నారు. బలం లేకున్నా గెలుస్తామంటూ ప్రగల్భాలు పలికినవారు, డాంబికంగా పేలినవారు నల్లగొండలో కాంగ్రెస్ విజయంతో ఆత్మవిమర్శ చేసుకోవాలని జానారెడ్డి సూచించారు. గెలుపోటములు సహజమని, అంతిమంగా ప్రజల పక్షాన పరస్పర సహకారంతో పనిచేయాలన్నారు. ‘తెలంగాణ ప్రజల కోరిక ప్రకారం రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్.., కాంగ్రెస్ పార్టీదే భవిష్యత్తు. విలీనం చేస్తామంటూ టీఆర్ఎస్ పార్టీ మాటతప్పింది. తెలంగాణ ఇస్తే మద్దతుగా ఉంటామన్న సంఘాలు కూడా తప్పించుకున్నాయి. అయినా కాంగ్రెస్పార్టీ వెనుకాడలేదు’ అని అన్నారు. కాంగ్రెస్నే గెలిపించారు: షబ్బీర్ ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. నైతిక విలువలను వదిలేసి డబ్బు, అధికారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఓటర్లతో మాట్లాడినా కాంగ్రెస్పార్టీ అభ్యర్థులను ఓటర్లు గెలిపించారని అన్నారు. -
ఎమ్మెల్సీ ఫలితాలు కేసీఆర్కు చెంపపెట్టు
మాజీ మంత్రి డీకే అరుణ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన ఎమ్మెల్సీ ఫలితాలు సీఎం కేసీఆర్కు చెంపపెట్టు లాంటివని, అధికారం ఉందని ఏ పని చేసినా చెల్లుబాటవుతుందన్న ఆయన ధోరణి ఈ ఎన్నికల ఫలితాలతోనైనా మారాలని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నూతన ఎమ్మెల్సీ దామోదర్రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక చోట్ల టీఆర్ఎస్కు గెలిచే సత్తా, సంఖ్యా బలం లేకపోయినా నోట్లు పడేసి ఓట్లు కొనుగోలు చేయొచ్చని ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలిపారని, అయినా ధర్మమే గెలిచిందని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని నల్లగొండ, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపించాయన్నారు. అధికార బలంతో అన్ని పార్టీలను కాలరాయాలని సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నాలను ఈ ఎన్నికల ద్వారా తిప్పికొట్టారన్నారు. -
వ్రతం చెడినా దక్కని ‘ఫలితం’
దేవులపల్లి అమర్ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్న చందంగా మొన్నటి పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాలు వెలువడడంతో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు ఇక ఈ గిమ్మిక్కులతో లాభం లేదని మొత్తం పార్టీనీ, ప్రభుత్వాన్నీ ప్రక్షాళన చేయబోతున్నారని వార్తలు వెలువడినాయి. దీనితో మంత్రులు, నాయకులు, శ్రేణులు కూడా గందరగోళంలో పడ్డారు. ముఖ్యమంత్రి ఇంత తీవ్రమైన మార్పులను ఎందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు? ఎందుకంటే- కౌన్సిల్ ఫలితాలు అధికార పార్టీనీ, నాయకుడినీ పెద్ద షాక్కే గురి చేశాయి కాబట్టి. తెలంగాణకు మారుపేరు టీఆర్ఎస్, సుదీర్ఘ పోరాటాల కారణంగా సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్కు తప్ప మరొక పార్టీకి స్థానం లేదనీ, గులాబీ రంగు తప్ప మిగతా రంగులన్నింటినీ తెలంగాణ ప్రకృతిలో నుంచి తొలగిస్తామనీ ఈ పదినెలల కాలం ఉపన్యాసాలతో ఊదరగొట్టిన అధికార పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. గతవారం జరిగిన శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్ఎస్కు మింగుడు పడకపోవడంలో ఆశ్చర్యం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మహ బూబ్నగర్ జిల్లాలకు కలిపి ఉన్న నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, న్యాయవాది రామచందర్రావు సాధించిన ఆధిక్యం ఆ పార్టీ సహా, అన్ని రాజకీయ పార్టీలను ఆశ్చర్యచకితులను చేసింది. ఎందరినో సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అధికార పార్టీకి మాత్రం తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది. రామచందర్రావు సాధించిన ఆధిక్యం ఓ పక్క బాధపెడుతుం టే, మరో పక్క నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు కలిపి ఉన్న నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలిచిన తీరు కుంగ దీసింది. ఏమిటీ అధిక ప్రసంగం? ఈ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రీ, ఆయన కుమారుడూ, ఇతర నాయ కులూ బోలెడు మాట్లాడారు. ప్రతిపక్షాలు లేనేలేవన్నారు. ముఖ్యమంత్రి మరింత ముందుకుపోయి బీజేపీకి ఓట్లు వేస్తే మోరీ (మురుగు కాలువ)లో వేసినట్టేనన్నారు. ఆయన కుమారుడు, కేటీ రామారావు తెలంగాణ ప్రజలకు పసుపు వర్ణం శుభసూచకమే కాదంటారు. అది తమకు గిట్టని తెలుగుదేశం జెండా రంగన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ను ఓడించిన బీజేపీ అభ్యర్థి అదే పసుపు జెండా నీడన ప్రచారం చేసి గెలిచారు మరి! సాధ్య మైతే సప్తవర్ణాలలో తమ పార్టీ జెండా రంగు గులాబీ లేదు కాబట్టి ఆ ఏడు రంగులనూ నిషేధిస్తాను అన్న ధోరణి ఆయనది. తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు నుంచే, నిజానికి ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టక ముందే పసుపు రంగు ఉందనీ, ఎరుపు రంగును కమ్యూనిస్టులు కనుగొనలేదనీ అలాగే గులాబీ రంగు చంద్రశేఖరరావు పరిశోధనలో బయటపడింది కాదనీ యువనాయకుడికి ఎవరు చెప్పాలి? ఈ వింత ధోరణి సుదీర్ఘ రాజకీయ భవి ష్యత్తు కలిగిన కేటీఆర్ వంటి యువనేతకు ఉండడం విచారకరం. పైగా రేపో మాపో పార్టీపగ్గాలు ఆయనకే అప్పగించనున్నారనే వార్త చలామణిలో ఉంది. ఇక ప్రస్తుతం శాసనమండలి ఎన్నికల విషయానికి వస్తే - ఫలితాలు వెలువడ్డాక అధికార పక్షీయుల మాట పడిపోయింది. ఫలితాల మీద స్పందిం చిన కొద్ది మంది, అభ్యర్థి దేవీప్రసాదరావు సహా, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఫలి తం అనడానికి లేదన్నారు. మొదట్లో చెప్పుకున్నట్టు, తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి స్థానం లేదని ఈ పదిమాసాలూ అధికార పార్టీ బెదిరించి, విపక్షాలను ఖాళీ చేసే పనిలో పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినన్ని స్థానాలను ఎన్నికలలో సాధించుకున్నప్పటికీ, సంతృప్తి చెందని అధికార పార్టీ, దాని అధిపతీ స్వయంగా వలసలను ప్రోత్స హించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి శాసనసభ్యులను, శాసన మండలి సభ్యులను తమ పార్టీలోకి లాక్కున్నారు. నైతికత గురించి మాట్లా డిన వారిని తెలంగాణ వ్యతిరేకులని ముద్రవేశారు. వారంతా బంగారు తెలం గాణ నిర్మాణంలో భాగస్వాములు కావడానికి స్వచ్ఛందంగా చేరినవారేనని ప్రచారం చేశారు, ప్రకటనలు ఇప్పించారు. ప్రక్షాళనే మార్గమా? వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్న చందంగా మొన్నటి పట్టభద్రుల నియోజక వర్గ ఫలితాలు వెలువడడంతో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు ఇక ఈ గిమ్మిక్కులతో లాభం లేదని మొత్తం పార్టీనీ, ప్రభుత్వాన్నీ ప్రక్షాళన చేయ బోతున్నారని వార్తలు వెలువడినాయి. దీనితో మంత్రులు, నాయకులు, శ్రేణు లు కూడా గందరగోళంలో పడ్డారు. ముఖ్యమంత్రి ఇంత తీవ్రమైన మార్పు లను ఎందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు? ఎందుకంటే- కౌన్సిల్ ఫలితాలు అధికార పార్టీనీ, నాయకుడినీ పెద్ద షాక్కే గురి చేశాయి కాబట్టి. టీఆర్ఎస్ రంగంలో దింపిన ఇద్దరు అభ్యర్థులు చిన్నాచితకా నాయకులు కారు. దేవీప్రసాదరావు మలిదశ ఉద్యమంలో రాజకీయ జేఏసీలో కీలక నాయకుడు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకగా నిలబడిన తెలంగాణ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు. రెండవ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి 2014 ఎన్నికలలో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. అధిష్టా నానికి అత్యంత సన్నిహితుడు. మొత్తం పార్టీ వ్యవస్థలన్నింటినీ రద్దు చేసి పల్లాయే అధ్యక్షునిగా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసేటంత సన్నిహితుడు. అంటే మొన్న కౌన్సిల్ ఎన్నికలలో పోటీ చేసే నాటికి అధికార పార్టీ పెద్ద దిక్కు ఆయనే. అటువంటి