-
ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో చార్జిషీట్
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో ఏడుగురు నిందితులపై పోలీసులు శనివారం 800 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. దాదాపు 120 మంది సాక్ష్యాలను అందులో పొందుపరిచారు. నిందితుల్లో నలుగురిపై హత్యా నేరం మోపారు. దీనిపై విచారణను ఏప్రిల్ 13కు మెట్రోపాలిటన్ జడ్జి సన్యా దలాల్ వాయిదా వేశారు. గత డిసెంబర్ 31న ఢిల్లీలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుని అర్ధరాత్రి దాటాక స్కూటీపై వెళ్తున్న అంజలీసింగ్ అనే 20 ఏళ్ల యువతిని నిందితులు కారుతో ఢీకొట్టడం, ఆమె కారు కింద చిక్కుకుందని తెలిసి కూడా అలాగే 12 కిలోమీటర్లకు పైగా లాక్కెళ్లడం తెలిసిందే. దాంతో ఒళ్లంతా ఛిద్రమై అంజలి అత్యంత బాధాకరంగా మరణించింది. -
ఆ సమయంలో అమ్మాయిని ఫాలో కావడం అసాధ్యం.. కోర్టు కీలక తీర్పు
ముంబై: మహిళపై వేధింపుల కేసులో ముంబై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు గతవారం కీలక తీర్పునిచ్చింది. 40 ఏళ్ల నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైలో ఉదయం వేళ చాలా రద్దీగా ఉంటుందని, ఆ సమయంలో ఒకరిని మరొకరు ఫాలో కావడం అసాధ్యమని వ్యాఖ్యానించింది. ఏం జరిగిందంటే..? ముంబై చిరా బజార్లో నివసించే ఓ మహిళ.. ఓ వ్యక్తి తనను రోజు ఫాలో అవుతున్నాడని ఆరోపించింది. ఉదయం రైల్వే స్టేషన్కు వెళ్లే సమయంలో అతడు తనను బైక్పై అనుసరిస్తున్నాడని, తనవైపే చూస్తూ ఇబ్బంది పెడుతున్నాడని కేసు పెట్టింది. నిందితుడు కూడా అదే ప్రాంతంలో ఓ గ్యారేజీ నడుపుతున్నాడు. ఆమె వెళ్లేదారిలోనే ఆ షాపు కూడా ఉంది. అయితే మహిళ చేసిన ఆరోపణలపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముంబైలో ఉదయం వేళ చాలా రద్దీగా ఉంటుందని, ఆపీసులకు వెళ్లేవారితో రోడ్లు కిక్కిరిపోతాయని పేర్కొంది. అలాంటి సమయంలో ఒకరిని మరొకరు ఫాలో చేయడం అసలు సాధ్యం కాదని చెప్పింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బెయిల్ ఇచ్చింది. ఈ కేసు 2017 ఆగస్టు 3న నమోదైంది. చదవండి: ఇండియన్ కరెన్సీ నోట్లపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు -
జగన్పై హత్యాయత్నం కేసు.. విజయవాడకు బదిలీ
-
జగన్పై హత్యాయత్నం కేసు.. విజయవాడకు బదిలీ
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం కేసును విశాఖపట్నం నుంచి విజయవాడకు బదిలీ చేయాలంటూ మెట్రోపాలిటన్ కోర్టు తీర్పునిచ్చింది. జగన్పై హత్యాయత్నం కేసులో ప్రభుత్వం తమకు సహకరించడం లేదని.. ఈ కేసును విజయవాడకు బదిలీ చేయాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి.. ఈ కేసును విశాఖపట్నం నుంచి విజయవాడకు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను ఎన్ఐఏకు అప్పగించాలంటూ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
వైఎస్ జగన్ షర్టును 23న కోర్టుకు సమర్పించండి
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్టోబర్ 25వ తేదీన విశాఖ ఎయిర్పోర్టులో హత్యాయత్నం జరిగిన సమయంలో ఆయన ధరించిన చొక్కాను తమకు సమర్పించాలని విశాఖ 7వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు ‘సిట్’ అధికారులను ఆదేశించింది. ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ ఎయిర్పోర్టులో జగన్పై హత్యాయత్నం జరిగినప్పుడు కత్తి గాయం కారణంగా చిరిగిన ఆయన చొక్కాకు రక్తం మరకలు అయ్యాయి. దీంతో వైఎస్ జగన్ ఆ చొక్కాను వీఐపీ లాంజ్లోనే మార్చుకుని మరో షర్టు ధరించి విమానంలో హైదరాబాద్ వెళ్లి చికిత్స కోసం నేరుగా ఆసుపత్రికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఘటన సమయంలో వైఎస్ జగన్ ధరించిన షర్టును అందచేయాలన్న ఉత్తర్వులపై సిట్ అధికారిగా వ్యవహరిస్తున్న విశాఖ ఏసీపీ బీవీఎస్ నాగేశ్వరరావును ‘సాక్షి’ శనివారం రాత్రి వివరణ కోరగా ఆ చొక్కాను ఈ నెల 23న కోర్టుకు సమర్పించాలని ఆదేశించిందన్నారు. అయితే ఈ విషయంలో వైఎస్ జగన్, ఆయన పీఏ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరంలేదని, ఆ చొక్కాను ఎవరైనా తీసుకొచ్చి అప్పగించవచ్చని చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూటమి కుట్రలు.. పథకాలనూ అడ్డుకుంటారా?: సీఎం జగన్
ప్రచార హోరు..
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
మెరుగైన వైద్య సేవలు అందించాలి
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
పోస్టల్ బ్యాలెట్కు ఏర్పాట్లు చేయాలి
బిల్లులు రాక రెండేళ్లు..
నగదు సీజ్
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement