-
గూగుల్, యాపిల్.. అంతా గప్పాలేనా?
యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, టెస్లా, బైడూ.. ఈ కంపెనీలకు ఏమైంది? ఒక పక్క చిప్ల కొరత, మరోపక్క సొంతంగా తయారు చేసుకుంటామని ప్రకటనలు. ఈ ప్రకటనలు ఆచరణలోకి వచ్చేది ఎప్పుడు?..అమలయ్యేది ఎప్పుడు? పాత ప్రకటనలను తెర మీదకు తెచ్చి.. కొత్తగా డబ్బా కొడుతున్న టెక్ కంపెనీలు ఎందుకంత హడావిడి చేస్తున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీలన్నీ సొంతంగా చిప్ తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నాయన్న వార్తలు ఈమధ్య కాలంలో బాగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గూగుల్, యాపిల్లు ఈ రేసులో ముందున్నాయని, ‘గూగుల్బుక్ ల్యాప్ట్యాప్’ కోసం గూగుల్ సొంతంగా సీపీయూలను తయారు చేయడంలో చివరి దశకు చేరుకుందని ప్రకటనలు వెలువడుతున్నాయి. కానీ, ఏ లెక్కన చూసినా ఈ ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చేది 2023 చివరికే. క్లిక్ చేయండి: ఫేస్ కాదు ఫేక్ బుక్ అయితే సొంత చిప్ తయారీ వ్యవహారం అంత సులువు కాదని, చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని టెక్ నిపుణులు చెప్తున్నారు. తాజాగా టీఎస్ఎంసీ కంపెనీ తైవాన్లో అత్యాధునిక చిప్ల ఫ్యాక్టరీ పెట్టనున్నట్లు ప్రకటించింది. సుమారు పది బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటు చేయబోయే ఈ ఫ్యాక్టరీ.. పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ కోసం ఎన్నేళ్లు పడుతుందో కచ్చితంగా చెప్పడం లేదు. ఈ లెక్కన టెక్ దిగ్గజాలేవీ ఇప్పటికిప్పుడే చిప్ తయారీలోకి స్వయంగా దిగే అవకాశాలేవని, ప్రకటనలన్నీ ఉత్త ప్రకటనలేనని అభిప్రాయపడుతున్నారు. ఆగమేఘాల మీద ప్రకటనలు.. పీసీ, ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్, ట్యాబ్లెట్, టీవీ, ఆటోమొబైల్స్ రంగాల్లో మైక్రోప్రాసెసర్ల(సెమీ-కండక్టర్)ను ఉపయోగిస్తారు. అందుకే మార్కెట్లో వీటికి హై డిమాండ్ ఉంది. అయితే కరోనా టైం నుంచి చిప్ షార్టేజీ మొదలైంది. చాలా వరకు కంపెనీలు బాగా నష్టపోయాయి. ఆ ప్రభావంతో ఉత్పత్తి తగ్గి.. రేట్లు ఆకాశానికి అంటాయి. ప్రత్యేకించి కొన్ని బ్రాండ్లు ప్రొడక్టివిటీ ఉన్నా.. ఎక్కువ రేట్లకు అమ్మేస్తుండడంతో కంపెనీలకు అసహనం పెరిగిపోతోంది. అందుకే సొంతంగా చిప్ తయారీలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటిస్తున్నాయి. వరుసగా ఒక్కో కంపెనీలు చిప్ ప్రకటనలు ఇచ్చుకుంటున్నాయి. అయితే ఇలాంటి ప్రకటనల ద్వారా అవతలి కంపెనీలను దిగొచ్చి చేసే స్రా్టటజీ కూడా అయ్యి ఉండొచ్చని టెక్ నిపుణులు చెప్తున్నారు. సొంత ఆలోచన మంచిదే ఒకవేళ కంపెనీలు నిజంగా సొంత చిప్ తయారీ రంగంలోకి అడుగుపెట్టినా.. అది మంచి ఆలోచనే అంటున్నారు ‘డైలాగ్ సెమీకండక్టర్’(యూకే) మాజీ బాస్ రస్ షా. ప్రస్తుతం మార్కెట్లో ఒకేరకమైన చిప్స్ ఉన్నాయి. ఇవి కాకుండా తమ డివైజ్లకు తగ్గట్లుగా చిప్స్ తయారీ చేసుకోవాలనేది టెక్ కంపెనీల ఉద్దేశం. తద్వారా డివైజ్ల సాఫ్ట్వేర్తో పాటు హార్డ్వేర్ కూడా వాళ్ల నియంత్రణలో ఉంటుంది. పైగా చీప్గా వర్కవుట్ అయ్యే వ్యవహారమని, డివైజ్లకు అందే ఎనర్జీని కూడా తక్కువగా తీసుకుంటుందని, స్మార్ట్ ఫోన్లు అయినా.. క్లౌడ్ సర్వీసెస్లకైనా ఒకేలా పని చేస్తాయని రస్ షా చెబుతున్నారు. పాత ప్రకటనలే! సొంత చిప్ల ప్రకటనలు వరుసగా చేస్తున్న బడా కంపెనీలు.. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం ఇవ్వట్లేదు. నిజానికి నవంబర్ 2020లోనే యాపిల్.. ఇంటెల్ ఎక్స్86 తరహా సొంత ప్రాసెసర్ను తయారు చేయబోతున్నట్లు ప్రకటించింది. కానీ, ఆ ప్రయత్నాలు అసలు మొదలుకాలేదు. ఇక టెస్లా ఏమో ఆరు నెలల కిందటే డేటా సెంటర్ల్లోని అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ కోసం ‘డోజో’ చిప్ను తయారు చేయనున్నట్లు ప్రకటించుకుంది. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ క్లౌడ్ సర్వీసులు ఉన్న అమెజాన్.. నెట్వర్కింగ్ చిప్ను రూపొందించే పనిలో చాలాకాలం నుంచే ఉంది. ఫేస్బుక్ రెండేళ్ల క్రితమే అర్టిఫీషియల్ సొంత చిప్ ప్రకటన చేసింది. గూగుల్ కూడా సేమ్ ఇదే తీరు. ఒకవేళ నిజంగా వీళ్లు రంగంలోకి దిగినా.. డిజైనింగ్ వరకే పరిమితం అవుతారని చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్క కంపెనీ కూడా చిప్ తయారీ రంగంలోకి దిగే పరిస్థితులు లేవని కరాఖండిగా చెప్తున్నారు. ఒకవేళ ధైర్యం చేస్తే.. తడిసి మోపెడు అవ్వడం ఖాయమంటున్నారు. చదవండి: అసలు చిప్లు ఏం చేస్తాయి? వివాదాలు ఎందుకంటే.. -
చిప్ల తయారీలోకి ఆపిల్, గూగుల్.. ఏమిటీ వివాదం?
ఎవరనుకున్నారు...???? అమెరికా అమలాపురాలను ఒక్క ఫోన్ కాల్ కలిపేస్తుందని! ఆఫీసు, ఇల్లు, సినిమాహాలు, ఒలింపిక్ క్రీడలు... అరచేతిలో ఇమిడిపోతాయని!! గుడిలో, బడిలో.. వాషింగ్మెషీన్లో.. నడిపే వాహనంలో, తళుకుల బల్బుల్లో.. ఇందుగలదందు లేదన్న సందేహంబు వలదన్నట్టు... చిప్లు చేరిపోతాయనీ.. సుఖసౌఖ్యాలను మన దరికి చేరుస్తాయని!! మనిషి మేధకు తాజా తార్కాణమా అన్నట్లు.. యాభై ఏళ్ల క్రితం మొదలైన మైక్రోప్రాసెసర్ ప్రస్థానం... గతం... ప్రస్తుతం.. భవిష్యత్తు...!!! ‘‘స్పర్ధయా వర్ధతే విద్య’’ అంటుంది ఓ సంస్కృత నానుడి. పోటీ ఉంటేనే విద్యలో రాణించగలం అని అర్థం. మరి.. పోటీ వ్యాపారంలో ఉంటే? ఇంకొన్నేళ్లలో మనకు ఇది కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటారా? పీసీ, ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్, ట్యాబ్లెట్లకు అత్యంత కీలకమైన మైక్రోప్రాసెసర్ల తయారీలో ఇప్పుడు పోటీ నెలకొంది కాబట్టి! మైక్రోప్రాసెసర్ల గతం... ప్రస్తుతం.. భవిష్యత్తుల గురించి తెలుసుకునే ముందు ఆసక్తికరమైన ఈ పోటీ సంగతేమిటో అర్థం చేసుకుందాం. సాక్షి, హైదరాబాద్: నిన్న మొన్నటివరకూ మైక్రోప్రాసెసర్ అంటే.. ఇంటెల్. ఇంటెల్ అంటే మైక్రోప్రాసెసర్ అదీ పరిస్థితి. కాలక్రమంలో సాంసంగ్, టీఎస్ఎంసీ, క్వాల్కామ్, మీడియాటెక్ వంటివి పీసీ, స్మార్ట్ఫోన్ మైక్రోప్రాసెసర్ల తయారీ రంగంలోకి దిగినా ఆధిపత్యం మాత్రం ఇంటెల్దే కొనసాగింది. కానీ ఆ పరిస్థితులిప్పుడు మారిపోతున్నాయి. దిగ్గజం ఇంటెల్ను తోసిరాజని ఒకవైపు ఆపిల్ ఇంకోవైపు గూగుల్ రెండూ తమదైన మైక్రోప్రాసెసర్లను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. స్మార్ట్ఫోన్ రంగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న క్వాల్కామ్కూ చెక్ పెట్టేందుకు ఆపిల్, గూగుల్లు రెండూ పావులు కదుపుతూండటం విశేషం. ఆపిల్ ఇప్పటికే పీసీ, స్మార్ట్ఫోన్లు రెండింటికీ సొంతంగా చిప్లు తయారు చేసుకుంటున్నా... క్వాల్కామ్, ఇంటెల్ వంటి సంస్థల చిప్లను కూడా కొంతమేరకు ఉపయోగిస్తోంది. త్వరలోనే దీనికీ స్వస్తి చెబుతామని ఆపిల్ ప్రకటించింది. మరోవైపు గూగుల్ కూడా తన స్మార్ట్ఫోన్లు ‘పిక్సెల్ –6’, ‘పిక్సెల్ –6 ప్రో’లకు సొంతంగా మైక్రోప్రాసెసర్లు తయారు చేసుకుంటామని ప్రకటించింది. ఈ పరిణామం కాస్తా.. మరింత సమర్థమైన ఫోన్లు, క్రోమ్బుక్లు చౌకధరల్లో వినియోగదారుడికి అందే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. గూగుల్ కూడా 2016లో క్వాల్కామ్ సరఫరా చేసే చిప్లతో పిక్సెల్ బ్రాండు స్మార్ట్ఫోన్లను తయారు చేస్తూండగా.. వీటి ధరల విషయంలో పలు విమర్శలు వచ్చాయి. సొంతంగా చిప్లు తయారు చేసుకుంటే తాము అనుకున్న ఫీచర్లను స్మార్ట్ఫోన్ల ద్వారా అందించే వీలుంటుందని కంపెనీ భావిస్తోంది. కృత్రిమ మేధ, రియల్టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ వంటి కొత్త కొత్త టెక్నాలజీలను తమ చిప్ల ద్వారా అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఏమిటీ వివాదం కంప్యూటర్లకు మాత్రమే కాదు.. స్మార్ట్ఫోన్లకు, ట్యాబ్లెట్లకు, ఇతర ఆపిల్ ఉత్పత్తులకు కొంతకాలం క్రితం వరకూ ఇంటెల్, క్వాల్కామ్లే అందించేవి. అయితే ఆపిల్, గూగుల్ల అవసరాలకు తగ్గట్టుగా ఎక్కువ సామర్థ్యంతో ఉన్న చిప్లను తయారు చేయడంలో ఇంటెల్ కొన్నేళ్లుగా వెనుకబడటం, ఇతర కంపెనీల చిప్లను వాడటంలో ఉన్న కొన్ని పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఆపిల్, గూగుల్ రెండూ సొంతంగా చిప్లు తయారు చేసుకోవాలని తీర్మానించుకున్నాయి. పీసీ, స్మార్ట్ఫోన్లు రెండింటికీ సొంతంగా చిప్లు తయారు చేసుకున్న ఆపిల్ స్మార్ట్ఫోన్లలోని మెడెమ్లు, ఇతర పరికరాల కోసం మాత్రం క్వాల్కామ్పైనే ఆధారపడుతోంది. కానీ ధరలు ఎక్కువగా ఉండటం, కొన్ని గుత్తాధిపత్య ధోరణిల కారణంగా వీటిని కూడా సొంతంగా తయారు చేసుకోవాలని రెండేళ్ల క్రితం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంత సులువా? మైక్రోప్రాసెసర్ల తయారీ అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమవుతాయి. ఇసుక నుంచి సిలికాన్ను తయారు చేసే ఫౌండ్రీలను ఏర్పాటు చేయడం మొదలుకొని మిల్లీమీటర్ల సైజున్న చిప్లలో వెయ్యికోట్లకుపైగా ట్రాన్సిస్టర్లను ఇమడ్చేలా డిజైన్లు తయారు చేయాలంటే ఏళ్లుపూళ్లవుతాయి. ఆపిల్ పీసీ చిప్ల తయారీలో విజయం సాధించినా స్మార్ట్ఫోన్లతో వ్యవహారం అంత సులువు కాదని నిపుణులు అంటున్నారు. ఇంటెల్ నుంచి కొను గోలు చేసిన మోడెమ్ తయారీ కేంద్రం సాయంతో సొంత తయారీ మొదలుపెట్టనుంది. కాకపోతే చిప్ల తయారీతోపాటు క్వాల్కామ్ స్మార్ట్ఫోన్ టెక్నాలజీలపై విస్తృత పరిశోధనలు, పరీక్షలు చేస్తూండటం, ప్రమాణాలను నిర్ణయించడంలో చాలా ముందున్న కారణంగా 5జీ ఫోన్ల విషయంలో మాత్రం క్వాల్కామ్పై ఆధారపడాల్సి ఉంటుందని అంచనా. ఏతావాతా.. ఆపిల్ తనదైన స్మార్ట్ఫోన్ చిప్లను తయారు చేసుకునేందుకు మరికొంత సమయం పట్టనుందన్నమాట. లక్షల కోట్ల వ్యవహారం! మైక్రోప్రాసెసర్ తయారీ మార్కెట్ విలువ ఎకాఎకిన కొన్ని లక్షల కోట్ల వరకూ ఉంటుంది. ఇంటెల్, మోటరోలా, అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్, ఐబీఎం, సన్ మైక్రోసిస్టమ్స్, హ్యూలెట్ ప్యాకర్డ్ వంటి దిగ్గజాలు కొన్ని వందల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టడమే కాకుండా.. పోటాపోటీగా మరింత సమర్థమైన, మెరుగైన ఫీచర్లు ఉన్న మైక్రోప్రాసెసర్లను అందుబాటు లోకి వెచ్చాయి. యాభై ఏళ్ల క్రితం నాటి తొలి మైక్రోప్రాసెసర్లో కేవలం 2300 ట్రాన్సిస్టర్లు ఉంటే.. తాజాగా ఈ సంఖ్య 1600 కోట్లకు చేరిపోయిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చూ. అది కూడా ఒక చదరపు సెంటీమీటర్ వైశాల్యంలోనే ఇన్ని కోట్ల ట్రాన్సిస్టర్లను ఇమడ్చేందుకు ఎంత సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్, పరికరాలు అవసరమవుతాయో ఊహించుకోవచ్చు. ఇలా తయారైన మైక్రోప్రాసెసర్లు పీసీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లతోపాటు పరిశ్రమల్లో, వాహనాల్లో, దైనందిన వాడకంలో ఉండే ఎలక్ట్రానిక్ పరికరాల్లోకీ చేరిపోయాయి. ఇంత విస్తృత వాడకం ఉన్న కారణంగానే మైక్రోప్రాసెసర్ల మార్కెట్ విలువ ఏడాదికి దాదాపు రూ.6.75 లక్షల కోట్లు ఉంది. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ఏడాది వృద్ధి 6.4 శాతం వరకూ ఉండవచ్చునని అంచనా. 