breaking news
LIC officials
-
నిర్మలా సీతారామన్ సంతకం ఫోర్జరీ చేసి.. 99లక్షలు కాజేశారు
పూణే: హలో మేడం.. మేం ‘డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ’ నుంచి మాట్లాడుతున్నాం. మీరు ఆధార్కు లింక్ చేసిన ఫోన్ నంబర్ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం" అంటూ అరెస్టు వారెంట్ పంపించారు. లెటర్పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంతకం ఉండటంతో బాధితురాలు నమ్మింది.ఆ తర్వాత ఫోన్ చేసిన వ్యక్తి రూ.99 లక్షలు అడిగాడు. భయంతో బాధితురాలు ఆ మొత్తాన్ని చెప్పిన బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసింది. అనంతరం అదే నంబర్కు కాల్ చేయగా..ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించింది. తాను మోసపోయినట్లు గ్రహించిన ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.సైబర్ నేరస్తులు ఇప్పుడు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఓటీపీలు షేర్ చేయొద్దంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంతో ప్రజల్లో అవగాహన పెరగడంతో, సైబర్ మోసగాళ్లు నకిలీ అరెస్ట్ వారెంట్లు, అధికార ముద్రలు, ప్రముఖుల సంతకాలను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.తాజా ఘటన అక్టోబర్ చివరి వారంలో పూణేలోని కొథ్రుడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలు ఎల్ఐసీ సంస్థలో ఉన్నతోద్యోగినిగా పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేశారు.ఇంట్లో ఉంటున్న సమయంలో ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. ‘డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ’ నుంచి సీనియర్ అధికారినంటూ నిందితుడు పరిచయం చేసుకున్నాడు. ఆమె ఆధార్కు లింక్ చేసిన ఫోన్ నెంబర్తో అక్రమ లావాదేవీలకు ఉపయోగించినట్లు బెదిరించాడు.తర్వాత ఆమెను జార్జ్ మాథ్యూ అనే మరో వ్యక్తికి కనెక్ట్ చేసి, మనీలాండరింగ్ కేసులో ఆమె పేరు ఉందని చెప్పాడు.నిర్మలా సీతారామన్ నకిలీ సంతకంతో, అధికారిక ముద్ర, సీల్తో కూడిన అరెస్ట్ వారెంట్ పంపించారు. ఆమె వయస్సు కారణంగా మినహాయింపు ఇస్తున్నామని, విచారణ కోసం కెమెరా ముందు రావాలని సూచించారు. ధృవీకరణ కోసం కొంత నగదు బదిలీ చేయాలని చెప్పడంతో, ఆమె రూ.99 లక్షలు పంపించారు. చివరికి తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాల్ని పోలీసుల్ని ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
జీవిత బీమాలో దగా..
గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో బయటపడ్డ భారీ మోసం సూక్ష్మ బీమా సొమ్ము దారి మళ్లింపు పాలసీలు సరెండర్ చేసి రూ.కోట్లు కొల్లగొట్టిన ఎల్ఐసీ అధికారులు, డిస్ట్రిబ్యూటర్లు! తీవ్రంగా నష్టపోయిన పేదలు, కార్మికులు, రైతులు, రైతు కూలీలు సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: సూక్ష్మ బీమా పేరిట పేదల నుంచి రూ.కోట్లు కొల్ల గొట్టారు. భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో భారీ కుంభకోణం చోటుచేసు కుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దా దాపు అన్ని జిల్లాల్లోనూ పేదలు, కార్మికులు, రైతులను మోసం చేశారు. అయినా ఎల్ఐసీ గానీ, ప్రభుత్వం గానీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. లక్షల్లో డమ్మీ పాలసీలు సూక్ష్మ బీమా పథకాన్ని ఎల్ఐసీ దాదాపు దశాబ్దం క్రితం ప్రారంభించింది. ప్రీమియం వసూలు చేయడానికి ఎన్జీఓలను, ప్రైవేట్ సంస్థలను నియమించింది. వారిని ‘డిస్ట్రి బ్యూటర్లు’గా వ్యవహరిస్తోంది. ఈ డిస్ట్రిబ్యూ టర్లు తమ కింద పెద్ద సంఖ్యలో ఏజెంట్లను నియమించుకున్నారు. వారిని ‘మైక్రో ఏజెంట్లు’గా పిలుస్తారు. సూక్ష్మ బీమా గురించి ఎల్ఐసీ విస్తృతంగా ప్రచారం చేయడం, ఎల్ఐసీ బ్రాండ్, లోగోతో బ్రోచర్లు ముద్రించడం వల్ల ప్రజలు సులభంగా నమ్మారు. ప్రీమియం కూడా తక్కువ కావడంతో లక్షల సంఖ్యలో సూక్ష్మ బీమా పాలసీలు తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో 1.7 లక్షల మంది, కృష్ణా జిల్లాలో 1.5 లక్షలు, నెల్లూరు జిల్లాలో 1.4 లక్షల మంది ఈ పాలసీలు తీసుకున్నారు. మిగతా జిల్లాల్లోనూ లక్షల సంఖ్యలో పాలసీలు తీసుకున్నారు. ఏజెంట్లు వసూలు చేసిన ప్రీమియం సొమ్మును ఎల్ఐసీ కార్యాలయాల్లోనే జమ చేయడానికి అవకాశం కల్పించారు. వారంతా ఆ డబ్బును సూక్ష్మ బీమా పాలసీలకు జమ చేయకుండా అతి తక్కువ ప్రీమియంతో ప్రారంభించిన లక్షలాది ‘డమ్మీ’ పాలసీలకు మళ్లించారు. తర్వాత ఆ పాలసీలను సరెండర్ చేసి సొమ్ము చేసుకున్నారు. సొమ్ము హాంఫట్... ఎల్ఐసీ జీవన్ మధుర్, జీవన్దీప్, జీవన్ మంగళ్, భాగ్యలక్ష్మి, న్యూ భాగ్యలక్ష్మి... ఇవన్నీ సూక్ష్మ బీమా పాలసీల పేర్లు. ప్రకాశం జిల్లాలో ఎల్ఐసీ జీవన్ మధుర్ పేరిట 1.7 లక్షల పాలసీలను జారీ చేశారు. జాన్బాబు నేతృ త్వంలోని ‘భాను హోమ్ ఫర్ డిస్టిట్యూడ్ అండ్ అల్లైడ్ ఆర్గనైజేషన్’కు ప్రీమియం వసూలు చేసిపెట్టే బాధ్యతను 2008లో ఎల్ఐసీ అప్పగించింది. ఐదేళ్ల తర్వాత తమ పాలసీలు మెచ్యూరై డబ్బు తీసుకోవడానికి ఎల్ఐసీ కార్యాలయా లకు వెళ్లిన వారికి.. పాలసీలన్నీ ల్యాప్స్ అయ్యా యని, తాము చెల్లించిన సొమ్ము తమ పాలసీ ఖాతాలో జమ కాలేదని గుర్తించారు. ఎల్ఐసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పెద్దగా స్పం దించలేదు. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి నా.. పోలీసులు విచారణ జరపలేదు. ప్రకా శం, నెల్లూరు జిల్లాల్లో కేసులు నమోదవుతుం టే.. మచిలీపట్నం డివిజన్లో న్యూ జీవన్ మంగళ్ పేరిట కొత్తగా సూక్ష్మ బీమాను ఎల్ఐసీ ప్రారంభించింది. ప్రకాశం జిల్లాలో ప్రజలను మోసం చేసిన జాన్బాబే తన బంధువుల పేరిట ‘గ్రీన్స్ మైక్రో ఇన్సూరెన్స్’ పేరిట ఏర్పాటు చేసిన సంస్థకు ప్రీమియం వసూలు చేసే బాధ్యతను ఎల్ఐసీ అప్పగించ డం గమనార్హం. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 3.2 లక్షల మందికిపైగా పాలసీదారులను మోసం చేయడం గమనార్హం. -
కెయిర్న్ డీల్పై ఎల్ఐసీతో వేదాంత వర్గాల భేటీ
ముంబై: కెయిర్న్-వేదాంత విలీనానికి సంబంధించి మైనారిటీ వాటాదారు ఎల్ఐసీ అధికారులతో కెయిర్న్ ఇండియా అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. డీల్ వేల్యుయేషన్, విలీనానంతరం ఏర్పడే సంస్థ రుణ భారం తదితర అంశాలపై ఎల్ఐసీ వర్గాలు సందేహాలు వ్యక్తం చేశాయి. అయితే, వీటన్నింటిపై కెయిర్న్ ఇండియా అధికారులు తగు వివరణ ఇచ్చినట్లు సమాచారం. వేదాంత-కెయిర్న్ విలీనం కంపెనీకి ప్రయోజనం చేకూర్చగలదని వారు పేర్కొన్నట్లు ఎల్ఐసీ వర్గాలు వివరించాయి. విలీనానికి సంబంధించి వివిధ కోణాలన్నీ పరిశీలించాక..కెయిర్న్ ఇండియా ఏజీఎం తేదీ లోగా తమ నిర్ణయాన్ని తెలియజేయనున్నట్లు తెలిపాయి. జులై 21న కెయిర్న్ ఇండియా ఏజీఎం నిర్వహించనుంది.


