-
రాష్ట్రంలో 71 కొత్త పురపాలికలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 71 పురపాలిక సంస్థలు ఏర్పాటు కానున్నాయి. 173 గ్రామ పంచాయతీలు/ఆవాస ప్రాంతాలను విలీనం చేయడం ద్వారా ఈ 71 చిన్న పట్టణ ప్రాంతాలు ఏర్పాటవుతున్నాయి. వీటితోపాటు రాష్ట్రంలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లోకి మరో 136 గ్రామాలు/గ్రామాల్లోని భాగాలను విలీనం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం, మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, జీహెచ్ఎంసీ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ.. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బుధవారం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారు. గత సాంప్రదాయానికి భిన్నంగా స్థానిక ప్రజల అభిప్రాయంతో, గ్రామ పంచాయతీల తీర్మానంతో పనిలేకుండా.. నేరుగా కొత్త పురపాలికల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న పురపాలికల్లో గ్రామాలు/ఆవాసాలను విలీనం చేసేందుకు వీలుగా సవరణలు చేపడుతున్నారు. 144కు పెరగనున్న పురపాలికలు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం జూలై 31తో ముగియనుండడంతో ఆలోపే పురపాలక చట్టాల సవరణలు పూర్తిచేసి.. కొత్త పురపాలికల ఏర్పాటుకు రంగం సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు ఆగమేఘాల మీద కసరత్తు పూర్తి చేసి.. తాజాగా శాసనసభలో సవరణ బిల్లులు ప్రవేశపెట్టింది. కొత్తగా ఏర్పాటుచేసే 71 మున్సిపాలిటీలు, న్యాయ వివాదాల్లో ఉన్న మరో ఏడు మున్సిపాలిటీలు, ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేసే 136 గ్రామ పంచాయతీల పేర్లను ఆయా చట్టాల్లో చేర్చనుంది. ఈ బిల్లులకు గురువారం రాష్ట్ర శాసనసభ ఆమోదం లభించే అవకాశముంది. కొత్త పురపాలికలుగా ఏర్పాటవుతున్న, ఇప్పటికే ఉన్న పురపాలికల్లో విలీనమవుతున్న గ్రామ పంచాయతీల పాలక మండళ్ల పదవీకాలం ముగిసిన వెంటనే... వాటికి మున్సిపాలిటీ హోదా అమల్లోకి రానుంది. ఇక జీహెచ్ఎంసీలో కొత్తగా బండ్లగూడ గ్రామ పంచాయతీ విలీనం కానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం జీహెచ్ఎంసీతో సహా 73 పురపాలికలు ఉండగా... కొత్త పురపాలికల ఏర్పాటుతో వాటి సంఖ్య 144కి పెరగనుంది. న్యాయ సమస్యలు లేకుండా.. ఇప్పటికే ఏర్పాటును ప్రకటించిన ఏడు పురపాలికలకు సంబంధించి స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో రెండేళ్లుగా అది అమల్లోకి రాలేదు. ఈ న్యాయ వివాదాన్ని అధిగమించేందుకు ఆ ఏడు మున్సిపాలిటీలైన నకిరేకల్, జిల్లెలగూడ, మీర్పేట్, బొడుప్పల్, పీర్జాదిగూడ, దుబ్బాక, మేడ్చల్లను.. తాజాగా సవరణ బిల్లులలో చేర్చినట్టు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు బిల్లులో రాతపూర్వకంగా తెలిపారు. పట్టణ లక్షణాలు, పట్టణ పరిసరా ల్లో ఉన్న గ్రామాలను జిల్లా కలెక్టర్ల ద్వారా గుర్తించి.. పురపాలికలుగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదు ప్రస్తుత చట్టాల ప్రకారం.. గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా కల్పించడానికిగాని, ప్రస్తుతమున్న మున్సిపాలిటీలో విలీనం చేయడానికిగానీ పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయం బహిరంగ ప్రకటన జారీచేసి.. నిర్ణీత గడువులోగా స్థానిక ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించాలి. ఆ అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి రాత పూర్వకంగా సమాధానాలు ఇవ్వాలి. చివరిగా గ్రామసభ నిర్వహించి మున్సిపాలిటీగా ఏర్పాటు/మున్సిపాలిటీలో విలీనాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కానీ ఇకపై పంచాయతీ తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ వంటి ప్రక్రియేదీ అవసరం లేకుండానే.. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామ పంచాయతీలకు మున్సిపల్ హోదా/మున్సిపాలిటీలో విలీనం వంటివి చేపట్టేలా చట్టాలకు సవరణలు చేస్తున్నారు. -
రామదాసుకు అంతర్జాతీయస్థాయి కీర్తి కోసం కృషి
సాక్షి, నేలకొండపల్లి: రామయ్య పరమ భక్తాగ్రేసరుడు కంచర్ల గోపన్న(రామదాసు)కు అంతర్జాతీయస్థాయిలో కీర్తిని తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక రామదాసు ధ్యాన మందిరంలో భక్త రామదాసు జయంత్యుత్సవాలను ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం రామదాసు ధ్యాన మందిరం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రసంగించారు. ఈ మందిరం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గత ఏడాది మాట ఇచ్చారని, దానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. భక్త రామదాసు ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసినట్లే ఆయన స్మృతి భవనాన్ని కూడా త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రామదాసు వంటి మహనీయుడి చరిత్రను ప్రపంచమంతా తెలుసుకునేలా ప్రచారం చేయాలని తుమ్మల సూచించారు. ఇక్కడ బౌద్ధ క్షేత్రంతోపాటు బాలసముద్రం చెరువును కూడా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. effort for International glory to Ramadas:Tummala -
‘భగీరథ’ పనుల్లో వేగం పెంచాలి
సాక్షి, మరిపెడ(వరంగల్): మిషన్ భగీరథ పనులను గడువులోగా పూర్తి చేసి ఈనెల 26న ట్రయల్ రన్ చేయాలని భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం ఎదళ్లగుట్ట వద్ద కొనసాగుతున్న మిషన్ భగీ రథ పనులపై శనివారం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ సెక్రటరీ స్మితా సబర్వాల్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 24 వేల పై చిలుకులు గ్రామాలకు శుద్దీచేసిన నీరు అందించాలనే లక్ష్యంతో సీఎం కే సీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అబ్బాయిపాలెం నుంచి పాలకుర్తి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్తో పాటు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలానికి నీటి ని అందించనున్నట్లు ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఇందుకు రూ.1,700 కోట్లు ఖర్చు అంచనా వేసినట్లు తెలిపారు. అయితే అన్నింకంటే ముందుగా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ, నర్సింహులపేట, కురవి, డోర్నకల్ మండలాలకు ఈనెల 15 వరకుభగీర«థ నీరందుతుందన్నారు. ఎదళ్లగుట్ట వద్ద జరుగుతున్న పనులు దాదాపు పూర్తయినట్లు తెలిపారు. గ్రామాల్లో ఏర్పాటు చేయాల్సిన పైపులైన్ పనులు 25 శాతం మాత్రమే మిగిలి ఉన్నాయని, అవి వారం రోజుల్లో పూర్తవుతాయన్నారు. అధికారులపై మండిపాటు.. బొడ్లాడ వద్ద జరుగుతున్న పనుల్లో జరుగుతున్న జాప్యంపై ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావద్దని హెచ్చరించారు. అలాగే పరకాల నియోజకవర్గంలో జరుగుతున్న పనులు ఈనెల 8 వరకు పూర్తి చేస్తామని తెలిపారు. స్టేషన్ఘన్పూర్, ధర్మసాగర్, జనగామలో ఈనెల 30లోగా పూర్తవుతాయని, అయితే ఇక్కడ పైప్లైన్ నిర్మాణంలో జాప్యం జరుగుతోందని ఇది సహించే విషయం కాదని చైర్మన్ మందలించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే వేరే వారిని పెట్టుకుని పనులు చేయించుకుంటామని హెచ్చరించారు. ఏటూరునాగారం వద్ద జరుగుతున్న పనుల్లో ఎలక్ట్రోమెకానిక్ వర్క్స్ ఇంత వరకు పనులు ప్రారంభం కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఈనెల 15 వర కు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు, అధికారులకు చెప్పా రు. జనగామ 180 ఇంట్రా విలేజ్లో పనులు కావాల్సి ఉందన్నారు. యాదాద్రిలో 569 పనులకు 207 పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇవన్ని ఈ నెల 20 వరకు పూర్తిచేస్తామని సమీక్షలో వెల్లడించారు. అధికారులకు స్వాగతం... మరిపెడ శివారులోని ఎస్సీ గురుకులం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలంలో భగీరథ వైస్ చైర్మ న్ వేముల ప్రశాంత్రెడ్డి, సీఎం కార్యాలయ సెక్రటరీ స్మితా సబర్వాల్ దిగారు. ఈ సందర్భంగా వారికి మం త్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే రెడ్యానాయక్ స్వాగతం పలికారు. ఏ రోజు నివేదిక ఆ రోజు ఇవ్వాలి.. ఈనెల 26న మిషన్ భగీరథ ట్రయల్ రన్ చేయాల్సిందేనని సీఎం కార్యాలయం సెక్రటరీ స్మితా సబర్వాల్ అన్నారు. కొంత మంది అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అది సరైందని పద్ధతి కాదన్నారు. అ«ధికారులు సమన్వయంగా పనిచేయాలని ఆమె సూచించారు. ప్రతి రోజు 24 గంటలు పనిచేసి గడువులోగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. రేపటిలోగా ఎప్పటి వరకు పనులు పూర్తి చేస్తారో నివేదిక తీసుకో వాలని సీఎంసీ సురేంద్రరెడ్డికి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం పనుల ను గడువులోగా పూర్తి కాకుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. సమీక్షలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, ప్రభుత్వ సలహదారుడు జ్ఞానేశ్వర్, జనగామ ఇన్చార్జి కలెక్టర్ అనితా రాంచంద్రన్, మహబూబాబాద్ జిల్లా జేసీ దామోదర్రెడ్డి, గుడిపుడి నవీన్, డి.ఎస్ రవిచంద్ర, మిషన్ భగీరథ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మెగా కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
