breaking news
mitrivanam
-
మెట్రో జర్నీ అంటేనే భయపడిపోతున్నారు..
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రాకతో ట్రాఫిక్ బాధలు తప్పాయని ఊపిరి పీల్చుకున్న నగరవాసులు... ఇప్పుడు మెట్రో జర్నీ అంటేనే భయపడిపోతున్నారు. అమీర్పేట్ మెట్రో స్టేషన్లో పెచ్చులూడి ఆదివారం ఓ యువతి ప్రాణాలు కోల్పోవడంతో బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర పరిధిలో ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్సిటీ మార్గాల్లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం విదితమే. ఈ రెండు రూట్లలో నిత్యం 3లక్షల మంది జర్నీ చేస్తుండగా... డిసెంబరులో ఎంజీబీఎస్–జేబీఎస్ రూట్లోనూ రాకపోకలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చదవండి: మెట్రో పిల్లర్ కాదు.. కిల్లర్ అయితే ఈ మార్గాల్లో స్టేషన్లలోని సీలింగ్, పిల్లర్లు పెచ్చులూడుతుండడంపై సిటీజనులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో స్టేషన్లు ప్రారంభమైన రెండేళ్లకే ఇలా పెచ్చులూడడం.. నిర్మాణ పనుల్లోని డొల్లతనాన్ని స్పష్టం చేస్తోంది. పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని మెట్రో అధికారులు, ప్రభుత్వ వర్గాలు ఒకవైపు ఎలుగెత్తి చాటుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం దారుణమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో పిల్లర్ల నిర్మాణాన్ని ఎక్కడికక్కడ చేపట్టినప్పటికీ, వాటిపై ఏర్పాటు చేసిన సెగ్మెంట్లు, స్టేషన్లకు ఇరువైపులా పక్షి రెక్కల ఆకృతిలో ఉన్న నిర్మాణాలను ఉప్పల్, మియాపూర్ మెట్రో కాస్టింగ్ యార్డుల్లో సిద్ధం చేసి తీసుకొచ్చి అమర్చారు. అంటే ప్రీకాస్ట్ విధానంలో సిద్ధం చేసిన విడిభాగాలతో మెట్రో స్టేషన్లు రూపుదిద్దుకున్నాయి. ఇక మూడు అంతస్తులుగా పిలిచే ఒక్కో మెట్రో స్టేషన్ నిర్మాణానికి సుమారు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేశారు. ప్లాట్ఫామ్ లెవల్, మధ్యభాగం(కాన్కోర్స్), రహదారి మార్గంలో ఉండే మెట్రో మార్గానికి పైకప్పులను కాంక్రీటు మిశ్రమం, టైల్స్, ఫాల్సీలింగ్ ఇతర ఫినిషింగ్ మెటీరియల్తోతీర్చిదిద్దారు. మెట్రో పిల్లర్లు, పునాదులు, స్టేషన్ల కాంక్రీటు నిర్మాణాల నాణ్యతకు ఎలాంటి ఢోకా లేకపోయినా, పైకప్పులకు అతికించిన టైల్స్, పిల్లర్లు, సెగ్మెంట్ల మధ్యనున్న ఖాళీ ప్రదేశాలను పూడ్చిన కాంక్రీటు మిశ్రమం రైళ్లు రాకపోకలు సాగించినపుడు, భారీ వర్షాలు కురిసినపుడు ఊడిపడుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలోనూ అమీర్పేట్ మెట్రో స్టేషన్లో భారీ ఈదురు గాలులకు ఫాల్సీలింగ్ మెటీరియల్ ఎగిరిపడడం సంచలనం సృష్టించింది. కాగా ఆదివారం జరిగిన సంఘటన నేపథ్యంలోని నగరంలో మూడు మార్గాల్లో ఉన్న 64 స్టేషన్లలో ఇలాంటివి పునరావృతం కాకుండా నిపుణుల బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేపడతామని హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. -
నావన్నీ కోతి పనులే..
హిమజ, యాంకర్, నటి విజయవాడలో అమ్మమ్మ వాళ్లింట్లో పుట్టాను. చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే పెరిగాను. అన్నయ్య మాత్రం అమ్మమ్మ వాళ్లింట్లో పెరిగాడు. నాన్న ఆర్టీసీలో మేనేజర్. అమ్మ హౌస్వైఫ్. నేను చిన్నప్పటి నుంచి చాలా అల్లరి. హాలీడేస్లో అన్నయ్య హైదరాబాద్ రాగానే ఎంతో ఎగ్జైట్ అయ్యేదాన్ని. ఒకసారి అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లినప్పుడు సడన్గా కనిపించకుండా పోయాను. అప్పుడంతా నా కోసం ఊరంతా వెతికారు. ఒకచోట టెంట్ వేసి ఫంక్షన్ చేస్తున్నారు. అక్కడి వరకు వెతుక్కుంటూ వస్తే, అక్కడ దొరికాను. విషయమేమిటంటే, నేను పెద్ద ఫుడీని. ఎక్కడ ఫంక్షన్ జరిగితే అక్కడ వాలిపోయేదాన్ని. చదువు విషయానికొస్తే, లాస్ట్ బెంచర్స్ వరస్ట్ బ్యాచ్కి లీడర్ని. క్లాస్రూమ్ లో అందరి బాక్సుల్లోని లంచ్ కొంచెం కొంచెం తినేసేదాన్ని. స్పోర్ట్స్లో కబడ్డీ, టెన్నికాయ్ చాలా ఇంటరెస్ట్. చిన్నప్పుడు.. ఆదిత్య 369లో లాగా ఒక టైమ్ మెషిన్ తయారు చేసేయాలని అనుకునేదాన్ని. అయితే, నావన్నీ కోతి పనులే కదా! మా ఇంటి చుట్టుపక్కల ఎవరి పెళ్లి బారాత్ జరిగినా, తీన్మార్ బ్యాండు వినిపిస్తే చాలు, వెంటనే డ్యాన్స్ చేయడానికి వెళ్లిపోయేదాన్ని. ఇంట్లో చెప్పకుండా ఆడిషన్కి వెళ్లా.. ఎంబీఏ వరకు చదివి అమీర్పేటలోని మైత్రీవనంలో జావా, ఒరాకిల్ వంటి కోర్సులన్నీ చేశా. నాకు నటనంటేనే ఇంట్రెస్ట్. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా..ఓసారి మయూరి ఆఫీసుకి వెళ్లి ఆడిషన్ ఇచ్చి వచ్చాను. రెండు రోజుల్లోనే ఫోన్ కాల్.. ‘భార్యామణి’ సీరియల్లో హీరోయిన్గా సెలక్ట్ అయ్యానని.. అలా స్వయంవరం సీరియల్లో, టీవీ షోస్లో అవకాశాలు వచ్చాయి. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్లో లీడ్ రోల్ చేస్తూ, ‘ద బెస్ట్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ది ఇయుర్-2014’గా ఎంపికయ్యాను. తాటాకు టపాకాయలు కాల్చేదాన్ని.. మేం హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఎల్బీ నగర్లో ఉండేవాళ్లం. దీపావళికి తాటాకు టపాకాయలు బాగా కాల్చేదాన్ని. ఇప్పుడు నన్ను చూసుకుని మా పేరెంట్స్ ఎంతో గర్వపడుతున్నారు. సంప్రదాయంగా ఉండటానికే ఇష్టపడతాను. సాయిబాబాను అనుక్షణం నమ్ముతాను. నా డ్రెసెస్ నేనే డిజైన్ చేసుకుంటాను. ఇక హైదరాబాద్ సిటీ అంటే, నాకు నా తండ్రి అంత భరోసా. యాక్టింగ్కి, కెరీర్కి హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ అని భావిస్తాను. - చల్లపల్లి శిరీష