breaking news
Mangala Bank
-
బెగ్గర్ల కోసం ఒక బ్యాంక్!
బెగ్గర్ల కోసం, బెగ్గర్ల చేత, బెగ్గర్లతో నిర్వహింపబడుతున్న బ్యాంక్ అది! పేరు ‘మంగళ బ్యాంక్’. బీహార్లోని గయలో ఉంటుంది. బహుశా ముష్టెత్తుకొనే వాళ్ల కోసం ఏర్పడిన తొలి బ్యాంక్ ఇదే కావొచ్చు. భిక్షాటన చేసి బిచ్చగాళ్లు సంపాదించుకునే మొత్తంతో ఈ బ్యాంక్ను నడుపుతున్నారు. దీనికి ఒక మేనేజర్, ట్రెజరర్, డెరైక్టర్లు ఉన్నారు. వీరందరూ కూడా భిక్షగాళ్లే. ప్రత్యేకంగా ఆఫీసు లేదు కానీ.. మాంఝీఅనే ఒక బిచ్చగాడి ఇంటి నుంచి ఈ బ్యాంక్ ఆపరేట్ అవుతూ ఉంటుంది. గయలో ‘మా మంగళగౌరీ మందిర్’ అని ఒక ప్రముఖ దేవాలయం ఉంది. భక్తుల తాకిడి బాగా ఉంటే ఆ ప్రాంతంలో చాలా మంది యాచకులు ఉంటారు. అనునిత్యం రద్దీగా ఉంటే ఆ ఆలయ ప్రాంగణంలో దానం చేస్తే పుణ్యం వస్తుందనే నమ్మకం ఉండటంతో వీళ్లకు బాగానే గిట్టుబాటు అవుతోంది. ఈ నేపథ్యంలో ఏడాది కిందట యాచకులంతా ఒక సొసైటీగా ఏర్పడి బ్యాంక్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో మొత్తం 40 మంది ఖాతాదారులున్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ వారానికి 20 రూపాయలు చొప్పున కట్టాలి. దీంతో వారానికి దాదాపు ఎనిమిదివందల రూపాయల నిధి ఏర్పడుతుంది. అంటే నెలకు 3,200 రూపాయలు. ఇలా ఏడాదిగా నడుస్తున్న బ్యాక్ టర్నోవర్ దాదాపు 40 వేల రూపాయలకు చేరింది. ఈ డబ్బును ఖాతాదారులకు అప్పుగా ఇస్తారు. కనీసం ఎనిమిది వేల రూపాయల వరకూ రుణపరిమితి ఉంటుంది. అత్యవసరాల సమయాల్లోనే అప్పు ఇస్తారు. నెల వరకూ ఎలాంటి వడ్డీ ఉండదు. రెండో నెల నుంచి తక్కువ పర్సెంట్లోనే వడ్డీ పడుతుంది. కొన్ని టర్మ్లలో లోన్ను తీర్చేయాల్సి ఉంటుంది. దీని వల్ల తమకు చాలా ఉపయోగం కనిపిస్తోందని.. అత్యవసర సమయాల్లో ఈ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొన్న యాచకులు చెబుతున్నారు. యాచకులే అయినా వీరి సంఘటిత శక్తి బాగానే ఉందనుకోవాల్సి వస్తోంది. వీరు ఇలాగే ఆ బ్యాంక్ టర్నోవర్ను భారీ స్థాయిలో అభివృద్ధి చేసి.. ప్రపంచానికి కొత్త ఆర్థిక పాఠాలు చెబుతారేమో చూడాలి! -
ఆ బ్యాంక్లో అందరూ బెగ్గర్సే..
బీహార్: ఇప్పటివరకూ మహిళలకు, రైతులకు ప్రత్యేక బ్యాంకుల గురించి విన్నాం. అయితే మేము ఎందులోనూ తక్కువ కాదంటూ బెగ్గర్లు కూడా ఓ బ్యాంక్ను ఏర్పాటు చేసుకున్నారు. బీహార్ రాష్ట్రం గయాలో ఇప్పుడు ఆ బ్యాంక్ ...బెగ్గర్లను ఆకట్టుకుంటోంది. భిక్షాటన చేసి పొట్టపోసుకునే 40 మంది భిక్షగాళ్లు 'మంగళ' పేరుతో ఓ బ్యాంక్ను ఏర్పాటు చేసుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన గయాలోని మంగళగౌరి అమ్మవారి గుడిలోని భిక్షకుల ఆలోచనకు ప్రతిరూపమే ఈ మంగళ బ్యాంక్. అపుడెపుడో..అడుక్కుని ఆస్తులు కూడబెట్టిన భిక్షగాళ్ల ఆస్తుల వివరాలు విని విస్తుపోయాం... బెగ్గర్ల లైఫ్ స్టైల్ తెలుసుకుని అవాక్కయ్యాం....ఇపుడు బెగ్గర్లు తమకోసం తాము ఏర్పాటు చేసుకున్న బ్యాంక్ గురించి వింటే వార్నీ అనక మానరు. ఎందుకంటే డబ్బులు ఎక్కువై వీళ్లు ఈ బ్యాంక్ను ఏర్పాటు చేసుకోలేదు. కనీసం రేషన్ కార్డు, ఆధార్ కార్డు లాంటివి కూడా వీరికి అందుబాటులో లేవు. దాంతో తమ భవిష్యత్ అవసరాల కోసం, ఆపదలో ఉన్నపుడు, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నపుడు తమను ఆదుకోవడం కోసం చేసుకున్న ఒక చిన్న వెసులుబాటు ఈ మంగళబ్యాంక్. కాగా ఇక్కడ మేనేజర్ సహా సిబ్బంది అంతా బెగ్గర్లే. అంటే బెగ్గర్ల బ్యాంక్ అన్నమాట. రిథమిక్గా వినడానికి ఎంత బావుందో.... ఈ ప్రయత్నం వెనుక వారి కృషి పట్టుదల కూడా అంతే హర్షణీయంగా ఉంది. ఈ మంగళబ్యాంక్ మేనేజర్ రాజ్ కుమార్ మాంఝీ మాటల్లో చెప్పాలంటే.. 40మంది సభ్యులు, ఒక మేనేజర్, ట్రెజరర్, సెక్రటరీ, ఓ ఏజెంట్ ఉన్న ఈబ్యాంక్లో ప్రతీ కార్యక్రమాన్ని కలిసికట్టుగా చేసుకుంటారు. అచ్చంగా అన్ని బ్యాంకుల్లాగానే వీరికి నియమ నిబంధనలు ఉంటాయి. ప్రతీ మంగళవారం తలా రూ.20 చొప్పున మొత్తం రూ.800 జమ చేసుకుంటారు. అలా కూడబెట్టిన సొమ్మును తమ అవసరాల కోసం వాడుకుంటారు. అంతేకాకుండా తమకూ లోన్ సదుపాయం ఉందని బ్యాంక్ సెక్రటరీ మాలతీదేవి చెబుతోంది. ప్రమాదంలో గాయపడిన ఒక బెగ్గర్ కుటుంబానికి ఎనిమిది వేల రూపాయల సాయాన్ని కూడా అందించినట్లు తెలిపింది. తమ భవిష్యత్ అవసరాల కోసం మంగళ బ్యాంక్ బాగా ఉపయోగపడుతోందని సభ్యులందరూ సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర నిరుపేదలు, సాంఘిక సంక్షేమ సంస్థ సహకారంతో గత సంవత్సర కాలంగా ఈ బ్యాంక్ను విజయవంతంగా నడిపిస్తున్నారు. అన్నట్టు ఈ బ్యాంక్ సిబ్బంది అంతా బ్యాంక్ కార్యకలాపాల నిర్వహణ కోసం బాగా చదువుకోవడం మరో విశేషం.