breaking news
love fiilure
-
ప్రేమించిన అమ్మాయి, స్నేహితులు మోసం చేశారని లాడ్జిలో..
సాక్షి, హస్తినాపురం (హైదరాబాద్): ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ విఫలం కారణంగా వివాహమైన ఓ యువకుడు లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన షేక్ బ్రహ్మం(35) గతంలో లారీల వ్యాపారం చేస్తుండేవాడు. అతనికి భార్య ఖాశీంబీ, కూతురు, కుమారుడు ఉన్నారు. శుక్రవారం తన స్వగ్రామం నుంచి నగరానికి వచ్చిన బ్రహ్మం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్లోని వీఎంఆర్ గ్రాండ్ లాడ్జిలో నంబర్: 304 గదిలో అద్దెకు దిగాడు. ప్రకాశం జిల్లా రావిపోడుకు చెందిన బ్రహ్మం మిత్రుడు జ్యోతి వేణుగోపాల్ శనివారం నగరానికి చేరుకున్నాడు. మధ్యాహ్నం లాడ్జిలో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మద్యానికి, గదికి అద్దె డబ్బులు చెల్లించాలని బాయ్ వచ్చి అడిగాడు. తర్వాత చెల్లిస్తామని చెప్పి మిత్రుడితో కలిసి లాడ్జి కిందికి వచ్చాడు. తర్వాత ఫోన్లో మాట్లాడుతూ గదిలోకి వెళ్లిన బ్రహ్మం తాను ఒక అమ్మాయిని ప్రేమించానని.. ఆమె, తన స్నేహితులు కూడా మోసం చేశారని చెబుతూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తన తల్లికి, భార్యకు రికార్డు చేసిన వీడియో పంపాడు. అనంతరం ఫ్యాన్కు లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోలు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: నా చావుకు భార్య, అత్తింటివారే కారణం.. -
ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య
కోల్సిటీ : ప్రేమ విఫలమైందని మనస్తాపం చెంది గోదావరిఖనికి చెందిన కోడూరి రాము(25) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... స్థానిక ఫైవింక్లయిన్ ఏరియాకు చెందిన రాయమల్లు కుమారుడు రాము 10వ తరగతి వరకు చదువుకున్నాడు. కొంతకాలంగా డ్రై వర్గా పని చేస్తున్నాడు. ఇటీవల ఓ యువతిని ప్రేమించాడు. ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. గురువారం మిత్రులతో కలిసి కాళేశ్వరం వెళ్లిన రాము సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాడు. రాత్రి ఏడు గంటల సమయంలో బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. స్థానిక 5ఏ గని సమీపంలోని ఇసుక బంకర్ దగ్గర చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రాము తండ్రి రాయమల్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై ్స రాజమౌళిగౌడ్ తెలిపారు.