breaking news
mayour
-
నగరపాలక పంచాయతీ
ముదిరిపాకాన పడిన కమిషనర్, మేయర్ విభేదాలు గుంటూరు నుంచి వచ్చిన మున్సిపల్ అసిస్టెంట్ డైరెక్టర్లు కార్యదర్శి కార్యాలయంలో రికార్డుల పరిశీలన నకళ్లు వెంటబెట్టుకు వెళ్లిన వైనం వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ ఫిర్యాదుతో కదిలిన రాష్ట్ర యంత్రాంగం పాలన గాడితప్పడంతోనే ప్రభుత్వం దృష్టికి.. సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో మేయర్ పంతం రజనీశేషసా యి, కమిషనర్ వి.విజయరామరాజుల మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు పరచడంలో ఒకరి కొకరు పంతాలకు పోవడంతో కౌన్సిల్, స్టాండింగ్ కమిటీ తీర్మానాలు కొన్ని పెండిం గ్లో పడిపోతున్నాయి. నగరపాలన కుంటుపడుతుండడంతో వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి ముఖ్యమంత్రికి, మున్సి పల్ పరిపాలన సంచాలకులకు ఫిర్యా దు చేశారు. దీంతో సోమవారం మున్సిపల్ సంచాలకులు కన్నబాబు ఆదేశాల మేరకు గుంటూరు నుంచి సహాయ సంచాలకులు టీఎస్ఎస్ఎ¯ŒSజీ శ్రీనివాస్, పి.రాఘునాథ్రెడ్డిలు రాజమహేంద్రవరం వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరపాలక సంస్థ కార్యదర్శి శైలజావల్లి కార్యాలయంలో కౌన్సిల్, స్థాయీ సంఘం తీర్మానాలు, ఇతర రికార్డులు పరిశీలించారు. వాటి నకళ్లను తమ వెంటబెట్టుకు వెళ్లారు. తాము గమనించిన విషయాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని సహాయ సంచాలకులు శ్రీనివాస్, రాఘునాథ్రెడ్డి తెలిపారు. అంత్య పుష్కరాల నుంచి విభేదాలు మొదలు తనకు తెలియకుండానే స్టాండింగ్ కమిటీ , కౌన్సిల్ సమావేశం అజెండాలోకి అంశాలు చేర్చుతున్నారంటూ గతంలో మేయర్ పంతం రజనీశేషసాయి విలేకర్ల సమావేశంలో కుండబద్ధలు కొట్టిన విషయం తెలిసిందే. నగరపాలక సంస్థలో తనకు తెలియకుండానే పాలన జరిగిపోతోందని, ఇలా అయితే ఇక పాలక మండలి, మేయర్ ఎందుకని ఘాటుగా స్పందించారు. అధికార యంత్రాంగమే పాలన చేసుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు. అదే సమయంలో తన పరిధి మేరకే తాను పని చేస్తున్నానని, తనకు ఉన్న అధికారం మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నానని కమిషనర్ వి.విజయ రామరాజు పేర్కొన్నారు. మేయర్, కమిషనర్ల మధ్య గోదావరి అంత్య పుష్కరాల నుంచి పాలన, నిర్ణయాలలో ప్రారంభమైన మనస్పర్థలు ‘హ్యాపీ సండే’ కార్యక్రమంతో మరింత ముదిరాయి. ‘తనకు తెలియకుండానే కౌన్సిల్, స్థాయీ సంఘం సమావేశం అజెండాలోకి అంశాలు చేర్చుతుండడంతో వాటిని తోసిపుచ్చుతున్నారు. వాటిని తరువాత సమావేశంలో అనుమతి కోసం యంత్రాంగం చేర్చుతోంది. నగరపాలక సంస్థలో ఇతర కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికిలాగే వాచ్మెన్ల జీతాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని మేయర్ రజనీశేష సాయి కమిషనర్కు లేఖ రాశారు. అయితే ఆ విషయం బుట్టదాఖలైంది. దీంతో ఇరువురి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పాలక మండలి నిర్ణయం లేకుండానే మున్సిపల్ పాఠశాలలోని స్వీపర్లకు జీతాలు పెంచి ఇస్తున్నారని, అలాంటప్పుడు ఇక కౌన్సిల్ ఆమోదం ఎందుకని డిసెంబర్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో మేయర్ ప్రశ్నించారు. కంప్యూటర్ ఆపరేటర్ల జీతాలతో మరోసారి... ఇక తన వ్యక్తిగత కంప్యూటర్ ఆపరేటర్ విషయంలో మేయర్కు కమిషనర్కు మధ్య ఉన్న విభేదాలు తారస్థాయికి చేరాయి. కంప్యూటర్ ఆపరేటర్ను నియమించకపోవడంతో మేయర్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న ఆపరేటర్ల జీతాలు విడుదల తీర్మానాన్ని పక్కనబెట్టారు. దీనిపై ఈ నెల ఏడో తేదీన జరిగిన బడ్జెట్ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. జీతాలు ఆపవద్దని నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో వారు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. వైఎస్సార్సీపీ ఫిర్యాదుతో కదిలిన రాష్ట్ర యంత్రాంగం... గత కొన్ని నెలలుగా నగరపాలక సంస్థలో జరుగుతున్న విషయాలను గమనిస్తూ ఎప్పటికప్పుడు విలేకర్ల సమావేశం నిర్వహిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పాలక మండలి తీరును ఎండగట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత మేడపాటి షర్మిలారెడ్డి నగరపాలక సంస్థలో జరుగుతున్న విషయాలను ముఖ్య మంత్రి చంద్రబాబుకు, మున్సిపల్ పరిపాలన సంచా లకులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు నుంచి వచ్చిన మున్సిపల్ పరిపాలన సహాయ సంచాలకులు సోమవారం నగరపాలక సంస్థలో రికార్డులు పరిశీలించి, నకళ్లు తమవెంటబెట్టుకు వెళ్లారు. -
మేయర్కు అసమ్మతి సెగ
పావులు కదుపుతున్న అసమ్మతి వర్గం నోరు విప్పని సొంత వర్గం సీఎం వద్ద పంచాయితీకి ప్రయత్నం నగరపాలక సంస్థ పాలకవర్గంలో కేఎంకే చిచ్చు రేపింది. మేయర్ కోనేరు శ్రీధర్ను పదవి నుంచి తప్పించేందుకు టీడీపీకే చెందిన కార్పొరేటర్లు పావులు కదుపుతున్నారు. అందుకు ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్నట్లు సమాచారం. విజయవాడ సెంట్రల్ : మేయర్ కోనేరు శ్రీధర్ ఒంటరి అవుతున్నారు. తన వర్గానికి చెందిన కార్పొరేటర్లు కేఎంకే వ్యవహారంలో నోరు మెదిపేందుకు ధైర్యం చేయడం లేదు. కౌన్సిల్ ఆవిర్భావం నుంచి టీడీపీ ఫ్లోర్లీడర్ జి.హరిబాబు మేయర్ కుడిభుజంగా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు మూడు నియోజకవర్గాలకు చెందిన కార్పొరేటర్లు మద్దతుగా నిలిచారు. మేయర్ మార్పునకు సంబంధించి రెండు నెలల క్రితం అసమ్మతి వర్గం సంతకాల సేకరణ చేపట్టగా 12 మంది కార్పొరేటర్లు మేయర్కు అండగా నిలబడ్డారు. శ్రీధర్పై ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడల్లా హరిబాబు తీవ్రంగా స్పందించేవారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరంతా గప్చుప్గా ఉండిపోయారు. రహస్య మంతనాలు అసమ్మతి వర్గం కార్పొరేటర్లు చురగ్గా పావులు కదుపుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్నారు. రహస్య మంతనాలు సాగించిన అసమ్మతివర్గం బుధవారం ఏ1 కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన పుష్కరాల విజయోత్సవ సభలోనూ మరోమారు భేటీ అయినట్లు సమాచారం. గతంలో మేయర్ను మార్చాలంటూ అసమ్మతి వర్గం పట్టుబట్టిన సందర్భంలో ఆయన ఏం అవినీతి చేశారో చెప్పండి అంటూ పశ్చిమ నియోజక వర్గానికి చెందిన ఓ నాయకుడు ప్రశ్నించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఇప్పుడు ఆధారాలతో సహా బయట పడటంతో దీన్ని అస్త్రంగా వాడుకోవాలని భావిస్తున్నారు. పదవుల మార్పు విషయమై పుష్కరాలు అయ్యే వరకు మాట్లాడొద్దంటూ ఎంపీ కేశినేని నాని అసమ్మతి వర్గాన్ని ఇప్పటి వరకు కట్టడి చేస్తూ వచ్చారు. పుష్కరాలు పూర్తవ్వడంతో పాటు మేయర్ కే ఎంకే వ్యవహారంలో అడ్డంగా బుక్ అవ్వడంతో అసమ్మతి వర్గం నోటికి పని^ ðlబుతున్నారు. కాంట్రాక్ట్ చేయడం తప్పే అంటూ ఇప్పటికే కొందరు కార్పొరేటర్లు బయటపడ్డ విషయం విదితమే. రివేంజ్.. ఫుడ్, కాంట్రాక్ట్ కార్మికుల సరఫరా పనులను ఎనిమిది మంది టీడీపీ కార్పొరేటర్లు దక్కించుకున్నారు. అయితే బినామీ పేర్లతో పనులు చేశారు. ఓ కార్పొరేటర్ మాత్రం తన మరిది పేరుతో టెండర్ దక్కించుకున్నారు. మేయర్ సతీమణి కోనేరు రమాదేవి కేఎంకే గౌరవ డైరెక్టర్గా వ్యవహరించడం అత్యధిక మొత్తంలో కాంట్రాక్ట్ చేయడంతో ఫోకస్ మేయర్పైకి వెళ్లింది. శ్రీకనకదుర్గా లేఅవుట్ వ్యవహరంలో ఏకపక్షంగా వ్యవహరించిన మేయర్ విజ్ఞాన యాత్రకు వెళ్లినప్పుడు కావాలనే తమను అల్లరి పాలయ్యేట్లు చేయడంపై కొందరు మహిళా కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. కేఎంకే వ్యవహారాన్ని ఆయుధంగా చేసుకొని మేయర్పై ప్రతీకారం తీర్చుకోవాలనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ద్వారా సీఎం చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు భోగట్టా.