breaking news
mental police movie
-
‘మెంటల్ పోలీస్’పై స్టే
సాక్షి, హైదరాబాద్: శ్రీకాంత్ హీరోగా నటించిన మెంటల్ పోలీస్’ సినిమా విడుదలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. ఈ సినిమా విడుదలపై రెండు వారాల పాటు స్టే విధించింది. ఈ సినిమా విషయంలో పిటిషనర్ సమర్పించే వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని సెన్సార్బోర్డ్ ప్రాంతీయ అధికారిని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సెన్సార్బోర్డు ప్రాంతీయ అధికారి, మెంటల్ పోలీస్ దర్శక, నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మెంటల్ పోలీస్ సినిమా టైటిల్ పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఈ సినిమా విడుదలకు దృవీకరణ పత్రం ఇవ్వకుండా సెన్సార్బోర్డు అధికారులను ఆదేశించాలని కోరుతూ నెల్లూరు పోలీసు అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు యడ్ల శ్రీహరిబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, మెంటల్ పోలీస్ సినిమా టైటిల్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతివాదులకు పిటిషనర్ మార్చి 23న వినతి పత్రం సమర్పించారని తెలిపారు. అయినప్పటికీ ఎటువంటి స్పందలేదన్నారు. ప్రజల్లో పోలీసుశాఖ ప్రతిష్టను దిగజార్చేలా సినిమా పేరు ఉందని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, మెంటల్పోలీస్ సినిమా విడుదలపై రెండు వారాల పాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. -
శ్రీకాంత్ 'మెంటల్ పోలీస్' విడుదలపై స్టే
హైదరాబాద్: శ్రీకాంత్ హీరోగా నటించిన మెంటల్ పోలీస్ సినిమా విడుదలపై హైకోర్టు స్టే విధించింది. ఈ సినిమా టైటిల్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసు అధికారుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు సోమవారం విచారించింది. వాదనలు విన్న అనంతరం మెంటల్ పోలీస్ విడుదలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా 'మెంటల్ పోలీస్' టైటిల్ పెట్టినందుకు నిర్మాత, దర్శకులతోపాటు హీరో శ్రీకాంత్కు పోలీసు అధికారుల సంఘం లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. పోలీసులకున్న గౌరవ మర్యాదలను కించపరిచేలా సినిమా పేరు పెట్టారని, దాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. శ్రీకాంత్, అక్ష జంటగా కరణం పి.బాబ్జీ దర్శకత్వంలో వీవీఏఎన్ ప్రసాద్ దాసరి, వీవీ దుర్గాప్రసాద్ అనగాని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు.