-
రూ.1,590కు కోటి గెల్చుకున్న లక్కీ గాళ్
నాగపూర్:కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార యోజన అవార్డులను ప్రదానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అందించారు. ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోదీ నాగపూర్లో ఈ బహుమతులకు విజేతలకు అందజేసారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన లక్కీ గ్రాహక్ యోజన్ కింద లాతూర్కి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థినిని అదృష్ట లక్ష్మి వరించింది. మొబైల్ ఈఎంఐ పేమెంట్ను ఆన్లైన్లో చెల్లించి కోటి రూపాయలు దక్కించుకుంది. రూపే యాప్ ద్వారా రూ.1,590 డిజిటల్ లావాదేవీలు జరిపినందుకు శ్రద్ధ మోహన్ (20) కోటి రూపాయలను సొంతం చేసుకుంది. రెండవ బహుమతిగా రూ. 50లక్షల నగదు బహుమతి గుజరాత్కు చెందిన హార్దిక్ కుమార్ (29)ని వరించింది. ప్రైమరీ స్కూలు టీచర్ అయిన ఇతను రుపే కార్డు ద్వారా రూ.1110 ఆన్ లైన్ లావాదేవీ నిర్వహించారు. డిజి ధన్ వ్యాపార యోజన కింద మొదటి బహుమతిగా రూ. 50లక్షలను తమిళనాడులోని తాంబరానికి చెందిన జీఆర్టీ జ్యువెల్లరీ వ్యాపారి ఆనంద్ అనంత పద్మనాభన్ గెలుచుకున్నారు. రూ.300 పేమెంట్ను ఆన్లైన్ ద్వారా స్వీకరించారు. ఈ కేటగిరీలో రెండవ బహుమతి రూ. 25లక్షలను మహారాష్ట్రలోని బ్యూటీ పార్లర్ యజమాని రాగిణి రాజేంద్ర ఉత్తేకర్ అందుకున్నారు. తన బ్యూటీ సేవలకు గాను ఈమె రూ.510 స్వీకరించారు. కాగా డిజిటల్ లావాదేవీలను ఊతమిచ్చే దిశగా నీతి ఆయోగ్ గత ఏడాది డిశెంబర్ లో లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార యోజన పేరుతో ఈ క్యాష్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారిక సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా16లక్షలమందికి రూ. 258కోట్ల ప్రైజ్మనీ అందించారు. వీరిలో కస్టమర్లు, వ్యాపారులు ఉన్నారు. -
‘ఆన్లైన్’కి 226 కోట్ల బహుమతులు
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్కీ గ్రాహక్ యోజన, డిజీ ధన్ వ్యాపార్ యోజన పథకాల ద్వారా 14 లక్షల మంది వినియోగదారులకు రూ.226 కోట్ల బహుమతులను అందించినట్లు నీతిఆయోగ్ తెలిపింది. బహుమతులు అందుకున్నవారిలో 70వేల మంది వ్యాపారులున్నారని పేర్కొంది. గతేడాది డిసెంబర్ 25న ప్రారంభమైన ఈ రెండు పథకాలు ఏప్రిల్ 14 వరకూ కొనసాగనున్నాయి. ఆన్ లైన్ నగదు లావాదేవీలు ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ 100 నగరాల్లో వందకుపైగా డీజీధన్ మేళాలు నిర్వహించింది. ప్రతిరోజు 5 వేల మంది వినియోగదారులను లాటరీ ద్వారా ప్రోత్సహకాలకు ఎంపిక చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement