breaking news
loses vision
-
పెన్సిల్ గుచ్చి కన్ను పోగొట్టాడు..!
ముంబై : బడి పిల్లల మధ్య మొదలైన గలాట ఓ విద్యార్థి కంటి చూపు పోయేందుకు కారణమైంది. ఓ విద్యార్థి కంట్లో పెన్సిల్తో గుచ్చడంతో అతని కుడి కన్ను పూర్తిగా గుడ్డిదైపోయింది. ఈ ఘటన ఘట్కోపర్లో గతేడాది జూలై 21న జరిగింది. అయితే, చికిత్స చేస్తే తమ కుమారుడి (9) కన్ను బాగవుతుందని ఆశించిన ఆ కుటుంబానికి నిరాశే ఎదురైంది. ఇప్పటివరకు రెండు లక్షల రూపాయలు ఖర్చయ్యాయని, అయినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు కారణమైన విద్యార్థి కుటుంబం నుంచి నష్టపరిహారం ఇప్పించడని పోలీసులను ఆశ్రయించారు. పెన్సిల్తో పెద్ద ప్రమాదమేమీ లేదని చెప్పి స్కూల్ యాజమాన్యం నమ్మబలికిందని... ఇప్పుడు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నష్టపరిహారం ఇప్పించకపోగా.. రూ.3 వేలు ఫీజు కట్టలేదని తమ పిల్లాడి మార్కుల మెమోను నిలుపుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు సర్జరీలు చేయించామని తమ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని వాపోయారు. పెన్సిల్ లెడ్ చిన్నారి కంటిలోనే ఉండిపోవడంతో చూపు తిరిగిరావడం అసాధ్యమని వైద్యులు అంటున్నారని తెలిపారు. కాగా, ఈ ఆరోపణల్ని స్కూల్ యాజమాన్యం తోసిపుచ్చింది. పిల్లాడి కంట్లో దాడి చేసిందెవరో ఖచ్చితంగా తెలియదన్నారు. ఘటన జరిగినప్పుడు అక్కడ టీచర్లెవరూ లేదని ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఇక బాధితుని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నట్టుగా తాము ఎవరినుంచీ నష్టపరిహారం ఇప్పించలేమని స్పష్టం చేశారు. కావాలంటే.. స్థానికంగా ఉండే నాయకుల సహకారంతో పిల్లాడి కంటి చికిత్సకు అవసరమైన సాయం అందించేలా కృషి చేస్తామని అన్నారు. గతేడాది కాలంగా బాధిత విద్యార్థి ఫీజు తనే చెల్లిస్తున్నానని వెల్లడించారు. బాధితుని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేసి నిజానిజాలు కనగొంటామని పంత్నగర్ సీనియర్ ఇన్స్పెక్టర్ రోహిణీ కాలే తెలిపారు. -
దోమకుట్టి కన్ను పోయింది
లండన్: దోమల వల్ల మలేరియా, పైలేరియా వంటి రోగాలతోపాటు మరెన్నో ఇతర వ్యాధులు వస్తాయని మనకు తెలిసిందే. అయితే బ్రిటన్ లో మాత్రం ఓ మహిళకు దోమకాటు వల్ల ఏకంగా కనుచూపు పోయింది. దీంతో ఇది అరుదైన కేసుగా మిగిలింది. అక్కడ భారత సంతతికి చెందిన ఓ వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం బ్రిటన్ కు చెందిన ఓ 69 ఏళ్ల మహిళ 2014 జూలై నెలలో గ్రెనడాలోని కరేబియా దీవులను సందర్శించింది. ఆ సమయంలో ఆమెకు ఓ దోమ కుట్టడంతో ముందు చికెన్ గున్యా వ్యాధి భారిన పడింది. అలా కొద్ది కాలం తర్వాత చూపుమందగించడంతో బ్రిటన్ లోని వెస్ట్ మిడ్ ల్యాండ్ లోగల పోస్టుగ్రాడ్యుయేట్ డీనరి అండ్ క్వీన్స్ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లింది. అందులో ఆమెను డాక్టర్ అర్బిజిత్ మోహెతే అనే వైద్యుడు పరీక్షించాడు. ఈ పరీక్షల్లో దోమకాటు ద్వారా శరీరంలోకి చొరబడిన వైరస్ ఆమె కుడికన్ను పనిచేసేందుకు సహకరించే వ్యవస్థపై దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేసిందని గుర్తించారు. ముందస్తుగా ఈ సమస్య బాధితురాలు గుర్తించకపోవడంతో చివరి దృష్టిలోపాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కంటి చూపు విషయంలో ఎంత తొందరగా చికిత్స చేసుకుంటే అంతమంచిది లేదంటే దుష్ప్రభావాలు చాలా ఎక్కువ అని వైద్యులు సెలవిచ్చారు.