ఇద్దరు ప్రముఖులను బరిలోకి దింపితే ఎదురైన ఫలితం చంద్రశేఖరరావును దిగ్భ్రాంతికి గురి చేయడంలో ఆశ్చర్యం ఏముంది? ఈ రెండు కౌన్సిల్ స్థానాలను గెలుచుకోవడానికి ఆయన ఎన్నెన్ని ప్రకటనలు చేశారు? ‘సెటిలర్’ అన్న పదమే తెలంగాణలో వినిపించడానికి వీలులేదని హఠాత్తుగా ప్రకటించినా అంతా నమ్మేస్తారని కూడా ఆయన అనుకున్నారు. అదీ జరగలేదు. రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి ఐదు గంటలు గడిపినా, రామా నాయుడి అంత్యక్రియలు అధికారికంగా జరిపించినా అందులో ఆ వర్గాల వారు చిత్తశుద్ధిని చూడలేదు. ఓటమి వెనుక.. ఎదురేలేదని టీఆర్ఎస్ గట్టి నమ్మకంతో ఉన్న కాలంలో ఇటువంటి ఫలితం రావడానికి కారణం ఏమిటి? అందుకు బోలెడు కారణాలు ఉన్నాయి. కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు. మరీ దీర్ఘంగా కాకుండా ముఖ్యమైన కారణాలను చెప్పుకుందాం! మొదటిదీ, ముఖ్యమైనదీ - మితిమీరిన ఆత్మ విశ్వాసం. పార్టీలోనే జరిగిన అంతర్గత వెన్నుపోటు. మాటలు తప్ప చేతలేమీ లేవన్న పట్టభద్రుల ఆగ్రహం (వీరిలో ఉపా ధ్యాయులు, నిరుద్యోగులు కూడా ఉన్నారు). బీజేపీ ముందు నుంచే అభ్యర్థిని నిర్ణయించి ప్రచారం చేయడం. అన్నింటికీ మించినది- అధికార పార్టీ సృష్టిస్తున్న గందరగోళం, దానితో బలౌతున్న నైతికత. ఒకటి పోయినా మరొకటి గెలిచాం కదా అని అధికార పక్షం వాదించ వచ్చు. అది ఎటువంటి గెలుపో ఒకసారి సమీక్షించుకుంటే అర్థమవుతుంది. ఇంత పెద్ద రాజకీయ వ్యవస్థను నడుపుతున్న నాయకత్వం ఆ పని ఇప్పటికే చేసి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఒక నిర్దిష్టమైన లక్ష్య సాధన కోసం ఏర్పడిన పోరాట సంస్థ. అవసరం కాబట్టి రాజకీయ రూపం, నిర్మాణం సంత రించుకున్నది. లక్ష్యాన్ని సాధించి అధికారంలోకి వచ్చింది. సంపూర్ణ రాజకీయ పార్టీగా మారింది, కాబట్టి బలోపేతం కావలసిందే. కానీ గెలుపే పరమావధి, ఇంకో పార్టీని బతకనివ్వం అన్న ధోరణిని ప్రజాస్వామ్యంలో జనం మెచ్చరు. ఆ విషయాన్ని స్పష్టం చేయడానికే ప్రజలు ఈ ఫలితం ఇచ్చారు. ముందున్నది ముసళ్ల పండుగ అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ఏదో రెండు కౌన్సిల్ స్థానాల ఎన్నికలే కదా అని ఊరుకోవడానికి వీలు లేదు. ముందున్నది ముసళ్ల పండుగ. కాం గ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి వలస వచ్చిన శాసన సభ్యుల స్థానాలకు ఏదో ఒకరోజు ఎన్నికలు జరగవలసిందే. అలాంటివి పది వరకు ఉంటాయి. ఉప ముఖ్యమంత్రిగా తీసుకున్నాక కడియం శ్రీహరి ప్రాతి నిధ్యం వహిస్తున్న వరంగల్ పార్లమెంట్ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరపక తప్పదు. కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులను అడిగి చూడండి, ఈసారి ఏం చెయ్యబోతున్నారో! తుమ్మల నాగేశ్వరరావును మంత్రిగా కొనసాగిం చడానికి ఎక్కడి నుంచి గెలిపిస్తారో? నిన్నగాక మొన్న పలు కౌన్సిల్ స్థానాలు కూడా సభ్యుల పదవీకాలం పూర్తికావడంతో ఖాళీ అయ్యాయి. వీటన్నిటి కన్నా ముఖ్యమైనది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. ఓ పక్క హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంది, ఎప్పుడు ఎన్నికలు పెడతారని! ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మరో ఎన్నిక వరం గల్ మునిసిపల్ కార్పొరేషన్. ఉద్యమకాలంలో రాజీనామాలు పడేసి మళ్లీ పోటీచేస్తే ప్రజలు గెలిపించారు, ఎన్నిసార్లయినా. రాష్ట్రం ఏర్పడుతున్న సం దర్భంలో జరిగిన తొలి ఎన్నికలలో సుదీర్ఘ పోరాటం చేసి సాధించినందుకు గెలిపించారు ప్రజలు. ఎల్లకాలం ఇదే విధంగా సాగుతుందని అధికార పక్షం భావిస్తే పప్పులో కాలేసినట్టే. అందుకు సంబంధించిన వ్యక్తీకరణే ఈ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు. కానీ, తెలంగాణ పున ర్నిర్మాణంలో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఎన్నికలూ, వాటితో వచ్చే పదవులూ పరమార్థం కాదు. datelinehyderabad@gmail.com