breaking news
Loop Mobile
-
లూప్ నుంచి తప్పుకున్న ఎయిర్టెల్
న్యూఢిల్లీ: టెలికం సేవల దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ముంబైకి చెందిన లూప్ మొబైల్ను కొనుగోలు చేసే ప్రణాళికలనుంచి తప్పుకుంది. లూప్ను కొనుగోలు చేసేందుకు రూ. 700 కోట్లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఫిబ్రవరిలో కుదిరిన ఈ ఒప్పందానికి టెలికం శాఖ(డాట్) నుంచి అనుమతి లభించాల్సి ఉంది. దీంతో 17 లక్షలమంది వినియోగదారులు కలిగిన లూప్... ఎయిర్టెల్తో విలీనమయ్యే అవకాశాన్ని పోగొట్టుకుంది. ఈ అంశాన్ని బీఎస్ఈకి వెల్లడిస్తూ ఎయిర్టెల్ ఇప్పటివరకూ డాట్ అనుమతులు లభించకపోగా, ఈ నెలతో లూప్ లెసైన్స్ గడువు ముగిసిపోతున్నదని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత కొనుగోలు ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలిపింది. 2012 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు రద్దు చేసిన 122 టెలికం లెసైన్స్లలో లూప్ టెలికం కూడా ఉండటంతో ఖైతాన్ గ్రూప్ కంపెనీ అయిన లూప్ మొబైల్కు దెబ్బ త గిలిన సంగతి తెలిసిందే. కాగా, మిగిలిన ముంబై సర్కిల్ లెసైన్స్ గడువు సైతం ఈ నెల 29తో ముగియనుంది. నిజానికి ముంబై కార్యకలాపాలను కొనసాగించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్వహించిన వేలంలో స్పెక్ట్రమ్ను కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే లూప్ స్పెక్ట్రమ్ను కొనుగోలు చేయకపోవడం గమనార్హం. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేరు దాదాపు 3% క్షీణించి రూ. 385 వద్ద ముగిసింది. -
లూప్ రేసులో భారతీ ఎయిర్టెల్
న్యూఢిల్లీ: మొబైల్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ముంబైలోని లూప్ మొబైల్ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. తద్వారా 30 లక్షల కస్టమర్లను పొందేందుకు ఎయిర్టెక్కు వీలు చిక్కనుంది. ముంబై సర్కిల్లో మొబైల్ టెలిఫోనీ లెసైన్స్ను కలిగిన లూప్.. ఈ డీల్ ద్వారా రూ. 750 కోట్లను ఆశిస్తోంది. అయితే ఖైతాన్ గ్రూప్నకు చెందిన లూప్నకు రూ. 400 కోట్లమేర రుణాలు కూడా ఉన్నాయి. మొబైల్ బిజినెస్ను విక్రయించేందుకు ఇతర టెలికం కంపెనీలతోనూ లూప్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. లూప్నకు గల స్పెక్ట్రమ్ విలువ తాజా బేస్ ధరతో పోలిస్తే రూ. 2,624 కోట్లు చేస్తుందని అంచనా. సెప్టెంబర్ చివరికి ముంబైలో ఎయిర్టెల్కు 41 లక్షల కస్టమర్లున్నారు. 68 లక్షల మంది కస్టమర్లతో వొడాఫోన్ టాప్లో ఉంది. లూప్ కొనుగోలుతో ఎయిర్టెల్ నంబర్వన్గా ఎదిగే అవకాశముంది. కాగా, గురువారం బీఎస్ఈలో భారతీ షేరు దాదాపు 5% దిగజారి రూ. 316 వద్ద ముగిసింది.