breaking news
Life coverage
-
ఎయిర్టెల్ రీచార్జ్పై రూ.4 లక్షల ఇన్సూరెన్స్
సాక్షి, న్యూఢిల్లీ: భారతి ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం బంపర్ఆఫర్ తీసుకొచ్చింది. రూ.599 ప్లాన్ రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు రూ.4 లక్షల విలువైన బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో జతకట్టింది. ఈ భాగస్వామ్య ఒప్పందం ద్వారా భారతి ఎయిర్టెల్ ప్రీ-పెయిడ్ మొబైల్ కస్టమర్లు ఆక్సా నుండి జీవిత బీమా పొందుతారని ఎయిర్టెల్ సోమవారం ప్రకటించింది. రూ.599 ఆఫర్లు రూ.599 ల కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్పై రోజుకు 2జీబీ డేటా, ఏ నెట్వర్క్కు అయినా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటులో ఉంటుంది. ప్రతి రీఛార్జితో మూడు నెలల వరకు బీమా కవర్ ఆటోమాటిక్గా కొనసాగుతుంది. 18-54 సంవత్సరాల వయస్సు గల వినియోగదారులందరికీ లభించే ఈ జీవిత బీమా సౌకర్యానికి ఎలాంటి వైద్య పరీక్షలు, ధృవీకరణ పత్రం అవసరం లేదనీ, తక్షణమే డిజిటల్ కాపీని కస్టమర్ ఇంటికే పంపిస్తామని భారతి ఎయిర్టెల్ ఢిల్లీ-ఎన్సిఆర్, సీఈవో వాణి వెంకటేష్ తెలిపారు. భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్తో భాగస్వామ్యంతో సులభంగా వినియోగదారులకు లైఫ్ ఇన్సూరెన్స్ను అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు.ఈ ప్రయోజనం పొందడానికి, కస్టమర్ ఎస్ఎంఎస్, ఎయిర్టెల్ థాంక్స్ యాప్ లేదా ఎయిర్టెల్ రిటైలర్ ద్వారా మొదట రీఛార్జ్ చేసిన తర్వాత నమోదు చేసుకోవాలన్నారు. కాగా న్యూఢిల్లీ సహా ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఈ సేవలను ప్రారంభించిందని, క్రమంగా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ ఆఫర్ ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. -
ఎక్సైడ్ లైఫ్ నుంచి స్మార్ట్ టర్మ్ ప్లాన్
హైదరాబాద్: సమగ్రమైన లైఫ్ కవరేజీ అందించేలా ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ తాజాగా స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. టర్మ్ పాలసీ అయినప్పటికీ .. పాలసీదారు జీవించి ఉన్న పక్షంలో అప్పటిదాకా కట్టిన ప్రీమియంలను పాలసీ వ్యవధి ముగిశాక తిరిగివ్వడం దీనిలో ప్రత్యేకత. ఇది క్లాసిక్, స్టెప్ అప్, కాంప్రిహెన్సివ్ వేరియంట్లలో లభిస్తుంది. క్లాసిక్ విధానంలో పాలసీ గడువు పూర్తయ్యాక అప్పటిదాకా కట్టిన వార్షిక ప్రీమియంలకు సరిసమానమైన మొత్తాన్ని అందుకోవచ్చు. ఇక స్టెప్అప్ విధానంలో వార్షిక ప్రీమియంల కన్నా 150 శాతం దాకా పొందవచ్చు. కాంప్రహెన్సివ్ వేరియంట్ ఎంచుకుంటే.. మరింత అధిక బీమా కవరేజితో పొందడంతో పాటు, చెల్లించిన ప్రీమియంలలో కొంత మొత్తాన్ని కూడా మెచ్యూరిటీ సమయంలో అందుకోవచ్చని ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ తివారి తెలిపారు.