-
హోదాపై చంద్రబాబుది పూటకో మాట
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. నాలుగేళ్లుగా చంద్రబాబు పరిపాలన అంతా అవినీతిమయంగా మారిందని ధ్వజమెత్తారు. కేవలం రెండు ఎకరాల ఆసామి అయిన చంద్రబాబుకు లక్ష వేల కోట్ల రూపాయలు ఎక్కడినుండి వచ్చాయో చెప్పాలని నిలదీశారు. శనివారం కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతూ.. ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటులో వైఎస్ఆర్సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దత్తు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. బీజేపీతో కాపురం చేసి 24 సార్లు ఢిల్లీకి వెళ్ళానని చెప్తున్న చంద్రబాబు ఏం సాధించాడో ప్రజలకు చెప్పాలన్నారు. నాలుగేళ్లు గడిచినా ఒక్క నిరుద్యోగికైనా చంద్రబాబు ఉద్యోగం కల్పించారా అని ప్రశ్నించారు. శేఖర్ రెడ్డికి, లోకేష్ బాబుకు మధ్య ఏం సంబంధం ఉందో చంద్రబాబు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. శేఖర్ రెడ్డిని అడ్డుపెట్టుకొని లోకేష్ వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం సోమవారం పార్లమెంటులో చేపట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ప్రజలతో మమేకమై ప్రజాసంకల్ప మానవహారం చేపట్టబోతున్నామని ఐజయ్య వెల్లడించారు. -
ఎమ్మెల్యేపై పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్: కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ఎస్సీ కాదంటూ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఐజయ్య ఎస్సీ కులానికి చెందిన వారు కాదంటూ, తప్పుడు పత్రాలు సృష్టించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడంటూ పిటిషన్లో గుంపుల రవికుమార్ అనే వ్యక్తి పేర్కొన్నాడు. అయితే కేసు విచారణకు వచ్చే సమయానికి గుంపుల రవి కుమార్ అనారోగ్యంతో మృతిచెందడంతో కేసును న్యాయమూర్తి కొట్టేశారు. -
ఆంధ్రజ్యోతికి బాగా అలవాటైపోయింది..
కర్నూలు : ఆంధ్రజ్యోతి దినపత్రికపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ఎమ్మెల్యేలను వైఎస్ జగన్ అవమానించారనడం అవాస్తవమని ఆయన గురువారమిక్కడ అన్నారు. మేం వేసిన రోడ్లపై నడుస్తూ, మేం ఇచ్చిన పెన్షన్లు తీసుకుంటూ, మాకు ఓటు వేయరా అని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడినప్పుడు ఎల్లో మీడియా ఎందుకు స్పందించలేదని ఐజయ్య సూటిగా ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై బురద చల్లడం ఆంధ్రజ్యోతికి బాగా అలవాటైందని ఆయన ధ్వజమెత్తారు. బీరు హెల్దీ డ్రింక్ అని మంత్రి జవహర్ మాట్లాడినా...ఎల్లో మీడియా ఎందుకు పట్టించుకోలేదని గుర్తు చేశారు. కాగా రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ పరిచయ కార్యక్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై ఆగ్రహం ప్రదర్శించారంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో బుధవారం ఓ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. -
కాంట్రాక్టర్ల కోసమే హంద్రీనీవా విస్తరణ పనులు
- నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య పగిడ్యాల: కాంట్రాక్టర్లను బతికించడానికే రూ. 1000 కోట్లతో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ విస్తరణ పనులను టెండర్లు పిలిచారని నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య ఆరోపించారు. సోమవారం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రమాదేవి స్వగృహంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హంద్రీనీవా కాలువకు సంబంధించి పిల్ల కాలువలు, నీటి కుంటలు, తూములు ఏర్పాటు చేయకుండా విస్తరణ పనులు చేసి పలమనేరుకు నీరు తరలించాలని చూస్తే సహించబోమన్నారు. విస్తరణ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. రెండు పంప్లను పూర్తి చేయించి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేయడంలోని ఆంతర్యమేమిటో చెప్పాలన్నారు. జూన్ ఒకటో తేదీన నందికొట్కూరు పట్టణం అక్షర శ్రీ పాఠశాలలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఫ్లీనరీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. టీడీపీ మోసాలను ప్రజల ముందు ఉంచి పలు తీర్మానాలను చేస్తామన్నారు. టీడీపీ మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులైన హరికృష్ణ, బాలకృష్ణలకు ఆహ్వానించకపోవడం విచారకరమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు.. తన మూడేళ్ల పాలనలో ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు గంగి రవి, రమణారెడ్డి, వెంకటరామిరెడ్డి, భూపాల్రెడ్డి, చిట్టిరెడ్డి, కిరణ్రెడ్డి, డీలర్ నారాయణ, పక్కిరెడ్డి, ఇస్మాయిల్, నరసింహులు, బోయ జయరాముడు తదితరులు పాల్గొన్నారు. -
‘ఆయన హత్య వార్త విని దిగ్భ్రాంతి చెందా’
కర్నూలు: ‘నిన్ననే నారాయణరెడ్డి ఆప్యాయంగా పలకరించారు. 30న జరగనున్న వైఎస్పార్ సీపీ ప్లీనరీ గురించి చర్చించారు. ఇవాళ ఆయన హత్య వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాన’ని వైఎస్సార్ సీపీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేయడాన్ని ఆమె ఖండించారు. రాజకీయ పార్టీ నాయకుల కదలికలపై పోలీసులకు సమాచారం ఉంటుందని, ఇలాంటి ఘటనలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. నారాయణరెడ్డి మృతి బాధాకరమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యానించారు. చంద్రబాబు అండతోనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆదేశాలతోనే దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. నారాయణరెడ్డి రాబోయే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి అని, అదును చూసి ఆయనను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement