breaking news
Lyon
-
సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై పాకశాస్త్రంలో తెలంగాణ అమ్మాయి అశ్విత పోలీస్ సత్తా చాటింది. ఫ్రాన్స్లోని లియాన్లో జరుగుతున్న వరల్డ్ స్కిల్స్–2024లో అశ్విత బెస్ట్ ఆఫ్ నేషన్ అవార్డును గెలుచుకుంది. భారతదేశం స్కిల్ సెట్లలో 4 కాంస్య పతకాలు, 12 మెడలియన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డులతో కలిపి మొత్తం 16 పతకాలు సొంతం చేసుకుంది. ‘పాటిస్సేరీ–కన్ఫెక్షనరీ’లో అశ్విత పోలీస్, ‘ఇండస్ట్రీ 4.0’లో గుజరాత్కు చెందిన ధ్రుమిల్కుమార్ ధీరేంద్రకుమార్ గాంధీ, సత్యజిత్ బాలకృష్ణన్, ‘హోటల్ రిసెప్షన్’లో ఢిల్లీకి చెందిన జోతిర్ ఆదిత్య కృష్ణప్రియ రవికుమార్, ‘రెన్యూవబుల్ ఎనర్జీ’లో ఒడిశాకు చెందిన అమరేష్ కుమార్ సాహు కాంస్యపతకాలు గెలుచుకున్నారు. వీటితోపాటు భారతీయ బృందం 12 మెడలియన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ను సంపాదించింది. ‘పాటిస్సేరీ అండ్ కన్ఫెక్షనరీ’లో పోటీ చేసిన అశ్విత టీమ్ ఇండియా నుంచి అత్యుత్తమ పోటీదారుగా బెస్ట్ ఆఫ్ నేషన్ అవార్డును కూడా గెలుచుకుంది.అశ్విత చిన్నప్పటి నుంచి స్వీట్స్ తయారుచేయడం, టీవీ షోల ద్వారా పాకశాస్త్రంలో నైపుణ్యాన్ని పెంచుకుంది. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యారి్థని అయిన అశ్విత.. చెఫ్ వినేష్ జానీ మార్గదర్శకత్వంలో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. అశ్విత విజయం ప్రపంచ వేదికపై భారతీయ పాకశాస్త్ర ప్రతిభ పెరుగుతున్న ప్రాముఖ్యతను చాటుతోంది. ఈ విజయం దేశవ్యాప్తంగా ఔత్సాహిక చెఫ్లను ప్రేరేపిస్తుందని కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్íÙప్ మంత్రిత్వ శాఖ కొనియాడింది. పాటిస్సేరీ అండ్ కన్ఫెక్షనరీ విభాగంలో 21 దేశాలతో పోటీపడి కాంస్యం సాధించిన అశ్విత పోలీస్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రయాణం సవాలుతో కూడుకున్నది. నా దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకం సాధించాలనే కల నిజమైంది. కానీ నమ్మశక్యంగా లేదు’అని అన్నారు. వరల్డ్ స్కిల్స్ 2024లో 70కి పైగా దేశాల నుంచి 1,400 మందికి పైగా పోటీదారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. భారత్ 52 నైపుణ్య విభాగాల్లో పోటీపడింది. -
నాథన్ లియాన్ రికార్డుల మోత..
బెంగళూరు: భారత్ తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో్ చెలరేగిపోయిన ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ రికార్డుల మోత మోగించాడు. భారత్ ను మొదటి ఇన్నింగ్స్ లో 189 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన లియాన్.. భారత్ లో అద్భుతమైన గణాంకాలను కూడా నమోదు చేశాడు. తొలుత భారత్ లో అత్యధిక వికెట్లు సాధించిన ఆసీస్ బౌలర్ గా సరికొత్త రికార్డును లియాన్ లిఖించాడు. ఈ మ్యాచ్ కు ముందు ఓవరాల్ గా భారత్ పై అత్యధిక వికెట్లను సాధించిన ఆసీస్ బౌలర్ బ్రెట్ లీ(53). తాజాగా ఆ రికార్డును లియాన్ బద్ధలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ వికెట్ ను తీసిన తరువాత బ్రెట్ లీ రికార్డును లియాన్ సవరించాడు. మరొకవైపు భారత్ లోఅత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన విదేశీ బౌలర్ గా లియాన్ గుర్తింపు సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 50 పరుగులిచ్చిన లియాన్ ఎనిమిది వికెట్లు సాధించాడు. దాంతో భారత్ లో బెస్ట్ ఫిగర్స్ ను నమోదు చేసిన ఆతిథ్య బౌలర్ గా లియాన్ చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంచితే టెస్టుల్లో విరాట్ కోహ్లి, చటేశ్వర పూజారాలను లియాన్ ఐదుసార్లు అవుట్ చేశాడు. తద్వారా వీరిద్దర్నీ అత్యధిక సార్లు అవుట్ చేసిన ఘనతను సైతం లియాన్ సాధించాడు. దాంతో పాటు చిన్నస్వామి స్టేడియంలో అత్యధిక వికెట్లు సాధించిన విదేశీ బౌలర్ గా లియాన్ నిలిచాడు.