-
ఫార్మసీ కోర్సులు.. కెరీర్ అవకాశాలు
దేశంలో ఫార్మారంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ ఔషధశాలగా భారత్ పేరొందుతోంది. నూతన ఆవిష్కరణలతో కొత్త ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తికి నెలవైన ఫార్మా రంగంలో అవకాశాలకు కొదవలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియెట్ తర్వాత ఫార్మసీ కోర్సులు అభ్యసించొచ్చు. రోగులకు మందులు అందించడం దగ్గర్నుంచి ఔషధాల పరిశోధన వరకూ.. అనేక ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ఫార్మసీకోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం... ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన అభ్యర్థుల కోసం ప్రధానంగా మూడు రకాల ఫార్మసీ కోర్సులున్నాయి. డి.ఫార్మసీ(డిప్లొమా ఇన్ ఫార్మసీ), బీఫార్మసీ(బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ), ఫార్మ్–డి(డాక్టర్ ఆఫ్ ఫార్మసీ). ఈ కోర్సులు పూర్తిచేసిన తర్వాత ఉన్నత విద్యావకాశాలనూ అందిపుచ్చుకోవచ్చు. డి.ఫార్మసీ ► ఇంటర్మీడియెట్లో ఎంపీసీ/బైపీసీలో సాధించిన మార్కుల ఆధారంగా డి.ఫార్మసీలో ప్రవేశం పొందొచ్చు. రాష్ట్ర సాంకేతిక శాఖ నోటిఫికేషన్ను జారీ చేస్తుంది. ఈ కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. కోర్సు పూర్తయిన తర్వాత ప్రాక్టికల్ శిక్షణ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవచ్చు. ► ఉద్యోగావకాశాలు: డి–ఫార్మసీ అభ్యర్థులకు ప్రభుత్వ ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, విద్యా సంస్థలు, క్లినిక్లు, ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ మందుల దుకాణాలు, ఫార్మాస్యూటికల్ సంస్థలు, సేల్స్, మార్కెటింగ్, పరిశోధనా సంస్థలు, పరిశోధన ప్రయోగశాలల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ► ఉన్నత విద్య: డి.ఫార్మసీ తర్వాత రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈసెట్ పరీక్షలో అర్హత సాధించి.. లేటరల్ ఎంట్రీ ద్వారా బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరొచ్చు. ఫార్మ్–డి కోర్సులను కూడా అభ్యసించొచ్చు. బీఫార్మసీ ► ఇంటర్మీడియెట్లో ఎంపీసీ/బైపీసీ/డి.ఫార్మసీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ(బీఫార్మసీ)లో చేరొచ్చు. కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఫార్మసీ పూర్తి చేసినవారు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవచ్చు. ► ఉద్యోగావకాశాలు: బీఫార్మసీలో ఉత్తీర్ణులకు పలు ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో ఫార్మసిస్ట్లుగా చేరొచ్చు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు, మెడికల్ అండర్ రైటర్లుగా పనిచేయొచ్చు. సొంతంగా మందుల దుకాణాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఫార్మస్యూటికల్, బయోటెక్ కంపెనీల్లో రీసెర్చ్ సైంటిస్టు, రీసెర్చ్ అసోసియేట్, ప్రీ క్లినికల్ రీసెర్చ్లో.. స్టడీ డైరెక్టర్, క్యూసీ మేనేజర్, క్యూసీ ఆడిటర్, క్యూసీ అసోసియేట్ కొలువులు; ఫార్మా ఇండస్ట్రీలో.. ఫార్ములేషన్స్ ఆర్ అండ్ డీ, అనలిటికల్ ఆర్ అండ్ డీ, క్వాలిటీ కంట్రోల్స్, క్వాలిటీ అస్యూరెన్స్ విభాగాల్లో అవకాశాలు పొందొచ్చు. ఫార్మ్–డి ► ఇంటర్మీడియెట్లో ఎంపీసీ/బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులు ఫార్మ్–డి కోర్సులో చేరొచ్చు. కోర్సు కాలవ్యవధి ఆరేళ్లు. కోర్సులో థియరీతోపాటు ప్రాక్టికల్స్కు ప్రాధాన్యం ఉంటుంది. అయిదేళ్లు తరగతిగది బోధన, ప్రాక్టికల్స్తోపాటు.. చివరి ఏడాది పూర్తిగా ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఫార్మ్–డి కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవచ్చు. ► ఉద్యోగ అవకాశాలు: ఫార్మ్–డి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు క్లినికల్ ఫార్మసిస్టు, కమ్యూనిటీ ఫార్మసిస్టు, హాస్పిటల్ ఫార్మసిస్టుగా అవకాశాలు లభిస్తాయి. క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషనల్లో ఏడీఆర్ మానిటరింగ్, డ్రగ్ ఇంటరాక్షన్ మానిటరింగ్, టాక్సికాలజీ, థెరప్యూటిక్స్, బీఏబీఈ స్టడీస్, పేషెంట్ మానిటరింగ్, క్లినికల్ ప్రోటోకాల్ డెవలప్మెంట్, పేషెంట్ కేస్ స్టడీ, పేషెంట్ కౌన్సెలింగ్, క్లినికల్ ట్రయల్స్, డేటా మేనేజ్మెంట్ వంటి అవకాశాలు ఉంటాయి. విదేశాలలోనూ వీరికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు.. పరిశోధనలపై దృష్టిసారించాలనుకుంటే.. పీహెచ్డీ చేయొచ్చు. మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (ఎంఫార్మసీ) ► బీఫార్మసీ పూర్తిచేసిన అభ్యర్థులు రెండేళ్ల కాలవ్యవధి ఉన్న ఎంఫార్మసీ కోర్సులో చేరొచ్చు. ఎంఫార్మసీలో ఫార్మాస్యుటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మా కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఇండస్ట్రియల్ ఫార్మసీ, ఫార్మసీ ప్రాక్టీస్, క్వాలిటీ అస్యూరెన్స్ తదితర స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు. ► నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీ)నిర్వహించే గ్రాడ్యుయేట్ ఫార్మసీ అప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్) పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా దేశంలోని పలు యూనివర్సిటీలు ఎంఫార్మసీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అభ్యర్థులు జీప్యాట్ స్కోరుతో తాము చేరాలనుకుంటున్న యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్కు స్వయంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ► నైపర్ జేఈఈ రాసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) విద్యాసంస్థల్లో ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ► అంతర్జాతీయ అర్హత పరీక్షల ద్వారా విదేశాల్లో ఎంఎస్(ఫార్మాస్యూటికల్ సైన్సెస్)తో పాటు ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీలో చేరే అవకాశముంది. ► బీఫార్మసీ తర్వాత మూడేళ్ల ఫార్మ్–డి(పోస్ట్ బ్యాచులరేట్)లో చేరవచ్చు. ఫార్మ్–డి(పోస్ట్ బ్యాచులరేట్)ను లేటరల్ ఎంట్రీగా పరిగణిస్తారు. బీఫార్మసీ తర్వాత ఫార్మ్–డిలో నేరుగా నాలుగో సంవత్సరంలో ప్రవేశం పొందొచ్చు. రాష్ట్ర స్థాయిలో పీజీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి ఎంఫార్మసీ కోర్సులో చేరొచ్చు. ఫార్మసీ–మేనేజ్మెంట్ కోర్సులు ► ఫార్మసీ రంగంలో మేనేజ్మెంట్ నిపుణుల అవసరం నెలకొంది. దాంతో నైపర్ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు ఎంబీఏ(ఫార్మ్) వంటి ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాయి. అలాగే ఎంటెక్(ఫార్మసీ), ఎంఎస్(ఫార్మ్) లాంటి వినూత్న కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. బీఫార్మసీ, ఎమ్మెస్సీ లైఫ్ సైన్సెస్ సంబంధిత కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు వీటిలో చేరొచ్చు. పీహెచ్డీ ► నైపర్లతోపాటు, పలు సెంట్రల్ యూనివర్సిటీలు, బిట్స్ తదితర ఇన్స్టిట్యూట్లు ఫార్మసీలో వివిధ స్పెషలైజేషన్స్తో పీహెచ్డీ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఉన్నత విద్యతో మరిన్ని అవకాశాలు కోవిడ్ పరిస్థితుల్లో ఫార్మా రంగం ప్రాధాన్యత మరింత పెరిగింది. ఫార్మసీలో ఉన్నత విద్య అభ్యసించిన వారికి అవకాశాలకు ఢోకా లేదు. భవిష్యత్తులో ఫార్మా రంగం విస్తరణ, కొత్త ప్రాజెక్టుల కారణంగా ఉపాధి మార్గాలు మరింత విస్తృతమవుతాయి. ఫార్మా కోర్సులు చదివిన వారు ఆస్పత్రుల్లో ఫార్మాసిస్టులు, అనలిటికల్, పరిశోధన, అభివృద్ధి, మెడికల్ రేటింగ్స్, డేటా అనాలిసిస్ విభాగాలతోపాటు పలు ప్రభుత్వ ఉద్యోగాలు సైతం సొంతం చేసుకోవచ్చు. పీహెచ్డీతోపాటు విదేశాల్లో పోస్ట్ డాక్టోరల్ కోర్సులు అభ్యసించి పరిశోధన దిశగా అడుగులు వేయొచ్చు. అధ్యాపక వృత్తిలోనూ స్థిరపడొచ్చు. – ఎన్.శంకరయ్య, అసోసియేట్ ప్రొఫెసర్, నైపర్ హైదరాబాద్. -
ఎంఫార్మా కోర్సులకు జీప్యాట్ - 2017
దేశవ్యాప్తంగా ఎంఫార్మా (ఎంఫార్మసీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.. గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్). ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ప్రతి ఏటా ఈ పరీక్షను నిర్వహిస్తోంది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరిగే ఈ పరీక్ష స్కోర్ ద్వారా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీ ఫార్మసీ డిపార్ట్మెంట్లు, క్యాంపస్ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో ఎంఫార్మా కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. అంతేకాకుండా స్కాలర్షిప్స్, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. 2017కు సంబంధించి జీప్యాట్ ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో జీప్యాట్ అర్హతలు, పరీక్ష విధానం తదితర అంశాలపై ఫోకస్.. అర్హత: 10+2/ఇంటర్మీడియెట్ తర్వాత నాలుగేళ్ల బీఫార్మసీ ఉత్తీర్ణత. లేటరల్ ఎంట్రీ ద్వారా బీఫార్మసీ అభ్యసించినవారు, బీఫార్మసీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. బీఫార్మసీ మొదటి మూడేళ్ల విద్యార్థులు అర్హులు కాదు. పరీక్ష విధానం: మూడు గంటల వ్యవధి (180 నిమిషాలు)లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 125 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు కేటాయించారు. అదేవిధంగా ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది. ఫార్మాస్యూటిక్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రోబయాలజీ ఇన్ ఫార్మసీ, ఇంట్రడక్షన్ టు ఫార్మాస్యూటికల్ జురిప్రుడెన్స్ అండ్ ఎథిక్స్, ఇంట్రడక్షన్ టు డిస్పెన్సింగ్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ, ఇంపార్టెన్స్ ఆఫ్ యూనిట్ ఆపరేషన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టాచియోమెట్రీ; డొసేజెస్ ఫార్మ్స్, డిజైనింగ్ అండ్ ఎవల్యూషన్, బయోఫార్మాస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనటిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ ఫార్మసీ వంటి అంశాలపై ప్రశ్నలడుగుతారు. ఈ అంశాల్లో ముందుగా ప్రాథమిక భావనలను, ముఖ్య సూత్రాలను ఔపోనస పట్టాలి. తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ ఆధారంగా ముఖ్యమైన అంశాలన్నింటిని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. చదువుకోవడానికి వీలుగా షార్ట్ నోట్స్, బుల్లెట్ పాయింట్స్లా రూపొందించుకోవాలి. తరచుగా వీటిని పునశ్చరణ చేస్తుండాలి. ఈ పై టాపిక్స్తోపాటు ఫార్మసీలో కర్బన రసాయన శాస్త్రం ప్రాధాన్యత, ప్రభావాలను కూడా అభ్యర్థులు చదవాలి. అదేవిధంగా ఫార్మాస్యూటికల్స్లో బయోకెమిస్ట్రీ, వాటి అనువర్తనాలు, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఎనాలిసిస్, ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ, బయోలాజికల్ సోర్సెస్, కల్టివేషన్ తదితర అంశాలు కూడా పరీక్ష కోణంలో ముఖ్యమైనవే. ప్రిపరేషన్ తీరు: జీప్యాట్లో అడిగే ప్రశ్నలు సబ్జెక్ట్ నాలెడ్జ్తోపాటు ప్రాక్టికల్ ఓరియెంటెడ్గా కూడా ఉంటాయి. కాబట్టి కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా.. ఒక అంశాన్ని సాధారణ పరిస్థితులకు అన్వయించి ఆలోచించే నైపుణ్యం పొందాలి. ఉదాహరణకు.. ఏదైనా ఒక వ్యాధి ఉన్న వ్యక్తికి నిర్దేశిత ఔషధం ఇస్తే కలిగే పరిణామాలను అంచనా వేయగల సామర్థ్యం సొంతం చేసుకోవాలి. జీప్యాట్ స్కోర్తో ఫెలోషిప్: జీప్యాట్ స్కోర్కు ఏడాది వ్యాలిడిటీ ఉంటుంది. ఈ వ్యవధిలో ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు నెలకు రూ.12,400 చొప్పున ఫెలోషిప్ పొందొచ్చు. దరఖాస్తు రుసుం: జనరల్/ఓబీసీ విద్యార్థులు రూ.1400+బ్యాంక్ ఛార్జీలు, మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.700 + బ్యాంక్ ఛార్జీలను.. క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు లేదా ఏదైనా ఎస్బీఐ శాఖలో నగదు చెల్లించాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్ 10. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 10. పరీక్ష తేదీలు: జనవరి 28, 29, 2017. వెబ్సైట్: http://aicte-gpat.in/ -
ఎంటెక్, ఎం.ఫార్మసీలపై దృష్టి
నాణ్యతా ప్రమాణాల పెంపునకు సర్కారు చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంటెక్, ఎం ఫార్మసీ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రమాణాలు, అర్హులైన అధ్యాపకులు లేకుండా కాలేజీలను నడుపుతున్న తీరును నియంత్రించేందుకు చర్యలు చేపట్టనుంది. అందులో భాగంగా విద్యార్థులు, ఫ్యాకల్టీకి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచి స్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 137 ఇంజనీరింగ్ కాలేజీలు ఎంటెక్ కోర్సును అందిస్తున్నాయి. వాటికోసం ప్రత్యేకంగా కాలేజీలు లేకపోయినా బీటెక్ కోర్సులను నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీల్లోనే ఎంటెక్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. అయితే ఆయా కాలేజీల్లో ఎంటెక్ విద్యార్థులకు బోధించే అర్హులైన అధ్యాపకులు లేరని, బోధనే సరిగా జరగడం లేదని జేఎన్టీయూహెచ్, ఉన్నత విద్యాశాఖ గుర్తించాయి. నిబంధనల ప్రకారం.. ఎంటెక్ కోర్సు కొనసాగించాలంటే ప్రతి ఆరుగురు విద్యార్థులకు ఒక పీహెచ్డీ ప్రొఫెసర్, ఒక ఎంటెక్ చేసి సీనియారిటీ కలిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలి. కానీ చాలా కాలేజీల్లో పీహెచ్డీ చేసిన ప్రొఫెసర్లు లేరన్న విషయం విద్యాశాఖ దృష్టికి వచ్చింది. సరైన మౌలిక వసతులు, ల్యాబ్లు, లైబ్రరీలు, ఇతర పరికరాలు కూడా అవసరమైన మేరకు లేవని గుర్తించింది. ఎంఫార్మసీ కాలేజీల్లోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని నిర్ధారించింది. బయోమెట్రిక్ తో అక్రమాలకు చెక్ ఆధార్ నంబర్, బయోమెట్రిక్ ఆధారంగా ప్రవేశాలు చేపట్టడం.. విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ హాజరు ప్రవేశపెట్టడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టవచ్చని విద్యాశాఖ భావిస్తోంది. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ దుర్వినియోగం కాకుండా చర్యలు చేపట్టాలని యోచిస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement