breaking news
Married woamn suicide
-
క్షణికావేశంలో..
పొందూరు: క్షణికావేశం.. చిన్నచిన్న అపార్థాలకు ఓ నిండు జీవితం బలైంది. ముక్కుపచ్చలారని చిన్నారి తల్లిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటనతో రెండు కుటుం బాలకు తీరని శోకం మిగిలింది. మండలంలోని అచ్చిపోలవలస గ్రామానికి చెందిన వివాహిత సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై బాలరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అచ్చిపోలవలస గ్రామంలో గోరింట జయశ్రీ(25) కొన్నాళ్లుగా నివాసం ఉంటోంది. ఆమె భర్త కృష్ణప్రసాద్ జగదల్పూర్లో రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. అక్కడి వాతావారణం సరిగ్గా ఉండదని.. కృష్ణప్రసాద్ కుటుంబాన్ని అచ్చిపోలవలసలో ఉంచాడు. ఆ విషయాన్ని భార్యకు చెప్పి ఒప్పిస్తూ వచ్చాడు. ఇటీవల గ్రూప్స్లో సెలెక్ట్ అవ్వడంతో శ్రీకాకుళంలో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. శ్రీ కాకుళంలోనే ఉండి, చదువుకుంటూ.. అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి, వెళ్తుండేవాడు. అయితే, భర్త తనను సరిగ్గా చూసుకోవడం లేదని కొన్నాళ్ల నుంచి జయశ్రీ బాధ పడుతుండేది. ఈ నేపథ్యంలో గతంలో రెండు సార్లు ఆత్మహత్యకు యత్నించింది. సోమవారం క్షణికావేశంతో తన ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్సై బాలరాజు సిబ్బందితో కలసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. పసిపాపకు దిక్కెవరు..? కృష్ణ ప్రసాద్, జయశ్రీలకు రెండేళ్ల కుమార్తె ఉంది. తల్లి జయశ్రీ మృతి చెందడంతో ఇంక ఆ పాపకు దిక్కెవరు? అమ్మలేని లోటు తీరెదెలా? అని స్థానికులు కంట తడిపెడుతున్నారు. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు వృద్ధాప్యంలో ఉండటం.. క్షణికావేశంలో జయశ్రీ ఆత్మహత్య చేసుకోవడంతో ముక్కుపచ్చలారని చిన్నారి అనాథగా మిగిలిపోయింది. చిన్నారి అమ్మ కావాలని ఏడుస్తుండటం.. స్థానికులను కలిచివేస్తోంది. -
వివాహిత ఆత్మహత్య
అన్నానగర్ : మాడంబాక్కంలో భార్య, భర్తల మధ్య జరిగిన ఘర్షణలో మనస్తాపం చెందిన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మాడంబాక్కం, పద్మావతి నగర్, 23వ వీధికి చెందిన షణ్ముగం(40). కేళంబాక్కంలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని భార్య రేఖ(34). వీరికి మూడు సంవత్సరాల కుమార్తె ఉంది. ఈ చిన్నారికి త్వరలో పుట్టినరోజు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం చిన్నారి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించే విషయంలో భార్యభర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో షణ్ముగం చిన్నారిని తీసుకుని తన తల్లి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో రేఖ ఒంటరిగా ఉంది. అంతకుముందు జరిగిన ఘర్షణతో మనస్తాపం చెందిన రేఖ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి ఇంటికి వచ్చిన షణ్ముగం భార్య ఉరి వేసుకుని శవంగా కనిపించడంతో దిగ్భ్రాంతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న సేలైయూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.