breaking news
lump
-
నొప్పి లేకున్నా... నిర్లక్ష్యం వద్దు!!
కొందరిలో ఒక్కోసారి తమ కాళ్లలో లేదా చేతుల్లో గడ్డ కనిపించవచ్చు. అది నొప్పి లేని గడ్డ కావడంతో పాటు క్రమంగా పెరుగుతూపోవచ్చు. కారణం లేకుండా ఎముకల్లో నొప్పి కనిపించడంతో రాత్రివేళల్లో ఆ నొప్పి పెరుగుతూ పోవచ్చు. ఆటల్లో గాయపడటమో లేదా తమకు తెలియకుండా ఏదైనా చిన్నపాటి దెబ్బతగలడం వల్లనో ఇలా జరుగుతుండవచ్చని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఈ లక్షణాలు కొన్నిసార్లు ‘సార్కోమా’ అనే క్యాన్సర్కు సూచనలు కావచ్చు. ఈ సార్కోమా తరహా క్యాన్సర్పై అవగాహన కోసం ఈ కథనం.సార్కోమా అనేది అరుదైన క్యాన్సర్లలో ఒకటి. సార్కోమా అంటే ఏమిటో చూద్దాం...మన దేశంలో సార్కోమా విస్తృతి... భారతదేశంలో ప్రతి ఏడాది సుమారు 20 వేల కొత్త సార్కోమా కేసులు నమోదవుతున్నట్లు అంచనా. అయితే అవగాహన లోపం, లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల చాలామంది వ్యాధి ముదిరిన తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారు. తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందిస్తే మంచి ఫలితాలు కనిపించడంతో పాటు బాధితుల్లో మంచి మెరుగుదల కనిపిస్తుందని గుర్తుంచుకోవడం ముఖ్యం. సార్కోమా అంటే..? సార్కోమా అనేది దేహంలోని ఎముకలు, కండరాలు, కొవ్వు, రక్తనాళాలు, నరాలు, కార్టిలేజ్, టెండన్లు వంటి మృదుకణజాలా (సాఫ్ట్ టిష్యూస్)లో వచ్చే అరుదైన క్యాన్సర్. సాధారంగా కనిపించే మిగతా క్యాన్సర్లతో పోలిస్తే ఇది కాస్త అరుదుగా కనిపించినప్పటికీ, చిన్నపిల్లలు, యువత, మధ్యవయస్కుల్లోనూ ఇటీవల కొంత ఎక్కువగానే కనిపిస్తోంది. ఇది శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ముఖ్యంగా చేతులు, కాళ్లు, తొడలు, భుజాలు, పొత్తికడుపు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.లక్షణాలు... తొలి దశల్లో ‘సార్కోమా’లో పెద్దగా నొప్పి ఉండకపోవడంతో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. సార్కోమాలో కనిపించే సాధారణ లక్షణాలవి... ∙నొప్పి లేకుండా క్రమంగా పెరుగుతున్న గడ్డ ∙చేతులు లేదా కాళ్లలో అసాధారణ వాపు ∙రాత్రివేళల్లో ఎక్కువయ్యే ఎముకల నొప్పి ∙కారణం లేకుండా నెలల తరబడి నొప్పి కొనసాగడం ∙గడ్డ పరిమాణం వేగంగా పెరుగుతుండటం ∙కదలికల్లో ఇబ్బంది లేదా గడ్డ వచ్చిన అవయవం పనితీరు తగ్గడం ∙ఐదు సెంటీమీటర్లకు మించిన గడ్డలు రావడం, కొన్ని వారాలుగా ఆ గడ్డల్లో వాపు తగ్గకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయడం సరికాదు. పైన పేర్కొన్న లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది.నిర్ధారణ ఇలా... సార్కోమా నిర్ధారణ కోసం చేసే పరీక్షల్లో కొన్ని... ∙ఎంఆర్ఐ స్కాన్ ∙పీఈటీ–సీటీ స్కాన్ ∙బయాప్సీ. ఈ పరీక్షలతో కణితి రకం, సైజు, వ్యాప్తితో పాటు అది ఏ దశలో ఉందన్న విషయాలను నిర్ధారణ చేశాక... దాన్ని బట్టి చికిత్సను ΄్లాన్ చేస్తారు. చికిత్స ... బాధితుల పరిస్థితిని బట్టి శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీనిలలో పేషెంట్కు అవసరమైనదాన్ని నిర్ణయిస్తారు. ఒక్కోసారి ఈ చికిత్సలన్నింటినీ సమన్వయంతో అందించాల్సి రావచ్చు. అయితే తొలిదశల్లోనే చికిత్స మొదలుపెట్టడం వల్ల చాలా మంది జీవితం తిరిగి సాధారణంగా అయ్యేందకు అవకాశాలెక్కువ.ఆధునిక చికిత్సలతో అవయవాన్ని కాపాడే అవకాశం... గతంలో సార్కోమా చికిత్సలో చాలాసార్లు చెయ్యి లేదా కాలిని తొలగించాల్సి వచ్చేది. కానీ ఇటీవల వైద్యరంగంలోని అధునాత సాంకేతిక పురోగతితో లింబ్ సాల్వేజ్ సర్జరీలు, అత్యాధునిక ఇం΄్లాంట్లు, రీకన్ స్ట్రక్షన్ పద్ధతుల ద్వారా గడ్డను పూర్తిగా తొలగించడంతో పాటు అవయవాన్ని కాపాడే అవకాశాలూ గణనీయంగా పెరిగాయి.చికిత్స తర్వాత కూడా జాగ్రత్తలు అవసరం... శస్త్రచికిత్సతో లేదా ఇతరత్రా అవసరమైన చికిత్సల తర్వాత పరిస్థితి అంతా తిరిగి సాధారణ స్థితి చేరుకుందని అనుకోవడం సరికాదు. నిజానికి పేషెంట్లు తమ చికిత్స తర్వాత కూడా ఫిజియోథెరపీ, పునరావాస చికిత్స (రీ–హ్యాబిలిటేషన్ థెరపీ) వంటివి చేస్తూ ఉండటంతో పాటు క్రమం తప్పకుండా ఫాలోఅప్కు రావడమూ తప్పనిసరి. అలాగే కుటుంబ సభ్యుల సహకారమూ పేషెంట్లు పూర్తిగా కోలుకోవడంలో కీలక భూమిక పోషిస్తుందని గుర్తుంచుకోవాలి. డాక్టర్ రాజీవ్ రెడ్డిఆర్థోపెడిక్ ఆంకోసర్జన్– సార్కోమా స్పెషలిస్ట్ -
Health: ఐదో నెలలో రొమ్ములో గడ్డలు తగలడం నార్మల్ కాదు! వెంటనే..
నేను ప్రెగ్నెంట్ను. ఇప్పుడు అయిదవ నెల. ఈ మధ్య అంటే ఓ పదిరోజులుగా .. ఎడమ బ్రెస్ట్లో గడ్డలాగా తగులుతోంది. అది నార్మల్గా ప్రెగ్నెన్సీలో అలా ఉంటుందా? చెకప్ చేయించుకోవాలా? తెలియజేయగలరు. – వి. ఆనంది, జగదల్పూర్ ప్రెగ్నెన్సీ సమయంలో బ్రెస్ట్స్లో చాలా మార్పులు జరుగుతుంటాయి. మూడవ నెల నుంచే ఈ మార్పులు కనిపిస్తాయి. బ్రెస్ట్స్ సైజ్ పెరగడం, నిపుల్ ఏరియా డార్క్గా అవడం, కొంచెం నొప్పి వంటివి ఉండడం సహజం. కానీ గడ్డలు తగలడం.. ఈ అయిదవ నెల సమయంలో నార్మల్ కాదు. మీరు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఇప్పుడు మిమ్మల్ని ట్రీట్ చేస్తున్న ప్రసూతి వైద్యులను సంప్రదించాలి. ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ అనేది సురక్షితం. డాక్టర్ పరీక్ష చేసి.. రెండు వైపులా బ్రెస్ట్స్కి అల్ట్రాసౌండ్ సజెస్ట్ చేస్తారు. ఎక్స్రే సురక్షితం కాదు. స్కానింగ్లో బ్రెస్ట్ టిష్యూలో ఉండే మార్పులను కనిపెట్టవచ్చు. చాలాసార్లు అంటే 90 శాతం ఇవి క్యాన్సర్ గడ్డలు కావు. ఇవి క్యాన్సర్కారకం కాని ఫైబ్రోఎడినోమా గడ్డలే అయి ఉంటాయి. ఇవి బ్రెస్ట్ సైజ్తోపాటు కొంచెం పెరిగి, ప్రెగ్నెన్సీలో బయటపడవచ్చు. ఒక చోట బ్రెస్ట్ టిష్యూ గట్టిపడి ఇవి ఏర్పడతాయి. చాలా మందిలో ఇవి 1–2 సెంటిమీటర్ల నుంచి 5–6 సెంటిమీటర్ల పరిమాణంలో ఉండొచ్చు. వీటిని అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకోవచ్చు. వీటివల్ల ఏ ప్రమాదమూ ఉండదు. కానీ ప్రసవం తర్వాత కూడా ఫాలోఅప్ స్కాన్ చేయించుకుంటూ సైజులో మార్పులు కనిపెట్టుకుంటూ ఉండాలి. వీటివల్ల ఫ్యూచర్లో పాలు ఏర్పడడానికి కానీ, ఇవ్వటానికి కానీ ఏ ఇబ్బందీ ఉండదు. కొంతమందిలో ఇవి చాలా పెద్దగా అయి అయిదు సెంటిమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే excision బయాప్సీ ద్వారా చిన్న సర్జరీతో తీయటం జరుగుతుంది. కానీ అది ప్రెగ్నెన్సీలో ఎమర్జెన్సీ గా చెయ్యవలసిన అవసరం లేదు. అరుదుగా నిపుల్ నుంచి గ్రీన్ కలర్ డిశ్చార్జ్ రావటం, నిపుల్ ఏరియాలో గుంటలు పడడం, బ్రెస్ట్ అంతా ష్రింక్ అవటం లాంటి మార్పులు ఉంటే అవి ప్రమాద సంకేతాలన్నమాటే. అలాంటప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో abdominal shielding చేసి బిడ్డకు ఎక్స్రే కణాలు పడకుండా మమ్మోగ్రఫీ అనే టెస్ట్ చేస్తారు. ఇది క్యాన్సర్ను కనిపెట్టే టెస్ట్. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో సీనియర్ ప్రసూతి వైద్యులు, బ్రెస్ట్ స్పెషలిస్ట్ మీ కేస్ను హ్యాండిల్ చేసి తగిన ట్రీట్మెంట్/ బయాప్సీ/ సర్జరీ గురించి అవగాహన కల్పిస్తారు. అందుకే బ్రెస్ట్లో ఎలాంటి గడ్డలు తగిలినా వెంటనే డాక్టర్ను కన్సల్ట్ చేయాలి. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
బాలిక కడుపులో వెంట్రుకల ముద్ద
ఆరిలోవ(విశాఖ తూర్పు): తీవ్ర కడుపునొప్పితో బాధ పడుతున్న బాలికకు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి స్వస్థత చేకూర్చారు వైద్యులు. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో ఆధునిక పద్ధతిలో ఈ సర్జరీ చేశారు. విమ్స్ డైరెక్టర్ కె.రాంబాబు తెలిపిన వివరాలివి.. రాజమండ్రికి చెందిన 13 ఏళ్ల బాలిక కొద్ది రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడేది. ఎన్ని ఆస్పత్రులకు తీసుకువెళ్లినా తగ్గకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఈ నెల 19న విశాఖలో విమ్స్కు తీసుకు వచ్చారు. ఇక్కడి వైద్యులు ఆ బాలికకు ఎండోస్కోపీ చేసి కడుపు లోపల వెంట్రుకలతో కూడిన పదార్థం ముద్దగా ఉన్నట్లు గుర్తించారు. దీనిని ట్రైకోబెజార్ వ్యాధిగా నిర్థారించారు. దీంతో ఈ నెల 23న లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి బాలిక కడుపులో ఉన్న వెంట్రుకలతో ఉన్న 300 గ్రాముల పదార్థాన్ని తొలగించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ శస్త్రచికిత్సను ఉచితంగా నిర్వహించారు. అరుదైన శస్త్రచికిత్స అనంతరం పూర్తి స్థాయిలో కోలుకున్న బాలికను శనివారం డిశ్చార్జి చేశారు. 50 ఏళ్లలో 68 మందికి మాత్రమే.. ఇలాంటి వ్యాధి అరుదుగా వస్తుందని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు. 50 ఏళ్లలో దేశంలో 68 మందికి మాత్రమే ఈ తరహా శస్త్రచికిత్సలు చేసినట్లు చెప్పారు. విమ్స్లో చిన్నారికి జరిగిన సర్జరీ 68వది అని తెలిపారు. సర్జరీ విజయవంతంగా నిర్వహించిన వైద్యులను అభినందించారు. బాలిక పూర్తిగా కోలుకోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ చేసి తమ కుమార్తె ప్రాణాలను కాపాడారని విమ్స్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ స్రవంతి బృందం, విమ్స్ ఆర్ఎంవో డాక్టర్ విజయకుమార్ పాల్గొన్నారు. (చదవండి: చెత్తకు కొత్త రూపుం...వేస్ట్ క్రాఫ్ట్) -
టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!!
This is Why You Should Not Spend More Than 10 Minutes on the Toilet: చాలా మందికి టాయిలెట్లో ఎక్కువ సమయం గడపటం అలవాటు. టాయిలెట్లో తీరిగ్గా కూర్చుని ఫోన్ చూస్తూ గంటల కొద్ది సమయం ఈజీగా గడిపేస్తారు. ఐతే ఆ పొజిషన్లో ఎక్కువ సమయం కూర్చోవరటం ఎంత ప్రమాదమో తెలిస్తే 10 నిముషాలకంటే ఎక్కువ సమయం టాయిలెట్లో ఎప్పటికీ గడపరు. అవునండీ.. తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ సుందర్ల్యాండ్కి చెందిన క్లినికల్ లెక్చరర్ ఎన్హెచ్ఎన్ సర్జన్ డా. కరన్ రాజన్ మాటల్లో.. ‘టాయిలెట్లో 10 నిముషాల కంటే ఎక్కువ సమయం కూర్చుంటే మల మార్గంలో ఉండే రక్తనాళాలపై ఒత్తిడి ఎక్కువయ్యి, రక్తనాళాలు ఉబ్బి ఫైల్స్ ఏర్పడతాయి. ఈ వ్యాధిని హెమోరాయిడ్ అని అంటారు. వీటిని తొలగించాలంటే శస్త్ర చికిత్స ఒక్కటే మార్గం. జీర్ణ ప్రక్రియ సజావుగా జరగడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారం ప్రతి రోజూ తీసుకుంటే మల విసర్జన సక్రమంగా ఉంటుంది' అని వివరించారు. చదవండి: 2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్.. మీ జీవితంలో ఫైల్స్ సమస్య ఎప్పటికీ తలెత్తకుండా ఉండాలంటే ఈ సూచనలు ఖచ్చితంగా పాటించడం ఒక్కటే మార్గం. కాబట్టి టాయిలెట్లో సిట్టింగ్ పొజిషన్లో 10 నిముషాల కంటే ఎక్కువ సమయం గడపకండే!! జాగ్రత్త మరి..! చదవండి: 23 కోట్ల బీమా సొమ్ము కోసం రైలు పట్టాలపై పడుకుని రెండు కాళ్లు..!! -
ఆయువు తీసిన అన్నంముద్ద
ధర్మపురి, న్యూస్లైన్: ప్రేమతో తినిపించిన గోరుముద్దలు బాలుడి నిండుప్రాణం తీశాయి. అప్పటివరకు తల్లిదండ్రుల ఒడిలో అల్లారుముద్దుగా ఆటలాడుకొన్న ఆ చిన్నారికి క్షణాల్లో నూరేళ్లు నిండాయి. కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని తోట్లవాడకు చెందిన రాచకొండ శ్రీనివాస్-మనీష దంపతులకు కుమారులు మణిశేఖర్(5), శ్రీహర్షత్(8నెలలు) సంతానం. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం శ్రీహర్షత్కు గోరుముద్దలు తినిపిస్తుండగా, గొంతులో ముద్ద అడ్డుపడి బాలుడికి ఊపిరాడలేదు. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికి బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి ఊపిరితిత్తుల్లోకి ముద్ద వెళ్లి ఊపిరాడక మృతిచెంది ఉంటాడని వైద్యులు తెలిపారు.


