breaking news
Lowpressure
-
కర్నూలు జిల్లాలో వడగళ్ల వాన
విజయవాడ: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందువల్ల నెల్లూరు జిల్లాలో పలుచోట్ల చిరుజల్లులు పడ్డాయి. కర్నూలు జిల్లాలో వడగళ్ల వాన పడింది. కర్నూలు జిల్లా ఆస్పరి, గోనెగండ్ల మండలాలలో ఆదివారం సాయంత్రం భారీగా వడగళ్ల వాన పడింది. బైలుప్పల, వి.అగ్రహారం, గంజిపల్లి గ్రామాల్లో రేగిపండు సైజులో వడగండ్లు పడ్డాయి. దీంతో పొలాల్లో కూలీ పనులు చేసుకుంటున్న మహిళలకు దెబ్బలు తగిలాయి. మహిళలు పనులు వదిలేసి సమీప గుడిసెల్లోకి పరుగులు తీశారు. అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో పలు జిల్లాలలో పంటలు దెబ్బతిన్నాయి. కర్నూలు జిల్లా మహానంది మండలం తిమ్మాపురం, అబ్దీపురం, శ్రీనగరం, గాజులపల్లె, మహానంది, కృష్ణనంది గ్రామ పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి భారీ గాలులతో కూడిన వర్షాల పడ్దాయి. పంటలకు భారీ నష్టం వాటిల్లింది. సుమారు వెయ్యి ఎకరాల్లో అరటి చెట్లు నేలమట్టం అయ్యాయి. -
తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం
విశాఖపట్నం: తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటలలో వాయుగుండంగా మారే ప్రమాదం ఉంది. అయితే వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై ఉండదని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒడిషా నుంచి దక్షిణ కోస్తామీదగా తమిళనాడు వరకు ద్రోణి ఏర్పడింది. ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటలలో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ రోజు రాయలసీమ, కోస్తా ఆంధ్రలలో వర్షం పడే అవకాశం ఉంది. సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.