2021 చివరకల్లా మార్కెట్ రూ.7 లక్షల కోట్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లదే హవా.. మైక్రోప్రాసెసర్ల రంగంలో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లలో వేగంగా వృద్ధి కనపడుతోంది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉండటం, ప్రజల వద్ద ఖర్చు పెట్టేందుకు ఉండే ఆదాయం పెరుగుతూండటం నేపథ్యంలో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ల విక్రయాలు పెరుగుతూండటం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు 2019లో సగటు అమెరికన్ చేతిలో ఖర్చు పెట్టేందుకు సగటున 15 వేల డాలర్లు ఉంటే అది గత ఏడాది అక్టోబరు నాటికి 47,673 డాలర్లకు చేరినట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. భారత్, చైనా వంటి దేశాల్లోనూ మధ్యతరగతి ప్రజలు ఎలక్ట్రానిక్ పరికరాలపై పెడుతున్న ఖర్చు ఎక్కువవుతూండటం మైక్రోప్రాసెసర్ రంగానికి వరంగా మారుతోంది. ఒక్క భారత్లోనే వచ్చే ఏడాదికల్లా స్మార్ట్ఫోన్లు ఉన్న వారి సంఖ్య 82 కోట్లకు చేరుతుందని అంతర్జాతీయ సంస్థ కేపీఎంజీ లెక్కకడుతోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వాడకం పెరిగిన కొద్దీ అందులోనూ చిప్ల వాడకం ఉన్న కారణంగా మైక్రోప్రాసెసర్ రంగం వృద్ధి వేగంగా సాగుతుందని అంచనా. దిగ్గజ తయారీదారులు వీరే... మైక్రోప్రాసెసర్ల తయారీలో తైవాన్కు చెందిన మీడియాటెక్, దక్షిణ కొరియాకు చెందిన సాంసంగ్, జపాన్లోని తోషిబాలు కలసి అమెరికా బయట ఆధిపత్యం కనబరుస్తున్నాయి. మొత్తమ్మీద చూస్తే అమెరికన్ కంపెనీ ఇంటెల్దే తొలిస్థానం. మార్కెట్ దీని షేర్ 19.5 శాతంగా ఉంది. తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 11.25 శాతంతో రెండో స్థానంలోనూ, దాదాపు 10 శాతంతో మూడోస్థానంలో క్వాల్కామ్ ఉన్నాయి. సాంసంగ్ సెమీ కండక్టర్, బ్రాడ్కామ్, ఫ్రీస్కేల్ సెమీ కండక్టర్, ఎన్విడియా, ఏఎండీ, స్ప్రెడ్ట్రమ్, టీఐ, ఆపిల్, ఐబీఎం, ఆట్మెల్, టీఎస్ఎంసీ, లీడ్కోర్, ఆమ్లాజిక్, నూఫ్రంట్, ఇన్జెనిక్ వంటి కొన్ని కంపెనీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మైక్రో ప్రాసెసర్ సెగ్మెంట్ను స్థూలంగా మూడు భాగాలుగా విడదీయవచ్చు. ఆర్మ్, ఎక్స్–86 ఆధారిత ఎంపీయూలు ఒక వర్గమైతే.. అప్లికేషన్ల ఆధారంగా చేసే వర్గీకరణ (పీసీలు, సర్వర్లు, ట్యాబ్లెట్లు, సెల్ఫోన్లు, ఎంబెడెడ్ ఎంపీయూలు) రెండోది. ఉపయోగించే రంగం ఆధారంగా జరిగే మూడో వర్గీకరణలో సమాచారం, కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటివి ఉంటాయి. స్మార్ట్ఫోన్లలో మాత్రం క్వాల్కామ్ పెత్తనం కొనసాగుతోంది. 2020 లెక్కల ప్రకారం స్మార్ట్ఫోన్ అప్లికేషన్ ప్రాసెసర్ రంగంలో క్వాల్కామ్ 32 శాతం ఆదాయాన్ని దక్కించుకుంది. చైనాకు చెందిన హైసిలికాన్ 22 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఆపిల్ 19 శాతంతో మూడో స్థానంలో ఉండగా.. మిగిలిన అన్ని సంస్థలు కలిసి 27 శాతం వాటా కలిగి ఉన్నాయి. -
ఇంటెల్కు త్వరలో యాపిల్ గుడ్బై?
ముంబై: టెక్ దిగ్గజాలు ఇంటెల్, యాపిల్ సంయుక్తంగా ప్రపంచానికి ఎన్నో కొత్త ఆవిష్కరణలు అందించాయి. ప్రస్తుతం కంప్యూటర్ తయారీలో యాపిల్ సంస్థ ఇంటెల్ మైక్రోప్రాసెసర్లను ఉపయోగిస్తుంది. అదే విధంగా యాపిల్ సంస్థ అత్యాధునిక చిప్లను రూపొందిస్తుంది. సొంతంగా ఎదగాలనే వ్యూహంతో మరో టెక్ దిగ్గజాం ఇన్టెల్తో విడిపోవాలని యాపిల్ సంస్థ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా త్వరలో యాపిల్ సంస్థ రూపొందించే సరికొత్త ఆవిష్కరణల ప్రణాళికను వివరిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా విభిన్న ఫీచర్లతో అత్యాధునిక స్మార్ట్ఫోన్(ఐఫోన్)లను రూపొందించి కోట్లాది వినియోగదారులను యాపిల్ ఆకట్టుకుంది. కానీ యాపిల్ సంస్థ సొంతంగా నిలదొక్కుకునే వ్యూహాలు రచిస్తుంది. ఇటీవల ట్రక్కుల తయారీలో ఈకామర్స్ దిగ్గజం అమోజాన్ ప్రవేశించిన విషయం విదితమే. మరోవైపు అన్ని దేశాల సాంకేతికతలను ఉపయోగించుకొని సరికొత్త ఆవిష్కరణలకు యాపిల్ సంస్థ వ్యూహాలు రచిస్తుంది. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఐఫోన్లకు సరికొత్త చిప్ల ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. మరోవైపు అత్యాధునిక సాంకేతికతతో దిగ్గజ కంపెనీలు సొంతంగా ఎదగాలనే వ్యూహాలు రచిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: శాంసంగ్కు బై, ఆపిల్కు సై : వారెన్ బఫెట్) -
స్మార్ట్ ఎల్ఈడీ బల్బు...
ఎల్ఈడీ బల్బులు విద్యుత్తు తక్కువ వాడతాయి. ఎక్కువ కాలం మన్నుతాయి. ఈ విషయాలు మనకు తెలుసు. కానీ ఖరీదెక్కువన్న ఒకే ఒక కారణంతో వాడేందుకు సందేహిస్తాం. కానీ ఫొటోలో కనిపిస్తున్న ఎల్ఈడీ ‘క్రీ’ పరిస్థితి వేరు. దీని ఖరీదు దాదాపు రూ.900. కాకపోతే దీన్ని ఆన్/ఆఫ్ చేయాలంటే స్విచ్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమేమీ లేదు. ఇంట్లోంచైనా, పక్క ఊరి నుంచైనా ఈ పని చేయవచ్చు. అలా పనిచేసేందుకు దీంట్లో ఓ మైక్రోప్రాసెసర్ను ఏర్పాటు చేశారుమరి. వెలుతురు తగ్గించేందుకు, ఆన్/ఆఫ్ చేసేందుకు, ఫలానా టైమ్కు ఆన్ లేదా ఆఫ్ కావాలి అన్న అదేశాలు పంపేందుకు మొబైల్ఫోన్ అప్లికేషన్ ఒక్కటుంటే సరిపోతుంది.! అమెరికాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ కొత్త దీపాలు కనీసం 81 శాతం తక్కువ విద్యుత్తు వాడతాయట
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement