breaking news
Lipika
-
Akshita Sachdeva: ‘కిబో’ పరికరం ఆ దిశగా వేసిన తొలి అడుగు..
మనం ఏ బాట ఎంచుకోవాలో అనేది విధి నిర్ణయిస్తుందో లేదోగానీ పరిస్థితులు మాత్రం నిర్ణయిస్తాయి. డాక్టర్ కావాలనుకున్న అక్షితా సచ్దేవా పరిస్థితుల ప్రభావం వల్ల పరిశోధన రంగంలోకి వచ్చింది. ఎన్నో రంగాలకు చెందిన ఎంతోమంది అంధులతో మాట్లాడింది. వారి సమస్యల గురించి లోతుగా తెలుసుకుంది. వారు ఎదుర్కొంటున్న సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు కనుక్కోవాలనుకుంది. బెంగళూరు కేంద్రంగా ఆమెప్రారంభించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ‘ట్రెస్టిల్ ల్యాబ్స్’ అంధులకు బాట చూపించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ల్యాబ్స్ నుంచి వచ్చిన ‘కిబో’ పరికరం ఆ దిశగా వేసిన తొలి అడుగు....అక్షితా సచ్దేవా అమ్మమ్మ క్యాన్సర్తో చనిపోయింది. ఇక అప్పటి నుంచి డాక్టర్ కావాలనేది తన లక్ష్యంగా మారింది. అయితే కాలేజీ రోజుల్లో ఒక లెక్చరర్తో మాట్లాడిన తరువాత తన ఆలోచనల్లో మార్పు వచ్చింది. ‘డాక్టర్ కావాలి’ అనే తన లక్ష్యం గురించి చెప్పినప్పుడు క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించే సాంకేతికత, దాని ప్రాధాన్యతతో పాటు హెల్త్కేర్ రంగంలోని ఎన్నో ఆవిష్కరణల గురించి చెప్పారు ఆ లెక్చరర్.‘నా కళ్లు తెరిపించిన సందర్భం అది’ అని ఆ రోజును గుర్తు చేసుకుంటుంది అక్షిత. ఆ రోజు నుంచి హెల్త్కేర్ రంగానికి సంబంధించిన సాంకేతికత, సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టింది. ఫరీదాబాద్లోని మానవ్ రచన కాలేజ్లో ఇంజినీరింగ్ చేస్తున్న రోజుల్లో దృష్టి లోపం ఉన్నవారి కోసం ఒక గ్లోవ్ను రూపొందించింది అక్షితా సచ్దేవా. చూపుడు వేలిపై కెమెరా ఉండే ఈ హ్యాండ్గ్లోవ్ సహాయంతో దృష్టి లోపం ఉన్నవారు చదవవచ్చు.ఈ గ్లోవ్ గురించి న్యూ దిల్లీలోని నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్(ఎన్ఏబీ)కి వివరించింది అక్షిత. దృష్టి లోపం ఉన్న ఒక యువకుడు ఈ గ్లోవ్ను ఉపయోగించి న్యూస్పేపర్ చదవగలిగాడు. ఈ విజయం ఆమెలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఇంకా ఏదో సాధించాలనే పట్టుదలను పెంచింది. అంధులకు జీవనోపాధి, విద్య, దైనందిన జీవన విషయాల్లో సహాయపడడానికి తన ఆవిష్కరణను ముందుకు తీసుకువెళ్లాలనుకుంది.అంధులు ఎదుర్కొనే సమస్యలను లోతుగా అర్థం చేసుకోవాలనుకుంది. బ్యాంకర్లు, పీహెచ్డీ స్కాలర్లు, గృహిణులు... వివిధ విభాగాలకు చెందిన అంధులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుంది. ఆ సమయంలోనే దీపాలి పవార్ అనే స్టూడెంట్తో మాట్లాడింది.కాలేజీలో ఒక సెమిస్టర్ పూర్తి చేసిన దీపాలి హటాత్తుగా చూపు కోల్పోయింది. ఆమెను తిరిగి తీసుకోవడానికి కాలేజి వారు నిరాకరించారు. బ్రెయిలీ నేర్చుకోమని సలహా ఇచ్చారు. బ్రెయిలీ నేర్చుకోవడానికి దీపాలి రెండేళ్లు గడిపింది. అయితే అది ఆమెకు కష్టంగా ఉండేది. బ్రెయిలీ నేర్చుకున్న తరువాత కూడా ఆమెకు కాలేజీలో చదివే అవకాశం రాలేదు. యశ్వంత్రావ్ చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్శిటీలో చేరడమే దీపాలి ముందు ఉన్న ఏకైక మార్గం అయింది.ఆడియో–రికార్డెడ్ పుస్తకాలను అందించే ఒక స్వచ్ఛంద సంస్థను సంప్రదించింది దీపాలి. అయితే ఒక్కొక్క పుస్తకం కోసం నాలుగు నుంచి ఆరువారాల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఆమె దగ్గర మూడు పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. ఆ పుస్తకాలను తీసుకువెళ్లిన అక్షిత వాటిని మొబైల్ అప్లికేషన్ ఫామ్లోకి మార్చి దీపాలికి ఇచ్చింది.మూడు నెలల తరువాత..దీపాలి నుంచి ఫోన్ వచ్చింది. ‘సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ను సింగిల్ అటెంప్ట్లో పూర్తి చేశాను’ అని సంతోషంగా చెప్పింది. ఇది అక్షితకు మరో విజయం. మరింత ఉత్సాహాన్ని ఇచ్చిన విజయం. ఈ ఉత్సాహ బలమే బోనీదేవ్తో కలిసి బెంగళూరు కేంద్రంగా ‘ట్రెస్టిల్ ల్యాబ్స్’ అనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీప్రారంభించేలా చేసింది.నాసిక్లోని ‘నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్’లో పెద్దయంత్రాన్ని చూసింది అక్షిత. అయితే అది పెద్దగా ఉపయోగంలో లేదు. ఈ మెషిన్ ప్రింటెడ్ డాక్యుమెంట్స్ను చదవగలుగుతుంది. అయితే కేవలం ఇంగ్లీష్లో మాత్రమే. అప్పుడే అక్షితకు ఎన్నో భారతీయ భాషలకు సంబంధించిన పుస్తకాలను చదవగలిగే యంత్రాన్ని రూపొందించాలనే ఐడియా తట్టింది.అది ‘కిబో’ రూపంలో సాకారం అయింది. ఈ పరికరం విజయం సాధించడంతో నాసిక్ మున్సిపల్ కార్పోరేషన్, ఐఐఎం–అహ్మదాబాద్... మొదలైన సంస్థల నుంచి ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ‘భారతీయ భాషలపై దృష్టి కేంద్రీకరించిన తొలి అసిస్టివ్ టెక్ టూల్ కిబో’ అంటుంది అక్షిత.మరింతగా..అంధులకు ఉపకరించే దిశగా ఆసియా, ఆఫ్రికాలలో మా సంస్థను విస్తరించాలనుకుంటున్నాం. ‘కిబో’కు మరిన్ని భాషలను జోడించాలనుకొంటున్నాము. ఏఐ సాంకేతికతతో సెల్ఫ్–లెర్నింగ్, సెల్ఫ్–ట్రైనింగ్ మాడ్యూల్స్కు రూపకల్పన చేస్తాం. – అక్షితా సచ్దేవా, కో–ఫౌండర్, ట్రెస్టిల్ ల్యాబ్స్కిబో ఇలా..‘కిబో’ వాటర్ బాటిల్ ఆకారంతో ఉంటుంది. దీని ఎడమవైపు ఉన్న బటన్ను నొక్కితే టేబుల్ ల్యాంప్ ఆకారంలోకి మారుతుంది. యూఎస్బీ కేబుల్ దీన్ని ల్యాప్టాప్కు కనెక్ట్ చేస్తుంది. పుస్తక పాఠాన్ని ‘కిటో’ సంగ్రహిస్తుంది.అరవై భాషలలో ఏ భాషలలోనైనా అనువాదం అడగవచ్చు. వ్యక్తులు, సంస్థల కోసం విడిగా నాలుగు ‘కిబో’ప్రాడక్ట్స్ను రూపొందించారు. ‘కిబో ఎక్స్ఎస్’ను స్కూలు, కాలేజీలలోని లైబ్రరీల కోసం అందుబాటులో ఉంచారు. ‘కిబో 360’ని వ్యాపారసంస్థలు, యూనివర్శిటీలు, ప్రచురణ సంస్థల కోసం రూపొందించారు. -
'ఆ మంత్రి భార్యను రెండుసార్లు చంపాలనుకున్నాడు'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమనాథ భారతి మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయన తన భార్యను రెండు సార్లు హత్య చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఇప్పటికే గృహహింసతోపాటు, హత్య చేసేందుకు కూడా తన భర్త ప్రయత్నించారని పోలీసులకు సోమనాథ భారతిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు పురోగతిని కోర్టుకు వివరించారు. మొట్టమొదటి హత్య యత్నం ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు జరిగిందని, రెండోసారి ఆమె మణికట్టును చీల్చి చంపేయత్నం చేశారని కోర్టుకు పోలీసులు తెలిపారు. అయితే కోర్టు మాత్రం గురువారం కూడా సోమనాథను అరెస్టు చేసేందుకు పోలీసులకు అనుమతి ఇవ్వలేదు. మరోపక్క, ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్ని కూడా వెలువరించలేదు. ఇక కోర్టుకు హాజరైన భార్య లిపిక ఆయన తన కుక్క డాన్తో దాడి చేయించాడని తెలిపింది. తన నగలు ఆయన వద్దే ఉన్నాయని వాటిని తనకు ఇప్పించాలని కోర్టును అభ్యర్థించింది. -
'డాన్, నేను ఏ తప్పూ చేయలేదు'
న్యూఢిల్లీ: 'డాన్కు ఏమి తెలియదు. డాన్ ఏ నేరం చేయలేదు. ఇంట్లో వాళ్లను ఎక్కడైనా పెంపుడు జంతువులు హత్య చేస్తాయా' అని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ప్రశ్నించారు. ఇంతకీ డాన్ అంటే ఏమిటని అనుకుంటున్నారా..? అది సోమనాథ భారతి పెంపుడు కుక్క పేరు. ప్రస్తుతం సోమనాథ భారతిపై ఆయన భార్య లిపికా మిత్రా తనపై హత్యా ప్రయత్నం చేశారని, గృహహింసకు పాల్పడ్డారని కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో కీలక దర్యాప్తు ప్రస్తుతం ఈ డాన్ చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే లిపికా మిత్రా ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో తన బాస్(సోమనాథ భారతి) ఆదేశాలను పాటించి డాన్ దాడి చేసిందని, మీదపడి కరిచిందని, ముఖ్యంగా తన కడుపుపై తీవ్రగాయాలు చేసిందని, మరికొన్ని చోట్ల కూడా దారుణంగా దాడి చేసి చంపేయత్నం చేసిందని పోలీసులకు వివరించింది. దీనికి సంబంధించిన వీడియో టేపులు కూడా ఉన్నట్లు ఆమె పేర్కొంది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసును భిన్న కోణాల్లో విచారిస్తున్నారు. అయితే, ఆ వీడియో టేపులను కావాలనే సోమనాథ భారతి మాయం చేసినట్లు కూడా ఆరోపిస్తున్నారు. ఢిల్లీ కోర్టులో అరెస్టు నుంచి ఉపశమనం పొందిన ఆయన విచారణ కోసం ఇటీవల తరచూ పోలీస్ స్టేషన్కు వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన పెంపుడు కుక్కను గురించి పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో తన జీపులోని వెనుక సీట్లో డాన్ను తీసుకొచ్చిన ఆయన దానిని మీడియాకు చూపిస్తూ 'పెంపుడు జంతువులు ఎక్కడైనా ఇంట్లో వాళ్లను హత్య చేస్తాయా.. డాన్ కరుస్తాడా? చూడండి అంటూ ప్రశ్నించారు. డాన్గానీ, తాను గానీ ఏ తప్పూ చేయలేదని నిజంగా కావాలంటే తన వద్ద టేపుల ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. బెయిల్ పిటిషన్ కోసం ఆ ఆడియో టేపులను కూడా జత చేసినట్లు చెప్పారు. -
సోమ్నాథ్పై గృహహింస ఫిర్యాదు
ఢిల్లీ మహిళా కమిషన్ను ఆశ్రయించిన భార్య న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీపార్టీకి కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల కేసులో న్యాయ మంత్రి జితేందర్సింగ్ తోమర్ అరెస్టు, రాజీనామా ఉదంతం జరిగి 24గంటలైనా కాకుండానే ఆ పార్టీ ఎమ్మెల్యే సోమ్నాథ్ భారతిపై ఆయన భార్య లిపిక గృహహింస చట్టం కింద ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ)లో బుధవారం ఫిర్యాదు చేశారు. భర్త తనను శారీరకంగా, మానసికంగా, మౌఖికంగా హింసిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలకు జూన్ 26లోగా తమ ముందు హాజరై సమాధానం చెప్పాలని డీసీడబ్ల్యూ సోమ్నాథ్కు నోటీసు ఇచ్చింది. భర్త, ఆయన అనుచరుల నుంచి తనకు ముప్పు ఉందని లిపిక చెప్పారు. 2010 నుంచీ సోమ్నాథ్ ఆమెను వేధిస్తున్నారని.. ఇక ఈ వేధింపులకు ముగింపు పలకాలని లిపిక భావిస్తున్నారని డీసీడబ్ల్యూ చైర్పర్సన్ బర్ఖాసింగ్ అన్నారు. మూడేళ్లుగా లిపిక సోమ్నాథ్కు దూరంగా విడిగా ఉంటున్నప్పటికీ, ఆయన ఆమె దగ్గరకు వచ్చిపోతున్నారని బర్ఖా చెప్పారు. 2010 నుంచి సోమ్నాథ్తో గడ్డుకాలాన్ని అనుభవించానని, వివాహ బంధం నుంచి విముక్తి కోరుకుంటున్నానని లిపిక చెప్పారు.