అత్యాధునికంగా సచివాలయం
► బైసన్పోలో గ్రౌండ్స్లో రూ.300 కోట్లతో మూడు అంతస్తుల్లో: తుమ్మల ►మొదటి అంతస్తులో ఒకవైపు సీఎం, మరోవైపు సీఎస్ కార్యాలయాలు ►రెండు, మూడో అంతస్తుల్లో కార్యదర్శులు, ఉన్నతాధికారుల కార్యాలయాలు ►ప్రతిపక్షాలు కాకిగోల ఆపాలంటూ మండిపడ్డ ఆర్ అండ్ బీ మంత్రి సాక్షి,ప్రతినిధి ఖమ్మం: ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా బైసన్ పోలో గ్రౌండ్స్లో రూ.300 కోట్లతో నూతన సచివాలయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టం చేశారు. ప్రస్తుత సచివాలయం పాలనా అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేకపోతోందన్నారు. కొత్త సచివాలయంలో మూడు ఫ్లోర్లు ఉంటాయని, మొదటి ఫ్లోర్లో ఒకవైపు సీఎం కార్యాలయం.. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఉంటుందని చెప్పారు. రెండో ఫ్లోర్లో ప్రభుత్వ శాఖల కార్యదర్శులు ఉంటారని, మూడో ఫ్లోర్లో ప్రభుత్వ శాఖల ప్రధాన అధికారులు ఉంటారని తెలిపారు. బుధవారం ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం లో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భం గా కొత్త సచివాలయ నమూనాను విడుదల చేశారు. ‘‘రక్షణ శాఖ పరిధిలో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్స్పై రాష్ట్ర ప్రభుత్వం అనేకమార్లు కేంద్రంతో చర్చలు జరిపింది. పట్టుబట్టి సాధించుకున్నాం. దీనికి బదులుగా కేంద్రానికి రూ.95 కోట్ల నగదుతోపాటు వారు కోరుకున్నచోట 596 ఎకరాల స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 38 ఎకరాల బైసన్ పోలో గ్రౌండ్స్లో ఆధునిక హంగులతో సచివాలయాన్ని నిర్మిస్తాం’’ అని వివరించారు. ప్రతిపక్షాలది కాకిగోల.. రాద్ధాంతం.. ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాద్ధాంతం చేస్తూ రాజకీయ ప్రయోజనం కోసం పాకులాడు తున్నాయని, ఇప్పటికైనా కాకిగోల ఆపాలంటూ తుమ్మల మండిపడ్డారు. ‘‘సచివాలయాన్ని కూడా కట్టనివ్వబోమంటూ శపథాలు చేస్తున్నారు. పనులను అడ్డుకుని నిర్మాణాలను ఆలస్యం చేయ గలుగుతారేమో కానీ.. వాటిని ఆపే శక్తి ప్రతి పక్షాలకు లేదు. అభివృద్ధిని ఎవరు అడ్డుకున్నా ప్రజలు సహించే పరిస్థితిలో లేరు. ఇప్పుడున్న సచివాలయంలో ఏ సమావేశం నిర్వహించాలన్నా ఇబ్బంది కలుగు తోంది. కలెక్టర్ల సదస్సు, కేబినెట్ సమావేశాలను హోటళ్లను అద్దెకు తీసుకుని నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొత్త సచివాలయంలో ఆధునిక హంగులతో పూర్తిస్థాయి సమావేశ మందిరాన్ని నిర్మిస్తాం’’ అని తెలిపారు. కాళేశ్వరం, భద్రాద్రి పవర్ ప్లాంట్, యాదాద్రి నిర్మాణాలను ఆపేందుకు యత్నించి ప్రతిపక్షాలు విఫలమయ్యాయన్నారు. -
'గ్రీన్ డే'లో పాల్గొన్న తుమ్మల, ఇంద్రకరణ్
పెగడపల్లి: రాష్ట్ర ప్రభుత్వ పిలుపులో భాగంగా మంత్రులు హారితహారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లిలో పాఠశాలల్లో ‘గ్రీన్ డే’ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారం నిర్మించారు. అనంతరం ప్రతిజ్ఞ చేసి పాఠశాలలో మొక్కలు నాటారు. దమ్మపేటలో... దమ్మపేట మండలం గండుగులపల్లి డబుల్ బెడ్ రూం కాలనీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి కొబ్బరి మొక్కలు నాటారు. మొక్కలు నాటిన మంత్రి ఇంద్రకరణ్ నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో గ్రీన్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కస్తూర్భా గాంధీ విద్యా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కలెక్టర్ ఇలంబర్తి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గాజువాకలో జనజాతర
బీజేపీతోనే దేశ భద్రత, అభివృద్ధి
పటాన్చెరుపై పట్టెవరిదో?
బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదు
No Headline
అదనపు పోలింగ్ సిబ్బందికి శిక్షణ
బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
గాజువాకలో సీఎం జగన్ రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement