-
పెన్షన్ కోసం తల్లి శవాన్ని..
కోల్కతా, పశ్చిమ బెంగాల్ : డబ్బుకు లోకం దాసోహం. ఇది ఊరికే చెప్పలేదు. ఎందుకంటే డబ్బే ప్రధానం అన్నింటికి. అన్ని బంధాలను నిలిపేది, పడగొట్టేది ఈ డబ్బే. దీనికి తార్కాణంగా నిలిచే ఘటన ఒకటి కోల్కతాలో చోటుచేసుకుంది. తల్లికి వచ్చే పెన్షన్ డబ్బుల కోసం ఆమె మరణాన్ని కూడా లోకానికి తెలియకుండా చేశాడు. తల్లి శవాన్ని ఇంట్లోని ఫ్రిజ్లోనే దాచిపెట్టారు. ఆమె కొడుకు, భర్త కలిసి ఈ పని చేశారు. తల్లికి వచ్చే పెన్షన్ డబ్బుల కోసం ఆమె బతికే ఉన్నట్లుగా సర్టిఫికేట్స్ కూడా సృష్టించాడు. వివరాలు...కోల్కతాకు చెందిన బీనా మజుందార్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తు ఉండేది. అనారోగ్యం కారణంగా 2015 ఏప్రిల్ 7న హాస్పిటల్లో మరణించింది. అయితే అప్పటి నుంచి తన భర్త గోపాల్ మజుందార్, కుమారుడు సుప్రభాత్ మజుందార్లు ఆమె శవాన్ని ఇంట్లోనే ఫ్రిజ్లో దాచిపెట్టారు. ఇరుగు పొరుగు వారు అడిగితే మార్చురీలో ఉందని చెప్పేవారు. బీనా మజుందార్కు వచ్చే పెన్షన్ డబ్బులను గత రెండేళ్ల నుంచి వీరే డ్రా చేస్తున్నారు. అయితే పెన్షన్ కోసమే ఇలా చేసుండవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. శవంపై కత్తి గాట్లు ఉన్నాయని, పోస్ట్మార్టంకు తరలించామని దాని తర్వాతే అసలు నిజాలు చెప్పగలమని పోలీసులు పేర్కొన్నారు. -
మేం బతికే ఉన్నాం..
లైవ్ సర్టిఫికెట్ కోసం పింఛన్దారుల పాట్లు ఇందూరు : రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల పెన్షన్దారులకు విధించిన కొత్త నిబంధనతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పెన్షన్ లబ్ధిదారులు తాము బతికి ఉన్నామని నిరూపించుకోవడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ సేవ కేంద్రాలలో వేలి ముద్రలు పోల్చి చూసుకుని ‘లైవ్ ఎవిడెన్స్ సర్టిఫికెట్’ ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఈనెల 21 వ తేదీలోగా ‘లైవ్ ఎవిడెన్స్ సర్టిఫికెట్’ సమర్పించాలని పేర్కొంది. దీంతో నిజామాబాద్లోని పెన్షన్ లబ్ధిదారులు నగరంలోని మీసేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అందరూ ఒకేసారి రావడంతో గంటల తరబడి వరుసల్లో నిల్చోవాల్సి వస్తోంది. బుధవారం సర్వర్ సతాయించడంతో మరింత ఎక్కువ సమయం వేచి చూడాల్సి వచ్చింది. -
జీవించే ఉన్నారా?
♦ జిల్లా యంత్రాంగం సరికొత్త కార్యక్రమం ♦ అక్రమాలకు చెక్ పెట్టేందుకు ‘ప్రయోగం’ ♦ జూన్ 1 నుంచే అమల్లోకి.. ♦ ‘లైవ్ సర్టిఫికెట్’ ఉంటేనే ‘ఆసరా’ జిల్లాలో 3,40,880 మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 92,802 మంది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు. లబ్ధిదారులు జూన్ 1 నుంచి 25లోపు ‘లైవ్ సర్టిఫికెట్ల’ను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పించాలి. వాటిని సమర్పించిన వారికే పింఛన్లు. మీసేవ కేంద్రాల్లో బయోమెట్రిక్, ఐరీస్ పద్ధతిలో వివరాలు సమర్పిస్తే వెనువెంటనే లైవ్ సర్టిఫికెట్లు జారీ అయ్యేలా జిల్లా యంత్రాంగం ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఆసరా పథకంలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి పింఛన్ దారుడు ఇకపై జీవించి ఉన్నట్టు నిర్ధారణ (లైవ్ సర్టిఫికెట్) పత్రాన్ని సమర్పిస్తేనే పింఛన్ డబ్బులు ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా : గ్రామీణ ప్రాంతాల్లో బయోమెట్రిక్ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుడికే పింఛన్ డబ్బులు అందిస్తుండగా.. పట్టణ ప్రాంతంలో మాత్రం లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో ఈ మొత్తాన్ని జమచేస్తున్నారు. ఈక్రమంలో లబ్ధిదారులు మరణించినప్పటికీ.. వారి కుటుంబీకులు పింఛన్ డబ్బులను బ్యాంకు నుంచి డ్రా చేస్తున్నారు. ఈక్రమంలో మరణించిన వారిని జాబితా నుంచి తొలగించేందుకు ఉపక్రమించిన యంత్రాంగం.. జీవించి ఉన్నట్లు నిర్ధారించే సర్టిఫికెట్లను లబ్ధిదారుల నుంచి కోరుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లా ప్రాంతానికి చెందిన లబ్ధిదారులంతా జూన్ 1వ తేదీ నుంచి 25లోపు ఈ సర్టిఫికెట్లను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. వీటిని సమర్పించిన వారికే పింఛన్ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. జిల్లాలో 3,40,880 మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 92,802 మంది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు. అల్వాల్, కూకట్పల్లి, ఎల్బీనగర్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి-1, శేరిలింగంపల్లి-2, ఉప్పల్, కాప్రా సర్కిళ్ల పరిధిలోని ఈ లబ్ధిదారులకు పింఛన్ డబ్బును బ్యాంకు ఖాతాలో జమచేస్తున్నారు. జిల్లా యంత్రాంగం తాజా నిర్ణయంతో ఈ సర్కిళ్లలోని లబ్ధిదారులు లైవ్ సర్టిఫికెట్లను సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలి. ఇందుకుగాను సమీప మీసేవ కేంద్రాల్లో బయోమెట్రిక్, ఐరీస్ పద్ధతిలో వివరాలు సమరిస్తే వెనువెంటనే లైవ్ సర్టిఫికెట్లు జారీ అయ్యేలా యంత్రాంగం సాఫ్ట్వేర్ తయారు చేసింది. ఇందుకు సంబంధించి మీసేవ నిర్వాహకులకు రెండ్రోజుల క్రితం కలెక్టరేట్లో శిక్షణ ఇచ్చింది. ఈ సర్టిఫికెట్లు సమర్పించకుంటే వారికి వచ్చే నెల నుంచి ఆసరా ఫించన్ నిలిచిపోనుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
అవినీతిలో ‘ఆది’పత్యం
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement