breaking news
Majeed Memon
-
గవర్నర్తో సీఎం భేటీ అందుకేనా!
జైపూర్/ఢిల్లీ: రాజస్తాన్లో వారం క్రితం మొదలైన రాజకీయ సంక్షోభం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే, అక్కడ పరిస్థితులు చక్కబడుతున్నాయని, సంక్షోభం ముగియనుందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన కీలక నేత మజీద్ మీమాన్ చెప్తున్నారు. అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి ఢోకా లేదని అంటున్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్లో మాదిరిగా రాజస్తాన్లో ఆపరేషన్ లోటస్ విజయవంతం కాబోదని ఆయన జోస్యం చెప్పారు. విశ్వాసపరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్గుతుందని మీమాన్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో భేటీ కావడంలోనే సీఎం గహ్లోత్ విశ్వాసం తెలుస్తోందన్నారు. బీజేపీ పెద్దలతో కలిసి పైలట్ వేసిన ఎత్తుగడలు పారలేదని మీమాన్ చురకలు వేశారు. భేటీ అందుకేనా? గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో సీఎం గహ్లోత్ రాజ్భవన్లో శనివారం భేటీ అయ్యారు. 45 నిముషాలపాటు జరిగిన ఈ భేటీలో తమ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఎమ్మెల్యేల లిస్టును ముఖ్యమంత్రి గవర్నర్కు అందించినట్టు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, మరికొందరు స్వతంత్ర ఎమ్మెల్యేల వివరాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతోపాటు బలపరీక్షకు అసెంబ్లీని సమావేశ పరచాలని కూడా ఈ భేటీలో సీఎం కోరి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్పీకర్ అనర్హత నోటీసులపై సచిన్ పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేలు 18 మంది హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వారి పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు అనర్హత నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పీకర్ హైకోర్టుకు విన్నవించారు. (చదవండి: పైలట్తో 18 నెలలుగా మాటల్లేవ్: గహ్లోత్) ఆహ్వానిస్తాం కాగా, పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని సీఎం గహ్లోత్, కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు. మరోవైపు బీజేపీలో చేరేది లేదని పైలట్ ఇదివరకే స్పష్టం చేశాడు. తదుపరి కార్యాచరణ చెప్పలేదు. ఈనేపథ్యంలో సోమ, మంగళవారాలు రాజస్తాన్ రాజకీయాలు కీలకం కానున్నాయి. ఇక రాజస్తాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) ప్రభుత్వ కుట్రలపై ఆడియో టేపులను సెషన్స్లో కోర్టులో సమర్పించింది. బీజేపీ నేతలు అశోక్ సింగ్, భరత్ మిలానీని ఎస్ఓజీ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. అయితే, ఆడియో టేపులన్నీ అసత్య ఆరోపణలనీ బీజేపీ నేతలు కొట్టిపడేస్తున్నారు. ఒకవేళ ఎవరి ఫోన్లనైనా ట్యాపింగ్ చేస్తే ఆ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. (నేను బీజేపీతోనే..) Desert storm in Rajasthan seems to have blown over with CM confidently meting the Governor and contemplating convening Assaembly session soon. ‘Operation Lotus’ appears to have failed this time. — Majeed Memon (@advmajeedmemon) July 19, 2020 -
మోదీపై ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్సీపీ నేత, రాజ్యసభ ఎంపీ మజీద్ మెమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నాగరికత తెలియని వ్యక్తిలా, నిరక్షరాస్యుడిలా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దారినపోయే వ్యక్తి తరహాలో మాట్లాడటం ప్రధాని స్ధాయి వ్యక్తికి తగదని హితవు పలికారు. ‘అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి తన రాజ్యాంగ హోదా పట్ల స్పృహతో ఉండాలని, దేశ ప్రధాని పదవికి జరిగే ఎన్నికలు రోడ్లపై జరగవన్న సంగతి మోదీకి తెలిసిఉండా’లని వ్యాఖ్యానించారు. కాగా, పాకిస్తాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలన్న బీజేపీ వ్యాఖ్యలపై గతంలో మెమన్ స్పందిస్తూ నేపాల్ ఎన్నికల్లో బీజేపీ పోటీచేస్తే అక్కడ పెద్దసంఖ్యలో ఉండే చౌకీదార్లు (కాపలాదారులు) ఆ పార్టీని గెలిపిస్తారని ఎద్దేవా చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్పీపీ కూటమి మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమితో తలపడనుంది. -
దినకరన్ పై ముప్పేట దాడి
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకుల కోసం ఎన్నికల అధికారికి లంచం ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ పై జాతీయ పార్టీల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమిళనాడు రాజకీయాలకు దిగజార్చారని ధ్వజమెత్తారు. దినకరన్ చర్యను ముక్తకంఠంతో ఖండించారు. ఆయనను అరెస్ట్ చేసి విచారించాలని డిమాండ్ చేశారు. ‘ఎన్నికల అధికారికి దినకరన్ లంచం ఇవ్వజూపారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. చాలా తక్కువ సమయంలోనే తమిళ రాజకీయాలను దినకరన్ అథమస్థాయికి దిగజార్చార’ని బీజేపీ నాయకుడు ఎస్. ప్రకాశ్ ఆక్షేపించారు. తమ తప్పును తెలుసుకున్న అన్నాడీఎంకే ఇప్పుడు పన్నీర్ సెల్వం వర్గంతో విలీన చర్చలు జరుపుతోందని తెలిపారు. ‘తమిళ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు విలీన చర్చలు జరుపుతున్నాయి. తాజా పరిణామాలను కనిపెట్టి చూస్తున్నాం. దినకరన్ ను అరెస్ట్ చేసి విచారించాలి. చట్టపరంగా చర్యలు చేపట్టాల’ని సీపీఐ సీనియర్ నేత డి.రాజా డిమాండ్ చేశారు. దినకరన్ పై వచ్చిన నిజమైతే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్సీపీ నేత మజీద్ మెమన్ అన్నారు. ఇటువంటి చర్యలకు ప్రజాస్వామ్యానికి చేటు చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను చట్టం ముందు నిలబెట్టాలని కోరారు.