breaking news
Mango Baskets
-
ఇంతకంటే దారుణం ఉండదు
-
ఇది నిజమా.. ఇంతకంటే దారుణం ఉండదు
న్యూఢిల్లీ: మామిడ పండ్ల వ్యాపారం చేసుకునే ఒక పేద వీధి వ్యాపారిని కొంతమంది జనం దోచుకున్న వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటనపై నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఇది చాలా దారుణమంటూ సోషల్ మీడియాను హోరెత్తించారు. దీనిపై మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, దీప్దాస్ గుప్తాలు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇంత దారుణమా.. నేను షాకయ్యా..భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకూడదని ఆశిస్తున్నా’ అని దీప్దాప్ గుప్తా పేర్కొనగా, ‘ ఇది నిజమా..ఆ వీడియో రియలేనా. నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఒకవేళ ఇది నిజమైతే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు’ అని ఆకాశ్ చోప్రా ఆవేదన వ్యక్తం చేశాడు. వీరిద్దరూ ఢిల్లీ క్రికెటర్లు కావడంతో ఈ ఘటన వారిని మరింత ఆందోళనకు గురిచేసింది.(సిగ్గు..సిగ్గు.. వీధి వ్యాపారిని దోచేసిన జనం!) గురువారం ఢిల్లీ నగరంలో ఒక స్కూల్ వద్ద మామిడి పండ్లు అమ్మే పేద వీధి వ్యాపారికి మరొక వ్యాపారికి మధ్య గొడవ జరిగింది. ఆ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం పెరిగింది. ఇదే అదునుగా భావించిన కొంతమంది ఆ మామిడి పండ్లను నిమిషాల వ్యవధిలోనే లూటీ చేశారు. గొడవ ముగిసి సదరు వ్యాపారి చూసుకునే సరికి అక్కడ ఉన్న బాస్కెట్లో మామిడి పండ్లు అన్నీ దాదాపు ఖాళీ అయిపోయాయి. సుమారు రూ. 30 వేల విలువ గల సరుకును జనం ఇలా దోచుకోవడంపై ఆ వ్యాపారి కన్నీరుమున్నీరయ్యాడు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.(నీకు.. 3డీ కామెంట్ అవసరమా?: గంభీర్) -
సిగ్గు..సిగ్గు.. వీధి వ్యాపారిని దోచేసిన జనం!
న్యూఢిల్లీ: కష్టాలు వచ్చినప్పుడే మనలోని అసలు మనిషి బయటకు వస్తాడు. బాగున్నప్పుడు విలువలు చెప్పి.. కష్టాల్లో ఉన్నప్పుడు తప్పులు చేస్తే ఇక విలువలకు అర్థం ఏం ఉంటుంది. ఇప్పడు ఈ ముచ్చట ఎందుకంటే పైన చెప్పిన డైలాగ్కు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి ప్రస్తుతం ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. చోటు అనే వ్యక్తి బండి మీద మామిడి పళ్లు పెట్టుకుని అమ్ముతుంటాడు. ఈ క్రమంలో నిన్న ఓ స్కూల్ దగ్గర పండ్ల బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటుండగా.. చోటుకు, పక్క దుకాణదారుకి గొడవ జరిగింది. వారిద్దరూ అలా కొట్టుకుంటుండగా ఆ పక్క వెళ్లే జనాలు దీన్ని అదునుగా భావించి చోటు బండి మీద ఉన్న మామిడి పళ్లను అందినకాడికి అందుకుని వెళ్లారు. కొందరు హెల్మెట్లో పెట్టుకుని మరి వెళ్లారు. చోటు వచ్చి చూసేసరికి బండి మొత్తం ఖాళీ అయ్యింది. దాదాపు 30 వేల రూపాయల విలువైన మామిడి పళ్లను ఎత్తుకెళ్లారు జనాలు. ఖాళీ బండి చూసి లబోదిబోమంటున్నాడు చోటు. లాక్డౌన్తో దాదాపు రెండు నెలలుగా జనాలకు పనులు లేవు.. డబ్బులు కూడా లేవు. మరోవైపు మామిడి పళ్ల రేటు ఆకాశాన్ని తాకింది. ఈ క్రమంలో జనాలు.. ఇదే చాన్స్గా అందినకాడికి మామిడి పండ్లను ఎత్తుకుని వెళ్లారు. (ఈ ఏడాది నయమే..) -
మామిడితాండ్ర C/O ఊనగట్ల
చాగల్లు: పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలో మామిడి తాండ్ర తయారీ కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందింది. మామిడి పండ్ల గుజ్జు నుంచి తాండ్రను తయారు చేస్తారు. ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ గ్రామంలో మామిడి తాండ్ర తయారీ ముమ్మరంగా జరుగుతుంది. మామిడి పండ్లను గతంలో రోళ్లలో వేసి కుమ్మి గుజ్జు తీసేవారు. ఇప్పుడు అధునాతమైన యంత్రాలు సహాయంతో గుజ్జు తీస్తున్నారు. ఆ గుజ్జులో బెల్లం లేదా పంచదార కలిపి తాటాకు చాపలతో మామిడి గుజ్జును పూతగా పెడతారు. ఈ విధంగా ఎండాకాలంలో రోజుకు ఐదు నుంచి ఎనిమిది సార్లు చొప్పున వారం రోజులపాటు పూత పెడితే మామిడితాండ్ర తయారవుతుంది. చాపల మాదిరిగా ఉన్న తాండ్రను ఆరిన తరువాత వాటిని చిన్నసైజు ముక్కలుగా కోసి 50 కిలోలు చొప్పున పెట్టెల్లో ప్యాక్ చేసి భద్రపరుస్తారు. మామిడి పళ్లకు పెరిగిన గిరాకీ మామిడితాండ్రకు కలెక్టర్, రసాలు, బంగినపల్లి వంటి మామిడిపళ్ల రకాలను వినియోగిస్తారు. ఈ ఏడాది మామిడి పళ్లకు గిరాకీ ఎక్కవగా ఉండటంతో టన్ను రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు మామిడితాండ్ర తయారీదారులు చెబుతున్నారు. నిడదవోలు, కొవ్వూరు పాడు, ద్వారకాతిరుమల, తాడేపల్లిగూడెం, నూజివీడు మార్కెట్ల నుంచి మామిడికాయలను టన్నుల లెక్కన కొనుగోలు చేస్తారు. గత రెండేళ్లుగా వాతావరణం అనుకూలించక మామిడికాయల కాపు తగ్గి రేట్లు గణనీయంగా పెరిగాయని తయారీదారులు చెబుతున్నారు. గ్రామంలో 450 మందికి ఉపాధి మామిడి తాండ్ర తాయారీ కేంద్రాలు పెద్ద కేంద్రాల్లో 25 నుంచి 30 మంది, చిన్న కేంద్రాల్లో 15 నుంచి 20 మంది ఉపాధి పొందుతున్నారు. గ్రామంలో సుమారు 450 మందికి పైగా మహిళలు, పిల్లలు ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో మామిడితాండ్ర తయారీ సమయం కావడంతో మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆదాయ వనరుగా కూడా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తుంది. రైతులకు మామిడికాయలకు గిట్టుబాటు ధర రావడానికి కూడా ఇంది ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ విధంగా ఈ ప్రాంత ప్రజలకు మామిడితాండ్ర తయారీ చక్కని ఉపాధి అవకాశాలను కలిగిస్తోంది. మార్కెట్ లేక తగ్గిన తయారీ కేంద్రాలు మామిడితాండ్ర తయారీ ద్వారా రోజుకు టన్ను మామిడికాయల వరకు దిగుమతి చేసుకుంటారు. మామిడితాండ్రను అందమైన ముక్కలు కోసి 50 కేజీలు చొప్పున పెట్టెలుగా పెట్టి 200 పెట్టెలను లారీకి ఎగుమతి చేస్తుంటారు. టోకున మామిడితాండ్ర ధర క్వింటాలు రూ.7 వేలు నుంచి రూ.8 వేల వరకు ధర ఉంటుంది. ఆ వంతున రూ.50 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ముంబై, చెన్నై తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి తాండ్ర ఎగుమతి అధికంగా జరిగేది. అయితే గతంలో వ్యాపారస్తులు మామిడితాండ్ర తయారీదారులను మోసగించి డబ్బులు సక్రమంగా చెల్లించకపోవడం వల్ల చాలావరకు ఎగుమతులు తగ్గిపోయాయి. మార్కెటింగ్ లేక ఇబ్బందులు పడుతున్నామని వీరు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం మామిడితాండ్ర తయారీ కేంద్రాలు గత రెండేళ్ల క్రితం 50 వరకు ఉండగా ప్రస్తుతం 10 కేంద్రాలకు పరిమితమయ్యాయి. మామిడితాండ్రను స్థానికంగా అమ్మడానికే తయారీదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తయారీదారులే కాకుండా మామిడితాండ్రను సైకిళ్లపై విక్రయిస్తూ మరో వంద మంది వరకు ఉపాధి పొందుతున్నారు. రుణ సౌకర్యం కల్పించాలి ఎన్నో ఏళ్లుగా మామిడితాండ్ర తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నాం. బ్యాంకులు రుణ సౌకర్యం కల్పిస్తే ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తెచ్చుకునే అవకాశం ఉండదు. మామిడికాయల రేట్లు గత రెండేళ్లుగా బాగా పెరగడం, మార్కెటింగ్ సమస్య వల్ల తయారీదారులు తగ్గిపోయారు. రుణ సౌకర్యం కల్పించి ప్రోత్సహించాలి. – కె.శ్రీనివాసరావు, మామిడితాండ్ర తయారీదారుడు, ఊనగట్ల మహిళలకు ఉపాధి మామిడితాండ్రను కుటీర పరిశ్రమగా వేసవికాలంలో మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పనిని బట్టి రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకు కూలి లభిస్తుంది. ఈ ప్రాంత మహిళలకు తాండ్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రభుత్వం మామిడితాండ్ర పరిశ్రమను గుర్తించి పోత్స్రహించాలి. – యాండ్ర మాణిక్యం, మామిడితాండ్ర తయారీ కూలీ, ఊనగట్ల సీజన్లో పనికి వెళతా నేను డిగ్రీ చదివాను. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వేసవిలో తాండ్ర తయారీ పనులకు వెళుతున్నాను. సీజన్లో ఈ పనులకు వెళ్లడం వల్ల కుటుంబానికి ఆర్థికంగా అసరాగా ఉపయోగపడుతున్నాను. సీజన్లోనే పని ఉంటుంది. ఆ సమయంలో ఎంతో కొంత సంపాదించుకుంటున్నాను. నాలాగే చాలా మంది దీనిపై ఆధారపడ్డాం. – కోడి సతీష్, యువకుడు, ఊనగట్ల -
ఘనంగా మ్యాంగో ఫెస్టివల్
వడోదర: గుజరాత్ లోని వడోదరలో మ్యాంగో ఫెస్టివల్ ను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కళ్యాణ్ రాయిజీ దేవాలయంలో నిర్వహించిన ఈ ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా దాదాపు పాతిక వేల బుట్టల మామిడి పళ్ల ను శ్రీ కృష్ణునికి నైవేద్యంగా సమర్పించారు. వేలాదిగా తరలివచ్చిన మామిడి పళ్లతో దేవాలయప్రాంగణమంతా కళకళలాడింది. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు,పురుషులు సంప్రదాయ బద్ధంగా ప్రత్యేక మామిడిపళ్లను స్వామికి సమర్పించారు. వడోదరలో కన్నుల పండుగా నిర్వహిస్తున్న మ్యాంగో ఫెస్టివల్ ను వేలాదిమంది భక్తులు తిలకించి , ప్రసాదాన్ని స్వీకరించారు. 50 వేల మంది భక్తులు ఆలయాన్ని సందర్భించారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.