breaking news
Lecturer died
-
సూసైడ్ లెటర్ రాసి నారాయణ కళాశాల లెక్చరర్ ఆత్మహత్య
అనంతపురం: పట్టణంలోని నారాయణ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్ పనిచేసే ప్రత్యూష (26) శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాలమేరకు... ప్రత్యూష అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేదని, ఇందులో భాగంగానే ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు. ప్రత్యూష ఉదయం కళాశాల విధులకు హాజరై పర్మిషన్ తీసుకుని గుడ్డం సమీపంలోని రైల్వేట్రాక్కు చేరుకుని గూడ్స్రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. బ్యాగులో ఉన్న సూసైడ్ నోట్ను పరిశీలించగా తన చావుకు ఎవరూ బాధ్యులు కారని రాసి ఉంచిన ఉత్తరాన్ని స్వాదీనం చేసుకున్నామని రైల్వే ఎస్ఐ బాలాజీనాయక్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పరీక్ష హాలులోనే కుప్పకూలిన అధ్యాపకురాలు
గుంటూరు ఎడ్యుకేషన్(గుంటూరు): ఇంటర్మీడియెట్ పరీక్షల ఇన్విజిలేషన్ విధుల్లో ఉన్న ఓ అధ్యాపకురాలు పరీక్షహాలులోనే గుండెపోటుతో కుప్పకూలారు. గుం టూరు నగరం ఏసీ కళాశాలలో గురువారం ఈ విషాదం చోటు చేసుకుంది. అదే సమయంలో ఆమె తనయుడు మరో కేంద్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్ష రాశాడు. స్థానిక ఏసీ కళాశాలలో ఆంగ్లభాష అధ్యాపకురాలు పిడకాల హేమ కాంతి (44) ఇంటర్ పరీక్షలకు అదే కళాశాలలో ఇన్విజిలేటర్గా వ్యవహ రిస్తున్నారు. గురువారం ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ప్రశ్నపత్రాలు పంపిణీ చేసిన హేమకాంతి ఉదయం 9.30 గంటల సమయంలో గుండెనొప్పి రాగా పరీక్ష హాలులోనే కుప్పకూలిపోయారు.