-
ఫస్ట్ ఉమెన్ మెరైన్ ఇంజనీర్
పాతికేళ్ల కిందట.. మగవాళ్లు మాత్రమే పనిచేయగలరు అనే చోట.. ఓ ఇరవై రెండేళ్ల అమ్మాయి ‘నేను సైతం’ అంది. ఎంపిక చేసిన 1500 మందిలో తను ఒక్కతే అమ్మాయి. అయినా వెనకడుగు వేయలేదు. మొట్టమొదటి ఇండియన్ ఉమెన్ మెరైన్ ఇంజినీర్గా విధులకు సన్నద్ధమైంది. ఆమె వేసిన మార్గం మరికొందరు అమ్మాయిల్లో ధైర్యం నింపింది. ఆమే సోనాలీ బెనర్జీ. ‘నేను నా బాల్యంలోనే సముద్రంతో ప్రేమలో పడ్డాను’ అంటూ నవ్వుతూ చెబుతుంది సోనాలీ. చిన్నతనంలో మొదటిసారి ఓడలో ప్రయాణించినప్పుడు అదే ఓడలో పనిచేయాలని కన్న కల పెద్దయ్యాక సాకారం చేసుకుంది. కష్టమైన ఇష్టం సోనాలీబెనర్జీ అలహాబాద్లో పుట్టి పెరిగింది. ఆమెకు చిన్నప్పటి నుంచి సముద్రం, ఓడ ప్రయాణం అంటే మహా ఇష్టం. ఓడల ద్వారానే ప్రపంచం మొత్తం ప్రయాణించాలనుకుంది. ఆమె ఇష్టాన్ని కనిపెట్టిన మేనమామ కలను సాకారం చేసుకోవాలంటే మెరైన్ ఇంజినీర్ అవమని ప్రోత్సహించాడు. 1995లో ఐఐటి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మెరైన్ ఇంజనీరింగ్లో ప్రవేశం పొందింది. మెరైన్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక, షిప్పింగ్ సంస్థలో 6 నెలల ఫ్రీ కోర్సుకు ఎంపికయ్యింది. నాలుగేళ్ల కష్టం తర్వాత 27 ఆగస్టు 1999 న మెరైన్ ఇంజనీర్ అయ్యింది. మెరైన్ ఇంజనీర్ పని ఓడ మరమ్మత్తు, నిర్వహణ. ‘నేటి ఆధునిక నౌకలలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఒక మెరైన్ ఇంజనీర్ ఈ తాజా సాధనాలను అర్థం చేసుకోవాలి. ఈ పరికరాలను ఆపరేట్ చేయడానికి, రిపేర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి’ అంటోంది సోనాలీ. తండ్రికి అయిష్టం సోనాలి మెరైన్ ఇంజినీర్ అవడం అప్పట్లో ఆమె తండ్రికి అస్సలు ఇష్టం లేదు. అది పురుషుల రంగం. అందులో ఓ ఆడపిల్ల వెళ్లి ఎలా పనిచేయగలదు అనేవాడు. కానీ, సోనాలి ఆడపిల్లలు కూడా పురుషుల రంగంలో పనిచేయగలరు అని తండ్రికి నిరూపించింది. అయితే, పురుషుల రంగంలో పనిచేయడం సోనాలీకి అంత సులభం కాలేదు. తనతో చదువుతున్న చాలా మంది అబ్బాయిలు కూడా ఆమె ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడానికే ప్రయత్నించారు. కానీ అధ్యాపకులు మాత్రం ఎప్పుడూ ఆమె ప్రోత్సహించారు. ఏకైక మహిళ మెరైన్ ఇంజనీర్ అయినప్పుడు ఆమె వయసు 22 సంవత్సరాలు. కోల్కతా సమీపంలోని తారత్లాలో ఉన్న మెరైన్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో ప్రవేశం పొందిన తరువాత, 1500 మంది క్యాడెట్లలో ఆమె ఏకైక మహిళ అని తెలిసింది. దీంతో మొదట్లో సోనాలికి ఇబ్బందిగా అనిపించింది. దానివల్ల ఆమెను ఎక్కడ ఉంచాలి అని ఇటు తల్లిదండ్రులు, అధ్యాపకులు చర్చించారు. సుదీర్ఘ చర్చల తరువాత ఆమెను ఆఫీసర్స్ క్వార్టర్లో ఉంచారు. కోర్సు పూర్తయ్యాక సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, ఫిజి, ఆస్ట్రేలియాలో శిక్షణ పూర్తి చేసింది. నాలుగేళ్ల కృషి తరువాత 27 ఆగస్టు 1999 న మెరైన్ ఇంజనీర్ అయ్యింది. ఓడలోని మిషన్ రూమ్ బాధ్యతలు చేపట్టింది. సమర్థవంతంగా విధులను నిర్వరిస్తోంది. -
నిశ్చితార్థం రోజే నేవీ ఇంజనీర్ దుర్మరణం
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలో ఘోరం జరిగింది. మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆ యువకుడికి మరి కొద్ది గంటల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే ఇంట్లో భారీ పేలుడు సంభవించి అతడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం సత్యనారాయణ కాలనీలోని సాయిబాబా ఆలయం సమీపంలో నివసిస్తున్న రైల్వే ఉద్యోగి విన్నకోట హరగోపాల్, దమయంతిల కుమారుడు రాజా(26) మంగళవారం రాత్రి అనూహ్యంగా మరణించాడు. నౌకాదళం(నేవీ)లో మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రాజాకు ఇటీవలే పెళ్లి సంబంధం కుదిరింది. బుధవారం ఉదయం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. కార్యక్రమానికి కావల్సిన వస్తువులు షాపింగ్ చేసేందుకు నిన్న సాయంత్రం హరగోపాల్, దమయంతి దంపతులు నగరానికి వచ్చారు. ఇంట్లో రాజాతోపాటు అమ్మమ్మ ఉంది. ఇంతలోనే ఉన్నట్లుండి ఫ్రిజ్ చెడిపోయింది. దీంతో రాజా.. మెకానిక్ ను పిలిపించాడు. ఫ్రిజ్ ను ఊడదీసి పరిశీలించిన మెకానిక్.. పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువుల స్థానంలో కొత్తవి కొనుక్కొస్తానని వెళ్లాడు. ఈలోగా అమ్మమ్మకు కాఫీ పెట్టిద్దామని వంట గదిలోకి వెళ్లిన రాజా గ్యాస్ స్టౌ వెలిగించాడు. అంతే! క్షణంలో గది నిండా మంటలు వ్యాపించాయి. సిలిండర్ పేలడంతో మంటలు ఎక్కువయ్యాయి. ఆ వెంటనే పక్కనున్న మరో సిలిండర్ కూడా పేలింది. అగ్నికీలల ధాటికి వంటగది అమాంతం కూలిపోయింది. మంటల్లో చిక్కుకున్న రాజా తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే ఇంట్లోని సోఫాలు, ఎల్ఈడీ టీవీలతో పాటు వంట సామగ్రి, తదితరాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ ఇంటి బయట కూర్చున్న రాజా అమ్మమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, 108 సిబ్బంది, ఫైర్ సిబ్బంది.. అతికష్టం మీద మంటలను ఆర్పి రాత్రి 10 గంటల సమయంలో రాజాను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి ఒంటి గంట సమయంలో రాజా కన్నుమూశాడు. ఒక్కగానొక కొడుకు నిశ్చితార్థం జరగాల్సిన రోజే అంత్యక్రియలు జరగడంతో మృతుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా, ఫ్రిజ్ రిపేర్ సమయంలో అందులో ఉండే నైట్రోజన్ గ్యాస్ లీకవ్వడం వల్లనే గ్యాస్ సిలిండర్ అంటుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement