Master Bharath
-
నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం
తెలుగులో ఎన్నో సినిమాల్లో బాలనటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఇతడి తల్లి కమలహాసిని.. ఆదివారం రాత్రి చెన్నైలో మరణించారు. ఈ క్రమంలో తోటి నటీనటులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. చెన్నైలోని భరత్ ఇంటికి బంధుమిత్రులు, సినీ ప్రముఖులు వచ్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) దర్శకుడు శ్రీనువైట్ల తీసిన వెంకీ, రెడీ, ఢీ, కింగ్ సినిమాలతో పాటు బిందాస్, మిస్టర్ ఫెర్ఫెక్ట్ తదితర 80 తెలుగు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. పెద్దవాడు అయిన తర్వాత అల్లు శిరీష్ 'ఏబీసీడీ' మూవీతో నటుడిగా మారాడు. చివరగా గతేడాది రిలీజైన గోపీచంద్ విశ్వం సినిమాలో సహాయ పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చేస్తున్నాడు.నటుడిగా తెలుగు, తమిళ, కన్నడలో పలు చిత్రాలు చేసిన మాస్టర్ భరత్.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతున్నాడు. ఇలాంటి సమయంలో తల్లిని కోల్పోవడంతో చాలా బాధపడుతున్నాడు. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విషాద ఘటనతో మాస్టర్ భరత్ అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగారు.(ఇదీ చదవండి: అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ) -
ఆ ‘సర్ప్రైజ్’ రివీల్ చేసిన మెగా హీరో
పలు చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న బాల నుటుడు భరత్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తనున్నారు. అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కనున్న ఏబీసీడీ చిత్రంలో హీరో ఫ్రెండ్ పాత్రను పోషించనున్నారు. ఈ విషయాన్ని శిరీష్ సోమవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. నిన్న అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనున్నట్టు చెప్పిన శిరీష్ నేడు ఆ విషయాన్ని బహిర్గతం చేశారు. ఈ చిత్రంలో శిరీష్కు ఫ్రెండ్ పాత్రలో భరత్ ఫుల్ లెన్త్ పాత్రలో కనపించనున్నారు. శిరీష్ ట్వీట్పై పలువురు సినీ ప్రముఖులు స్పందిసూ.. భరత్కు అల్ ది బెస్ట్ చెబుతున్నారు. వెంకీ, పోకిరి, ఢీ, రెడీ, కింగ్ వంటి అనేక చిత్రాల్లో భరత్ చేసిన పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. మాలీవుడ్లో హిట్ అయిన ఏబీసీడీ (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అమెరికా నుంచి ట్రిప్ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్ క్లాస్ లైఫ్ను లీడ్ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. నూతన దర్శకుడు సంజీవ్రెడ్డి ఈ రీమేక్ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ బాణీలు అందిస్తారు. కృష్ణార్జున యుద్దం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్సర్ థిల్లార్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. Master Bharath will be seen in a full length role as my best friend in ABCD. He transitions from child artiste to a character actor with this film. Welcome, Bharath. #ABCDTelugu pic.twitter.com/v4ES88ynp3 — Allu Sirish (@AlluSirish) June 11, 2018 -
అనుష్క చిత్రానికి యమ క్రేజ్
నటి అనుష్క చిత్రం అనూహ్య క్రేజ్ సంపాదించుకుంది. ఆ చిత్రం ఏమిటని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? తమిళంలో ఇంజి ఇడుప్పళగి పేరుతోనూ, తెలుగులో సైజ్ జీరో పేరుతోనూ రూపొందుతున్న ద్విభాషా చిత్రం గురించే ఈ ప్రస్థావన. ఇందులో హీరో ఆర్య ఉండగా అనుష్క చిత్రం అంటారేమిటి అన్న ప్రశ్న తలెత్తుతోందా?ఆర్య ప్రకాశ్రాజ్, సోనల్సుహాన్, మాస్టర్ భరత్ ఇలా చిత్రంలో చాలా మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. అయితే ఇది పూర్తిగా నటి అనుష్క చుట్టూ తిరిగే కథ. ఆమె అందం, మందం అంశాలను చర్చించే ఇతి వృత్తం. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై అనూహ్య ఆదరణను పొందిందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ టీజర్ విడుదలైన రెండు రోజుల్లోనే యూట్యూబ్లో రెండు లక్షల మంది వీక్షించినట్లు చిత్ర యూనిట్ తెలిపారు.ముఖ్యంగా ముద్దుగా, బొద్దుగా ఉన్న హన్సిక రూపం, సన్నగా, అందంగా ఉన్న రూపాలు సినీ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నట్లు,ఇందులో బొద్దుగా ఉండడానికి అనుష్క సుమారు 20 కిలోల బరువు పెరగడం వంటి అంశాలు ఇంజి ఇడుప్పళగి చిత్రంపై అంచనాలను పెంచేశాయని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా సంస్థ నిర్మిస్తోంది. మరగదమణి(కీరవాణి) సంగీతబాణీలందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు.