breaking news
lier
-
నువ్వే నా ఫస్ట్ లవ్ అని చెబితే అస్సలు నమ్మకండి.. అంతా అబద్దమట
అబద్దం..ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అబద్దాలు చెబుతూనే ఉంటారు. ఎంత నిజాయితీగా ఉందామనుకున్నా అవసరం కొద్దీ కొన్నిసార్లు అబద్దాలు చెప్పాల్సి వస్తుంది. కొంతమంది సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అబద్దాలు చెబితే, మరికొందరు ప్రతి చిన్న విషయానికి కూడా అబద్దాలు చెబుతూ ఉంటారు. వీళ్లలో మగవాళ్లే, ఆడవాళ్ల కంటే ఎక్కువగా అబద్దాలు చెబుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది.మహిళలు రెండింతలు అబద్దాలు చేపితే పురుషులు వారికన్నా ఆరు రెట్లు ఎక్కువగా అబద్దాలు చెబుతున్నట్లు పరిశోధకులు తేల్చేశారు. మన దేశంలో ఎక్కువగా ఎవరు ఏఏ సందర్భాల్లో అబద్దాలు చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.. ►ఎక్కువగా జీవిత భాగస్వామితో అబద్దాలు చెబుతున్నారని సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా మహిళలతో షాపింగ్ చేసేందుకు తప్పించుకోవడానికి రకరకాల కారణాలు చెబుతుంటారని తేలింది. ► సారీ.. పనిలో ఉన్నాను,ఫోన్ చూసుకోలేదు. అందుకే లిఫ్ట్ చేయలేదు అని ఎక్కువగా అబద్దాలు చెబుతుంటారు. ► నువ్వే నా ఫస్ట్ లవ్ అని ఎవరైనా చెబితే అస్సలు నమ్మకండి. చాలామంది మగవాళ్లు ఈ అబద్దాన్ని తమ గర్ల్ఫ్రెండ్ని ఇంప్రెస్ చేయడానికి ఎక్కువగా ఈ అబద్దం చెబుతారట. ► కొంతమంది మగవాళ్లు రేపట్నుంచి సిగరెట్ మానేస్తాను అని చెప్పి ప్రతిరోజు అదే రిపీట్ చేస్తారట. ► ఏదైనా ఒక ప్లేస్కి వెళ్దామని అడిగితే, ఇష్టం లేకపోతే పని ఉందని అబద్దం చెబుతారట. ► చాలామంది తమ దగ్గర చేతులో డబ్బులు ఉన్నా ఇవ్వడానికి ఇష్టపడరట. అప్పు అడిగితే ఇప్పుడు లేవు అని అబద్దాలు చెబుతున్నారట. ► కొంతమంది నోరు తెరిస్తే అబద్దాలు చెబుతుంటారు. అలా దొరికిపోతారు కూడా..అయినా సరే, ఇప్పుట్నుంచి అబద్దాలు చెప్పను అని మళ్లీమళ్లీ చెబుతుంటారు. ► అనుకున్నా టైం కంటే ఆలస్యమైతే, సారీ ట్రాఫిక్లో చిక్కుకున్నాను అని ఈజీగా అబద్దాలు ఆడేస్తారట. ► ఆడవాళ్లలో చాలామందికి పొసెసివ్ ఫీలింగ్ ఎక్కువ. తమకు అటెష్టన్ ఉండాలని ఆరాటపడతారట.వేరే అమ్మాయిలు అందంగా రెడీ అయినా జస్ట్ ఓకే, పర్లేదు, ఈ డ్రెస్ నీకంత నప్పలేదు అని అబద్దాలు చెబుతారట. ► నా బైక్ పంక్చర్ అయ్యింది, లేదా పెట్రోల్ అయిపోయింది అని చెబుతుంటారట ఒకవేళ బైక్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ► అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి రకరకాల ఫీట్లు చేసి అబద్దాలు చెబుతుంటారట. ఇందులో 58% మంది తమకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే అబద్దాలు చెబుతారని, 42% మంది తమ సీక్రెట్ను రహస్యంగా ఉంచేందుకు అబద్దాలు చెబుతారని తేలింది. 40శాతం మంది తాము నలుగురిలో చులకన అవ్వకుండా ఉండేందుకు అబద్దాలు చెబుతారని పరిశోధనలో వెల్లడైంది. మొత్తంగా చూసుకున్నా ఆడవాళ్లకంటే మగవాళ్లే ఎక్కువగా అబద్దాలు చెబుతారని తేలిపోయింది. రోజుకు కనీసం ఒక్కసారైనా అబద్ధం చెప్పే వారి సంఖ్య మగవారిలోనే అధికంగా ఉంటుందట.కొందరి బాడీ లాంగ్వేజీని బట్టి కూడా అబద్దాలు చెబుతున్నారా లేదో తెలుసుకోవచ్చట. మూడేళ్ల వయసు నుంచే అబద్దాలు చెప్పడం ప్రారంభమవుందని చెబుతున్నారు నిపుణులు. -
అబద్ధానికి ప్రతిరూపం చంద్రబాబు
సాక్షి, ఆళ్లగడ్డ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్దానికి ప్రతిరూపమని, ఆయన నోటి వెంట ఒక్క నిజం కూడా బయటకు రాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఢిల్లీలో బీజేపీ నేత రాంమాధవ్ ఇంటికి పోయినట్లు చిన్న ఆధారంతో నిరూపించినా దేనికైనా సిద్ధమని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. రాజకీయాల్లో వ్యక్తిగత మిత్రులు ఎంతో మంది ఉంటారని, వారు ఎదురుపడినప్పుడు కలసి మాట్లాడుకుని యోగక్షేమాలు తెలుసుకోవడం సహజమన్నారు. అలాంటిది ఇతర పార్టీ వాళ్లతో మాట్లాడితే రాజకీయ సంబంధం అంటగట్టడం సీఎంకే చెల్లిందన్నారు. ఆయనలో అభద్రతా భావం రోజురోజుకు పెరిగి ఎదుటివారిపై బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, దేశంలో అందరికంటే తానే సీనియర్ అని చెప్పుకునే సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. నాలుగేళ్లుగా నిద్రపోయి ఇప్పుడు ప్రత్యేక హోదా రావాలంటే రాష్ట్ర ప్రజలు తమ వెంటరావాలని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సమావేశంలో ముస్లిం మైనార్టీ నాయకుడు నయాబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు మాటలన్నీ అబద్ధాలే
ధ్వజమెత్తిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదాపై సీఎం ప్రకటనలోని అంశాలు ప్రతిలో లేవు ప్రకటన ప్రతిలోని అంశాలు, సీఎం ఉపన్యాసం వేర్వేరుగా ఉన్నాయి ఆ రెండూ ఒకటే అంటే నేను రాజీనామా చేస్తా లేకుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా? చంద్రబాబు చెప్పిందే ప్రజల్లోకి వెళ్లాలనేలా సభ నిర్వహిస్తున్నారు మాపై వేసే అభాండాలకు సమాధానం చెప్పే అవకాశమే ఇవ్వలేదు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలన్న విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటన చేస్తున్న సందర్భంలో చెప్పినవన్నీ అబద్ధాలేనని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై సభలో ఎమ్మెల్యేలకు పంపిణీ చేసిన ప్రకటన ప్రతిలోని అంశాలు, చంద్రబాబు ఉపన్యాసం రెండూ వేర్వేరుగా ఉన్నాయని తప్పుబట్టారు. ప్రకటనలో లేని అంశాలు, అర్ధసత్యాలు, అబద్ధాలు, వక్రీకరణలతో ఆయన ప్రసంగం సాగుతున్నందుకే తాము అభ్యంతరం తెలిపామని చెప్పారు. సభలో చంద్రబాబు వేసే అభాండాలకు సమాధానం చెప్పే అవకాశమే ఇవ్వలేదని ఆక్షేపించారు. సోమవారం శాసనసభ అర్ధంతరంగా వాయిదా పడిన అనంతరం జగన్మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటన ప్రతిని ఈ సందర్భంగా జగన్ చూపిస్తూ... ఇందులో ఉన్న అంశాలే బాబు ప్రసంగంలో ఉన్నాయేమో చెప్పండి.. రెండూ ఒకటే అంటే నేను రాజీనామా చేస్తా... లేకుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా? అని సవాలు విసిరారు. చంద్రబాబు చెప్పిందే ప్రజల్లోకి వెళ్లాలని, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదనే కుట్రతో సభను నిర్వహిస్తున్న తీరును తాము ఇవాళ బహిర్గతం చేశామని చెప్పారు. స్పీకర్ కూడా ఈ కుట్రలో భాగస్వామి అయ్యే పరిస్థితి ఉండటం బాధ కలిగిస్తోందన్నారు. చంద్రబాబు మాట్లాడ్డం, ఇతరులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం కొన్ని పత్రికలు ఆయన ప్రసంగాలను పెద్దబ్యానర్లుగా చేసి రాయడం రాజకీయ కుట్రలో భాగమని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... సభలో కుటిల నీతి... :సాధారణంగా ప్రశ్నోత్తరాల సమయం 9 గంటలకు, 10 గంటలకు జీరో అవర్ ఉంటుంది. ఎపుడైనా ప్రశ్నోత్తరాల సమయం కొంత పొడిగిస్తే అది 12 గంటల వరకూ లేదా మరికొంత సమయం పొడిగించి ముగిస్తారు. ఆ తరువాతే 347, 317 నిబంధనల కింద ప్రస్తావనలు వస్తాయి. ఇది ప్రొసీజర్. గతంలో ఏ స్పీకర్ అయినా ఈ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన సందర్భం ఎక్కడైనా ఉందా? కానీ ఇక్కడ జరిగింది.ఆ తర్వాత 1.20, 1.30 గంటల ప్రాంతంలో చంద్రబాబు లేస్తారు. మైక్ పట్టుకుని అబద్ధాలు చెప్తారు, అభాండాలు వేస్తారు. సమాధానం చెప్పడానికి మాకు ఒక్క నిమిషం కూడా మైక్ ఇవ్వరు. సరిగ్గా 2 గంటలకు సభ ముగించేస్తారు.చంద్రబాబు చెప్పేదే రావాలి... మిగిలిన వారు ఏం మాట్లాడినా బయటకు రాకూడదనే కుటిల నీతితో సభలో వ్యవహరించారు. రాజకీయాలు స్ట్రెయిట్గా చేయాలి. సభలో మీ వాదనేమిటో వినిపించండి, నా విధానమేమిటో నేనూ చెబుతాను. ఇద్దరి వాదనలూ ప్రజలు తెలుసుకుంటారు, అవీ ముక్కు సూటి రాజకీయాలంటే. లోక్పాల్కు అడ్డుపడకూడదనే... లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు రకరకాల తేదీలతో అబద్ధాలు చెప్పారు. అసలారోజుల్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తుకు చేసుకుంటే... రాష్ట్రాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ఏకమై ఉన్న రోజులవి. చంద్రబాబు కూడా రాష్ట్రాన్ని విడగొట్టే విషయంలో వారితో కలిసిపోయారు. వారంతా కలిసి పోయినపుడు ఇక అవిశ్వాస తీర్మానానికి బలమెక్కడుంటుంది? ఏ రోజైతే మేము అవిశ్వాసం వెనక్కి తీసుకున్నామని చంద్రబాబు చెప్పారో ఆరోజు పార్లమెంటులో లోక్పాల్ బిల్లు పెట్టారని గుర్తుకు తెచ్చుకుంటే మంచిది. ఆరోజు కనుక మేం అవిశ్వాసం నోటీసును అలాగే ఉంచితే... జగన్ లోక్పాల్కు వ్యతిరేకమని అభాండం వేసేవారు. వాస్తవానికి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చిత్తశుద్ధితో పోరాటం చేసిన వ్యక్తిని నేనే. పోరాడిన పార్టీ వైఎస్సార్సీపీ ఒక్కటే అని చెప్పడానికి గర్విస్తున్నాను. అదే చంద్రబాబు తెలంగాణలో సీట్ల కోసం రాష్ట్రాన్ని అమ్మేశాడు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా చంద్రబాబు వరంగల్కు వెళ్లి నా వల్లే తెలంగాణ వచ్చిందని గొప్ప గా చెప్పుకున్నారు. ఆరోజు తామే తొలుత తెలంగాణ రాష్ట్రానికి రాజ్యసభలో ఓట్లేశామని చెప్పి టీడీపీ ఫ్లోర్లీడర్లు బయటకు వచ్చి రెండు వేళ్లు చూపించి మరీ చెప్పారు. అయినా ఇవాళ్టి అంశం రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం.దీనిపై తీర్మానం పెట్టాలని ముం దుగా మేమే నోటీసిచ్చాం. మనం చేయబోయే తీర్మానానికి బలం చేకూరాలంటే, కేంద్రంపై ఒత్తిడి పెరగాలంటే కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను ఉపసంహరించుకోవాలని కోరాం. ప్రత్యేకహోదాకోసం మొన్న 29న బంద్ చేస్తుంటే... దాన్ని విఫలం చేయాలని చంద్రబాబు చూశారు. వేలాదిమందిని అరెస్టు చేయడంతోపాటు మహిళలను విద్యార్థులను ఇష్టమొచ్చినట్లు కొట్టారు. చంద్రబాబూ... ప్రత్యేక హోదాకు మీరు అనుకూలమా? వ్యతిరేకమా? తేల్చిచెప్పండి. చంద్రబాబువల్లే మరణాలు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ సృష్టించిన అయోమయంవల్లనే రాష్ట్రంలో ముగ్గురు చనిపోయారు. చంద్రబాబును పక్కనే పెట్టుకుని అరుణ్ జైట్లీ మాట్లాడిన మాటల్లో ప్రత్యేక హోదా గురించి ఒక్క మాటా లేదు. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయని 14వ ఆర్థిక సంఘం అభ్యంతరం చెబుతోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. చంద్రబాబు ఢిల్లీలో ఓరకంగా, విజయవాడలో మరోరకంగా మాట్లాడి కన్ఫ్యూజన్ సృష్టించడంతో ప్రత్యేక హోదా రాదని ముగ్గురు చనిపోయారు.అబద్ధాలు వక్రీకరణలతో రాజకీయాలు చేయవద్దు. ముఖ్యమంత్రి స్టేట్మెంట్ కాపీల్లో ఒక్క చోట కూడా ప్రసంగంలోని అంశాల్లేవని విజ్ఞులైన జర్నలిస్టులు గుర్తించాలి. మంగళవారం సభలో చంద్రబాబు మళ్లీ స్టేట్మెంట్ ఇస్తే... తర్వాత మాకు అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా మేం సమాధానం చెప్పి తీరుతాం. చంద్రబాబు గంట మాట్లాడినా, రెండు గంటలు మాట్లాడినా మేం కూడా మాకిచ్చే సమయంలో సమాధానాలిస్తాం.