breaking news
likhitha
-
'రాను బొంబాయికి రాను లిఖిత 'సాV3' మూవీ టీజర్ విడుదల (ఫొటోలు)
-
హీరోయిన్గా మారిన ‘రాను బొంబాయికి రాను’ భామ!
‘రాను బొంబాయికి రాను’ ఫోక్ సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. లిరిక్స్ కంటే ఎక్కువగా రామ్ రాథోడ్, లిఖిత వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఈ ఒక్క పాటతో లిఖిత..తెలుగు ఆడియన్స్కి బాగా దగ్గరైంది. ఈ పాట తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. అయితే ఇన్నాళ్లు ప్రైవేట్ ఆల్బమ్స్తో అలరించిన లిఖిత..ఇక ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ ఆమెను టాలీవుడ్కి పరిచయం చేయబోతున్నాడు. సామ్రాట్, డీమోన్ పవన్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘సాV3’ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ‘సాV3’ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హీరోయిన్ లిఖిత మాట్లాడుతూ - డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ చెబుతున్నప్పుడే మూవీ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా తెలిసింది. నేను ఫోక్ సాంగ్స్ నుంచి చిన్న గ్యాప్ తీసుకున్నాను. హీరోయిన్ గా మంచి రోల్స్ చేయాలనే ఫోక్ సాంగ్స్ కు గ్యాప్ ఇచ్చాను. అయినా మంచి ఆల్బమ్ వస్తే తప్పకుండా చేస్తాను. నేను ఒక బెస్ట్ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో ఈ మూవీ ఆఫర్ వచ్చింది. సామ్రాట్, పవన్ లాంటి కోస్టార్స్ దొరకడం హ్యాపీగా ఉంది. వాళ్లు తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంటారు. ప్రొడక్షన్ పరంగా ఎక్కడా రాజీపడకుండా మా విజయ గారు నిర్మించారు. ఎలాంటి స్క్రిప్ట్ పేపర్ లేకుండా మేమంతా కథను ఓన్ చేసుకుని నటించాం. అదంతా మా డైరెక్టర్ వల్లే సాధ్యమైంది’ అన్నారు.దర్శకుడు కృష్ణమాయ మాట్లాడుతూ... లిఖి, డీమోన్ పవన్ కొత్త వాళ్లు ఎలా నటిస్తారో అనుకున్నాను గానీ పర్ ఫార్మెన్స్ ఇరగదీశారు. వాళ్లకు ఇప్పటిదాకా సరైన మూవీ రాలేదని అనిపించింది. సాయి కార్తీక్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది. మా టెక్నీషియన్స్ అందరూ అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చారు. ‘సాV3’ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం’ అన్నారు.హీరో డీమోన్ పవన్ మాట్లాడుతూ - బిగ్ బాస్ తర్వాత నేను ఎలాంటి మూవీ చేయాలని ఆలోచిస్తున్న టైమ్ లో డైరెక్టర్ కృష్ణ మాయ ఈ స్క్రిప్ట్ చెప్పారు. చాలా మంచి స్క్రిప్ట్ ఇది. ఆయన స్క్రిప్ట్ చెబుతుంటే ఇంకా వినాలని అనిపించింది. అంత ఎక్స్ ప్రెసివ్ గా స్టోరీ చెప్పారు. ఇలాంటి దర్శకుడితో వర్క్ చేస్తే నటుడిగా నాకు మంచి పేరొస్తుందని నమ్మాను. మేమంతా ఈ సినిమా కోసం ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఆన్ సెట్ ఇంప్రూవైజ్ చేసుకుంటూ నాచురల్ గా నటించాం. సామ్రాట్ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. అలాగే లిఖితకు హీరోయిన్ గా మంచి పేరు వస్తుంది. తక్కువ టైమ్ లో మేమంతా క్వాలిటీగా సినిమా చేశాం. అన్నారు. -
సలార్లో అఖిల్ అక్కినేని.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ సతీమణి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'సలార్' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి తాజాగా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి.. ప్రభాస్, పృథ్వీరాజ్ల యాక్షన్ సీన్స్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సలార్ పార్ట్-2 ఉంటుందని ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. దానికి 'సలార్ శౌర్యాంగపర్వం' అనే టైటిల్ కూడా రివిల్ అయిపోయింది. సలార్ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. అఖిల్ లుక్తో పాటు అతని బాడీ కూడా బాలీవుడ్ హీరోలకు ఏం తక్కువ కాదు అన్నట్టుగా ఉంటుంది. అఖిల్ భారీ యాక్షన్ సీన్స్లలో దుమ్ములేపగలడు. దీంతో సలార్ పార్ట్ 2లో అఖిల్ ఎంట్రీ దాదాపు ఖాయం అని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై ప్రశాంత్ నీల్ సతీమణి లిఖితా రెడ్డి తాజాగా స్పందించారు. అవన్నీ పూర్తిగా వదంతులు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లు అడిగడంతో క్లారిటీ ఇచ్చారు. సలార్లో దేవా తండ్రి పాత్ర ఎవరు పోషిస్తున్నారు..? తన తండ్రిని రాజమన్నార్ చంపాడనే విషయం దేవాకు తెలుసా..? అని చాలామంది అడిగిన ప్రశ్నకు ఆమె రివీల్ చేయలేదు.. సమాధానాల కోసం తాను కూడా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. 'సలార్' గ్లింప్స్లో చూపించిన జురాసిక్ పార్క్ డైలాగ్ గురించి ఆమె చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. శౌర్యాంగపర్వం విడుదలయ్యాకు ఆ డైలాగ్ కరెక్టా? కాదా? అనేది తెలుస్తుందని తెలిపారు. అంతేకాకుండా పండిట్ రోల్ కూడా సలార్లో కొంత మాత్రమే రివీల్ చేసినట్లు ఆమె చెప్పారు. -
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటుడు సామ్రాట్ భార్య
నటుడు సామ్రాట్ రెడ్డి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇక క్యారెక్టర్ ఆర్టీస్ట్గా కెరీర్ ప్రారంభించిన సామ్రాట్.. వైఫ్ ఆఫ్ రామ్, పంచాక్షరి వంటి సినిమాల్లో లీడ్ రోల్లో నటించారు. ఆ తర్వాత హీరో నాని హోస్ట్ చేసిన బిగ్బాస్ సీజన్ 2లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇంతకుముందు హర్షితా రెడ్డి అనే యువతితో సామ్రాట్కు వివాహం జరిగింది. అయితే విబేధాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. 2020లో కాకినాడకు చెందిన అంజనా శ్రీలిఖిత అనే అమ్మాయితో సామ్రాట్కు రెండో విహాహం జరిగింది. ఆగస్టు 15న సామ్రాట్ భార్య లిఖిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇండిపెండెన్స్ రోజును ఇలా సెలబ్రేట్ చేసుకోవడం డిఫరెంట్ ఫీలింగ్ అంటూ సామ్రాట్ తన కూతురితో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన పలువురు ప్రముఖులు సామ్రాట్ దంపతులకు శుభాంకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Samrat Reddy (@samratreddy) -
ఎన్టీఆర్ షేర్ చేసిన స్పెషల్ ఫొటో.. క్షణాల్లో వైరల్
Jr NTR Prashanth Neel Celebrate Wedding Anniversary: 'రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్)' సక్సెస్తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ పాన్ ఇండియా చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా కూడా మారాడు. మరోవైపు 'కేజీఎఫ్ 2'తో భారీ విజయం సాధించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కొరటాల శివ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరి కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సెలబ్రేషన్ సినిమా గురించి అనుకుంటే పొరపాటే. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఎవరికివారి పర్సనల్ లైఫ్కు సంబంధించిన విషయాన్ని ఒకే రోజు వేడుక చేసుకున్నారు. మే 5న ఇటు తారక్తోపాటు అటు ప్రశాంత్ నీల్ వివాహ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవాన్ని వారిద్దరు తమ ఫ్యామిలీలతో కలిసి జరుపుకున్నారు. ఈ విషయానికి సంబంధించిన ఒక స్పెషల్ ఫొటోను తారక్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందులో ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి దంపతులతోపాటు ప్రశాంత్ నీల్, ఆయన భార్య లిఖిత ఉన్నారు. ఈ రెండు జంటల వివాహ వార్షికోత్సవం మే 5న కావడంతో ఇరు జంటలు కలిసి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఫొటోను షేర్ చేస్తూ 'ఒకే రోజు మా రెండు జంటల వివాహ వార్షికోత్సవం జరుపుకోవడం వేడుకగా ఉంది. ఇదొక కొత్త ఆరంభం.' అని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు రిహార్సల్స్కు రాలేదు: శేఖర్ మాస్టర్ View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జాతీయస్థాయి బాస్కెట్బాల్కు ఖమ్మం విద్యార్థిని
రఘునాధపాలెం, న్యూస్లైన్: జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు రఘునాధపాలెంలోని వీవీసీ పాఠశాల విద్యార్థిని బుడిగం లిఖిత ఎంపికైంది. ఇటీవల వరంగల్ జిల్లా కేసముద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-17 పోటీలలో ప్రతిభ ప్రదర్శించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. లిఖితను పాఠశాల కరస్పాండెంట్ రేఖల భాస్కర్, ప్రిన్సిపాల్ విద్యుల్లత, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, పీడీలు డి.శ్రీనివాస్, జ్శైవాసరావు తదితరులు అభినందించారు.


