breaking news
marketing manager
-
ఐసిస్తో సంబంధాలున్నాయని..
జైపూర్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మార్కెటింగ్ మేనేజర్ మహమ్మద్ సిరాజుద్దీన్కు ఈ నెల 21 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించినట్టు జైపూర్ పోలీసులు పేర్కొన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ఐఎస్ఐఎస్)తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో అతడిని గురువారం జైపూర్లో రాజస్థాన్ పోలీసులు, తీవ్రవాద నిరోధక విభాగ అధికారులు అరెస్ట్ చేశారు. ఐఎస్ఐఎస్ లో చేరేందుకు అతడు ఇటీవల హైదరాబాద్ యువతితో చాటింగ్ చేసినట్టు తెలిసింది. దాంతో రంగంలోకి దిగిన జైపూర్ పోలీసులు, తీవ్రవాద నిరోధక విభాగం చట్ట వ్యతిరేక కార్యకలాపాల కింద సిరాజుద్దీన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన సిరాజుద్దీన్ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ.. సామాజిక వెబ్సైట్లలో ఫోటోలు, వీడియోలను పోస్టు చేసినట్టు పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఐసిస్కు సంబంధించిన ఓ మ్యాగజైన్ను కూడా డౌన్లోడ్ చేసినట్టు తెలిపారు. మహమ్మద్ సిరాజుద్దీన్ భారత్ సహా ఇతర దేశాలలో ఆన్లైన్ ద్వారా తీవ్రవాద సంస్థతో సంబంధాలను పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
హైదరాబాద్లో మహిళపై గ్యాంగ్రేప్
హైదరాబాద్: హైదరాబాద్లో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేసే ఓ ఉద్యోగినిపై సంస్థ యజమాని, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గ్యాంగ్రేప్నకు పాల్పడ్డాడు. బాధితురాలు గతనెల 25న కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రేప్ విషయం బయటకు చెపితే చంపేస్తానని ఆ ముగ్గురు యువకులు బెదిరించారని బాధితురాలు కోర్టుకు తెలిపింది. కేసు వివరాలివీ.. హబ్సిగూడలోని ఫార్చున్ బట్టర్ ఫ్లై సిటీ కార్యాలయంలో మార్కెటింగ్ మేనేజర్ ఉద్యోగం ఉందని తెలిసి బాధితురాలు దరఖాస్తు చేసుకుంది. ఇంటర్వ్యూ చేసిన సంస్థ యజమాని సంకు రమణ.. బాధితురాలికి ఉద్యోగం ఇచ్చాడు. కొద్దిరోజుల తర్వాత మాదాపూర్లో మరో బ్రాంచ్ ప్రారంభిస్తున్నామని, అక్కడే పని చేయాల్సి ఉంటుందని మహిళకు చెప్పాడు. దీంతో గతేడాది నవంబర్ నుంచి బాధితురాలు మాదాపూర్లోని కార్యాలయానికి వెళ్తోంది. గతనెల 30వ తేదీన బాధితురాలిని అయ్యప్ప సొసైటీలోని ప్లాట్కు రమణరప్పించాడు. స్నేహితులు కిరణ్, రాజేశ్తో కలిసి అత్యాచారం చేశాడు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. -
విజయం: వి ఫర్ విక్టరీ, వినీత!
రస్నా, క్యాడ్బరీ, కోకాకోలా, బ్రిటానియా.. వీటిల్లో ఒకదానితో మరొకదానికి సంబంధం లేకపోవచ్చు! కానీ ‘వినీత బాలి’ అనే పేరుకు మాత్రం వీటన్నింటితోనూ సంబంధముంది! వినీత ఓ ఉద్యోగిగా చేరి రస్నాలో కెరీర్కు శ్రీకారం చుట్టారు. క్యాడ్బరీ అధినేత క్యాడ్బరీనీ మెప్పించారు. కోకాకోలాకు ప్రపంచవ్యాప్త మార్కెటింగ్ మేనేజర్గా పనిచేశారు. కష్టాల్లో ఉన్న బ్రిటానియాను పట్టాలపైకి తెచ్చి ఆదాయంలో అనూహ్య వృద్ధి సాధించేలా చేశారు. సాధారణ కుటుంబంలో పుట్టి అసామాన్యంగా ఎదిగిన ఈ ధీర వనిత జీవితం.. ఓ స్ఫూర్తి పాఠం! ‘‘ఆడా, మగా అన్న తేడాల గురించి మాట్లాడితే నాకు నచ్చదు. ఇక్కడ సామర్థ్యమే ముఖ్యం. ఆడవాళ్లకు అవకాశాలు రాకపోవడమే సమస్య. వస్తే ఏమైనా సాధించగలరు.’’ - వినీత బ్రిటానియా సంస్థ కష్టాల్లో ఉన్న కాలమది. ఆ సంస్థకు దీర్ఘకాలం మేనేజింగ్ డెరైక్టర్గా పనిచేసిన సునీల్ అలగ్ను పదవి నుంచి తప్పించాక బ్రిటానియా గాడి తప్పింది. ఆ స్థితిలో వినీత బాలి బ్రిటానియా ఎండీగా బాధ్యతలందుకున్నారు. ఎనిమిదేళ్లు గడిచాయి. సమస్యలన్నీ సర్దుకున్నాయి. బ్రిటానియా అనేక కొత్త ఉత్పత్తుల్ని ప్రవేశపెట్టింది. సంస్థ ఆదాయం మూడింతలు పెరిగింది. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద ఫుడ్ కంపెనీల్లో బ్రిటానియా ఒకటి. ఏమంత గొప్ప నేపథ్యం లేని ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన వినీత.. కార్పొరేట్ సంస్థల్ని విజయవంతంగా నడిపించడం, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం మామూలు విషయం కాదు. బెంగళూరుకు చెందిన వినీత ఢిల్లీలోని శ్రీరాం కళాశాలలో ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ముంబయిలో ఎంబీఏ చేసి ఫారిన్ సర్వీస్లో చేరాలన్నది ఆమె లక్ష్యం. కానీ ఎంబీఏ చేస్తుండగానే వోల్టాస్ సంస్థ పిలిచి మరీ ఉద్యోగమిచ్చింది. అక్కడికెళ్లి అందరిలా ఉద్యోగం చేసుకోకుండా ‘రస్నా’ను మార్కెట్లోకి తెచ్చారు వినీత. అంతే. దెబ్బకు జీవితం మారిపోయింది. వెంటనే దిగ్గజ చాక్లెట్ సంస్థ ‘క్యాడ్బరీ’ నుంచి ఆహ్వానం! అక్కడ పనితీరుకు సంస్థ అధినేత అడ్రియన్ క్యాడ్బరీ నుంచి ప్రశంసలు. ఉద్యోగ జీవితం సాగుతుండగానే రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి విదేశాల్లో చదివేందుకు వినీతకు స్కాలర్షిప్ వచ్చింది. అవకాశాన్ని వదులుకోకుండా వెళ్లి యుఎస్లో చదువుకుని మరింత రాటుదేలారామె. ఆ తర్వాత ఆమె మరో కంపెనీ వైపు చూడలేదు. యూకేలో సీనియర్ బ్రాండ్ మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చింది క్యాడ్బరీ. అక్కడ వినీత ప్రవేశపెట్టిన ‘విస్పా’ చాక్లెట్ మార్కెట్లో ఓ సంచలనం! క్యాడ్బరీ నుంచి వినీత తదుపరి ప్రయాణం శీతలపానీయాల దిగ్గజ సంస్థ కోకాకోలాలోకి. ఆ సంస్థకు ఆమె వరల్డ్వైడ్ మార్కెటింగ్ మేనేజర్గా పనిచేశారు. ఈ బాధ్యతల్లో ఆమె ఎన్నో దేశాలు తిరిగారు. ఈ క్రమంలో ఆమె 45 దేశాలు చూశారు. ఆరు దేశాల్లో నివాసమున్నారు. తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో 2005లో తప్పనిసరి పరిస్థితుల్లో బెంగుళూరుకి వచ్చేశారు వినీత. ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి రావడంతో అప్పటికే నష్టాలలో ఉన్న బ్రిటానియాలో చేరారు. ఓవైపు తల్లి అనారోగ్యం, మరోవైపు సంస్థ కష్టాలు. సాధారణంగా స్త్రీలు చాలా బంధాల్లో చాలా ఎమోషనల్ అంటారు. నిజమే.. ఆమెకు తల్లితో ఉన్న బంధమే సంస్థతో కూడా ఉంది. అంత ఎమోషన్ ఉంది కాబట్టే తల్లినీ చూసుకున్నారు, సంస్థనూ నిలబెట్టారు. బ్రిటానియా తరఫున ఆమె నెలకొల్పిన న్యూట్రిషన్ ఫౌండేషన్ చిన్నపిల్లల్లో పోషకాహార లోపాల్ని నివారించేందుకు కృషి చేస్తోంది. అంతేకాకుండా ఫౌండేషన్ ద్వారా సమాజానికి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇండియాలోని బిస్కెట్ కంపెనీల్లో అతి సామాన్యులకు-సంపన్నులకు ఇరువురికి నచ్చే ఉత్పత్తులను తేగలిగిన సత్తాకి సంస్థను వృద్ధి చేశారు. అందుకే 2011లో ఫోర్బ్స్.. వినీతను ఆసియాలోని 50 మంది అత్యుత్తమ మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా గుర్తించింది. అంతేనా.. మరెన్నో పురస్కారాలు వినీత సొంతమయ్యాయి. - ప్రకాష్ చిమ్మల