breaking news
meeting tomorrow
-
రేపు వైఎస్సార్సీపీ యువజన సమావేశం
పల్లెపల్లెకూ చంద్రబాబు మోసాలు క్షేత్రస్థాయిలో యువజన విభాగం పటిష్టం అ«ధ్యక్షుడు అనంతబాబు సాక్షిప్రతినిధి, కాకినాడ: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలను వాడవాడలా వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఎండగట్టనున్నట్టు ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు) చెప్పారు. శనివారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇందుకు కార్యచరణ రూపొందించేందుకు ఈ నెల 26న పిఠాపురంలో యువజన విభాగం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పిఠాపురం రైస్మిల్లర్స్ అసోసియేషన్ హాలులో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశానికి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, స్థానిక కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారని అనంతబాబు చెప్పారు. ఈ సమావేశానికి యువజన విభాగం మండల కన్వీనర్లు, జిల్లా కమిటీ సభ్యులు విధిగా హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
రేపు బీసీ సంక్షేమ శాఖలో విభజన సమావేశం
హన్మకొండ అర్బన్ : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగుల పంపిణీపై హైదరాబాద్లోని శాఖ కమిషనర్ కార్యాలయంలో శనివారం సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జిల్లా నుంచి డీడీ నర్సింహస్వామి, డీబీసీడబ్ల్యూవో హృషీకేష్రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల వివరాలు, జిల్లాలకు కేటాయింపు తదితర విషయాలపై స్పష్టత రానుంది.