breaking news
lokesh sharma
-
జిత్తుల మారి వైరస్
బీజింగ్: కరోనా మహమ్మారి జిత్తులు ఒక్కటొక్కటిగా ప్రపంచానికి తెలుస్తున్నాయి. వ్యాధి బారిన పడి ఓ మోస్తరు లక్షణాలు మాత్రమే కనపరిచిన వారికి చికిత్స చేశాక.. ఆ లక్షణాలు కనిపించక పోయినా, ఎనిమిది రోజుల పాటు వైరస్ వారి శరీరంలోనే ఉన్నట్లు గుర్తించామని భారతీయ సంతతి శాస్త్రవేత్త లోకేశ్ శర్మ చైనాలో నిర్వహించిన ఒక పరిశోధన చెబుతోంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ తాజా సంచికలో పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. బీజింగ్లోని పీఎల్ఏ జనరల్ ఆసుపత్రిలో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 9 మధ్యకాలంలో కరోనా చికిత్స పొందిన 16 మందిపై తాము పరిశోధనలు చేశామని లోకేశ్ శర్మ తెలిపారు. పదహారు మంది రోగుల నుంచి తాము రోజు విడిచి రోజు నమూనాలు సేకరించామని, చికిత్స తరువాత వైరస్ లేనట్లు పరీక్షలు నిర్ధారించినప్పటికీ సగం మందిలో మరో ఎనిమిది రోజులపాటు వైరస్ వారి శరీరంలో ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని చెప్పారు. (కరోనా ఎఫెక్ట్: ‘ఆమె మాట’కే ఇప్పుడు క్రేజ్) -
‘బొగ్గు’లోనూ గూఢచర్యం!
* కోల్, విద్యుత్ శాఖల రహస్య పత్రాల చేరవేత * ఆరోపణలపై ఒకరి అరెస్టు.. అదుపులో మరో ఆరుగురు న్యూఢిల్లీ: కార్పొరేట్ గూఢచర్యం ఒక్క చమురుశాఖకే పరిమితం కాలేదు! బొగ్గు, విద్యుత్ శాఖల్లో కూడా ఇదే తతంగం చోటుచేసుకుంది. తాజాగా ఈ రెండు శాఖల నుంచి రహస్య పత్రాలు బయటకు తరలించారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు నోయిడాలోని ఇన్ఫ్రా లైన్ కన్సల్టెన్సీ కంపెనీకి చెందిన లోకేశ్ శర్మ(33)ను అరెస్టు చేశారు. ఆయన నుంచి నకిలీ ఐడీ కార్డులు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీలో విసృ్తతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. లోకేశ్ను సోమవారం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా.. నిందితుడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చమురుశాఖలో కీలక పత్రాల చోరీ కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటికే 12 మందిని అరెస్టు చేయడం తెలిసిందే. వీరిలో శంతను సైకియా, ప్రయాస్ జైన్లను విచారించగా, లోకేశ్ పాత్ర వెలుగులోకి వచ్చింది. ‘ఈ రాకెట్లో లోకేశ్ కీలక పాత్ర పోషించాడు. పెట్రోలియం, బొగ్గు, విద్యుత్ శాఖల్లో పనిచేసే సిబ్బంది ద్వారా ఇతడు రహస్య డాక్యుమెంట్లను సేకరించేవాడు. వాటిని తన కంపెనీకి ఇవ్వడంతోపాటు బయట కూడా అమ్ముకునేవాడు అని ఢిల్లీ జాయింట్ కమిషనర్(క్రైం) రవీంద్ర తెలిపారు. చమురు శాఖలో వెలుగుచూసిన గూఢచర్యంతో సంబంధం లేకుండా దీన్ని వేరే కేసుగా పరిగణిస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని, లోకేశ్ ఇచ్చిన సమాచారంతో మరికొందరిని అరెస్టు చేస్తామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. రహస్య పత్రాలను వీరు ఎలా చేరవేశారు, వాటి ద్వారా ఎవరు లబ్ధి పొందారని అడగ్గా.. లోకేశ్ అనుచరులను కూడా విచారిస్తే ఈ వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.చమురు శాఖలో గూఢచర్యం కేసులో అరెస్టయిన నలుగురి నిందితులు లాల్తా ప్రసాద్, రాకేశ్, ప్రయాస్ జైన్, శంతను సైకియాలకు ఢిల్లీ కోర్టు మార్చి 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కస్టడీ గడువు ముగియడంతో పోలీసులు వారిని సోమవారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు తమతో ఖాళీ పేపర్లపై బలవంతంగా సంతకాలు తీసుకున్నారని వారు కోర్టుకు చెప్పారు. కేసు డైరీపై కోర్టు సంతకం చేయాలని వారి న్యాయవాది వాదించగా.. అందుకు కోర్టు సమ్మతించింది. సోదాలు జరగలేదు: రిలయన్స్ కార్పొరేట్ గూఢచర్యం కేసులో దేశవ్యాప్తంగా తమ కార్యాలయాలపై ఎక్కడా కూడా పోలీసులు దాడులు జరపలేదని అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపింది. రిలయన్స్ పవర్లో పనిచేసే ఓ ఉద్యోగి కార్యాలయంలోనే పోలీసులు సోదారుల జరిపారని, అయితే నేరానికి సంబంధించి ఆయన నుంచి ఎలాంటి సమాచారం లభ్యం కాలేదని వివరించింది. తమ వ్యాపారాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావు లేదని స్పష్టంచేసింది. గూఢచర్యం కేసులో అరెస్టయిన ఐదుగురు కార్పొరేట్ అధికారుల్లో రిలయన్స్ గ్రూపుకు చెందిన రిషీ ఆనంద్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.